1 ENS Live Breaking News

Tadepalle

2021-05-25 14:37:27

ఆనందయ్య మందుకు ఏపీలో లైన్ క్లియర్..

కరోనాను నియంత్రించే ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఆంధ్రప్రదేశ్ లోని ఆయుష్ అధికారుల నుంచి లైన్ క్లియర్ అయ్యింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి వుంది. ఆయుష్ వైద్యుల సమక్షంలోనే ఆనందయ్య కరోనాకి మందు తయారు చేశారు. దీనితో ఈ మందు వలన ఎలాంటి చెడు ఫలితాలు లేవని అయుష్ శాఖ కమిషనర్ రాములు తేల్చారు. అయితే దీనిని పూర్తిగా ఆయుర్వేదమని చెప్పలేమని, పసరు మందు లేదా నాటు మందుగానే గుర్తిస్తామని మాత్రం మెలిక పెట్టారు. ఈ మందు వలన కరోనా రోగుల్లో ఆక్సిజన్ పెరిగినట్టుగా ప్రాధమిక సమాచారం గుర్తించినట్టు వెల్లడించిన ఆయన  ఈ వైద్యం పొందిన మరికొందరిని పరీక్షించాలని చెబుతున్నారు. దీనితో ఏపీలో ఈ మందుపై ఏపీలో అధ్యయనం ముగిసింది. ఇక కేంద్ర ప్రభుత్వం సంస్థCCRAS(సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్)కు ఏపీలోని ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుందని ఆయుష్ కమిషనర్  ప్రకటించారు. కానీ ఈ మందుని ఆయుర్వేద మందు అనడానికి ముందుకి రాని ప్రభుత్వ అధికారులు కూడా నాటు మందుగానే గుర్తించడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఆనందయ్య కరోనా వైరస్ నియంత్రణకు తయారు చేసిన ఈ మందులో అన్నీ ఆయుర్వేద దినుసులే వినియోగించి చేసినప్పటీకీ ప్రభుత్వ అధికారులు కూడా నాటు వైద్యమనే ముద్రవేశారు తప్పితే ఈ మందు పనిచేయడం లేదని, గానీ దీనికి శాస్త్రీయత లేదని ఎక్కడా తేల్చలేదు. దీనితో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ అధికారులు ఈ మందులపై ఎలాంటి నివేదికలు ఇస్తాయనేది ఇపుడు ఉత్కంఠగా మారింది. అన్నీ అనుకూలిస్తే ప్రభుత్వం ద్వారానే ఈ మందుని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరిగే అవకాశం కూడా లేకపోలేదని ఒక అధికారి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగ వివరించారు.

Tadepalle

2021-05-23 03:07:01

ప్రభుత్వ శాఖల్లో గ్రామ సచివాలయశాఖ లేనట్టుంది..

