1 ENS Live Breaking News

గ్రామసచివాలయాల్లో వీడియోకాన్ఫరెన్సు..

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వీడియోకాన్ఫరెన్సు విధానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈమేరకు సీఎం వైఎస్ జగన్మోహ నరెడ్డి సంబంధిత శాఖల కార్యదర్శిలను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలకు నూతన భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. వీటి నిర్మాణం పూర్తయిన వెంటనే బ్రాడ్ బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ తోపాటు, వీడియోకాన్ఫరెన్సు వ్యవస్థను అన్ని సచివాలయాల్లోనూ అమరుస్తారు. ఆ తరువాత గ్రామసచివాలయాల్లోని అన్ని శాఖల సిబ్బందితో జిల్లా కలెక్టర్ నుంచి ఇతర శాఖల జిల్లా అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా తాజా పరిస్థితిని తెలుసుకుంటారు. అంతేకాదు ఒక్కోసారి నేరుగా సమస్యలపై వచ్చిన ప్రజలతో కూడా మాట్లాడి సచివాలయం ద్వారా ఎలాంటి సేవలు అందుతున్నాయో నేరుగా అడిగి తెలుసుకుంటారు. దేశంలోనే అత్యుత్తమ వ్యవస్థగా ప్రజలకు మరింతగా సేవలు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వ చేపడుతన్న విధానం చాలా మంది ప్రజల నుంచి మన్ననలు పొందుతుంది. అయితే ఇక్కడ నియమించబడిన 11శాఖల సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో విఫలమవుతున్నవిషయం కూడా ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లింది. ఈ సమస్యలను కూడా త్వరలోనే తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం విశేషం...

Velagapudi

2020-10-15 09:28:45

ఆరోగ్యశ్రీకి రూ.రూ. 148.37 కోట్లు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు రూ. 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి సోషల్ మీడియా మాద్యమం ద్వారా తెలియజేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ స్కీం కింద రూ. 31.97 కోట్లు విడుదల చేసినట్టు కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమన్న విజయసాయిరెడ్డి ప్రజలు నిత్యం చూసే సోషల్ మీడియా ద్వారానే కీలకమైన అంశాలు తెలియజేయడం విశేషం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు, ప్రత్యర్ధులపై సెటైర్లు కూడా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా తెలియజేస్తున్నారు. ప్రతీరోజూ రాజ్యసభ సభ్యులు ఏవిధమైన కామెంట్ చేస్తారో చూడటానికి పార్టీ సభ్యులతోపాటు, ఎల్లో అధికార పార్టీపై వార్తలు వ్యతిరేక మీడియా కూడా వేచి చూస్తుండటం విశేషం..

Visakhapatnam

2020-10-15 08:43:02

మీరుకొన్న బంగారం కాస్త తేడా ఇదిగో సాక్ష్యం..

