1 ENS Live Breaking News

శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.  శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వ‌హించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. అంకురార్పణ కారణంగా శనివారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

        ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో  లోకనాథం, పేష్కార్  శ్రీహరి, పారుపత్తేదార్  తులసీప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2023-08-26 13:57:50

బ్రహ్మకుమారీల మాజీ అధిపతి పేరుతో పోస్టల్ స్టాంపు

బ్ర‌హ్మ‌కుమారీల మాజీ అధిప‌తి దాదీ ప్ర‌కాశ‌మ‌ణి జ్ఞాప‌కార్ధం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సాంస్కృతిక కేంద్రంలో శుక్ర‌వారం పోస్టేజ్ స్టాంపును భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము విడుద‌ల చేశారు. ఈ త‌పాలా బిళ్ళ‌ను స‌మాచార మంత్రిత్వ శాఖ త‌పాలా విభాగ‌పు  మై స్టాంప్ అన్న చొర‌వ కింద దాదీ ప్ర‌కాశ‌మ‌ణి 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ఆధ్యాత్మికత ద్వారా భార‌త్‌లో, విదేశాల‌లోనూ భార‌తీయ విలువ‌ల‌ను వ్యాప్తి చేయ‌డంలో దాదీ ప్ర‌కాశ‌మ‌ణి గొప్ప పాత్ర పోషించార‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు. ప్ర‌పంచంలోనే మ‌హిళా నాయ‌క‌త్వంలోని అతిపెద్ద సంస్థ‌గా బ్ర‌హ్మ‌కుమారీస్ ఆమె నాయ‌క‌త్వంలో అవ‌త‌రించింది. నిజ‌మైన నాయ‌కురాలిలా, ఆమె బ్ర‌హ్మ‌కుమారీల కుటుంబానికి స‌వాళ్ళ‌తో కూడిన ప‌రిస్థితుల్లో కూడా విశ్వాసం, ధైర్యంతో అండ‌గా నిల‌వ‌డ‌మే కాక ఎల్ల‌వేళ‌లా వారికి మార్గ‌ద‌ర్శ‌నం చేశారు. జీవితం తాత్కాలిక‌మైన‌ద‌నీ,  ఒక వ్య‌క్తి తాను చేసిన ప‌నుల వ‌ల్ల మాత్ర‌మే వారిని గుర్తించుకుంటార‌నేది ప్ర‌పంచంలో అతిపెద్ద స‌త్య‌మ‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు.

 ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా ఉదాత్త‌మ‌మైన ప‌నులు చేయాల‌ని ఆమె అన్నారు. భౌతికంగా దాదాజీ మ‌న మ‌ధ్య ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, కానీ ఆమె ఆధ్యాత్మిక, ఉదాత్త 
వ్య‌క్తిత్వపు జ్ఞాప‌కాలు, మాన‌వాళి సంక్షేమం కోసం ఆమె ఇచ్చిన సందేశం అన్నీ కూడా ఎల్ల‌ప్పుడూ మ‌న మ‌ధ్య స‌జీవంగా ఉంటాయ‌ని, రానున్న త‌రాల‌కు స్ఫూర్తిని ఇస్తాయ‌ని ఆమె పంచుకున్నారు. ఇటీవ‌లి కాలంలో చంద్ర‌యాన్ -3 మిష‌న్ విజ‌యం గురించి మాట్లాడుతూ, భార‌త శాస్త్ర‌వేత్త‌లు సాధించిన అపూర్వ విజ‌యాన్ని మ‌నంద‌రం వీక్షించామ‌ని అన్నారు. చంద్రుడిపై ద‌క్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశం భార‌త అని ఆమె అన్నారు. చంద్ర‌యాన్ -3 మిష‌న్ ద్వారా చంద్రుని భూభాగం నుంచి సేక‌రించిన నూత‌న స‌మాచారం మొత్తం ప్ర‌పంచానికి లాభాల‌ను చేకూరుస్తుంద‌నే విశ్వాసాన్ని ఆమె వ్య‌క్తం చేశారు.  

