1 ENS Live Breaking News

హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రామునిగా..

శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధ‌‌‌‌వారం శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ధ‌ను‌స్సు ధ‌రించి కోదండ‌రాముని అలంకారంలో దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.           కాగా, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పుష్ప‌క విమానం, రాత్రి 7 గంట‌ల‌కు గ‌జ వాహ‌న‌సేవ‌ జ‌రుగ‌నున్నాయి.  ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి,  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా. నిశ్చిత‌,  చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి, డిపి.అనంత‌,  సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్, పేష్కార్  జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.      

Tirumala

2020-10-21 14:18:31

2020-10-20 21:07:24

సౌర, పవన విద్యుత్తులకు ప్రోత్సాహం..

ఆంధ్రప్రదేశ్ లో  సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎ నర్జి కార్పోరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు యస్. రమణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని తమ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎ నర్జీ ఎ క్స్‌పోర్టు పాలసి-2020, సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు ఏర్పాటు, తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కర్నూలు, కడప, అనంతపురం వంటి జిల్లాలో సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలు గుర్తించడం జరిగిందన్నారు. ఈప్రాంతంలో ఎ క్కువుగా మెట్ట, సాగుచేయలేని భూములు ఉన్నాయని వాటిని దీర్ఝకాలిక లీజుకు తీసుకుని పెద్దఎ త్తున సౌర, పవన మరియు పవన-సౌర హైబ్రీడ్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇక్కడ డవలపర్లు పవర్ ఫ్లాంట్లు నిర్మిస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకుంటుందన్నారు. సింగిల్ విండో విధానంతో ఇందుకు సంబంధించిన ఎ నర్జీ ఎ క్స్‌పోర్టు పాలసీని రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కర్నూలు, వైయస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల్లో 3 నుంచి 5 వేల మెగావాట్ల సామర్ధ్యం గల ఆల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎ నర్జీ పవర్ పార్క్‌లను ప్రోత్సహించడానికి ప్రతిపాదించడమైనదని చెప్పారు. నూతనపాలసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 3 నుంచి 5 వేల మెగావాట్ల సామర్ధ్యం స్ధాపించడం ద్వారా వేలకోట్లరూపాయలు పెట్టుబడులు ద్వారా కరువుపీడిత ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో 7 ప్రాంతాలలో 6,300 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. వైయస్ఆర్ కడపజిల్లాలో గండికోటలో 600 మెగావాట్లు, అనంతపురం జిల్లా చిత్రావతిలో 500 మెగావాట్లు, నెల్లూరు జిల్లా సోమశిలలో 1200 మెగావాట్లు, కర్నూలు జిల్లా వోక్‌లో 800 మెగావాట్లు, విజయనగరం జిల్లాలో కురుకుట్టిలో 1200 మెగావాట్లు, కర్రివలసలో 1000 మెగావాట్లు, విశాఖపట్నం జిల్లా ఎ ర్రవరంలో 1000 మెగావాట్లుతో పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటుకు అవసరమైన సాధ్యత డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు, ఇతర వివరణాత్మక నివేదికలను 30 నెలల కాలపరిమితిలో వాటిని అందించేందుకు బిడ్డర్లను ఎ ంపిక చేసామన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ఐఐటి, దేవాలయాలు, కళాశాలలు, పాఠశాలలు వంటి ప్రభుత్వ విభాగాలలో ఇంతవరకూ 19.50 మెగావాట్ల గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ ప్రోత్సహించడం జరిగిందన్నారు. క్రొత్త జాతీయ బయోగ్యాస్, సేంద్రీయ ఎ రువు కార్యక్రమం క్రింద రాష్ట్రంలో 3 లక్షల బయోగ్యాస్ ఫ్లాంట్లు నిర్మించబడ్డాయన్నారు.  రాష్ట్రంలో మొదటిదశలో ప్రస్తుతం 300 ఎ లక్ట్రిక్ కార్లు వినియోగంలో ఉన్నాయన్నారు. రెండవదశ క్రింద రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతోపాటు ప్రధాన జిల్లా కేంద్రాలలోని 83 ప్రాంతాల్లో 460 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుకానున్నాయని చెప్పారు. వీటి ఏర్పాటుకు ముందుకు వచ్చేవారి సమాచారం నిమిత్తం జాబితాలను అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా తమ సంస్ధ హర్యానాలోని మనేసార్‌లోని ఐక్యాట్‌తో సమన్వయం చేసుకుని ఆటోకాంపోనెంట్స్, వెహికల్స్, ఇంటిలిజెన్స్ టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటుకు 250 కోట్ల రూపాయల పెట్టుబడితో టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకోసం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ నుండి ప్రభుత్వం యల్ఓఐ పొందిందన్నారు. ఆటోలకు ఎ లక్ట్రిక్ రిక్ట్రోఫిట్ కిట్స్ అందించే విషయంలో కూడా అధ్యయనం జరుగుతున్నదన్నారు. ఇప్పటికే క్రొత్తఆటోలు రూపొందుతుండగా, పాతవాటిని బ్యాటరీలతోకూడిన ఎ లక్ట్రిక్ రెట్రోఫిట్ కిట్స్‌తో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వాటిమార్పుకు ఒక ఆటోకు రూ. 50 నుండి 60 వేలు ఖర్చుకాగలదని, అయితే దీర్ఝకాలికంగా ఇంధనంపై ఖర్చును నియంత్రించుకోవచ్చునన్నారు. ఈసందర్భంగా సోలార్, విండ్ ప్రాజెక్ట్స్, విండ్-సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్ట్స్, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్, తదితర ప్రాజెక్టులను నెరెడ్‌క్యాప్ (యన్ఆర్ఇడిసిఏపి) ప్రోత్సహిస్తున్న తీరును ఆయన వివరించారు.