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ శాఖలూ ఈ నెలాఖరు వరకూ ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలి. అలాకాకుండా 12 తరువాత కార్యాలయంలో ఉండాలంటే ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక పాసులుండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ చేసిన చేసిన ఉత్తర్వులు ఇవి. కానీ ఈ ప్రభుత్వ శాఖల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉన్నట్టుగా కనిపించలేదు.. అందుకే గ్రామ సచివాలయ ఉద్యోగులంతా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ యధాస్తితిగా గర్భీస్త్రీలు, బాలింత ఉద్యోగిణిలతో సహా విధులు నిర్వహిస్తున్నారు.  రాష్ట్రప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలతో సమానంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసి వాటి నిర్వహణను జిల్లాల్లోప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ల(గ్రామ సచివాలయాలు)కు అప్పగించింది. అయినా ప్రభుత్వం విడుదల చేసిన కొత్తగా విడుదలచేసిన కార్యాలయ పనిగంటల జీఓలు గ్రామ, వార్డు సచివాలయాలకు వర్తింప జేయడంలేదు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు(గ్రామసచివాలయం) ప్రభుత్వ శాఖలతోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ కరోనా సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన పనిగంటల ఆదేశాలను వర్తింప జేస్తుంటే.. కొన్ని జిల్లాల్లో గర్భిణీ స్త్రీలు, బాలింత ఉద్యోగులతో సహా పూర్తి పనిగంటలుతో పనులు చేయిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఒక్క కారణమే రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం  విడుదల చేసిన జీఓలు, ప్రత్యేక ఆదేశాలు గ్రామ సచివాలయాల్లో అమలు చేయలేదని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైనా ముఖ్యమైన జీఓ విడుదల చేసినపుడు దానిని జిల్లా కలెక్టర్లు ఆయాశాల ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేయస్తున్నారు. కానీ విచిత్రంగా ఆ సమాచారం కొన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు మాత్రం చేరడం లేదు. కరోనా సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన కుదించిన పనిగంటల సమయం ఒక్కటే కాకుండా ఇతర ముఖ్యమైన విషయాలకు సంబంధించిన జీఓలు రాకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయాల్లో జరిగే అభివ్రుద్ధి కార్యక్రమాలు, లోపాలు, పరిపాలన సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ యాప్ ద్వారా అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు ఇతర శాఖల అధికారుల ద్రుష్టికి తీసుకెళుతూ చైతన్యం తీసుకొస్తోంది. గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వ్యవస్థ జరిగే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన వార్తలను తాజా తాజాగా అందిస్తోంది. కొన్ని సందర్భల్లో కొన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు ఈఎన్ఎస్ అందించిన సమాచారం ఆధారంగా సత్వరమే చర్యలు చేపడుతున్నా..మరికొన్ని జిల్లాలో అమలు చేయడానికి ఎందుకనో ద్రుష్టి పెట్టడం లేదు. ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి తాజాగా పెంచిన పనిగంటల సమయాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కుదించిన పనిగంటల ఆదేశాలను అమలుచేస్తారా..లేదంటే అది ప్రభుత్వశాఖలో లేదన్నట్టుగా వారికి ప్రత్యేక ఆదేశాలిచ్చి పనిచేయిస్తారా అనేది వేచి చూడాలి..

Tadepalle

2021-05-22 06:26:46

Tadepalli

2021-05-22 03:47:54

ఆనందయ్య ఆయుర్వేద వైద్యవిధానం సరైనదే..

కరోనా వైరస్ ను మానవ శరీరం నుంచి బయటకు పంపించడానికి నెల్లూరు క్రిష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు సరైనదేనని వాదన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చాలాగట్టిగా వినిపిస్తున్నారు. ఈ ఆయుర్వేద మందులో వినియోగించేవన్నీ నిత్యం మన కళ్లముందు ఉండేవనని, ముఖ్యంగా ఈ మందు ద్వారా వ్యాధినిరోధకశక్తి బాగా పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆనందయ్య మందుకోసం వినియగించే ఆయుర్వేద దినుసులు ఏవిధంగా పనిచేస్తాయనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయుర్వేద వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ మందు తీసుకున్నవారందరికీ కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడం తో ఇపుడు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. ఇప్పటికే ఈ మందును పరీక్షించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితోపాటు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కేంద్రప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ మందుతీసుకుని నెగిటివ్ వచ్చిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో జనాబా వేలాది ఆ ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు కాస్త తేడాగా చూపించే పనిలో కూడా పడ్డాయి. మందు తీసుకున్నవారంతా తాము బాగానే ఉన్నామని చెబుతున్నప్పటికీ ఎవరైనా కాస్త తేడాగా చెప్పకపోతరా అనే కోణంలో తేడాగా వ్యవహరించే మీడియా విశ్వప్రయత్నాలు చేస్తున్నది. అలాంటి మీడియాను తెలుగుప్రజలంతా సోషల్ మీడియా వేదికగానే అమ్మనా బూతులు తిడుతున్నారు. మేము కరోనా వైరస్ నుంచి బతికి బట్టకట్టడం మీడియాకు ఇష్టం లేని కారణంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు ప్రాణాలను కాపాడుతున్న ఆయుర్వేద మందును అవగాహన లేని మీడియా సంస్థలు నాటు మందు అంటూ వెటకార దోరణికి తెరలేపడటం పైనా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా క్రిష్ణపట్నం ఆనందయ్య మందు వాడిని వారికి మంచి ఫలితాలు వస్తూనే ఉన్నాయి. ఈ మందుకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభిస్తే..లక్షలాది మందికి ఈ మందు చేరి కరోనా వైరస్ ని తరమికొట్టడానికి ఆస్కారం వుంటుందనే వాదన దేశవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఆనందయ్య కరోనా వైరస్ కి ఇచ్చిన ఆయుర్వేద మందు వలన  ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రభుత్వాలు ద్రుష్టిసారించడం శుభపరిణామంగా కనిపిస్తున్న ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఆశక్తి కరంగా మారింది..