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జ్యూయలరీ షాపుల యాజమాన్యాలు తరుగు, స్వచ్ఛత, తూకం, బిల్లు జారీ, హాల్‌ ‌మార్క్ ‌లేకుండా ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. మోసాల నిరోధానికి పూర్తి స్థాయిలో సంబంధిత అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించడం లేదు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పుట్టగొడుగుల్లా జ్యూయలరీ షాపులు వెలుస్తుండగా గడచిన అయిదేళ్లలో  కేవలం 86 షాపుల్లో సేకరించిన నమూనాలు మాత్రమే హాల్మార్క్ ‌బంగారం ఆభరణాలు నిర్ధేశించిన స్వచ్ఛత కంటే తక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని భారతీయ ప్రమాణాల సంస్ధ (బీఐఎస్‌) ‌విశాఖపట్నం బ్రాంచి ఆర్టీఐ (సమాచార హక్కు) చట్టం దరఖాస్తుదారు, ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణకు ఇచ్చిన సమాధానం (విజడ్‌బిఒ/ఆర్టీఐ/20-21/01)లో పేర్కొంది. ఈ బ్రాంచి పరిధిలో తెలంగాణాలోని ఖమ్మం జిల్లా, పాండిచ్చేరి రాష్ట్రంలోని యానాం జిల్లా, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని జిల్లాలు ఉన్నాయి. కాగా 1 ఏప్రిల్‌ 2015 ‌నుంచి 16 జూలై 2020 నాటికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో  బీఐఎస్‌ ‌నిర్ధేశించిన లక్ష్యాల సాధనలో భాగంగా తప్పదన్నట్టుగా ‘కొన్ని’ జ్యూయలరీ షాపుల్లో సేకరించిన నమూనాలలో కేవలం 86 మాత్రమే హాల్మార్క్ ‌బంగారం ఆభరణాలు నిర్ధేశించిన స్వచ్ఛత కంటే తక్కువగా ఉన్నాయి. అయితే ఆ జ్యూయలరీ షాపుల వివరాలు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 8 (‌డి) ప్రకారం వ్యాపార రహస్యమని కాబట్టి బహిర్గతం చేయబోమని బీఐఎస్‌ ‌విశాఖపట్నం బ్రాంచి కేంద్ర ప్రజా సమాచార అధికారి సకురామ్‌ ‌గుగులోతు పేర్కొన్నారు. దీంతో జ్యూయలరీ షాపుల యాజమాన్యాల దోపిడీ యదేచ్ఛగా జరుగుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన, అక్రమాలకు పాల్పడిన సంస్ధలు, వ్యక్తుల వివరాలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లు, న్యాయస్ధానాలు అనేక తీర్పులు వెలువరిచినప్పటికీ బీఐఎస్‌ ‌స్వచ్ఛతలేని బంగారం ఆభరణాలు విక్రయిస్తున్న సంస్ధల పరిరక్షణ కోసం పనిచేస్తుండడం సహేతకం కాదు. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార కమిషన్‌, ‌ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆర్టీఐ ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ తెలిపారు. 

Anakapalle

2020-10-15 07:36:27

15న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేర‌కు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల త‌ర‌హాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. నవరాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను పురస్కరించుకుని అక్టోబ‌రు 15న గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల మ‌ధ్య‌ అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా శ్రీ విష్వ‌క్సేనుల వారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేసి ఆస్థానం చేప‌డ‌తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరుగుతుంది.

Tirumala

2020-10-14 19:19:48

శ్రీ‌వారి ద‌యతో క‌రోనా క‌ట్ట‌డి జరగాలి..

