1 ENS Live Breaking News

ఈవోను క‌లిసిన అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు..

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల‌కు చెందిన 9 మంది అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు శుక్ర‌వారం తిరుమల ఈవో డా.కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డిని తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. టిటిడి కార్య‌క‌లాపాల‌పై అవ‌గాహ‌న పెంచుకునేందుకు, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను ప‌రిశీలించేందుకు అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది అధిక మాసం కార‌ణంగా రెండు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతున్నాయ‌ని, గురువారం అంకురార్ప‌ణ జ‌రిగింద‌ని వివ‌రించారు. శుక్ర‌వారం నుండి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, ప్ర‌ధానంగా అక్టోబ‌రు 20న గ‌రుడసేవ జ‌రుగుతుంద‌ని తెలిపారు. అనంత‌రం టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు, వైద్యశాల‌లు,  విద్యాసంస్థ‌లు, ఎస్వీబీసీ గురించి వివరించారు. అదేవిధంగా టిటిడిలో జ‌రుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిటిడిలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి తెలియజేశారు. టిటిడి నిర్వ‌హిస్తున్న వివిధ ట్ర‌స్టులు, వేద విద్య‌వ్యాప్తికి తీసుకుంటున్న చ‌ర్య‌లు వివ‌రించారు. అనంత‌రం అసిస్టెంట్ క‌లెక్ట‌ర్లు టిటిడి అద‌న‌పు ఈఓ  ఎవి.ధ‌ర్మారెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

Tirumala

2020-10-16 19:39:39

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు శుక్ర‌‌వారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేప‌ట్టారు. ఆ త‌రువాత ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆస్థానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అర్చ‌కులు కంక‌ణ‌ధార‌ణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, పార్ల‌మెంటు స‌భ్యులు  వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు  డిపి.అనంత‌, వేమిరెడ్డి ప్ర‌శాంతి, ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన  వేణుగోపాల దీక్షితులు, కంక‌ణ‌భ‌ట్టార్  రామ‌కృష్ణ దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, విజిఓ మ‌నోహ‌ర్‌, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-16 14:00:08

అక్రిటిడేషన్ కమిటీపై కోరి తెచ్చుకున్న కష్టాలు..

రాష్ట్ర సమాచార పౌరసంబంధాలశాఖ ప్రెస్ జర్నలిస్టులకు మంజూరు చేసే అక్రిడిటేషన్ కమిటీల విషయంలో అష్టకష్టాలు పడుతూ వస్తూ ప్రభుత్వానికి జర్నలిస్టుల నుంచి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తోంది. ఆది నుంచి కోర్టు కేసులతోనే కాలం వెళ్లదీయక తప్పడం లేదు. దానికి కారణంగా విచక్షణా రహితంగా అక్రిడిటేషన్ ల మంజూరులో నియమ నిబంధనలు మార్చడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. దేశ రాజధానిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబి) నిబంధనలు కాదని ఆంధ్రప్రదేశ్ లో సమాచారశాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలే దీనికి ప్రధాన కారణమవుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అక్రిడిటేషన్ల విషయంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారినా, సమయానికి అక్రిడిటేషన్లు ఇవ్వలేకపోతున్నాయి. పాత కార్డులకే ఎక్సటెన్షన్లు ఇచ్చి కాలయాపన చేస్తున్నాయి.  ప్రపంచ దేశాల్లో సైతం దేశ రాజధానిని, అక్కడి పిఐబీని ప్రమాణికంగా తీసుకుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఒక్కోసారి ఒక్కోవిధంగా అక్రిడిటేషన్ల విషయంలో నియమనిబంధనలు మార్చడంతోపాటు, కొందరు యూనియన్ నాయకుల ఒత్తిడితో ప్రత్యేక జీఓలు బయటకు తీసుకున్న సమాచారశాఖ అధికారుల తీరు కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అంతేకాకుండా జర్నలిస్టులు కాని వారికి అత్యధికంగా అక్రిడిటేషన్లు రావడం, కొన్ని జిల్లాల్లో ఏకంగా వీటికి బేరాలు పెట్టడంతో అక్రిడిటేషన్లకు మంచి డిమాండ్ ఏర్పండింది. కొన్నిజిల్లాల్లో కమిటీ సభ్యులను అడ్డం పెట్టుకొని సమాచారశాఖ ఇష్టానుసారం కొన్ని పత్రికలకు అడిగినన్ని అక్రిడిటేషన్లు మంజూరు చేయడం కూడా యావత్ కమిటీలనే ప్రశ్నార్ధకం చేసింది. ప్రభుత్వ నిబంధనలు కాకుండా కొన్నిజిల్లాల్లో సమాచారశాఖ అధికారులు నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశం అవుతుంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి పత్రికలు, లోకల్ కేబుల్ టివిలు, ఫైబర్ నెట్ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నా, సమాచారశాఖ అధికారులకు భజనలు చేసే వారికి మంజూరైనన్ని అక్రిడిటేషన్లు నిజంగా సంస్థలు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించే సంస్థలకు దక్కక పోవడం విశేషం. ఈ విషయంలో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు చేసినప్పటికీ సమాచారశాఖలోని అధికారులు వారియొక్క సొంతతెలివితో జీఓలు విడుదల చేసి కోర్టులకు సమాధానం చెప్పుకునేలా చేస్తున్నాయి. కొన్ని యూనియన్లు ఏకంగా అక్రిడిటేషన్ కమిటీలే వద్దని చెబుతున్నాయి. నిజంగా ప్రభుత్వంలోని సమాచారశాఖ నేరుగా విచారణ చేసి వర్కింగ్ జర్నలిస్టులకు, పీఐబి నిబంధనల మేరకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరుతున్నాయి. కానీ ఆవిషయాన్ని కూడా సమాచారశాఖ పరిగణలోకి తీసుకోవడం లేదు. తమ సొంత నిర్ణయాలతో జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ విషయంలో ఏడాదికో నిబంధన అమలు చేస్తూ, జర్నలిస్టులను అష్ట కష్టాలు పెడుతుంది. 2017లో ఇచ్చిన అక్రిడిటేషన్ నేటికీ ఎక్స్ టెన్షన్ లలో మాత్రమే సమాచారశాఖ నేటికీ కొనసాగిస్తుందంటే ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ విషయంలో పీఐబి నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేసి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు సమయానికి అందించాలని పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Velagapudi