Tadepalle

2021-05-22 02:38:32

బ్లాక్‌ ఫంగస్‌ కి ఆరోగ్యశ్రీలో చికిత్స..

బ్లాక్ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌)చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది..ఇప్పటికే కరోనాకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందిస్తున్న ప్రభుత్వం, తాజాగా బ్లాక్‌ ఫంగస్ కి కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడండంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.

Tadepalle

2021-05-20 14:58:43

2021-05-20 02:38:44

చెక్ పవర్ కోసం లెక్కలు కడుతున్నారు..

ఆంధ్రప్రదేశ్ లోని 13367 గ్రామ పంచాయల్లో సర్పంచ్ లకు త్వరలోనే చెక్ పవర్ ఇచ్చేందుకు ప్రభుత్వం చక చకా ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం సర్పంచ్ లవివరాలను ఆన్ లైన్ చేసి బయో మెట్రిక్ తో సిఎఫ్ఎంఎస్ ఐడీలను అన్ని పంచాయతీల్లో తయారు చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రత్యేక అధికారులు, కార్యదర్శిల పాలనతో నడిచిన పంచాయతీలు చాలా సంవత్సరాల తరువాత మళ్లీ పంచాయతీ పగ్గాలు సర్పంచ్ ల చేతికి వెళ్లాయి. మళ్లీ పంచాయతీ కార్యదర్శిలు డమ్మీలుగా మారబోతున్నారు. అన్ని పనులు, ఖర్చులు కూడా సర్పంచ్ లే చేపడతారు. కార్యదర్శిలు పని కార్యాలయానికే పరిమితం అవుతుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో చేసిన ఖర్చులకు లెక్కలను,  మిగులు మొత్తానికి  వివరాలను పక్కాగా చూపిస్తే తప్పా తాము రికార్డులు స్వాధీనం చేసుకోమని సర్పంచ్ లు తెగేసి చెబుతుండటంతో కార్యదర్శిలు చేసిన ఖర్చులకు పనిగట్టుకొని లెక్కలు కడుతున్నారు. కొన్ని చోట్ల కొత్తగా విధుల్లో చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలు వారు విధుల్లో చేరిన దగ్గర నుంచి చేసిన ఖర్చులకు మాత్రమే రికార్డులు చూపిస్తున్నారు. గతంలో పనిచేసిన వారి రికార్డులు తప్పులు తడకలుగా ఉండటంతో కొత్తగా వారు వచ్చిన తరువాత వచ్చిన నిధులకే లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడేసుకున్న పంచాయతీ కార్యదర్శిలు వాటిని కొన్ని జిల్లాల్లో తిరిగి చెల్లిస్తే.. మరికొన్నిచోట్ల చేసిన ఖర్చులకు, బిల్లులకు పొంతన లేకపోవడంతో కార్యదర్శిలతోపాటు ఎంపీడీఓలు కూడా సస్పెండ్ అయిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖజిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో పంచాయతీ కార్యదర్శిలు ఇలాంటి విషయాల్లోనే ఆధారాలతో సహా దొరికి సస్పెన్షన్లకు గురుయ్యారు. ఈ విషయంలో ఇప్పటి వరకూ కొందరు అవినీతి ఎంపీడీఓలు సదరు తేడా పంచాయతీ కార్యదర్శిలకు వత్తాసు పలుకుతూ వచ్చినా.. ప్రభుత్వం సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చే విషయంలో వేగంగా చర్యలు తీసుకోవడంతో ఆదాయ, వ్యయాలపై జోరుగా లెక్కలు కడుతున్నారు. కొన్నిచోట్ల లెక్కలు తేడాగా ఉండటంతో పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు రికార్డులు స్వాధీనం చేసుకోకుండా లెక్కలు లేని మొత్తాల వివరాలను లెక్కలు గట్టి జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓలకు నివేదించారు. ఈ తరుణంలోనే కొత్తగా వచ్చిన సర్పంచ్ లు చాలా చోట్ల పంచాయతీల్లో చేసిన ఖర్చులకు బిల్లులు చూపించని వైనంపై తూర్పుగోదావరి, విశాఖ, అనంతపురం, ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్లాయి. వాటిపై