లోక‌ క‌ల్యాణం కోసం క‌రోనా వ్యాధి క‌ట్ట‌డి కావాల‌నే సంక‌ల్పంతో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణ దీక్ష చేప‌ట్టామ‌ని, దేవ‌దేవుడైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌య వ‌ల్ల ఆ సంక‌ల్పం త‌ప్ప‌క నెరవేరాల‌ని ఆశిస్తున్నాన‌ని టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణ దీక్ష ముగింపు సంద‌ర్భంగా జ‌రిగిన‌ పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో ఈవో పాల్గొన్నారు.   ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక మొద‌టి వైదిక కార్య‌క్ర‌మంగా ఈ పూర్ణాహుతిలో పాల్గొన‌డం దైవానుగ్ర‌హ‌మ‌న్నారు. గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారిగా క‌రోనా క‌ట్ట‌డికి శాస్త్ర, సాంకేతిక ప‌ద్ధ‌తుల్లో కృషి చేశానని, ప్ర‌స్తు‌తం టిటిడి ఈఓగా వైదిక క్ర‌తువుల ద్వా‌రా వ్యాధిని నివారించేందుకు శ్రీ‌వారి అనుగ్ర‌హం కోసం ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. ఈ దీక్షా కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసిన అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి మ‌న‌స్ఫూర్తిగా అభినందన‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని పూర్తిగా దాత‌ల విరాళంతో నిర్వ‌హించామ‌ని, ఈ సంద‌ర్భంగా దాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 16 రోజుల పాటు ఎంతో దీక్ష‌తో పారాయ‌ణం, హోమాలు, జ‌పాలు నిర్వ‌హించిన వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌కు, అధ్యాప‌క బృందానికి, ఉపాస‌కులకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.  టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ క‌రోనా నుంచి మాన‌వాళికి విముక్తి క‌ల్పించేందుకు ఈ దీక్ష చేప‌ట్టామ‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుండి 32 మంది ఉపాసకుల‌ను ఆహ్వానించామ‌ని తెలిపారు. టిటిడిలో మొట్ట‌మొద‌టిసారిగా ఈ దీక్ష‌ను నిర్వ‌హించామ‌ని, ఉపాస‌కులు ఎంతో నియ‌మనిష్ట‌ల‌తో శ్లోక పారాయ‌ణం, హోమాలు నిర్వ‌హించార‌ని వివ‌రించారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా కోట్లాది మంది భ‌క్తులు వారి ఇళ్ల‌లో ఈ దీక్ష చేప‌ట్టి పారాయ‌ణం చేశార‌ని, ఛాన‌ల్‌కు వ‌చ్చిన టిఆర్‌పి రేటింగ్ ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి గారి సతీమ‌ణి  స్వ‌ర్ణ‌ల‌త, బోర్డు స‌భ్యులు కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్‌,  శేఖ‌ర్‌రెడ్డితోపాటు ప‌లువురు దాత‌లు ఇచ్చిన విరాళాల‌తో ఈ 16 రోజుల దీక్షా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించామ‌న్నారు. ముందుగా వేద విజ్ఞాన పీఠంలోని ప్రార్థ‌నా మందిరంలో ప్రిన్సిపాల్  కెఎస్ఎస్‌.అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో పూర్ణాహుతిలో భాగంగా వ‌శోద్ధార హోమం, పూర్ణ‌పాత్ర విస‌ర్జ‌న‌, బ్ర‌హ్మ స్థాప‌న చేప‌ట్టి  నారాయ‌ణ సూక్తం ప‌ఠించారు. అంత‌కుముందు శ్రీ‌వారి ఆల‌యం వెనుక‌వైపు గ‌ల వ‌సంత మండ‌పంలో సుంద‌ర‌కాండ శ్లోక‌ పారాయ‌ణం ముగిసింది. ముగింపు రోజున శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేకం శ్లోకాల‌ను కూడా ప‌ఠించారు. వ‌సంత మండ‌పంలో "రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిఃప్ర‌భుః " అనే మహామంత్రం ప్రకారం సుంద‌ర‌కాండ‌లోని మొత్తం 68 స‌ర్గ‌ల్లో గల 2,821 శ్లోకాల‌ను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేశారు. అదేవిధంగా, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో క‌లిసి 32 మంది ఉపాస‌కుల‌ను శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి ప్ర‌సాదం, సంభావ‌న అంద‌జేశారు. బోర్డు స‌భ్యులు  కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్ ఉపాస‌కుల‌కు వ‌స్త్ర బ‌హుమానం అందించారు. ఆ త‌రువాత శృంగేరి పీఠం త‌ర‌ఫున వారి ప్ర‌తినిధులు విచ్చేసి టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో, సివిఎస్వోను స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, కేంద్రీయ సంస్కృత వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్‌, ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఆర్ఆర్‌.రెడ్డి, డెప్యూటీ ఈవోలు  హ‌రీంద్ర‌నాథ్‌,  విజ‌య‌సార‌ధి, బాలాజి, విజివోలు  మ‌నోహ‌ర్‌,  ప్ర‌భాక‌ర్‌, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-14 19:04:28

నకిలీ జర్నలిస్టుల ఏరివేత నిర్ణయం హర్షదాయకం..

