1 ENS Live Breaking News

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తింపు హర్షనీయం..

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్ గుర్తిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల అల్లూరి చరిత్ర పరిశోధకులు, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సంపాదకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూ మ్రుత్యువాత పడిన జర్నలిస్టులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాస్త భరోసా దక్కుతుందన్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా  ప్రకటించండం కూడా అభినందనీయమన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ఈఎన్ఎస్ బాలు డిమాండ్ చేశారు. కరోనా అప్డేట్స్ ను ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ అందించేది ఒక్క మీడియానేనని అన్నారు. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కారణంగా ఇప్పటివరకు వందకు పైగా జర్నలిస్టులు మ్రుత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాంరు. ప్రభుత్వాలు బాధిత జర్నలిస్టుల కుటుంబాల సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాలను సత్వరమే అందించి మ్రుత్యువాత భారిన పడిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

విశాఖపట్నం

2021-05-06 04:44:19

కరోనాలోనూ సచివాలయాల్లో బయోమెట్రిక్..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో  గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్సు  అమలు చేయడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా మార్చిన విధానం ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే అందరు ఉద్యోగులు ఖచ్చితంగా బయో మెట్రిక్ అటెండెన్సు(ఇన్, ఔట్) వేస్తే తప్పా వారికి జీతాలు పెట్టేది లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ వేస్తున్నారు. ఈ సమయంలో గర్భిణి/బాలింత మహిళా ఉద్యోగులు భయం భయంగా బయో మెట్రిక్ వేయాల్సి వస్తుంది. ఇదే క్రమంలో చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన కూడా పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే 15వేల జీతంలోనే ప్రత్యేకంగా శానిటైజర్లు, గ్లౌజ్ లు, మాస్కులు, ఫేస్ షీల్డులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా.. ఏ ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియని తరుణంలో అందరు ఉద్యోగులు ఒకే బయో మెట్రిక్ యంత్రాన్ని వినియోగించడం పట్ల ఎవరికైనా వైరస్ సోకితే సచివాలయంలోని అందరు ఉద్యోగులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని హడలి చస్తున్నారు. కాకపోతే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రతీరోజూ అందరూ బయో మెట్రిక్ వేస్తున్నప్పటికీ ఏ సచివాలయంలోనూ ప్రభుత్వం గానీ, జిల్లా అధికారులు గానీ కనీసం శానిటైజర్లును ఏర్పాటు చేయడం లేదని చెబుతున్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు హేండ్ గ్లౌజులు, ప్రజలు తీసుకొచ్చే కాగితాలు వేయడానికి ప్రత్యేక ప్లాస్టిక్ ట్రేలు ఏర్పాటు చేస్తున్నారని..కానీ గ్రామ సచివాలయాల్లో ఎక్కడా వీటిని ఏర్పాటు చేయక పోవడం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తుంది. అందులోనూ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అంతా కలిసి ఒకే బయో మెట్రిక్ మిషన్ ను వినియోగించడమే ఇక్కడ భయాందోళనకు గురిచేస్తుంది. వాలంటీర్లకి ఇచ్చిన 50 ఇళ్లకి  వెళూతూ, సచివాలయానికి వచ్చేటపుడు వీరంతా బయో మెట్రిక్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు బయట తిరిగే సమయంలో వీరి ద్వారా అయినా వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. వాలంటీర్లు కూడా తప్పని సరిగా బయో మెట్రిక్ వేస్తే తప్పా వారికిచ్చే గౌరవ వేతనాలు రావని చెబుతుండటంతో వారు కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సి వస్తుంది. రాష్ట్రంలో చాలా ప్రభుత్వ శాఖల్లో బయో మెట్రిక్ అటెండెన్సు తీసేసినప్పటకీ గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రం అమలు చేయడం పట్ల ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కరోనా వైరస్ పూర్తిగా సమసి పోయేంతవరకూ అయినా అందరూ ఒకే చోట బయోమెట్రిక అటెండెన్సు వేసే విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అందరూ కింది స్థాయి సిబ్బందే కావడంతో ఎవరూ ఈ ఇబ్బందులను ఇటు జిల్లా కలెక్టర్, జెసి గ్రామ సచివాలయాలు ద్రుష్టికి తీసుకు వెళ్ల లేకపోతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్పా గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోనా సమయంలో సామూహికంగా ఒకే చోట బయో మెట్రిక్ అటెండెన్సు నుంచి ఈ కరోనా సమయంలో మినహాయింపు వచ్చేటట్టు కనిపించడం లేదు. 

