ఒక్కోసారి మీడియా నుంచి వచ్చే సందేశాత్మక, సూచనాత్మక వార్తలపై కేంద్రం సుమోటాగా స్పందిస్తూ ఉంటుంది..ఈ కోవలోనే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికా రిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా పంచాయతీలు, సచివాలయాల్లో చేపట్టే చెల్లింపులు డిజిటల్ రూపంలో చేపడితే సత్వర ఫలితాలు వస్తాయనే కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా వాటి వలన వచ్చే ఉపయోగాలను సైతం ప్రత్యేక కథనాల ద్వారా తెలియజేసింది. దీనితో రాష్ట్రప్రభుత్వం స్పందించకపోయినా..నేరుగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీల్లోని చెల్లింపులన్నీ డిజిటల్, యూపిఐ పేమెంట్ల ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది. దానికి మంచి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ చెల్లింపులను ప్రారంభిస్తుందని ప్రకటించింది. ఫోన్ పే, గుగూల్ పే, భీమ్ యాప్ ల ద్వారా చెల్లింపులు చేపట్టాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చెల్లింపులన్నీ ఆన్ లైన్, డిజిటల్ విధానాల్లోకి మార్చడం ద్వారా ప్రభుత్వానికి పంచాయతీల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా సదరు ఖాతాల్లోకి వెళ్లి నిధులు అన్ని రష్ట్రాల నుంచి ఒకేసారి కనిపిస్తాయి.
దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే గ్రామ పంచాయతీలన్నీ గ్రామ సచివాలయాలుగానూ, వార్డులన్నీ వార్డు సచివాలయాలుగానూ ప్రభుత్వం 2020లో మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం సేవలను అందిస్తోంది. వాటితోపాటు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఇచ్చే ద్రువీకరణలు కూడా సచివాలయాల ద్వారానే ఇవ్వడం, అందరికీ డిటిజల్ చెల్లింపులపై అవగాహన కలగడం కూడా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఊతమిచ్చాయి. అయితే ప్రస్తుతం ఏపీలోని అన్ని సచివాలయాల్లో డిజిటల్ చెల్లింపులు సచివాలయ సిబ్బంది అలవాటు చేస్తూ వస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆ విధానం తొలుత ఏపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో డిజిటల్ పేమెంట్లను తప్పని సరిచేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీచేయడంతో ఇక రాష్ట్రప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేయాల్సి వుంటుంది. ఇప్పటివరకూ గ్రామపంచాయతీల్లోని చెల్లింపులన్నీ నగదు రూపంలో జరిగేవి. వాటిని పంచాయతీ సిబ్బంది వారికి తీరిక దొరికినపుడు బ్యాంకుల్లో జమచేసేవారు. లేదంటే వాటిని ఖర్చుచేసి వాటి బిల్లులును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించేవారు. ఇపుడు అధికారికంగా ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ చెల్లింపుల విధానం ద్వారా అన్ని చెల్లింపులు ఆన్ లైన్ ద్వారా చేపట్టడంతో ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత మొత్తాలు ప్రతీరోజూ వస్తున్నాయో కేంద్రం, రాష్ట్రం తెలుసుకోవడానికి వీలుపడుతుంది.
ప్రజా ప్రయోజనాల విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రజలను చైతన్యం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుందనే అంశం మేము అందించే వార్తలు, వాటిపై వచ్చే స్పందనలే తెలియజేస్తున్నాయనడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులన్నీ ఆన్ లైన్ లోనే చేయాలన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వాలు వారు చేపట్టే కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల వారికి తాజా సమాచారం అందించేందుకు, Ens Live యాప్ ద్వారా ముందుంటామని మరోసారి తెలియజేస్తున్నాం.