1 ENS Live Breaking News

గర్భిణీలు సరే మరి బాలింతల పరిస్థితేంటి..

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కరోనా కారణంగా మహిళా గర్భిణీలకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తూ డిజిపి గౌతం సవాంగ్ అన్ని జిల్లా యూనిట్లకు ఆదేశాలు జారీచేశారు.. కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే ఈ అవకాశం కల్పించి బాలింత మహిళా ఉద్యోగిణిలకు అవకాశాలు కల్పించకపోవడంపై నిరసన వ్యక్తమవుతుంది. దానికి తోడు ఇపుడు గ్రామ,వార్డు సచివాలయాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న గ్రామమహిళా సంరక్షణా కార్యదర్శి(మహిళా పోలీస్)ల విషయంలో ఈ వర్క్ ఫ్రం హోం విషయంలో క్లారిటీ రాలేదు. డీజీపి గౌతం సవాంగ్ ఇచ్చిన ఆదేశాలు వీరికి వర్తిస్తాయో లేదా అనే అంశాన్ని ఎక్కడా పేర్కొనలేదు. చాలా మంది మహిళలు అటు పోలీసు శాఖలోనూ, ఇటు సచివాలయాల్లో గర్భిణీలుగానూ.. అంతకంటే ఎక్కువగా  బాలింతలుగా ఉన్నారు. కాన్పులు జరిగిన తరువాత నెలల చంటిపిల్లతోనే కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్నారు. దీనితో కరోనా సమయంలో తమకు కూడా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని, లేదంటే తాము కూడా కరోనా బారిన పడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన అవకాశం బాలింతలకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. నెలలు నిండిన పిల్లలతో భయం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు. వైద్యుల సూచన మేరకు కూడా గర్భిణీలు, బాలింతలు కూడా త్వరగా కరోనా వైరస్ భారిన పడే అకాశాలున్నాయి. ఈ విషయంలో డిజిపీ గౌతం సవాంగ్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతున్నా..కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే అవకాశం కల్పించి బాలింత విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమవుతుంది. అందులోనూ సచివాలయాల్లోనే విధులు నిర్వహిస్తున్నప్పటికీ,వీరి మాత్రుశాఖ హోం డిపార్ట్ మెంట్ కావడంతో వీరు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాస్తవానికి సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసు శాఖ ఉద్యోగులుగానే వీరంతా ఉన్నారు. అలాంటి సమయంలో వీరికి కూడా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాల్సి వుంది. కానీ కేవలం మహిళా ఖాకీలకే అవకాశం కల్పించడం గందర గోళానికి దారితీస్తుంది. ఇదే సమయంలో సమయంలో ప్రభుత్వం నుంచే వచ్చే ఉత్తర్వులు జిల్లా ఎస్పీ కార్యాలయాలన నుంచి ఎంపీడీఓల ద్వారా సచివాలయాలకు రావాల్సి వున్నా..రాష్ట్రంలో ఎక్కడా ఈ విధానం అమలు జరగడం లేదు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగుల సందేహాలు, అనుమానాలు తీర్చుకునే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే పనిచేసే వెసులుబాటు కల్పించినా అది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వర్తించలేదు. ఇపుడు పోలీసుశాఖలో మహిళా గర్భిణిలకు కల్పించిన వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కూడా సచివాలయాల్లోని మహిళా పోలీసులకు కల్పించకపోవడం దారుణమని ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్నారు. చాలా చోట్ల ఆసుపత్రుల్లో నిర్వహించే వేక్సినేషన్ల వద్దే విధులు కేటాయిస్తున్నారని కూడా భయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సి వుంది..

Tadepalle

2021-05-16 02:41:02

Tadepalle

2021-05-15 02:35:29

Tadepalle

2021-05-15 01:57:54

మనుషులకు దూరంగా ఉండండి..