తాడేపల్లి

2021-05-06 01:43:55

డయల్ యువర్ ఈఓ రద్దు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహించే డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఈఓ డా.జవహర్ రెడ్డి తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పరమైన కార్యక్రమాలను ద్రుష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు, ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో ఆలయంలో పనిచేసే అర్చకులు, సిబ్బందికి, అధికారులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

తిరుమల

2021-05-05 14:01:12

ఈ-ఫైలింగ్ కి దూరంగా సచివాలయాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ-ఫైలింగ్(ఎలక్ట్రానిక్ ఫైలింగ్ సిస్టమ్) లేమి తీవ్రంగా వెంటాడుతోంది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సుమారు ఏడాదిన్నర కావొస్తున్నా ప్రభుత్వం మాత్రం ఈ-ఫైలింగ్ విధానం మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టడం లేదు. దీనితో అవినీతి అధికారులకు మండల, జిల్లాలో స్థాయిలో ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రత్యక్షంగా ఇపుడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, అందునా మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణ సెలవు నుంచి ప్రసూతి సెలవులు, వాటియొక్క సాలరీ బిల్లుల శాఖా పరమైన అనుమతుల కోసం జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.15వేల రూపాయల జీతంతో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులు సెలవులు, వాటి మంజూరు కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇక సాధారణ ప్రజల అనుమతులైతే చెప్పాల్సిన పనేలేదు. వారికి సంబంధిత ద్రువీకరణ పత్రాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా శాఖల అనుమతులకు దరఖాస్తులు చేసుకునే వారంతా మండల కార్యాలయాల(ప్రభుత్వ శాఖలు) చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈఫైలింగ్ విధానం అమలు చేస్తే..గ్రామసచివాలయం నుంచి అప్ లోడ్ అయిన దరఖాస్తు మధ్యలో మండల శాఖ కార్యాలయం అనుమతి పొంది, ఆపై సంబంధిత జాల్లా శాఖ అధికారి అనుమతికి వెళుతుంది. అక్కడ కూడా అధికారుల క్రిందిస్థాయిలో జతచేసిన అనుబంధపత్రాల ఆధారంగా అనుమతులు నిర్ణీత సమయంలోనే అనుమతులు మంజూరు చేయడానికి ఆస్కారం వుంటుంది. అలాకాకుండా పాత కాగితపు దరఖాస్తు విధానమే నేటికీ అమలు జరుగుతుంటంతో దరఖాస్తు దారులు, ఉద్యోగుల దరఖాస్తులు ఎక్కడ పడేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అదే ఈఫైలింగ్ విధానంలో అయితే ఏ కార్యాలయంలో దరఖాస్తుదారుడు తొలుత అనుబంధ పత్రాలతో ఒక అనుమతికోసం దరఖాస్తుచేస్తాడో అవి మండల కార్యాలయం, జిల్లా కార్యాలయ అధికారుల అనుమతితో ఆన్ లైన్ లోనే తేదిలు, సమయాలతో సహా భద్రంగా ఉంటాయి. ప్రభుత్వం శాఖల అధికారులు కూడా నిర్ణీత సమయంలోనే అనుమతులు మంజూరు చేయడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే  గ్రామ సచివాలయం నుంచి దాఖలైన దరఖాస్తు మండల కేంద్రంలో ఆగిపోయినా, లేదంటే మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి చేరకపోయినా అనుమతులు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో మళ్లీ దరఖాస్తు దారులు గ్రామ సచివాలయాలకు వచ్చి ఇక్కడ దాఖలు చేసిన దరఖాస్తు నకలను, మండల కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తు నకలను, తీసుకొని జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగాల్సి వస్తుంది. అక్కడ కూడా అధికారులు, సిబ్బందికి  ఖాళీ ఉంటే తప్పా అనుమలుతు వచ్చే పరిస్థితి ఉండదు.  అదే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులైతే ప్రత్యేక సెలవులు, ప్రసూతి సెలువుల అనుమతుల కోసం మరోసారి జిల్లా కార్యాలయాలకు వెళ్లడానికి సెలవులు పెట్టాల్సి వస్తుంది. ఆ ఫైళ్లకు మోక్షం కలగడానికి వీరికొచ్చే అతి తక్కువ జీతం నుంచి అధికారులకు, సిబ్బందికి మామూళ్లు సమర్పించాల్సి వస్తుంది. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ గిరిజా శంఖర్ చొరవ తీసుకుంటే తప్పా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఈఫైలింగ్ విధానం అందుబాటులోకి రాదు. ప్రజలకు సత్వరమే సేవలు కూడా అందే పరిస్థితి లేదు. ఈ శాఖలో పనిచేసే సుమారు లక్ష మంది ఉద్యోగులకు, అందులో పనిచేసే మహిళల ప్రసూతి సెలవులు, ప్రత్యేక సెలవులకు సంబంధించిన అనుమతులు కూడా సకాలంలో అందే పరిస్థితి కనిపంచడం లేదు. ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసు కుంటుందో వేచి చూడాలి..!