2020-10-16 12:29:30

దుర్గమ్మకి ఇష్టమైన శుక్రవారమే ఫ్లైఓవర్ ప్రారంభం..

బెజవాడకు నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తూ.. విజయవాడకు తలమానికంగా నిలిచే బెంజ్‌ సర్కిల్, 2.3 కిలోమీటర్ల పొడవైన కనకదుర్గ ఫ్‌లైఓవర్లు నేడు ప్రారంభం  కానున్నాయి. ఈరోజు(శుక్రవారం దుర్గమ్మకు ఎంతో ఇష్టమైన రోజు)  ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్ మోహనరెడ్డి వర్చువల్‌ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.15,591.9 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. దుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం రెండు సార్లు వాయిదా పడి నేడు ప్రారంభానికి నోచుకుంది. ఈ సుదీర్ఘవంతెన ప్రారంభం అయితే విజయవాడ వాసులకు కష్టాలు చాలా వరకూ తీరిపోయినట్టే. అంతేకాదు, దేశంలో తిపెద్ద వంతెనగా కూడా కేంద్రం కూడా దీనిని గుర్తించింది. దీనిని పగలు, రాత్రి సమయాల్లో ప్రత్యేకంగా షూట్ చేయించి మరీ ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారు, దేశ ప్రజలు చూసే విధంగా సోషల్ మాద్యమాల్లో పెట్టింది. ఒక రకంగా ఈ దుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం ఒక చరిత్రగానే చెప్పాలి. 2020 ఆఖరు నెలల్లో ప్రారంభమవుతున్న అతి పెద్ద ప్రాజెక్టుగా కూడా ఈ ప్లైఓవర్ నిలవనుంది..

దుర్గగుడి ఫ్లైఓవర్

2020-10-16 09:14:16

వరద సహాయం తక్షణమే చేయండి..

రాష్ట్రవ్యాప్తంగా తుఫాను వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి తక్షణ సహాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బాదితులను మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకోవాలన్నారు. అంతేకాకుండా పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేవించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 చొప్పున ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్న సీఎం వారికి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు ముందస్తుగా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తం చేసి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో కూడా తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు పేరుకుపోయిన చోట్ల బ్లీచింగ్ చల్లించి చల్లించి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా గ్రామసచివాలయాల కార్యదర్శిలు ద్వారా వాస్తవ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని కలెక్టర్లును ఆదేశించారు. 

