1 ENS Live Breaking News

Tadepalle

2021-03-13 21:58:10

Tirupati

2021-03-13 13:37:52

యాదాద్రికి పూర్వ వైభవం..

యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.  ప్రగతిభవన్ లో శుక్రవారం సిఎం సమీక్షించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది రూపుదాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం ( ఆర్నమెంటల్ లుక్ ) కోసం కార్యాచరణ గురించి సిఎం ఆలయ అధికారులతో చర్చించారు. ఇటీవల యాదాద్రిలో పర్యటించి  క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని పరిసర ప్రాంతాలను కలియదిరిగి పలు సూచనలు  చేసిన నేపథ్యంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందనే విషయాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం  నిర్మిస్తున్న క్యూలైన్  నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సిఎం ముందుంచారు. వీటిని పరిశీలించిన మీదట నాలుగింటిలో ఒకదాన్ని సిఎం ఖారరు చేశారు. ఉత్తర దిక్కున వున్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15 కల్లా క్యూలైను నిర్మాణం పూర్తికావాలని సిఎం గడువు విధించారు. దీప స్థంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడస్టల్ కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని అన్నారు. శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్న సిఎం, ఆలయ ప్రహరి గోడలకు ఇత్తడితో  తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలన్నారు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా (ఐకానిక్ ఎలిమెంట్ లాగా) కనిపించే విధంగా తుదిమెరుగులు దిద్దాలని సిఎం అన్నారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శనం చక్రం ఏర్పాటు చేసినట్టు గానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమీయాలని అన్నారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్ తో తీర్చిదిద్దాలన్నారు. విష్ణు పుష్కరిణీ కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడలమీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలన్నారు. 80 ఫీట్ల పొడవు వున్న దీప స్థంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలన్నారు.అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమౌతున్నదని సిఎం కితాబిచ్చారు. చివరి అంకం చేరుకున్న ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాలను చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన  లైటింగ్ డెమో వీడియోను సిఎం తిలకించారు.  ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్,  సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటిడిఏ ప్రత్యేకాధికారి కిషన్ రావు, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఆర్కిటెక్ట్ మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.

Pragathi Bhavan

2021-03-12 18:35:34

డా.వైఎస్సార్ ఆశయాల ప్రతిబింబమే ఈ వైఎస్సార్సీపీ..