Delhi

2023-08-25 16:16:26

రూ.834 కోట్ల‌తో గిరిజ‌న కేంద్రీయ విశ్వవిద్యాల‌యం

సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.834 కోట్ల‌తో ఏర్పాటు చేయ‌నున్న కేంద్రీయ గిరిజ‌న విశ్వ విద్యాల‌య నిర్మాణ ప‌నుల‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈ మ‌హోత్త‌ర కార్య‌క్ర‌మంలో కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి & వ్య‌వ‌స్థాప‌క‌త‌ శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ భాగ‌స్వామ్య‌మ‌య్యారు. సాలూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మెంటాడ మండ‌లం చిన‌మేడ‌ప‌ల్లి వ‌ద్ద ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించి నిర్మాణ ప‌నుల‌కు ముఖ్య‌మంత్రి లాంఛ‌నంగా శంకుస్థాప‌న చేశారు. కేంద్ర మంత్రితో క‌లిసి కొబ్బ‌రికాయ కొట్టి ప‌నుల‌కు అంకురార్ప‌ణ చేశారు. రూ.834 కోట్ల‌తో చేప‌డుతున్న ఈ ప్రాజెక్టును మూడు సంవ‌త్స‌రాల‌లో పూర్తి చేసి గిరిజ‌న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ముందుగా హెలికాప్ట‌ర్ ద్వారా మెంటాడ మండ‌లం చిన‌మేడ‌ప‌ల్లి చేరుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించి నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అక్క‌డ నుంచి ద‌త్తిరాజేరు మండ‌లం మ‌ర‌డాం వ‌ద్ద ఏర్పాటు చేసిన స‌భాస్థలికి నేరుగా హెలికాప్ట‌ర్ ద్వారా చేరుకున్నారు. అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో విద్యార్థుల‌ను, ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ముఖ్య‌మంత్రి ప్రసంగించారు. 

గిరిజ‌న ప్రాంత ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అద్దంప‌డుతూ ఏర్పాటు కాబోతున్న‌ కేంద్రీయ విశ్వ విద్యాల‌యం మ‌రో మైలురాయి వంటిద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి.ఎస్ అన్నారు. దీని ద్వారా ఇక్క‌డ యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్తు ల‌భిస్తుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో భాగంగా మ‌ర‌డాం వ‌ద్ద ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో క‌లెక్ట‌ర్ ప్రారంభోపాన్యాసం చేశారు. విశ్వ విద్యాల‌యం ఏర్పాటులో భాగంగా చేప‌ట్టిన భూసేక‌ర‌ణ‌, ఇత‌ర చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. 561 ఎక‌రాల భూమిని యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యంకు అప్ప‌గించామ‌ని గుర్తు చేశారు. 42 నెల‌ల్లో గుర్తించిన ఈ ప్రాంతంలో విశ్వ‌విద్యాల‌య నిర్మాణ ప‌నులు పూర్తి అయిపోతాయ‌ని అన్నారు. గిరిజ‌న ప్రాంత ప్ర‌జ‌ల క‌ళ‌లు, సంస్కృతీ సంప్ర‌దాయాల‌కు యూనివ‌ర్శిటీ చ‌క్క‌ని వేదిక‌గా మారుతుంద‌ని పేర్కొన్నారు. విద్య‌, ప‌రిశోధ‌న‌లు మ‌రింత పెరుగుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ‌ల‌స‌లు ఆగిపోతాయ‌ని, చ‌క్క‌ని ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు. రూ.834 కోట్ల‌తో నిర్మాణాలు జ‌రుగుతాయ‌ని, మొద‌టి ద‌శ‌లో భాగంగా రూ.420 కోట్ల‌తో కొన్ని ప‌నులు ప్రారంభ‌య్యాయ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఏయూ భ‌వ‌నాల్లో తాత్కాలిక త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని క‌లెక్ట‌ర్ గుర్తు చేశారు. యూనివ‌ర్శిటీ నిర్మాణంలో భాగంగా రోడ్లు, తాగునీటి స‌దుపాయం, విద్యుత్ ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు, రైతుల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లింపు నిమిత్తం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.58.49 కోట్లు వెచ్చిస్తోంద‌ని వివ‌రించారు. అనంత‌రం కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌ను డిప్యూటీ సీఎం రాజ‌న్న‌దొర‌, జిల్లా యంత్రాంగం స‌త్క‌రించి బొబ్బిలి వీణ‌ల‌ను బ‌హూక‌రించారు. వీసీ క‌ట్టిమ‌ణి