జర్నలిస్టుల ముసుగులో జర్నలిజానికి మచ్చతెచ్చే నకిలీలను ఏరి పారేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందుకే అక్రిడేషన్ల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతోందని విశాఖపట్నంలో మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రకటించటాన్ని  అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (న్యూ ఢిల్లీ) జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు,ఏపీజేయు వ్యవస్థాపక కార్యదర్శి సీహెచ్.పూర్ణచంద్ర రావు, అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు లు ఇక్కడ విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో స్వాగతించారు. నకిలీలను ఏరివేసే ప్రక్రియ అన్నిరాష్ట్రాలకు మార్గదర్శకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ యూనియన్ తొలినుండి అధికారులు జారీచేసే అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టు సంఘాలకు సభ్యత్వం కల్పించటం వలనే జి.ఓ నిబంధనలు నిర్ల్యక్షం చేయబడి కొందరు క్రిమినల్స్ సైతం జర్నలిజం ముసుగులోకి   వచ్చి ఈరంగానికి మచ్చ తెస్తున్నారన్నార ఆరోపించారు. ఎట్టకేలకు ఈ విషయం గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం,సమాచార శాఖా మంత్రి పేర్ని నాని, కమిషనర్ టి వి కె రెడ్డి,ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ సంయుక్తంగా  అలాంటివారిని ఏరివేసే చర్యలు చేపట్టడం పట్ల  హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వివరించారు.  పత్రికలు, చానెళ్లు కొన్ని ఏదొక పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి, అలాగే వాటికి అనుకూలంగా వుండే వారిని లేక ఉండేందుకు అంగీకరించిన వారినే విలేకర్లుగా నియమించుకుంటాయని వేరే చెప్పాల్సిన పని లేదు.ఈ నియామకంలో భాగంగా చేరిన ఎవరైనా నేర చరిత్ర వున్నవారి వివరాలు ఇంటిలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్ ద్వారా సేకరించి మాత్రమే అక్రిడేషన్లు జారీచెయ్యలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  అసలు పత్రికలు ఎన్నడూ కనపడని వారు అక్రిడేషన్లేకాదు,ఆఖరికి  కమిటీలోకి కూడా నియమించబడుతున్నారని ఇది ఎలా సాధ్యం అని  సందేహం వ్యక్తం చేశారు.      తమ ఏపీజేయు తొలినుండి  ప్రభుత్వం జారీచేసే అక్రిడేషన్ల కమిటీలో యూనియన్లను నియమించవద్దని కోరుతోందని, అయితే కొన్ని రోజులుగా ఎంతో చరిత్ర ఉన్న ఒక యూనియన్ తమ యూనియన్ని గుర్తించలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర పదజాలం తో ప్రకటనలు చేసి జి.ఓ 98 రద్దుచేయాలని కోరుతూ ఉద్యమాలు చెయ్యటం,కొందరు నాయకులు ముఖ్యమంత్రి గారికి పరిశీలించమని కోరడం జరిగిందని,ఆయన పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వార్తల్లో వచ్చిందనన్నారు. నిజంగానే చరిత్రవున్న ఆ యూనియన్ కి  ఈ విషయం సానుభూతితో పరిశీలించాలని ఒక సోదర యూనియన్ పక్షాన తమ యూనియన్ కూడా  మా సోదర యూనియన్ ని గుర్తించేందుకు అవసరమైన అవకాశాలు సానుభూతితో పరిశీలించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఈనెల మొదటి నుండి అక్రిడేషన్లు రెన్యూవల్ చెయ్యకపోవటం తో విషయం తెలిసిన కొందరు నకిలీలు ఈ రంగంపై నిరాసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోందని, డిసెంబర్ వరకు ఇదే పొజిషన్ ఉంటే నకిలీలు స్వచ్చందంగా తప్పుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇక వేరే వడబోత పోయాల్సిన అవసరం ఉండకపోవచ్చని పూర్ణచంద్ర రావు,వాసుదేవ నాయుడు  అభిప్రాయపడ్డారు.   అలాగే నిజమైన జర్నలిస్టులకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మేలు చెయ్యాలని ఉన్నట్లు కూడా ప్రెస్ అకాడమీ అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనాధ్ ఆ మీట్ ది ప్రెస్ లో వెల్లడించడం,అలాగే కోవిడ్   భారిన పడి మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం కోరినట్టు,ఆమేరకు మంజూరైనట్లు కూడా మంగళవారం విశాఖలోనే ఆయన పాత్రికేయుల సమావేశంలో పేర్కొనటం పట్ల పూర్ణచంద్ర రావు,వాసుదేవ నాయుడులు కృతజ్ఞతలు తెలిపారు.

Machilipatnam

2020-10-14 14:49:37

ముగియనున్న సుంద‌ర‌కాండ దీక్ష ..

లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌ అక్టోబరు 14న బుధవారం ముగియనుంది. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో సెప్టెంబరు 29న ఈ దీక్ష ప్రారంభమైంది.  "రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిఃప్ర‌భుః " అనే మహామంత్రం ప్రకారం సుంద‌ర‌కాండ‌లోని మొత్తం 68 స‌ర్గ‌ల్లో గల 2,821 శ్లోకాల‌ను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 9 గంట‌ల నుండి ఒక గంట పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

Tirumala

2020-10-13 19:47:09

ఏకాంతంగా శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇటీవ‌ల విడుద‌ల చేసిన కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని అక్టోబ‌రు 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ మేర‌కు టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సోమ‌వారం టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్  భ‌ర‌త్ గుప్తా, టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, డిఐజి కాంతిరాణా టాటా, జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో  గోపినాథ్‌జెట్టి త‌దిత‌రుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను అనుమ‌తించి శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లను ఆల‌య మాడ వీధుల్లో నిర్వ‌హించాల‌ని అక్టోబ‌రు 1న టిటిడి ప్రకటించింది. అయితే, అక్టోబ‌రు 6న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూత‌న‌ నిబంధ‌న‌లు విడుద‌ల చేసింది. ఈ మేర‌కు 200 మందికి మించ‌కుండా మాత్ర‌మే మ‌త‌ప‌ర‌మైన‌, సాంస్కృతిక ఉత్స‌వాలు నిర్వ‌హించాలని సూచన‌ల్లో పేర్కొంది. అదేవిధంగా, అక్టోబ‌రు నుంచి డిసెంబ‌రు వ‌ర‌కు శీతాకాలంలో ప్ర‌ముఖ ఉత్స‌వాలు ఉన్న నేప‌థ్యంలో భ‌క్తులు గుమికూడే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్నందున, క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. కావున భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో గుమికూడ‌రాద‌ని కోరింది.           కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలను ఆల‌యం వెలుపల నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యాన్ని టిటిడి పునఃస‌మీక్షించింది. ప్ర‌భుత్వ సూచ‌న‌లు పాటిస్తూ న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆ మేర‌కు  ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యం తీసుకుంది.  ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారికి ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌న్నీ య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు. భ‌క్తుల కోసం వాహ‌న‌సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. 

Tirumala

2020-10-13 18:47:14

థాంక్యూ సీఎం జగన్ సర్.. గంట్ల

రాష్ట్రంలో కరోనావైరస్ భారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రూ. 5లక్షలు ఆర్థిక సహాయం చెల్లించడానికి నిర్ణయించడం అభినందనీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులను కూడా “ఫ్రంట్ లైన్ వారియర్స్”గా గుర్తించడం శుభ సూచికమన్నారు. ఈ సందర్భంగా థాంక్యూ సీఎం సర్ అంటూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. కరోనా సమయంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారన్నారు. ఎన్నో ఆందోళనలు తరువాత ప్రభుత్వం జర్నలిస్టులు కరోనా మ్రుతిచెందితే రూ.5లక్షలు ఇవ్వడానికి ఒప్పుకుందని అన్నారు. ఈ భరోసా జర్నిస్టులకు కాస్త స్వాంతన నిస్తుందన్నారు. ఇప్పటి వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధినిర్వహణ చేసిన జర్నలిస్టులకు సీఎం వైఎస్ జగన్ ప్రకటన ఎంతో దైర్యాన్ని ఇస్తుందన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మ్రుతిచెందిన జర్నలిస్టులకు సత్వరమే ప్రకటించిన మొత్తాన్ని అందజేయాలని ఈ సందర్భంగా గంట్లశ్రీనుబాబు ప్రభుత్వాన్ని కోరారు.