ఒక మహోన్న వ్యక్తి ఆశయం..ఒక మహానువుడి ముందు చూపు..ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత స్థానం..అశేష జనవాహిని విశేషంగా గుర్తుపెట్టుకున్న వ్యక్తి..ఆయనే దివంగత ప్రియతమనేత డా.వైఎస్.రాజశేఖరరెడ్డి. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు అతీతంగా డాక్టర్ వైఎస్సార్ ఆలోచనలు ప్రజలకు చేరువ కావాలని నాడు యువనేత సంకల్పించింది ప్రాణం పోసిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ) ఆ పార్టీ ఆవిర్భవా(12 మార్చి 2011 నికి నేటితో పది వసంతాలు(12 మార్చి 2021) నిండాయి. పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ప్రజల కోసమే కష్టపడిన పార్టీగా, అత్యతం ప్రాధాన్య కలిగిన పార్టీగా, ఒక వ్యక్తికోసం ప్రజల నాడితెలుసుకున్న పార్టీగా ఆవిర్భవించడం ఒక చారిత్రక ఘట్టం. నాడు డావెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన గుర్తుగా కాంగ్రెస్ అనే పేరు కలిపినా వాస్తవానికి కాంగ్రెస్ అంటే ఒక సమావేశం అని అర్ధం. అందరికోసం సమావేశమై ఏర్పాటైన పార్టీగా వైఎస్సార్సీపీ ఆవిర్భవించి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ ఆశీస్సులు, యువ నేత క్రుషి కష్టంతో నేడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతుంది. అంతేకాదు పార్టీ ఏ ప్రాధమిక సూత్రాలతో అయితే ఏర్పాటైందో వాటినే సంక్షేమ పథకాలుగా అమలు చేసి నవరత్నాలుగా ప్రజలకు అందజేసిన యువ ముఖ్యమంత్రిగా కూడా వైఎస్.జగన్మోహనరెడ్డి చరిత్ర కెక్కారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసేలా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి గ్రామసచివాలయమనే వ్యవస్థతో బాటలు వేశారు. దానికోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు ఒక లక్షా 26 వేలు. ప్రభుత్వ పథకాల అమలు కోసం అక్షరాల 4లక్షల మంది గ్రామవాలంటీర్లను నియమించి గ్రామంలోనే ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తూ వస్తుంది. ఇదొక్కటే కాదు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా అంటే పార్టీ పేరులో వున్న రైతులకు అగ్ర తాంబూలం ఇస్తూ గ్రామాల్లోనే రైతులకు విశేషంగా సేవలు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వతహాగా దివంగత నేత వైఎస్సార్ ఒక వైద్యుడు. ఏ రోజైతే గ్రామాల్లో ప్రాధమిక వైద్యం ప్రజలకు అందుతుందో ఆరోజే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నేటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  గ్రామాల్లో ప్రాధమిక వైద్యం అందించి సుమారు 90 రకాల మందులను అందుబాటులోకి తీసుకు రావడం కోసం ఏర్పాటు చేసే మరొక వ్యవస్థ డా.వైఎస్సార్ విలేజి క్లినిక్ లు.  వీటి ద్వారా ప్రజలకు వైద్య సేవలతోపాటు, బాలింతలకు చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు, ప్రాధమిక రక్త పరీక్షలు కూడా ఇక్కడే చేయనున్నారు. రైతుల పాల, పాడి వ్యవస్తను అభివ్రుద్ధి చేయడానికి డైరీలను పెంచడానికి అమూల్ సంస్థంతో ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేసుకొని గ్రామాల్లోనే పాలను సేకరించి రైతులను ఆర్ధికంగా అభివ్రుద్ధి చేస్తున్నారు. గ్రామాల్లోనే రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇలా అన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతులకు అందనున్నాయి. అదేవిధంగా యువతను అన్ని రంగాల్లో ముందుకి తీసుకెళ్లడం కోసం వైఎస్సార్ నాలడ్జ్ సెంటర్లు, స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేపడుతున్నారు. శ్రామికులను గుర్తించడానికి, ప్రత్యేక సెజ్ లలో ప్రైవేటు కంపెనీల ఏర్పాటు తద్వారా శ్రామికులందరికీ ఉపాది, ఉద్యోగ అవకాశాల కల్పన కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అంటే ఒక పార్టీ ఆవిర్భావం ప్రజల మనసులో గూడు కట్టుకున్న మహోన్నత వ్యక్తికోసం అయినా..ఆయన ఆలోచనకు అనుగుణంగా ఏర్పాటు కావడంతోపాటు ఆయన ఆశయాలను అన్నీ అమలు చేసే పార్టీగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చేపట్టే ప్రతీ కార్యక్రమం నేడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుని చేరువ అయ్యింది. పదేళ్లపాటు ప్రజలకోసమే పనిచేసి, నేడు ప్రజలను పాలిస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ, ప్రభుత్వం రానున్న రోజుల్లో దివంగత మహానేత డా.వైఎస్సార్ ఆశయాలు, ఆలోచనలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనమూ కోరుకుందాం.!

Tadepalle

2021-03-12 08:28:11

ఘనంగా అజాది కా అమృత్ మహోత్సవ్..