Velagapudi

2020-10-16 08:51:43

న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు గురు‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది. సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా అంకురార్ప‌ణ ఘ‌ట్టం నిర్వ‌హించిన అనంత‌రం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి సేనాధిప‌తి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించారు.   అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.  ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో  పి.బ‌సంత్ ‌కుమార్‌, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన  వేణుగోపాల దీక్షితులు, కంక‌ణ‌భ‌ట్టార్  రామ‌కృష్ణ దీక్షితులు, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, విజిఓ  మ‌నోహ‌ర్‌, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-15 20:57:05

తిరుపతిలో 20ఏళ యువతిపై పాస్టర్ అత్యాచారం..

ఆంధ్రప్రదేశ్ లో ఫాస్టర్లు ప్రార్ధనల ముసుగులో అత్యాచారాలు పెరుగుతున్నాయి..మొన్న విశాఖజిల్లా గాజువాకలో ఒక పాస్టర్ ఒ యువతిపై అత్యాచారం చేయగా నేడు తిరుపతిలో మరోపాస్టర్ 20ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. అయితే ఈ కేసుల్లో పోసు కేసులు తప్పా, చర్యలు లేకపోవడంతో రాష్ట్రంలో ఏదోమూల పాస్టర్ల అఘాయిత్యాలు పెచ్చు పెరుగుతున్నాయి. ఇక తిరుపతిలోని అఘాయిత్యానికి గురైన బాధితురాలి  తల్లి మీడియాకు తెలిపిన వివరాలు తెలుసుకుంటే... "తిరుపతిలో ఉండే పాస్టర్ దేవసహాయంకు చెందిన రెయిన్‌బో క్లినిక్ ప్రోడక్ట్ కంపెనీలో గత నెల 4వ తేదీన మా పెద్దకుమార్తె పనికి చేరింది. అయితే ఈ నెల 3వ తేదీన దేవసహాయం కారులో వచ్చి సరుకు డెలివరీ ఇవ్వాలని, మా అమ్మాయిని తీసుకెళ్లాడు. అలా చెప్పి తీసుకెళ్లి రేణిగుంట రోడ్డులోని తుకివాకం గ్రామసమీపంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అమ్మాయి ఇంటికి వచ్చాక మాకు ఈ ఘోరం గురించి తెలిసింది. దీంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దిశ పోలీస్ స్టేషన్‌కు వెళితే, వాళ్లతో మీరు పోరాటం చేయలేరని అన్నారు. మా అమ్మాయిని వేరే పని చేసుకోమని సలహా ఇచ్చారని తెలిపింది. దీంతో మేము స్పందన కార్యక్రమం ద్వారా ఈ ఘోరంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం" అని చెప్పారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదును అదనపు ఎస్పీ సుప్రజ గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పంపారు. దీంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పలువురు విపక్ష నాయకులు పరామర్శించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్‌తో పాటుగా, టీఎన్‌ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ శ్రేణులు ధర్నాకు దిగాయి.

తిరుపతి

2020-10-15 10:23:49

గ్రామసచివాలయాల్లో వీడియోకాన్ఫరెన్సు..

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వీడియోకాన్ఫరెన్సు విధానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు సీఎం వైఎస్ జగన్మోహ నరెడ్డి సంబంధిత శాఖల కార్యదర్శిలను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలకు నూతన భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. వీటి నిర్మాణం పూర్తయిన వెంటనే బ్రాడ్ బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ తోపాటు, వీడియోకాన్ఫరెన్సు వ్యవస్థను అన్ని సచివాలయాల్లోనూ అమరుస్తారు. ఆ తరువాత గ్రామసచివాలయాల్లోని అన్ని శాఖల సిబ్బందితో జిల్లా కలెక్టర్ నుంచి ఇతర శాఖల జిల్లా అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా తాజా పరిస్థితిని తెలుసుకుంటారు. అంతేకాదు ఒక్కోసారి నేరుగా సమస్యలపై వచ్చిన ప్రజలతో కూడా మాట్లాడి సచివాలయం ద్వారా ఎలాంటి సేవలు అందుతున్నాయో నేరుగా అడిగి తెలుసుకుంటారు. దేశంలోనే అత్యుత్తమ వ్యవస్థగా ప్రజలకు మరింతగా సేవలు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వ చేపడుతన్న విధానం చాలా మంది ప్రజల నుంచి మన్ననలు పొందుతుంది. అయితే ఇక్కడ నియమించబడిన 11శాఖల సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో విఫలమవుతున్నవిషయం కూడా ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లింది. ఈ సమస్యలను కూడా త్వరలోనే తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం విశేషం...

