1 ENS Live Breaking News

2021-05-20 02:38:44

చెక్ పవర్ కోసం లెక్కలు కడుతున్నారు..

ఆంధ్రప్రదేశ్ లోని 13367 గ్రామ పంచాయల్లో సర్పంచ్ లకు త్వరలోనే చెక్ పవర్ ఇచ్చేందుకు ప్రభుత్వం చక చకా ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం సర్పంచ్ లవివరాలను ఆన్ లైన్ చేసి బయో మెట్రిక్ తో సిఎఫ్ఎంఎస్ ఐడీలను అన్ని పంచాయతీల్లో తయారు చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రత్యేక అధికారులు, కార్యదర్శిల పాలనతో నడిచిన పంచాయతీలు చాలా సంవత్సరాల తరువాత మళ్లీ పంచాయతీ పగ్గాలు సర్పంచ్ ల చేతికి వెళ్లాయి. మళ్లీ పంచాయతీ కార్యదర్శిలు డమ్మీలుగా మారబోతున్నారు. అన్ని పనులు, ఖర్చులు కూడా సర్పంచ్ లే చేపడతారు. కార్యదర్శిలు పని కార్యాలయానికే పరిమితం అవుతుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో చేసిన ఖర్చులకు లెక్కలను,  మిగులు మొత్తానికి  వివరాలను పక్కాగా చూపిస్తే తప్పా తాము రికార్డులు స్వాధీనం చేసుకోమని సర్పంచ్ లు తెగేసి చెబుతుండటంతో కార్యదర్శిలు చేసిన ఖర్చులకు పనిగట్టుకొని లెక్కలు కడుతున్నారు. కొన్ని చోట్ల కొత్తగా విధుల్లో చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలు వారు విధుల్లో చేరిన దగ్గర నుంచి చేసిన ఖర్చులకు మాత్రమే రికార్డులు చూపిస్తున్నారు. గతంలో పనిచేసిన వారి రికార్డులు తప్పులు తడకలుగా ఉండటంతో కొత్తగా వారు వచ్చిన తరువాత వచ్చిన నిధులకే లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడేసుకున్న పంచాయతీ కార్యదర్శిలు వాటిని కొన్ని జిల్లాల్లో తిరిగి చెల్లిస్తే.. మరికొన్నిచోట్ల చేసిన ఖర్చులకు, బిల్లులకు పొంతన లేకపోవడంతో కార్యదర్శిలతోపాటు ఎంపీడీఓలు కూడా సస్పెండ్ అయిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖజిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శిలు ఇలాంటి విషయాల్లోనే ఆధారాలతో సహా దొరికి సస్పెన్షన్లకు గురుయ్యారు. ఈ విషయంలో ఇప్పటి వరకూ కొందరు అవినీతి ఎంపీడీఓలు సదరు తేడా పంచాయతీ కార్యదర్శిలకు వత్తాసు పలుకుతూ వచ్చినా.. ప్రభుత్వం సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చే విషయంలో వేగంగా చర్యలు తీసుకోవడంతో ఆదాయ, వ్యయాలపై జోరుగా లెక్కలు కడుతున్నారు. కొన్నిచోట్ల లెక్కలు తేడాగా ఉండటంతో పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు రికార్డులు స్వాధీనం చేసుకోకుండా లెక్కలు లేని మొత్తాల వివరాలను లెక్కలు గట్టి జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓలకు నివేదించారు. ఈ తరుణంలోనే కొత్తగా వచ్చిన సర్పంచ్ లు చాలా చోట్ల పంచాయతీల్లో చేసిన ఖర్చులకు బిల్లులు చూపించని వైనంపై తూర్పుగోదావరి, విశాఖ, అనంతపురం, ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్లాయి. వాటిపై డిఎల్పీఓ విచారణలు చేపట్టి రికవరీ చేయడంతోపాటు సదరు పంచాయతీ కార్యదర్శిలను సస్పెండ్ చేయడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇలా పంచాయతీ నిధులు సొంత అవసరాలకు వాడుకోవడం, తమ కుటుంబ సభ్యుల ఖాతాలకు పంపిచడం, అధిక మొత్తాలను పక్కదారి పట్టించిన వారిలో అధికంగా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలే ఉండటం విశేషం. కొంత మంది ఇప్పటికే విధులు నుంచి రిటైర్ అయిపోయినా వారి వివరాలను కూడా జిల్లాల వారీగా తయారు చేస్తున్నట్టు సమాచారం. పంచాయతీ రికార్డులు, పన్నుల మొత్తం, ఇతర నిధులకు లెక్కలు, వాటికి బిల్లు సక్రమంగా ఉంటే తప్పా చాలా చోట్ల సర్పంచ్ లు రికార్డులు స్వాధీనం చేసుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ లకు ఇచ్చే చెక్ పవర్ అంశం చర్చనీయాంశమవుతుంది. అదేసమయంలో అవినీతికి పాల్పిడిన వారిని ఏరిపారేయాలని కూడా ప్రభుత్వం కంకణం కట్టుకునే ఈ చెక్ పవర్ తంతును అత్యంత వేగంగా చేపడుతుండటం విశేషం. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..ఎంత మంది చేసిన ఖర్చులకు లెక్కలు చూపని పంచాయతీ కార్యదర్శిలు బయటకొస్తారనేది..!