Visakhapatnam

2020-10-13 14:24:25

కరోణాతో మ్రుతిచెందిన జర్నలిస్టులకు రూ.5లక్షలు

 రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రూ. 5లక్షలు ఆర్థిక సహాయం చెల్లించడానికి నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్  ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. మంగళవారం నాడు స్థానిక వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సమావేశ మందిరంలో ఆయన  పత్రికా విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ కోవిడ్ పై పోరాటంలో “ఫ్రంట్ లైన్ వారియర్స్” గా వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద్య సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా ముందు వరసలో వుండి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎంతోమంది పాత్రికేయులు విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ వైరస్ బారిన పడి మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రెస్ అకాడమీ తరపున, జర్నలిస్టులందరి తరపున ముఖ్యమంత్రి గారిని కోరగా, ఆయన తక్షణం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారని ఆయన తెలిపారు. ఇందుకు గాను ప్రెస్ అకాడమీ తరపున, జర్నలిస్టుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వారికి కూడా సత్వరం మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు. ఇంకా ప్రతి జిల్లాలోను కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రులలో ప్రత్యేకంగా బెడ్  లను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జర్నలిస్టుల విజ్ఞప్తిని మన్నించి, వారి కష్టాన్ని గుర్తించి జర్నలిస్టులను ఆదుకోవడానికి  అన్నిరకాలుగా ప్రభుత్వం ముందుంటుందని, సానుకూల ధృక్పథంతో వ్యవహరిస్తుందని తెలిపారని  అన్నారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులకు కొన్నిరాష్ట్రాలలో మినహా చాలా రాష్ట్రాలలో పరిహారం చెల్లించలేదని, మన రాష్ట్రంలో జర్నలిస్టులు కోరగానే సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రికి ఆయన మరో సారి ధన్యవాదాలు  తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి.మణిరామ్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటరాజు గౌడ్, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు,  ఇతరులు పాల్గొన్నారు. 

విజెఎఫ్ ప్రెస్ క్లబ్

2020-10-13 14:16:41

దాతలూ జంతువులను దత్తత తీసుకోండి..

తిరుపతి ఎస్వీ జూపార్క్ లోని జంతువులు, పక్షులు, మ్రుగాలు తదితర వణ్యప్రాణులను దత్తత తీసుకోవాలని జూ క్యురేటర్ హిమ శైలజ కోరుతున్నారు. ఈ మేరకు జూలో దత్తత తీసుకోవాలనే జంతువులు, పక్షుల వివరాలను నేరుగా ఈ నెంబరులో  9440810066 సంప్రదించవచ్చునని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జూకి విరాళాలు అందించాలనుకునే దాతలు నేరుగా బ్యాంకు నగదును కూడా సమర్పించి ఆ వివరాలు జూ క్యూరేటర్ కు తెలియజేయాలని కోరుతున్నారు. బ్యాంకు వివరాలు తెలుసుకుంటే..Syndicate Bank a/c 31712210040128, IFSC Code:SYNB0003171, MICR Code: 517025002 ఖాతాకు నేరుగా విరాళాలు పంపించవచ్చునని కోరుతున్నారు. విరాళాలు పంపించిన వారు ఎంత మొత్తం పంపారో వారి వివరాలు ఫోను ద్వారా తెలియజేయాలన్నారు. లాక్ డౌన్ లో జూలోని జంతువుల సంరక్షణ భారంగా ఉన్న కారణంగా ఈ దత్తత కార్యక్రమం చేపట్టినట్టు క్యూరేటర్ వివరించారు. దాతలు ముందుకొచ్చి జూలోని జంతువులను దత్తత తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

తిరుపతి

2020-10-13 08:58:16

పగటిపూటే 9గంటల విద్యుత్..సీఎం

వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్‌ శాఖ, వైయ‌స్సార్‌ ఉచిత విద్యుత్‌పై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వ్యవసాయ మోటర్లకు మీటర్లు అమర్చినంత మాత్రాన రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడబోదన్న విషయాన్ని గట్టిగా ప్రచారం చేయాలన్నారు. మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యుత్‌ సరఫరాను తెలుసుకునే వీలు కలుగుతుందన్న సీఎం దీని వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయవచ్చునన్నారు. అంతేకాకుండా ఆ విద్యుత్‌ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని, ఆ తర్వాత రైతులు అదే నగదును విద్యుత్‌ బిల్లు కింద డిస్కమ్‌లకు చెల్లిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రంమలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సీఎండీ జి.సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్‌.శ్రీకాంత్, ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్‌తో పాటు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

Velagapudi

2020-10-12 19:48:10

దాతలు మరిన్ని కూరగాయలు అందించాలి..