Velagapudi

2020-10-20 17:09:59

2020-10-20 15:35:08

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు..

శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగ‌ళ‌‌‌వారం ఉదయం 9 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్ప స్వామివారు మోహినీ రూపంలో శృంగార  రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి,  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా. నిశ్చిత‌, చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, గోవింద‌హ‌రి,  డిపి.అనంత‌,  కుమార‌గురు,  ర‌మేష్‌‌ శెట్టి,  దుస్మంత కుమార్ దాస్‌, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  కాగా రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షించనున్నారు.  పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

Tirumala

2020-10-20 12:03:27

2020-10-19 20:55:49

2020-10-19 20:50:43

వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే..

ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన  ప్రాంతాలను ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన  రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా ఆయన ఇప్పటికే కేంద్రానికి లేఖ సైతం రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వరదల కారణంగా  4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరాల కోసం  వెంటనే 2250 కోట్లు సాయం అందించాల్సిందిగా ఆయన తన లేఖలో   కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా పంటనష్టాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. బాగా వరదలు వచ్చిన ప్రకాశం బ్యారేజీ, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే క్రిష్ణాజిల్లా కలెక్టర్ ను ఆదేశించి బాదితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పునరావాస చర్చలు తీసుకోవాలాని ఆదేశించారు. 

Prakasam Barrage

2020-10-19 20:49:47

కోవిడ్ మృత జర్నలిస్టులు వివరాలివ్వండి

ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులు కోవిడ్ 19తో మృతి చెంది వుంటే తక్షణమే వివరాలు ఆయా జిల్లాల సమాచారశాఖ కార్యాలయాలకు తెలియజేయాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు జర్నలిస్టులను కోరారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్19 నేపథ్యంలో రాష్ట్రంలో మృతి చెందిన 45 మంది జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుందని చెప్పారు.  ఈ మేరకు విశాఖ జిల్లా నుంచి కూడా ఇద్దరు జర్నలిస్టులు మృతి చెంది ఉండడంతో వారి వివరాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఇందుకు సంబంధించి  ఇంకా ఎవరైనా జర్నలిస్టు మృతి చెంది ఉంటే వారి వివరాలను తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపాలని ఆయన కోరారు. మృతి చెందిన  జర్నలిస్ట్ కుటుంబం కి రూ.5లక్షలు చొప్పున ప్రభుత్వం  ఆర్థిక సహాయం అందించనుందని  చెప్పారు. జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్  వారియర్స్ గా గుర్తించి ఇన్సూరెన్స్ సదుపాయము కల్పించాలని పీఎం మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి లను కోరడం జరిగింది అన్నారు. త్వరలో సానుకూల స్పందన లభిస్తుంని భావిస్తున్నట్లు శ్రీనుబాబు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజి విషయం కేంద్రం ద్రుష్టికి తీసుకువెళ్లనున్నామని వివరించారు...