డిఎల్పీఓ విచారణలు చేపట్టి రికవరీ చేయడంతోపాటు సదరు పంచాయతీ కార్యదర్శిలను సస్పెండ్ చేయడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇలా పంచాయతీ నిధులు సొంత అవసరాలకు వాడుకోవడం, తమ కుటుంబ సభ్యుల ఖాతాలకు పంపిచడం, అధిక మొత్తాలను పక్కదారి పట్టించిన వారిలో అధికంగా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలే ఉండటం విశేషం. కొంత మంది ఇప్పటికే విధులు నుంచి రిటైర్ అయిపోయినా వారి వివరాలను కూడా జిల్లాల వారీగా తయారు చేస్తున్నట్టు సమాచారం. పంచాయతీ రికార్డులు, పన్నుల మొత్తం, ఇతర నిధులకు లెక్కలు, వాటికి బిల్లు సక్రమంగా ఉంటే తప్పా చాలా చోట్ల సర్పంచ్ లు రికార్డులు స్వాధీనం చేసుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ లకు ఇచ్చే చెక్ పవర్ అంశం చర్చనీయాంశమవుతుంది. అదేసమయంలో అవినీతికి పాల్పిడిన వారిని ఏరిపారేయాలని కూడా ప్రభుత్వం కంకణం కట్టుకునే ఈ చెక్ పవర్ తంతును అత్యంత వేగంగా చేపడుతుండటం విశేషం. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..ఎంత మంది చేసిన ఖర్చులకు లెక్కలు చూపని పంచాయతీ కార్యదర్శిలు బయటకొస్తారనేది..!

Tadepalle

2021-05-20 01:55:17

రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతుంది..

రాష్ట్రంలో చేపట్టిన మొదటి జ్వరపీడుతుల గుర్తింపు సర్వే పూర్తయిన వెంటనే తదుపరి సర్వే కొద్ది రోజుల పాటు కొనసాగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 91,253 కరోనా టెస్టులు చేయగా, 21,320 పాజిటివ్ కేసులు   నమోదయ్యాయని, 99 మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,752 ఐసీయూ బెడ్లు ఉండగా, 6,008 రోగులతో నిండి ఉన్నాయన్నారు. 744 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆక్సిజన్ బెడ్లు 23,326 ఉండగా, 22,661 బెడ్లు కరోనా బాధితులతో నిండి ఉన్నాయన్నారు. ఇంకా 565 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. సాధారణ బెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 17,018 బెడ్లు ఉండగా, 10,424 బెడ్లు రోగులతో నిండి ఉన్నాయన్నారు. 6,594 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 17,231 చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో  20,353 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండగా, గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రులకు 24,544 సప్లయ్ చేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగంపై ఆడిట్ నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గడిచిన 24 గంటల్లో 620 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డ్రా చేసుకున్నామన్నారు. జామ్ నగర్ స్టీల్ ప్లాంట్ నుంచి మంగళవారం 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కెపాసిటీ కలిగిన 4 కంటైనర్లు రైలు మార్గంలో బయలుదేరాయన్నారు. బుధవారం రాత్రికి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రాష్ట్రానికి చేరుకుంటుందన్నారు. రూర్కెల్లా నుంచి రెండు కంటైనర్లలో 40, 80 మెట్రిక్ టన్నులు...మొత్తం 120 మెట్రిక్ ఆక్సిజన్ రాష్ట్రానికి రానుందన్నారు. రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్ నిల్వలు గత రెండు మూడు రోజుల నుంచి పెరుగుతోందన్నారు. 