కొన్ని వందల వేల సంస్క్రుతీ సంప్రదాయాలను, ప్రేమాభిమానాలను, కరోనా వైరస్ మటు మాయం చేసింది.. మనుషుల కలిసుండటాన్ని చూసి కన్నుకుట్టుందో ఏమో..వారి మధ్య దూరాన్ని ఖచ్చితంగా పెంచాలని నిర్ణయించుకుంది..అంతే బౌతిక దూరం పాటించకపోతే నేను మీలో ప్రవేశిస్తానని భయపెట్టి మరీ చంపుతోంది.. మనం బతికుంటే బలుసాకైనా తినొచ్చునని అంతా ఒక నిర్ణయానికి వచ్చేలా చేసింది..మనుషులకు దూరంగా ఉండకపోతే తప్పదన్నట్టుగా మార్చేసింది ఈ కరోనా. ప్రపంచ వ్యాప్తంగా వీదేశీ సంస్క్రుతి షేక్ హేండ్ కి శాస్వతంగా చరమగీతం పాడేలా చేసింది. మాయదారి కరోనా వైరస్ ప్రవేశించాక ఎన్నడూ వినని వార్తలు, ముందెన్నడూ కనని వైపరీత్యాలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి.. అయినా కరోనాని జయించడానికి ప్రజలు, ప్రభుత్వాలు ఎదురెళ్లి పోరాటం చేస్తూనే ఉన్నారు..అదే సమయంలో ఇహలోక దైవ సహాయం ఎలా వుంటుందో కూడా సోనూసూద్ లాంటి వారి  ద్వారా యావత్ ప్రపంచం మొత్తం తెలుసుకునేలా చేసింది ఈ కరోనా..!

Tadepalle

2021-05-15 01:54:43

Tadepalle

2021-05-14 13:57:10

Tadepalli

2021-05-14 11:53:14

Tadepalle

2021-05-14 08:57:14

2021-05-14 08:49:21

2021-05-14 07:06:21

Tadepalle

2021-05-14 06:06:10

Tadepalle

2021-05-14 04:05:56

Tadepalle

2021-05-14 04:03:15

టిఎన్ఆర్ కుటుంబాని అండగా ఐడ్రీమ్ మీడియా..

ఏదైనా మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టు మ్రుత్యువాత పడితే ఆరోజు సంతాపం తెలిపి, ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేసి  చేతులు దులుపుకోవాలని చూసే మీడియా సంస్థలున్న ఈరోజుల్లో.. ఐడ్రీమ్ మీడియా తమసంస్థ కోసం పనిచేసే వారి బాధ్యత అంతా మాదేనని నిరూపించింది.  నటుడు, ప్రముఖ యాంకర్‌,  టీఎన్‌ఆర్‌ని కరోనా కాటు వేస్తే..ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ సంస్థ చైర్మన్ చిన్నవాసుదేవ ముందుకి వచ్చారు. స్వయంగా ఆయన టిఎన్ఆర్ ఇంటికి వెళ్లి రూ.10లక్షలు ఆర్ధిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. అంతేకాకుండా వారి పిల్లల చదువు బాధ్యతను కూడా తమ సంస్థే భరిస్తుందని భరోసా ఇచ్చారు.  మీడియా సంస్థలో పనిచేసిన ఒక జర్నలిస్టు కోసం సదరు సంస్థ యజమాని నేరుగా వచ్చి కుటుంబం రోడ్డున పడకుండా చేసిన సహాయం నేడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఎన్నో మీడియా సంస్థల యాజమాన్యాలకు కనువిప్పుగా కూడా మారింది. చిన్నవాసుదేవ లాంటి చైర్మన్ లు ఉన్న మీడియా సంస్థలుంటే జర్నలిస్టులకు ఉద్యోగాలకు, జీవితాలకు భరోసా ఉంటుందనే భావన నేడు జర్నలిస్టుల్లో వ్యక్తమవుతుంది. 

Hyderabad

2021-05-13 13:26:45

తాడేపల్లి

2021-05-12 15:56:54

Tadepalle

2021-05-12 15:30:06