Velagapudi

2020-10-15 09:28:45

ఆరోగ్యశ్రీకి రూ.రూ. 148.37 కోట్లు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు రూ. 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి సోషల్ మీడియా మాద్యమం ద్వారా తెలియజేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ స్కీం కింద రూ. 31.97 కోట్లు విడుదల చేసినట్టు కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమన్న విజయసాయిరెడ్డి ప్రజలు నిత్యం చూసే సోషల్ మీడియా ద్వారానే కీలకమైన అంశాలు తెలియజేయడం విశేషం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు, ప్రత్యర్ధులపై సెటైర్లు కూడా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ప్రతీరోజూ రాజ్యసభ సభ్యులు ఏవిధమైన కామెంట్ చేస్తారో చూడటానికి పార్టీ సభ్యులతోపాటు, ఎల్లో అధికార పార్టీపై వార్తలు వ్యతిరేక మీడియా కూడా వేచి చూస్తుండటం విశేషం..

Visakhapatnam

2020-10-15 08:43:02

మీరుకొన్న బంగారం కాస్త తేడా ఇదిగో సాక్ష్యం..

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జ్యూయలరీ షాపుల యాజమాన్యాలు తరుగు, స్వచ్ఛత, తూకం, బిల్లు జారీ, హాల్‌ ‌మార్క్ ‌లేకుండా ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. మోసాల నిరోధానికి పూర్తి స్థాయిలో సంబంధిత అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించడం లేదు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పుట్టగొడుగుల్లా జ్యూయలరీ షాపులు వెలుస్తుండగా గడచిన అయిదేళ్లలో  కేవలం 86 షాపుల్లో సేకరించిన నమూనాలు మాత్రమే హాల్మార్క్ ‌బంగారం ఆభరణాలు నిర్ధేశించిన స్వచ్ఛత కంటే తక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని భారతీయ ప్రమాణాల సంస్ధ (బీఐఎస్‌) ‌విశాఖపట్నం బ్రాంచి ఆర్టీఐ (సమాచార హక్కు) చట్టం దరఖాస్తుదారు, ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణకు ఇచ్చిన సమాధానం (విజడ్‌బిఒ/ఆర్టీఐ/20-21/01)లో పేర్కొంది. ఈ బ్రాంచి పరిధిలో తెలంగాణాలోని ఖమ్మం జిల్లా, పాండిచ్చేరి రాష్ట్రంలోని యానాం జిల్లా, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని జిల్లాలు ఉన్నాయి. కాగా 1 ఏప్రిల్‌ 2015 ‌నుంచి 16 జూలై 2020 నాటికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో  బీఐఎస్‌ ‌నిర్ధేశించిన లక్ష్యాల సాధనలో భాగంగా తప్పదన్నట్టుగా ‘కొన్ని’ జ్యూయలరీ షాపుల్లో సేకరించిన నమూనాలలో కేవలం 86 మాత్రమే హాల్మార్క్ ‌బంగారం ఆభరణాలు నిర్ధేశించిన స్వచ్ఛత కంటే తక్కువగా ఉన్నాయి. అయితే ఆ జ్యూయలరీ షాపుల వివరాలు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 8 (‌డి) ప్రకారం వ్యాపార రహస్యమని కాబట్టి బహిర్గతం చేయబోమని బీఐఎస్‌ ‌విశాఖపట్నం బ్రాంచి కేంద్ర ప్రజా సమాచార అధికారి సకురామ్‌ ‌గుగులోతు పేర్కొన్నారు. దీంతో జ్యూయలరీ షాపుల యాజమాన్యాల దోపిడీ యదేచ్ఛగా జరుగుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన, అక్రమాలకు పాల్పడిన సంస్ధలు, వ్యక్తుల వివరాలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లు, న్యాయస్ధానాలు అనేక తీర్పులు వెలువరిచినప్పటికీ బీఐఎస్‌ ‌స్వచ్ఛతలేని బంగారం ఆభరణాలు విక్రయిస్తున్న సంస్ధల పరిరక్షణ కోసం పనిచేస్తుండడం సహేతకం కాదు. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార కమిషన్‌, ‌ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆర్టీఐ ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ తెలిపారు. 