Visakhapatnam

2020-10-19 13:49:11

క‌ల్ప‌వృక్ష వాహ‌నంపై రాజ‌మ‌న్నార్ గా..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు క‌ల్ప‌వృక్ష వాహనంపై రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో అభ‌య‌మిచ్చారు. క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.       ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, డా. నిశ్చిత‌, వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి,  చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి, డిపి.అనంత‌,  కుమార‌గురు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ ర‌మేష్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-19 12:54:31

ముత్యపుపందిరి వాహనంపై మురళీకృష్ణుడిగా..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆది‌వారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై రుక్మిణి స‌త్య‌భామ స‌మేత మురళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు క‌ల్ప‌వృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, చిప్ప‌గిరి ప్ర‌సాద్‌,  గోవింద‌హ‌రి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-18 21:02:23

శ్రీవారి భక్తులకు అత్యున్నత సేవలు..

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి తిరుమ‌ల‌కు వ‌స్తున్న భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తుల‌ను ఉన్న‌త‌మైన ప్ర‌మాణాల‌తో అందిస్తున్నామ‌ని టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి వివ‌రించారు.  ఆదివారం అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ను ప‌రిశీలించారు. మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో అన్న‌ప్ర‌సాదం స్వీక‌రించారు.  ఈ సంద‌ర్భంగా అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం వ‌ద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ, టిటిడి వ‌స‌తుల‌పై భ‌క్తులు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారన్న ఈఓ తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న స‌దుపాయాల‌ను ప‌రిశీలించిన‌ట్టు తెలిపారు. వెంగ‌మాంబ అన్న‌ప్రసాదం కాంప్లెక్స్‌లో కోల్డ్ స్టోరేజి, వంట‌శాల‌, భోజ‌న‌శాలను ప‌రిశీలించిన‌ట్టు చెప్పారు. ప‌రిశుభ్ర‌త‌మైన వాతావ‌ర‌ణంలో శుచిగా, రుచిగా అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డిస్తున్నార‌ని, ప‌లువురు భ‌క్తులతో మాట్లాడ‌గా అన్న‌ప్ర‌సాదాలు చాలా బాగున్నాయ‌ని సంతోషం వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా అన్న‌దానం అధికారుల‌కు, సిబ్బందికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.              అదేవిధంగా, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, దివ్య‌ద‌ర్శ‌నం(కాలిన‌డ‌క భ‌క్తుల కోసం) త‌దిత‌ర కాంప్లెక్సుల‌ను, ప్ర‌వేశమార్గాలను ప‌రిశీలించిన‌ట్టు ఈవో తెలిపారు. భ‌క్తుల కోసం సెల్‌ఫోన్ మ‌రియు ల‌గేజి డిపాజిట్ కౌంట‌ర్లు, కంపార్ట్‌మెంట్ల‌లో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదం, టి, కాఫి, చంటిపిల్ల‌ల‌కు పాలు, ఫోను, వైద్య‌సేవ‌లందించేందుకు డిస్పెన్స‌రీ త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించామ‌న్నారు.  ఈ త‌నిఖీల్లో టిటిడి విజివోలు  మ‌నోహ‌ర్‌,  ప్ర‌భాక‌ర్‌, అన్నదానం డెప్యూటీ ఈవో  నాగ‌రాజ‌, క్యాట‌రింగ్ అధికారి జిఎల్ఎన్‌.శాస్త్రి, శ్రీ‌వారి ఆల‌య ఏఈవో జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు, అన్న‌దానం ఏఈవో  లోక‌నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-18 15:45:06