తాడేపల్లి

2021-05-05 06:48:12

2021-05-04 12:57:46

బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ..

రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, లాక్ డౌన్ కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 24 గంటల్లో 1,15,275 కరోనా పరీక్షలు నిర్వహించగా, 18,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాని, 71 మరణాలు సంభవించాయని తెలిపారు. ఆదివారం కంటే అయిదు వేల కేసులు తక్కువగా నమోదయ్యాని తెలిపారు. 599 ఆసుపత్రుల్లో  కరోనా సేవలు అందిస్తున్నామన్నారు. కర్నూల్ మినహా మిగిలిన జిల్లాల్లో ఐసీయూ బెడ్ లు తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయన్నారు. కర్నూలు లో 324 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 11,665 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 82 కొవిడ్ కేర్ సెంటర్లలో 68 చోట్ల కరోనా టెస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. 
అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటు
ఈరోజు 447 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించామన్నారు. రాష్ట్రంలో పెరిగిన కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కొనుగోలు కమిటీ తొలి సమావేశం నేడు(సోమవారం) జరిగిందన్నారు. ఈ సమావేశంలో  ఆక్సిజన్ స్టోరేజ్, రవాణాకు అవసరమైన క్రయోజనిక్ ట్యాంకర్లు, ఇతర పరికరాల కొనుగోలుపై చర్చించామన్నారు. టీచింగ్ సహా అన్ని ప్రభుత్వాఆసుపత్రుల్లోనూ పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, పైప్ లైన్ల కొనుగోలుకు మూడు నాలుగు రోజుల్లో టెండర్లు ఫైనల్ చేస్తామన్నారు. ఇందుకోసం ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించనున్నామనేది రెండ్రోజుల్లో తెలియజేస్తామన్నారు.  104 కాల్ సెంటర్ కు 13,839 కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో 5,093 కాల్స్ వివిధ రకాల సమాచారం, 3,413 కాల్స్ కరోనా టెస్టులు, 2,370 ఆసుపత్రుల్లో అడ్మిషన్ల వివరాలు, 1,768 ఫోన్ కాల్స్ కరోనా టెస్టు రిజల్ట్ కోసం వచ్చాయన్నారు. 
లాక్ డౌన్ కాదు... కర్ఫ్యూ మాత్రమే...
పెరుగుతున్న కేసుల నేపథ్యంలో...రాష్ట్రంలో రెండు రకాల కట్టడి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. వ్యాపారాలకు, సాధారణ జీవనానికి ఎటువంటి ఆటంకాలు ఉండబోవన్నారు. అయితే, ఎక్కడైనా అయిదుగురు కంటే ఎక్కువగా ఉండకుండా ఉండేలా 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. నిత్యావసరాలు, ఇతర సరకుల కొనుగోలు సమయంలో భౌతిక దూరం పాటించాలన్నారు. గుంపుగా ఎక్కడా అయిదుగురికి  మించి ఉండకూడదన్నారు. 144 సెక్షన్ నిబంధన ఒక్కటే ఉదయం వేళల్లో అమలు చేస్తామన్నారు. ఇక రెండోది...మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ పరిస్థితి ఉంటుందన్నారు. ఇది లాక్ డౌన్ మాత్రం కాదన్నారు. మెడికల్ సహా అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందన్నారు. మీడియా, ఉద్యోగులకు ఎటువంటి ఆటంకం ఉండబోదన్నారు. పాస్ లు, ప్రయాణికుల రాకపోకలపై విధి విధానాలను రేపు తెలియజేస్తామన్నారు. ఈ నిబంధనలు బుధవారం ఉదయం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. కర్ఫ్యూతో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయొచ్చునన్నారు. కర్ఫ్యూ కు సంబంధించి పూర్తి వివరాలను మంగళవారం అందజేస్తామన్నారు. కరోనా కట్టడి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండ్రోజులకొకసారి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. నేడు(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు. కొన్ని జిల్లాలో బెడ్లు నిండిపోయాయని, మరికొన్ని జిల్లాలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 
ఏపీలో కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి లేదు...
ఏపీలో కొత్త స్ట్రెయిన్ లేదని, ప్రస్తుతం ఉన్న స్ట్రెయిన్ గతేడాది జులై నుంచే రాష్ట్రంలో ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే సీసీఎంబీ అధికారులతో తమ అధికారులు మాట్లాడారన్నారు. కొత్త స్ట్రెయిన్ పై సీసీఎంబీ అధికారికంగా ప్రకటించలేదన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తగదన్నారు. కొత్త స్ట్రెయిన్ వల్ల కేసులు పెరుగుతున్నాయనడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్ గైడ్ లైన్స్ ను పాటించడం ద్వారా కరోనా వైరస్ ను అడ్డుకట్ట వేయొచ్చునన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా కొవిడ్ గైడ్ లైన్స్ ను పాటించాలని ఆయన కోరారు. 
టీకా పంపిణీలో 45 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యత...
45 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి అవసరమైన వ్యాక్సిన్లను ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఇలా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను కూడా 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి కాకుండా 45 ఏళ్ల పైబడిన వారికే వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వృద్ధులకు వేసిన తరవాతే యువతకు వ్యాక్సిన్ వేయడం సరైన పద్ధతన్నారు. అందరికీ వ్యాక్సిన్ వేయడానికి కొన్ని నెలల సమయం పడుతుందన్నారు. 