Anakapalle

2020-10-15 07:36:27

15న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేర‌కు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల త‌ర‌హాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. నవరాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను పురస్కరించుకుని అక్టోబ‌రు 15న గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల మ‌ధ్య‌ అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా శ్రీ విష్వ‌క్సేనుల వారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేసి ఆస్థానం చేప‌డ‌తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది.

Tirumala

2020-10-14 19:19:48

శ్రీ‌వారి ద‌యతో క‌రోనా క‌ట్ట‌డి జరగాలి..

లోక‌ క‌ల్యాణం కోసం క‌రోనా వ్యాధి క‌ట్ట‌డి కావాల‌నే సంక‌ల్పంతో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణ దీక్ష చేప‌ట్టామ‌ని, దేవ‌దేవుడైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌య వ‌ల్ల ఆ సంక‌ల్పం త‌ప్ప‌క నెరవేరాల‌ని ఆశిస్తున్నాన‌ని టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణ దీక్ష ముగింపు సంద‌ర్భంగా జ‌రిగిన‌ పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో ఈవో పాల్గొన్నారు.   ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక మొద‌టి వైదిక కార్య‌క్ర‌మంగా ఈ పూర్ణాహుతిలో పాల్గొన‌డం దైవానుగ్ర‌హ‌మ‌న్నారు. గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారిగా క‌రోనా క‌ట్ట‌డికి శాస్త్ర, సాంకేతిక ప‌ద్ధ‌తుల్లో కృషి చేశానని, ప్ర‌స్తు‌తం టిటిడి ఈఓగా వైదిక క్ర‌తువుల ద్వా‌రా వ్యాధిని నివారించేందుకు శ్రీ‌వారి అనుగ్ర‌హం కోసం ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. ఈ దీక్షా కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసిన అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి మ‌న‌స్ఫూర్తిగా అభినందన‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని పూర్తిగా దాత‌ల విరాళంతో నిర్వ‌హించామ‌ని, ఈ సంద‌ర్భంగా దాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 16 రోజుల పాటు ఎంతో దీక్ష‌తో పారాయ‌ణం, హోమాలు, జ‌పాలు నిర్వ‌హించిన వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌కు, అధ్యాప‌క బృందానికి, ఉపాస‌కులకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.  టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ క‌రోనా నుంచి మాన‌వాళికి విముక్తి క‌ల్పించేందుకు ఈ దీక్ష చేప‌ట్టామ‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుండి 32 మంది ఉపాసకుల‌ను ఆహ్వానించామ‌ని తెలిపారు. టిటిడిలో మొట్ట‌మొద‌టిసారిగా ఈ దీక్ష‌ను నిర్వ‌హించామ‌ని, ఉపాస‌కులు ఎంతో నియ‌మనిష్ట‌ల‌తో శ్లోక పారాయ‌ణం, హోమాలు నిర్వ‌హించార‌ని వివ‌రించారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా కోట్లాది మంది భ‌క్తులు వారి ఇళ్ల‌లో ఈ దీక్ష చేప‌ట్టి పారాయ‌ణం చేశార‌ని, ఛాన‌ల్‌కు వ‌చ్చిన టిఆర్‌పి రేటింగ్ ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి గారి సతీమ‌ణి  స్వ‌ర్ణ‌ల‌త, బోర్డు స‌భ్యులు కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్‌,  శేఖ‌ర్‌రెడ్డితోపాటు ప‌లువురు దాత‌లు ఇచ్చిన విరాళాల‌తో ఈ 16 రోజుల దీక్షా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించామ‌న్నారు. ముందుగా వేద విజ్ఞాన పీఠంలోని ప్రార్థ‌నా మందిరంలో ప్రిన్సిపాల్  కెఎస్ఎస్‌.అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో పూర్ణాహుతిలో భాగంగా వ‌శోద్ధార హోమం, పూర్ణ‌పాత్ర విస‌ర్జ‌న‌, బ్ర‌హ్మ స్థాప‌న చేప‌ట్టి  నారాయ‌ణ సూక్తం ప‌ఠించారు. అంత‌కుముందు శ్రీ‌వారి ఆల‌యం వెనుక‌వైపు గ‌ల వ‌సంత మండ‌పంలో సుంద‌ర‌కాండ శ్లోక‌ పారాయ‌ణం ముగిసింది. ముగింపు రోజున శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేకం శ్లోకాల‌ను కూడా ప‌ఠించారు. వ‌సంత మండ‌పంలో "రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిఃప్ర‌భుః " అనే మహామంత్రం ప్రకారం సుంద‌ర‌కాండ‌లోని మొత్తం 68 స‌ర్గ‌ల్లో గల 2,821 శ్లోకాల‌ను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేశారు. అదేవిధంగా, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో క‌లిసి 32 మంది ఉపాస‌కుల‌ను శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి ప్ర‌సాదం, సంభావ‌న అంద‌జేశారు. బోర్డు స‌భ్యులు  కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్ ఉపాస‌కుల‌కు వ‌స్త్ర బ‌హుమానం అందించారు. ఆ త‌రువాత శృంగేరి పీఠం త‌ర‌ఫున వారి ప్ర‌తినిధులు విచ్చేసి టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో, సివిఎస్వోను స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, కేంద్రీయ సంస్కృత వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్‌, ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఆర్ఆర్‌.రెడ్డి, డెప్యూటీ ఈవోలు  హ‌రీంద్ర‌నాథ్‌,  విజ‌య‌సార‌ధి, బాలాజి, విజివోలు  మ‌నోహ‌ర్‌,  ప్ర‌భాక‌ర్‌, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-14 19:04:28