కేంద్రీయ గిరిజ‌న విశ్వ విద్యాల‌యం ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారం మ‌రువ‌లేనిద‌ని వైస్ ఛాన్సలర్ క‌ట్టిమ‌ణి అన్నారు. స‌భ‌లో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ, స్థానికంగా అందుతున్న స‌హ‌కారం, కేంద్రం నుంచి వ‌స్తున్న స‌హ‌కారం గురించి వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అనుకున్న స‌మ‌యానికి 561 ఎక‌రాల‌ భూమిని అప్ప‌గించింద‌ని చెప్పారు. రోడ్లు, విద్యుత్‌, తాగునీటి స‌దుపాయం కోసం పూర్తి స‌హ‌కారం అందిస్తోంద‌ని గుర్తు చేశారు. భూములిచ్చిన రైతుల‌కు స‌కాలంలో న‌ష్ట ప‌రిహారం చెల్లించి ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వహించింద‌ని కితాబిచ్చారు. ఈ ప్రాంతంలో గిరిజ‌న యూనివ‌ర్శిటీ రావ‌టం విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుకు సంకేత‌మ‌ని పేర్కొన్నారు. గిరిజ‌న ప్రాంత విద్యార్థుల‌కు ఇదొక వ‌ర‌మ‌ని, మాతృభాష‌లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల‌కు చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని అన్నారు. యూనివ‌ర్శిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో విప్లవాత్మ‌క‌మైన మార్పు వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు. 

అనంత‌రం కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌ను దుశ్శాలువాల‌తో స‌త్క‌రించి జ్ఞాపిక‌ల‌ను బ‌హుక‌రించారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, డిప్యూటీ సీఎం పీడిక రాజ‌న్న‌దొర‌, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాసరావు, అర‌కు ఎంపీ గొడ్డేటి మాధ‌వి, రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జె. శ్యామ‌ల‌రావు, వీసీ క‌ట్టిమ‌ణి, జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి.ఎస్, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, ర‌ఘురాజు, ఎమ్మెల్యేలు అల‌జంగి జోగారావు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, బొత్స అప్పల‌న‌ర‌స‌య్య‌, శంబంగి చిన వెంక‌ట అప్ప‌ల‌నాయుడు, పుష్ప శ్రీ‌వాణి, ఎస్టీ క‌మిష‌న్ ఛైర్ ప‌ర్శ‌న్ డా.జి.వి.జి. శంక‌ర‌రావు, ఇత‌ర అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Salur

2023-08-25 15:46:58

ఆ ప్రకటనలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవు

కేంద్ర ప్ర‌భుత్వం గ్యాంబ్లింగ్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించికీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం ఆన్ లైన్ మోసాలు దేశ వ్యాప్తంగా అత్యధికంగా జరుగుతు న్నందున ప్రభుత్వం హెచ్చరిక జారీచేసినట్టు తెలుస్తుంది. బెట్టింగుల తరహా కార్యకలాపాలను నిర్వహించే వేదికలకు సంబంధించిన ప్రకటనలను ప్ర‌చురించ‌డం లేదా ప్ర‌సారం చేయ‌డం మానుకోవాల‌ని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్‌ మీడియా, సామాజిక మాధ్యమ సంస్థలకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆన్ లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి అనేక మంది వీటి భారీన పడి లక్షలాది రూపాయలు మోసాలకు గురవుతున్నారు. దీనితో వీటిని పూర్తిగా నిషేధించే క్రమంలో కేంద్రం జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పాటించని సంస్థలు న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవా ల్సి ఉంటుంది. ఆన్ లైన్ మోసాలపై ప్రతినిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

New Delhi

2023-08-25 11:33:39

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. గురువారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 67,308 మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు రాగా, 26,674 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-25 01:25:21

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. సోమవారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 69,909మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు రాగా, 29,327 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-22 02:15:03

తిరుమల శ్రీ‌హ‌రికి రెండు బ్ర‌హ్మోత్స‌వాలు

పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే శ్రీవేంకటేశ్వరుడు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి 'బ్రహ్మోత్సవాలు'గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదుగానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

          సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా సెప్టెంబ‌రు 18న ధ్వ‌జారోహ‌ణం, సెప్టెంబ‌రు 22న గ‌రుడ వాహ‌నం, సెప్టెంబరు 23న స్వ‌ర్ణ‌ర‌థం, సెప్టెంబ‌రు 25న ర‌థోత్స‌వం(మ‌హార‌థం), సెప్టెంబ‌రు 26న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగ‌నున్నాయి.  న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబ‌రు 19న గ‌రుడ‌వాహ‌నం, అక్టోబ‌రు 22న స్వ‌ర్ణ‌ర‌థం, అక్టోబ‌రు 23న చ‌క్ర‌స్నానం జ‌రుగ‌నున్నాయి.  బ్ర‌హ్మోత్స‌వాల కార‌ణంగా సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు, అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ముంద‌స్తుగా ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌ను నిర్దేశిత వాహ‌న‌సేవ‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల అంకురార్ప‌ణ కార‌ణంగా అక్టోబ‌రు 14న స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Tirumala