మంగళగిరి

2021-05-03 15:35:14

2021-05-03 15:04:29

గ్రామ సచివాలయంలో మరో ముసలం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ఏడాది తిరగగానే మరో కొత్త ముసలం మొదలైంది. గ్రామ పంచాయతీ, గ్రామసచివాలయాలు స్థానిక సంస్థల ఎన్నికల తరువాత వేరుగా మారిపోయాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం జీఓనెంబరు-2 ద్వారా గ్రామసచివాలయానికి వీఆర్వోను డిడిఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనితో ప్రభుత్వం ప్రతీ 3వేల మందికి ఒక గ్రామసచివాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ నియమించిన గ్రామ కార్యదర్శి గ్రేడ్-5 లకు పనిలేకుండా పోయింది. ఆర్ధికపరమైన అంశాలతోపాటు, కొన్ని అధికారాలను డీడీఓలుగా ఉన్న వీఆర్వోలకే అప్పగించడంతో సచివాలయ కార్యదర్శిలు పలు క్లస్టర్లలో చేసేపనులకు ఎవరు జవాబుదారీగా ఉండాలో తెలియక మధన పడుతూ, రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన మొదలు పెట్టారు. పంచాయతీలకు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలను నియమించి, గ్రామసచివాలయాలకు గ్రేడ్-5 కార్యదర్శిలను అధిపతులను చేయడంతోపాటు ఆర్ధికపరమైన అంశాలు తమకే అప్పగించాలనేది వీరి వాదన. సచివాలయ కార్యదర్శిలు సెల్ఫ్ డిడిఓలుగా ఉన్నప్పటికీ ఆర్ధిక పరమైన అంశాలతోపాటు ఇతరత్రా అంశాలన్నింటికీ ప్రభుత్వం వీఆర్వోలనే సచివాలయాలకు బాసులను చేయడంతో వీరంతా తమ విధులు, బాధ్యతలు, క్లష్టర్ పరిధిలోని పనులకు ఎవరు జవాబు దారో చెప్పాలంటూ ఎంపీడీఓలకు, జిల్లా పంచాయతీ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది సిబ్బందిని వివిధ విభాగాల్లో నియమించిన ప్రభుత్వం సచివాలయాలకు గ్రేడ్-5 కార్యదర్శిలగా ఉంచిన ప్రభుత్వం షడన్ గా వీఆర్వోలను డిడిఓలుగా చేయడం పట్ల గ్రామ కార్యదర్శిలంతా ఆందోళన బాట పట్టారు. వీఆర్వోలు విద్యార్హతలు ఇంటర్మీడియట్ మాత్రమేనని, తాము డిగ్రీలు చదువుకొని ఎపీపీఎస్సీ ద్వారా విధుల్లోకి చేరామని వాధిస్తున్నారు. అదీ నిజమే వీఆర్వోల్లో చాలా మంది పదవ తరగతి చదివిన వారే ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ఇంటర్ విద్యార్హత చేయడంతో వీరంతా ఇంటర్ పాసయ్యారు. అతి కొద్దిమంది మాత్రమే దూరవిద్యలో డిగ్రీ చదివారు. కానీ గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు మాత్రం నేరుగా డిగ్రీ క్వాలిఫికేషన్ లో విధుల్లో చేరి సుమారు ఏడాదిన్నరగా ప్రజలకు సేవలు అందిస్తూ వస్తున్నారు. దీనితో ఒక్కసారిగా వీరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన జీఓ పట్ల అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం వీఆర్వోలకు అధికారాలిస్తూ జారీచేసిన జీఓనెంబరు2 లోపాలను, అర్ధం కాని కొన్ని అంశాలను తెరమీదకు తీసుకు వస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ చాలా పంచాయతీలు ఇన్చార్చి కార్యదర్శిలతోనే నడుతుస్తున్నాయి. మరికొన్ని గ్రామసచివాలయాల్లో విధులు, రికార్డులు, సిబ్బంది బదాలయింపులు కూడా పూర్తి కాలేదు. ఈ తరుణంలోనే పంచాయతీ ఎన్నికలు జరగడం, అక్కడ పంచాయతీ కార్యదర్శిలకు పూర్తిస్థాయిలో పనులు ఉండటంతో జీఓ నెంబరు 2 ద్వారా గ్రామసచివాలయంలోని గ్రేడ్-5 కార్యదర్శిల అధికారాలన్నీ వీఆర్వోల చేతి వెళ్లిపోవడంతో అంతా గందరగోళంగా మారింది. ఈ జీఓనెంబరు విషయంలో తొలుత ప్రభుత్వం కాస్త క్లారిటీ ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో గ్రామసచివాలయంలో పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు తమ అధికారాలు పోతే, ఆర్దిక పరమైన విషయాలకు తమకంటే స్థాయి తక్కువగా వున్న వీఆర్వోల దగ్గరకు ఎలా వెళతామనే భావనలో ఉన్నారు. తాము చేసే పనులకు ఆర్ధిక అధికారాలు తమకు అప్పగించాలని, పంచాయతీలకు ప్రత్యేకంగా కార్యదర్శిలను నియమించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా వుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నవారందరికీ ప్రొభిషన్ పిరియడ్ రెండేళ్లు ఇంకా పూర్తి కాలేదు. ఈ సమయంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేయమంటే ఆవిధంగా పనిచేయాలి. వీరు డిమాండ్ లు చేయడానికి వీలుపడదు. అయినప్పటీ ప్రభుత్వం ఇచ్చిన జీఓ విషయంలో లోపాలను, అర్ధం కానీ, మతలబులున్న విషయాలను గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రభుత్వం ద్రుష్టికి అధికారుల ద్వారా తీసుకెళుతున్నారు. ఇప్పటి వరకూ పాత పంచాయతీ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీల చేతిలోనే ఉన్న పంచాయతీలు, సచివాలయాల అధికారాల బదలాయింపు జరగకుండా ఇపుడు మళ్లీ ప్రభుత్వం గ్రేడ్-5 కార్యదర్శిల విధుల్లో కోత విధించడం తెరపైకి వీఆర్వోలను డిడిఓలుగా తీసుకురావడం ముందు ముందు ఏం జరగబోతుందనే ఉత్కంఠను రేపుతోంది..!