Tadepalle

2021-05-20 01:55:17

రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతుంది..

రాష్ట్రంలో చేపట్టిన మొదటి జ్వరపీడుతుల గుర్తింపు సర్వే పూర్తయిన వెంటనే తదుపరి సర్వే కొద్ది రోజుల పాటు కొనసాగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 91,253 కరోనా టెస్టులు చేయగా, 21,320 పాజిటివ్ కేసులు   నమోదయ్యాయని, 99 మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,752 ఐసీయూ బెడ్లు ఉండగా, 6,008 రోగులతో నిండి ఉన్నాయన్నారు. 744 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆక్సిజన్ బెడ్లు 23,326 ఉండగా, 22,661 బెడ్లు కరోనా బాధితులతో నిండి ఉన్నాయన్నారు. ఇంకా 565 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. సాధారణ బెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 17,018 బెడ్లు ఉండగా, 10,424 బెడ్లు రోగులతో నిండి ఉన్నాయన్నారు. 6,594 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 17,231 చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో  20,353 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రులకు 24,544 సప్లయ్ చేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగంపై ఆడిట్ నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గడిచిన 24 గంటల్లో 620 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డ్రా చేసుకున్నామన్నారు. జామ్ నగర్ స్టీల్ ప్లాంట్ నుంచి మంగళవారం 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కెపాసిటీ కలిగిన 4 కంటైనర్లు రైలు మార్గంలో బయలుదేరాయన్నారు. బుధవారం రాత్రికి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రాష్ట్రానికి చేరుకుంటుందన్నారు. రూర్కెల్లా నుంచి రెండు కంటైనర్లలో 40, 80 మెట్రిక్ టన్నులు...మొత్తం 120 మెట్రిక్ ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందన్నారు. రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్ నిల్వలు గత రెండు మూడు రోజుల నుంచి పెరుగుతోందన్నారు. 

అన్ని మందులూ అందుబాటులో ఉన్నాయ్...
104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 12,629 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో 5,286 కాల్స్ వివిధ సమాచారాల నిమిత్తం వచ్చాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అడ్మిషన్లకు 2,747 కాల్స్, 1,617 కాల్స్ టెస్టు రిజల్ట్ కోసం వచ్చాయన్నారు. టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 16 వేల మంది జర్వ పీడితులకు, హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు వైద్యులు ఫోన్ చేసి, సలహాలు సూచనలు అందజేశారన్నారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని,  కొరత ఉందంటూ ఎక్కడ నుంచి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో నిపుణుల కమిటీ సూచనలు అనుసరించి, ఫ్లాస్మా థెరపీ నిర్వహించడం లేదన్నారు.