2023-08-21 16:12:42

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. ఆదివారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 57,443 మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు రాగా, 28,198 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం అన్ని కంపార్ట్ మెంట్లు దాటి బయట లైనువరకూ  భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-11 01:47:40

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 75,594 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.69  కోట్లు ఆదాయం వచ్చింది. 26,213  మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు.  16 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-10 02:15:04

కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ఆడికృత్తిక

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది.  ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వ ర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం చేపడతారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో దేవేంద్ర‌బాబు, ఏఈఓ  సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ భూప‌తి పాల్గొన్నారు.

Tirupati

2023-08-09 09:09:56

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 73,879 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.05  కోట్లు ఆదాయం వచ్చింది. 26,144 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామి వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకట నలో తెలియజేసింది.

Tirumala

2023-08-09 07:14:54

తిరుమల శ్రీవారి దర్శనానికి 18గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 69,733 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.37  కోట్లు ఆదాయం వచ్చింది. 28,403 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. బయట వరకూ భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-08 01:45:51

తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.5.11 కోట్లు విరాళం

చెన్నై సలహామండలి అధ్యక్షుడు  శేఖర్ రెడ్డి నేతృత్వంలో 9 మంది దాతలు కలిసి టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం అందించారు. దాతలు ఈ మొత్తానికి సంబంధించిన డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు. చెన్నై టి.నగర్‌లోని వెంకటనారాయణ రోడ్‌లో ప్రస్తుతం ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు ఈ మొత్తాన్ని అందించారు. ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న రూ.35 కోట్ల విలువైన 5.5 గ్రౌండ్ల స్థలాన్ని చెన్నై సలహామండలి గుర్తించింది. ఈ స్థలం కొనుగోలుకు గతంలో కొంతమంది దాతలు 8,15,15,002 రూపాయలను విరాళంగా అందించారు.  ప్రస్తుతం విరాళం అందించిన దాతలు ర్యాపిడ్‌కేర్ గ్రూపు రూ.1.50 కోట్లు, కోయంబత్తూరుకు చెందిన  వెంకట సుబ్రహ్మణ్యం,  నాగరాజన్, సిఆర్ కన్ స్ట్రాక్షన్స్  ఒక్కొక్కరు కోటి రూపాయలు, శరణ్,  శెంబగమూర్తి  ఒక్కొక్కరు 20 లక్షలు, నరేష్ సుబ్రహ్మణ్యం,  బలహా కెమికల్స్(పి) లిమిటెడ్ వారు ఒక్కొక్కరు రూ. 10లక్షలు, నీలాద్రి ప్యాకింగ్స్ రూ.1లక్ష రూపాయలు  విరాళంగా అందించారు.  ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Tirumala

2023-08-07 09:43:39

పార్లమెంటులో రాహుల్ గాంధీ రీ ఎంట్రీ అదుర్స్

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్‌ గాంధీ సోమవారం పార్లమెంట్‌‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.  సుప్రీంకోర్టు స్టేతో లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ పునరుద్ధరించింది. దీనితో నాలుగు నెలల తర్వాత తొలిసారి రాహుల్‌ లోక్‌సభకు వచ్చారు. సభలోకి వచ్చేముందు ఆయన పార్లమెంట్‌ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించారు. రాహుల్ వస్తున్న వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకు  ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంట్ బయట కోలాహలంగా మారింది. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పూర్తిగా రద్దవుతుందనుకున్న తరుణంలో పార్లమెంటులోకి తిరిగి అడుగుపెట్టడంతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. పార్లమెంటులోకి అడుగుపెట్టనీయకుండా ఉండేలా ఆఘమేఘాలపై ప్రత్యేక సమావేశం ద్వారా వేటు వేసినా అది ఎక్కువ కాలం నిలవలేదు.

New Delhi

2023-08-07 09:21:25

తిరుమల శ్రీవారి దర్శనానికి 15గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 83,856 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.9  కోట్లు ఆదాయం వచ్చింది. 28,403 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-07 04:17:02