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా భ‌క్తుల‌కు రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు అందించేందుకు మ‌రిన్ని ర‌కాల కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కూరగాయల దాతలను టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి కోరారు. తిరుమ‌లలో అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి వినియోగించే కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేసే దాత‌ల‌తో సోమ‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ, దాత‌లు ఎంతో స‌హ‌కారం అందిస్తున్నార‌ని, 2004వ సంవ‌త్స‌రం నుంచి నిరంత‌రాయంగా కూర‌గాయల స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. ఈ నెల 16 నుండి 24వ తేదీ వ‌ర‌కు  తాజా కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేస్తుండ‌డంతో అన్న‌ప్ర‌సాదాలు రుచిక‌రంగా, నాణ్యంగా ఉంటున్నాయ‌న్నారు. అన్నిర‌కాల కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోర‌డంతో దాత‌లు అంగీక‌రించారని తెలిపారు. 2019-20వ సంవ‌త్స‌రంలో 18.57 ల‌క్ష‌ల ట‌న్నుల కూర‌గాయ‌లు విరాళంగా అందాయ‌ని, ఈ ఏడాది కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా సెప్టెంబ‌రు నెల వ‌ర‌కు 1.65 ల‌క్ష‌ల ట‌న్నుల కూర‌గాయ‌లను దాత‌లు విరాళంగా అందించారన్నారు. ఈ స‌మావేశంలో అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో  నాగ‌రాజ‌, క్యాట‌రింగ్ అధికారి  జిఎల్ఎన్‌.శాస్త్రి, ఏఈవో  లోక‌నాథం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచి వ‌చ్చిన 15 మంది కూర‌గాయ‌ల దాత‌లు పాల్గొన్నారు.

Tirumala

2020-10-12 16:33:25

జంతు ప్రేమికులూ దత్తతకు ముందురండి..

తిరుపతి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం(తిరుపతి జూ)లో ప్రాణులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందు కు రావాలని చిత్తూరు జిల్లాకలెక్టర్ నారాయణ భరత్ గుప్తా కోరారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా జూలోని వణ్యప్రాణులు పక్షులు సంరక్షణ కష్టంగా వున్న తరుణంలో దాతలు ముందుకి వచ్చి రోజుకి రూ.20 నుంచి ఎంత మొత్తముతోనైనా జంతువులు, పక్షులు, మ్రుగాలను దత్తత తీసుకోవాలని కోరారు. జూలోని జీవచరాలకు తోచినంత సహాయం చేయడానికి కూడా చిన్న పిల్లలు, జంతు ప్రేమికులు ముందుకి రావాలని కోరారు. లాక్ డౌన్ కారణంగా జూనిధులు అయిపోవడంతో వాటి సంరక్షణ కష్టంగా ఉన్నందున దాతలు ముందుకు వస్తే వారి పేరుతో జంతువులు, పక్షులను పెంచడానికి ఆస్కారం వుంటుందన్నారు. దేశంలోనే అతి పెద్ద జంతు సంరక్షణా కేంద్రంలో ఒకటిగా వున్న తిరుపతి జూని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనే విషయాన్ని గుర్తించి ప్రతీ ఒక్కరూ జంతు సంరక్షణకి ముందుకి రావాలని కలెక్టర్ కోరారు.

కలెక్టరేట్

2020-10-12 15:50:40

తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దండి కొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీలో కురుస్తున్న అధిక వర్షాల కారణంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. తహశీల్దార్లు, ఎంపీడీలను అత్యవసర సమయాల్లో సేవలు అందించడానికి సిద్దంగా వుంచినట్టు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. వార్షాలపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహించి వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా నదులు, బ్యారేజిలు ఉన్నచోట దిగువ ప్రాంతాలను ముందస్తుగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్ని బ్యారేజీలు పూర్తిస్థాయి నీటితో నిండుకుండలా కనిపిస్తున్నాయి.

వెలగపూడి

2020-10-12 12:28:39