జ్వర పీడితుల గుర్తింపు సర్వే కొనసాగింపు... 
జర్వపీడుతుల మొదటి విడత సర్వే పూర్తయిన వెంటనే తదుపరి సర్వే చేపట్టాలని, ఇలా కొన్ని రోజుల పాటు కొనసాగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన జ్వరపీడుతులను 90 వేల మంది గుర్తించామన్నారు. 50 వేల మంది జర్వపీడితుల రక్త శాంపిళ్లను సేకరించామని, ఇప్పటికే కొందరికి కరోనా టెస్టు రిజల్ట్ రిపోర్టులు అందజేశామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న రోగులతో పాటు జర్వపీడుతులకూ ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని ఆదేశించామన్నారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఎంతో బలంగా ఉందన్నారు. అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌... ఏపీలో ఉన్నంత మంది ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఏ రాష్ట్రంలోనూ లేరన్నారు. వలంటీర్లు, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తల సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల వ్యవధిలోనే జ్వరపీడుతులను గుర్తించగలిగామన్నారు. జ్వర పీడుతుల సర్వేతో కరోనా బాధితులను గుర్తించడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చ‌న్నారు. 

తప్పుడు వార్తలు నమ్మొద్దు...
సోషల్ మీడియాలో కేసులు, మృతుల గురించి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి తప్పుడు వార్తలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు దహన సంస్కారాలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేలా జీవో ఇచ్చామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసులు దాచాల్సిన పరిస్థితి లేదన్నారు. కర్ఫ్యూలో మార్పులు, లాక్ డౌన్ విధిస్తున్నారంటూ తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయన్నారు. ఇటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు, మరణాలపైనా ప్రతి రోజూ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఆక్సిజన్ సప్లయ్, రుయా ఆసుపత్రి ఘనటపైనా స్పష్టమైన అంకెలను తెలిపామన్నారు.

Tadepalle

2021-05-18 14:23:54

Tadepalle

2021-05-17 13:25:25

Tadepalle

2021-05-17 13:06:33

Tadepalle

2021-05-17 12:59:59

Tadepalle

2021-05-17 12:55:43

Tadepalli

2021-05-17 02:28:15

Tadepalle

2021-05-16 02:41:55

గర్భిణీలు సరే మరి బాలింతల పరిస్థితేంటి..