అన్ని మందులూ అందుబాటులో ఉన్నాయ్...
104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో 12,629 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో 5,286 కాల్స్ వివిధ సమాచారాల నిమిత్తం వచ్చాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అడ్మిషన్లకు 2,747 కాల్స్, 1,617 కాల్స్ టెస్టు రిజల్ట్ కోసం వచ్చాయన్నారు. టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 16 వేల మంది జర్వ పీడితులకు, హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులకు వైద్యులు ఫోన్ చేసి, సలహాలు సూచనలు అందజేశారన్నారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని,  కొరత ఉందంటూ ఎక్కడ నుంచి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో నిపుణుల కమిటీ సూచనలు అనుసరించి, ఫ్లాస్మా థెరపీ నిర్వహించడం లేదన్నారు.

జ్వర పీడితుల గుర్తింపు సర్వే కొనసాగింపు... 
జర్వపీడుతుల మొదటి విడత సర్వే పూర్తయిన వెంటనే తదుపరి సర్వే చేపట్టాలని, ఇలా కొన్ని రోజుల పాటు కొనసాగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన జ్వరపీడుతులను 90 వేల మంది గుర్తించామన్నారు. 50 వేల మంది జర్వపీడితుల రక్త శాంపిళ్లను సేకరించామని, ఇప్పటికే కొందరికి కరోనా టెస్టు రిజల్ట్ రిపోర్టులు అందజేశామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న రోగులతో పాటు జర్వపీడుతులకూ ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని ఆదేశించామన్నారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ఎంతో బలంగా ఉందన్నారు. అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌... ఏపీలో ఉన్నంత మంది ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఏ రాష్ట్రంలోనూ లేరన్నారు. వలంటీర్లు, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తల సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల వ్యవధిలోనే జ్వరపీడుతులను గుర్తించగలిగామన్నారు. జ్వర పీడుతుల సర్వేతో కరోనా బాధితులను గుర్తించడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చ‌న్నారు. 

తప్పుడు వార్తలు నమ్మొద్దు...
సోషల్ మీడియాలో కేసులు, మృతుల గురించి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటువంటి తప్పుడు వార్తలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు దహన సంస్కారాలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేలా జీవో ఇచ్చామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసులు దాచాల్సిన పరిస్థితి లేదన్నారు. కర్ఫ్యూలో మార్పులు, లాక్ డౌన్ విధిస్తున్నారంటూ తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయన్నారు. ఇటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు, మరణాలపైనా ప్రతి రోజూ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఆక్సిజన్ సప్లయ్, రుయా ఆసుపత్రి ఘనటపైనా స్పష్టమైన అంకెలను తెలిపామన్నారు.

Tadepalle

2021-05-18 14:23:54

Tadepalle

2021-05-17 13:25:25

Tadepalle

2021-05-17 13:06:33

Tadepalle

2021-05-17 12:59:59

Tadepalle

2021-05-17 12:55:43

Tadepalli

2021-05-17 02:28:15

Tadepalle

2021-05-16 02:41:55