భారదేశానికి  స్వాతంత్య్రం వచ్చి 2022 స్వాత్రంత్య్ర దినోత్సవం నాటికి  75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా " అజాది కా అమృత్ మహోత్సవ్ " వేడుకల్ని ఘనంగా  నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  దేశంలో  ఎంపిక చేసిన 75 ప్రముఖ నగరాలు, ప్రదేశాల్లో చరిత్రాత్మక నగరంగా  విజయవాడ ను ఎంపిక చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.  రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు.   స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా 75 వారాలుపాటు " అజాది కా అమృత్ మహోత్సవ్ " పేరిట ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  " అజాది కా అమృత్ మహోత్సవ్ " వేడుకల్ని విజయవాడ వేదికగా ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తి ని నింపేలా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు. మార్చి 12 శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకు  పిడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి  బాపూ మ్యూజియం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.   సాయంత్రం 5 గంటల నుంచి ప్రభుత్వ ఘంటశాల సంగీత కళాశాల ప్రాంగణంలో  ఫోటో ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు , స్వాతంత్ర్య సమరయోధులు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర యువజన వ్యవహారాల విభాగం , ఎన్ ఎస్ ఎస్, ఎన్ ఎస్ ఓ, ఎన్ సి సి వాలంటీర్స్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.   దేశంలోని చారితాత్మక, ప్రాముఖ్యత గల నగరాల్లో, పట్టణాల్లో,  ప్రాంతాల్లో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూన్నారు.   మార్చి 12 నుంచి ఏప్రిల్ 5 వరకు 25 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దండి సత్యాగ్రహం   మార్చి 12 ప్రారంభం అయి  ఏప్రిల్ 5  న ముగిసింది. వాటిని గుర్తు చేసునేలా ర్యాలీలు, సైకిల్ ర్యాలీ లు, వివిధ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు భారత దేశ స్వాతంత్ర్య కోసం స్వాతంత్ర్య సమరయోధులు పడిన ఇబ్బందులు   పై సమావేశాలు, చర్చలు,  సెమినార్ లు నిర్వహించడం జరుగుతుందని ఇంతియాజ్ తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీలను పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అదేవిధంగా కళాశాల, యూనివర్సిటీ ల స్థాయి లో కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల , జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ , నేతాజీ, తదితరులకు సంబంధించిన ఫోటో ప్రదర్శనలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.