నకిలీ జర్నలిస్టుల ఏరివేత నిర్ణయం హర్షదాయకం..

జర్నలిస్టుల ముసుగులో జర్నలిజానికి మచ్చతెచ్చే నకిలీలను ఏరి పారేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందుకే అక్రిడేషన్ల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతోందని విశాఖపట్నంలో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రకటించటాన్ని  అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (న్యూ ఢిల్లీ) జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు,ఏపీజేయు వ్యవస్థాపక కార్యదర్శి సీహెచ్.పూర్ణచంద్ర రావు, అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు లు ఇక్కడ విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో స్వాగతించారు. నకిలీలను ఏరివేసే ప్రక్రియ అన్నిరాష్ట్రాలకు మార్గదర్శకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ యూనియన్ తొలినుండి అధికారులు జారీచేసే అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు సభ్యత్వం కల్పించటం వలనే జి.ఓ నిబంధనలు నిర్ల్యక్షం చేయబడి కొందరు క్రిమినల్స్ సైతం జర్నలిజం ముసుగులోకి   వచ్చి ఈరంగానికి మచ్చ తెస్తున్నారన్నార ఆరోపించారు. ఎట్టకేలకు ఈ విషయం గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం,సమాచార శాఖా మంత్రి పేర్ని నాని, కమిషనర్ టి వి కె రెడ్డి,ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ సంయుక్తంగా  అలాంటివారిని ఏరివేసే చర్యలు చేపట్టడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వివరించారు.  పత్రికలు, చానెళ్లు కొన్ని ఏదొక పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి, అలాగే వాటికి అనుకూలంగా వుండే వారిని లేక ఉండేందుకు అంగీకరించిన వారినే విలేకర్లుగా నియమించుకుంటాయని వేరే చెప్పాల్సిన పని లేదు.ఈ నియామకంలో భాగంగా చేరిన ఎవరైనా నేర చరిత్ర వున్నవారి వివరాలు ఇంటిలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్ ద్వారా సేకరించి మాత్రమే అక్రిడేషన్లు జారీచెయ్యలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  అసలు పత్రికలు ఎన్నడూ కనపడని వారు అక్రిడేషన్లేకాదు,ఆఖరికి  కమిటీలోకి కూడా నియమించబడుతున్నారని ఇది ఎలా సాధ్యం అని  సందేహం వ్యక్తం చేశారు.      తమ ఏపీజేయు తొలినుండి  ప్రభుత్వం జారీచేసే అక్రిడేషన్ల కమిటీలో యూనియన్లను నియమించవద్దని కోరుతోందని, అయితే కొన్ని రోజులుగా ఎంతో చరిత్ర ఉన్న ఒక యూనియన్ తమ యూనియన్ని గుర్తించలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర పదజాలం తో ప్రకటనలు చేసి జి.ఓ 98 రద్దుచేయాలని కోరుతూ ఉద్యమాలు చెయ్యటం,కొందరు నాయకులు ముఖ్యమంత్రి గారికి పరిశీలించమని కోరడం జరిగిందని,ఆయన పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తల్లో వచ్చిందనన్నారు. నిజంగానే చరిత్రవున్న ఆ యూనియన్ కి  ఈ విషయం సానుభూతితో పరిశీలించాలని ఒక సోదర యూనియన్ పక్షాన తమ యూనియన్ కూడా  మా సోదర యూనియన్ ని గుర్తించేందుకు అవసరమైన అవకాశాలు సానుభూతితో పరిశీలించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఈనెల మొదటి నుండి అక్రిడేషన్లు రెన్యూవల్ చెయ్యకపోవటం తో విషయం తెలిసిన కొందరు నకిలీలు ఈ రంగంపై నిరాసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోందని, డిసెంబర్ వరకు ఇదే పొజిషన్ ఉంటే నకిలీలు స్వచ్చందంగా తప్పుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇక వేరే వడబోత పోయాల్సిన అవసరం ఉండకపోవచ్చని పూర్ణచంద్ర రావు,వాసుదేవ నాయుడు  అభిప్రాయపడ్డారు.   అలాగే నిజమైన జర్నలిస్టులకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మేలు చెయ్యాలని ఉన్నట్లు కూడా ప్రెస్ అకాడమీ అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాధ్ ఆ మీట్ ది ప్రెస్ లో వెల్లడించడం,అలాగే కోవిడ్   భారిన పడి మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం కోరినట్టు,ఆమేరకు మంజూరైనట్లు కూడా మంగళవారం విశాఖలోనే ఆయన పాత్రికేయుల సమావేశంలో పేర్కొనటం పట్ల పూర్ణచంద్ర రావు,వాసుదేవ నాయుడులు కృతజ్ఞతలు తెలిపారు.