తాడేపల్లి

2021-05-03 13:50:03

చిత్తూరు ఉప ఎన్నికల్లో నోటా హవా..

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో నోటా తన హవాని చాటుకుంది. అత్యధిక సంఖ్యలో తిరుపతిలో ఓటర్లు నోటాకి ఓట్లు వేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి గెలుపు, ఇతర ప్రత్యర్ధి పార్టీలకు ఓటమి వస్తుంటాయి. కానీ విచిత్రంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఆదివారం లెక్కింపు జరుగుతున్న మధ్యాహ్నాం 12.05 గంటల సమయానికే ఒక్క నోటాకి 4950(1.4 శాతం) ఓట్లు పోలవడం అన్ని రాజకీయ పార్టీల వారిని ఆలోచనకు గురిచేసింది. అంటే చాలా మంది ప్రజలకు ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలబడిన వారెవరికీ ఓట్లు వేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా అధికారికంగా చెప్పినట్టు అయ్యింది. వైసీపీ: 2,04,370(56.1 శాతం), టీడీపీ: 1,17,612(32.3 శాతం) , బీజేపీ: 20,811(5.7 శాతం), కాంగ్రెస్ : 3,280(0.9 శాతం) ,సీపీఎం :1,892(0.5 శాతం), ఇతరులు : 11,337(3.2 శాతం) ఓట్లు సాధించారు. ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతోంది..

తిరుపతి

2021-05-02 07:01:22

Tadepalle

2021-03-19 22:13:57

Tadepalle

2021-03-19 18:53:42

Hyderabad

2021-03-19 17:18:48

Tirumala

2021-03-19 16:23:31

Tadepalle

2021-03-19 16:20:46