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కరోనా కారణంగా మహిళా గర్భిణీలకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తూ డిజిపి గౌతం సవాంగ్ అన్ని జిల్లా యూనిట్లకు ఆదేశాలు జారీచేశారు.. కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే ఈ అవకాశం కల్పించి బాలింత మహిళా ఉద్యోగిణిలకు అవకాశాలు కల్పించకపోవడంపై నిరసన వ్యక్తమవుతుంది. దానికి తోడు ఇపుడు గ్రామ,వార్డు సచివాలయాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న గ్రామమహిళా సంరక్షణా కార్యదర్శి(మహిళా పోలీస్)ల విషయంలో ఈ వర్క్ ఫ్రం హోం విషయంలో క్లారిటీ రాలేదు. డీజీపి గౌతం సవాంగ్ ఇచ్చిన ఆదేశాలు వీరికి వర్తిస్తాయో లేదా అనే అంశాన్ని ఎక్కడా పేర్కొనలేదు. చాలా మంది మహిళలు అటు పోలీసు శాఖలోనూ, ఇటు సచివాలయాల్లో గర్భిణీలుగానూ.. అంతకంటే ఎక్కువగా  బాలింతలుగా ఉన్నారు. కాన్పులు జరిగిన తరువాత నెలల చంటిపిల్లతోనే కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్నారు. దీనితో కరోనా సమయంలో తమకు కూడా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని, లేదంటే తాము కూడా కరోనా బారిన పడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన అవకాశం బాలింతలకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. నెలలు నిండిన పిల్లలతో భయం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తుందని చెబుతున్నారు. వైద్యుల సూచన మేరకు కూడా గర్భిణీలు, బాలింతలు కూడా త్వరగా కరోనా వైరస్ భారిన పడే అకాశాలున్నాయి. ఈ విషయంలో డిజిపీ గౌతం సవాంగ్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతున్నా..కేవలం గర్భిణీ స్త్రీలకు మాత్రమే అవకాశం కల్పించి బాలింత విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమవుతుంది. అందులోనూ సచివాలయాల్లోనే విధులు నిర్వహిస్తున్నప్పటికీ,వీరి మాత్రుశాఖ హోం డిపార్ట్ మెంట్ కావడంతో వీరు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాస్తవానికి సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసు శాఖ ఉద్యోగులుగానే వీరంతా ఉన్నారు. అలాంటి సమయంలో వీరికి కూడా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాల్సి వుంది. కానీ కేవలం మహిళా ఖాకీలకే అవకాశం కల్పించడం గందర గోళానికి దారితీస్తుంది. ఇదే సమయంలో సమయంలో ప్రభుత్వం నుంచే వచ్చే ఉత్తర్వులు జిల్లా ఎస్పీ కార్యాలయాలన నుంచి ఎంపీడీఓల ద్వారా సచివాలయాలకు రావాల్సి వున్నా..రాష్ట్రంలో ఎక్కడా ఈ విధానం అమలు జరగడం లేదు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగుల సందేహాలు, అనుమానాలు తీర్చుకునే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే పనిచేసే వెసులుబాటు కల్పించినా అది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వర్తించలేదు. ఇపుడు పోలీసుశాఖలో మహిళా గర్భిణిలకు కల్పించిన వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కూడా సచివాలయాల్లోని మహిళా పోలీసులకు కల్పించకపోవడం దారుణమని ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్నారు. చాలా చోట్ల ఆసుపత్రుల్లో నిర్వహించే వేక్సినేషన్ల వద్దే విధులు కేటాయిస్తున్నారని కూడా భయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సి వుంది..

Tadepalle

2021-05-16 02:41:02

Tadepalle

2021-05-15 02:35:29

Tadepalle

2021-05-15 01:57:54

మనుషులకు దూరంగా ఉండండి..

కొన్ని వందల వేల సంస్క్రుతీ సంప్రదాయాలను, ప్రేమాభిమానాలను, కరోనా వైరస్ మటు మాయం చేసింది.. మనుషుల కలిసుండటాన్ని చూసి కన్నుకుట్టుందో ఏమో..వారి మధ్య దూరాన్ని ఖచ్చితంగా పెంచాలని నిర్ణయించుకుంది..అంతే బౌతిక దూరం పాటించకపోతే నేను మీలో ప్రవేశిస్తానని భయపెట్టి మరీ చంపుతోంది.. మనం బతికుంటే బలుసాకైనా తినొచ్చునని అంతా ఒక నిర్ణయానికి వచ్చేలా చేసింది..మనుషులకు దూరంగా ఉండకపోతే తప్పదన్నట్టుగా మార్చేసింది ఈ కరోనా. ప్రపంచ వ్యాప్తంగా వీదేశీ సంస్క్రుతి షేక్ హేండ్ కి శాస్వతంగా చరమగీతం పాడేలా చేసింది. మాయదారి కరోనా వైరస్ ప్రవేశించాక ఎన్నడూ వినని వార్తలు, ముందెన్నడూ కనని వైపరీత్యాలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి.. అయినా కరోనాని జయించడానికి ప్రజలు, ప్రభుత్వాలు ఎదురెళ్లి పోరాటం చేస్తూనే ఉన్నారు..అదే సమయంలో ఇహలోక దైవ సహాయం ఎలా వుంటుందో కూడా సోనూసూద్ లాంటి వారి  ద్వారా యావత్ ప్రపంచం మొత్తం తెలుసుకునేలా చేసింది ఈ కరోనా..!

Tadepalle

2021-05-15 01:54:43

Tadepalle

2021-05-14 13:57:10

Tadepalli

2021-05-14 11:53:14