Machilipatnam

2020-10-14 14:49:37

ముగియనున్న సుంద‌ర‌కాండ దీక్ష ..

లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌ అక్టోబరు 14న బుధవారం ముగియనుంది. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో సెప్టెంబరు 29న ఈ దీక్ష ప్రారంభమైంది.  "రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిఃప్ర‌భుః " అనే మహామంత్రం ప్రకారం సుంద‌ర‌కాండ‌లోని మొత్తం 68 స‌ర్గ‌ల్లో గల 2,821 శ్లోకాల‌ను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 9 గంట‌ల నుండి ఒక గంట పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

Tirumala

2020-10-13 19:47:09

ఏకాంతంగా శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇటీవ‌ల విడుద‌ల చేసిన కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని అక్టోబ‌రు 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ మేర‌కు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సోమ‌వారం టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్  భ‌ర‌త్ గుప్తా, టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, డిఐజి కాంతిరాణా టాటా, జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో  గోపినాథ్‌జెట్టి త‌దిత‌రుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమ‌తించి శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లను ఆల‌య మాడ వీధుల్లో నిర్వ‌హించాల‌ని అక్టోబ‌రు 1న టిటిడి ప్రకటించింది. అయితే, అక్టోబ‌రు 6న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూత‌న‌ నిబంధ‌న‌లు విడుద‌ల చేసింది. ఈ మేర‌కు 200 మందికి మించ‌కుండా మాత్ర‌మే మ‌త‌ప‌ర‌మైన‌, సాంస్కృతిక ఉత్స‌వాలు నిర్వ‌హించాలని సూచన‌ల్లో పేర్కొంది. అదేవిధంగా, అక్టోబ‌రు నుంచి డిసెంబ‌రు వ‌ర‌కు శీతాకాలంలో ప్ర‌ముఖ ఉత్స‌వాలు ఉన్న నేప‌థ్యంలో భ‌క్తులు గుమికూడే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్నందున, క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. కావున భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో గుమికూడ‌రాద‌ని కోరింది.           కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను ఆల‌యం వెలుపల నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యాన్ని టిటిడి పునఃస‌మీక్షించింది. ప్ర‌భుత్వ సూచ‌న‌లు పాటిస్తూ న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆ మేర‌కు  ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యం తీసుకుంది.  ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారికి ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌న్నీ య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు. భ‌క్తుల కోసం వాహ‌న‌సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. 

Tirumala

2020-10-13 18:47:14