Vijayawada

2021-03-11 19:31:06

Tadepalle

2021-03-11 19:08:14

Hyderabad

2021-03-11 18:23:08

మహిళా ఉద్యోగుల ప్రసూతి వేదన..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులు కంటతడి పెడుతూ ప్రసూతి వేదన అనుభవిస్తున్నారు..ఇదేదో కాన్పు సమయంలో, బిడ్డను కనడానికి పడే వేదన కాదు..ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో ఇచ్చే సెలవులను తిరిగి జీతంగా తెచ్చుకోవడానికి పడే ఇబ్బంది వేదన, నరకం ఇలా బాధ పెట్టడానికి ఎన్ని పదాలుంటే అన్నింటికీ ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు గుర్తు చేసుకోవచ్చు.. మొన్నటి వరకూ ఆ ఇబ్బంది రెగ్యులర్ ఉద్యోగులకే అనుకుంటే కేవలం 15వేల రూపాయల జీతంతో పనిచేసే నేటి గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులు కూడా ఇదే ఇబ్బందులను ఎదుక్కోవాల్సి వస్తుంది. అవును మీరు చదవుతున్నది అక్షర సత్యం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం చేసే ఆడపడుచు ఆవేదన. ఆరునెలల ప్రసూతి సెలవులు ప్రభుత్వం ఇచ్చినా, ఆపై ప్రసూతి రికార్డులు ప్రభుత్వానికి సంబంధిత శాఖ ద్వారా సమర్పిస్తే జీతం రావాలి. అలా ప్రభుత్వ శాఖల ద్వారా వస్తుంది కూడా. కానీ ఇక్కడే అసలైన చిక్కంతా మహిళా ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆరునెలల జీతం బిల్లుగా మార్చాలంటే సంబంధిత శాఖలో పదిశాతం జీతం మామూలుగా సమర్పించాల్సి వస్తుంది. అలా సమర్పించిన వారికి మాత్రమే బిల్లులు క్షణాల్లో మంజూరవుతున్నాయి. లేదంటే వారు నెలల తరబడి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే జీతానికి వీరికెందుకు మామూళ్లు ఇవ్వాలంటే అది అనాదిగా వస్తున్న ఆచారమని చాలా ఠీవీగా చెబుతున్నారు ఆయా శాఖల్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు ఇతర అధికారులు. మాకు కూడా శాఖ పరమైన ఖర్చులుంటాయని కూడా శెలవిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడే మహిళా ఉద్యోగులు ప్రభుత్వం ద్రుష్టికి ఈ సమస్యను తీసుకెళితే ఎవరైతే మహిళా ఉద్యోగులు ఆరు నెలలు ప్రసూతి సెలవులు పెట్టుకుంటారో అపుడే సంబంధిత జిల్లా శాఖల అధికారులు గానీ, లేదంటే సదరు జిల్లా కలెక్టర్ గానీ సెలవుతో కూడిన జీతం మంజూరు చేస్తున్నారు. ఆ విధంగా లేఖలు ఇస్తున్నారు. అలాంటి వారికి బాగానే ఉన్నా, ఆవిషయం తెలియని వారు మాత్రం ఆరు నెలల తరువాత సాలరీ బిల్లులతోపాటు, ఈ ఆరు నెలల ప్రసూతి సెలవులు బిల్లు పెట్టే సమయంలో సంబంధిత మండలశాఖ కార్యాలయంలో ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆ బిల్లులు మాత్రం పాస్ కావడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు..కేవలం రూ.15వేలతోనే ఉద్యోగం చేసుకునే గ్రామసచివాలయ  మహిళా ఉద్యోగుల నుంచి కూడా సంబంధిత శాఖ సిబ్బంది మామూళ్లకు పాల్పపడటం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. అందులోనూ అత్యధిక సిబ్బంది ఉన్న ఈ శాఖలో మహిళా ఉద్యోగిణిలు కూడా అధికంగా వుండటం చాలా మందికి అధికారులకు, సిబ్బందికి బాగా కలిసి వస్తుంది. ఈ విషయం జిల్లా కలెక్టర్ల వరకూ వెళ్లడంతో వారికి సెలవుతోపాటు, ప్రత్యేక లేఖ ద్వారా మానవతా ద్రుక్పదంతో జీతం కూడా వచ్చే ఏర్పాటు చేస్తున్నారు కొన్ని జిల్లాల కలెక్టర్లు. కాకపోతే ప్రభుత్వమే అధికారికంగా ఈ సర్ధుబాటు చేస్తే మధ్యలో ఈ దలారీ ప్రభుత్వశాఖల సీనియర్ అసిస్టెంట్లకు, ఇతర అధికారులకు మామూళ్లు ఇచ్చే బాధలు తప్పుతాయని ఆవేదన చెందుతున్నారు మహిళా ఉద్యోగులు.  ప్రభుత్వం ఈ విషయంలో మహిళా ఉద్యోగులందరికీ ప్రసూతి సెలవులు ఇచ్చే సమయం నుంచే జీతం ఇవ్వడంతోపాటు, సంబందిత ప్రసూతి పత్రాలు కూడా తిరిగి విధుల్లోకి చేరే సమయంలో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం తల్లీబిడ్డకోసం ప్రసూతి సెలవులు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నా.. అయితే మాకేంటి అన్నట్టుగా పలుశాఖల అధికారులు, సీనియర్ అసిస్టెంట్లు పాల్పడే మామూళ్లకు కళ్లెం పడదని... మహిళా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.  అదే సమయంలో ప్రభుత్వం ప్రసూతి సెలవులు ఇచ్చిన సమయంలో తిరిగి ఆ సెలవులకు సంబంధించిన లీవ్ జీతంగా మారడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనితో మహిళా ఉద్యోగులు ప్రభుత్వం ద్రుష్టికీ ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. ఆ విషయంపై సాంకేతిక సమస్యలపై రాష్ట్రప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయంతీసుకుంటే ప్రసూతి సెలవులపైనా మామూళ్లు వెతుక్కునే సిబ్బంది లంచావతారాలకు ముకుతాడు పడే అవకాశం కలుగుతుంది. ఈ విషయం తెలియజేసిన తరువాత ప్రభుత్వం ఇది తప్పుడు వార్త అనుకోవడానికి లేదు.. అలా లంచాలు తీసుకునే వారిపై ద్రుష్టిసారిస్తే గ్రామసచివాలయ శాఖ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రసూతి సెలవులపై కమిషన్లు మేసే లంచావతారులను పట్టుకోవచ్చు..ఈ సమాచారం కూడా ప్రభుత్వ మహిళా ఉద్యోగిణిలు కంట తడి పెట్టుకుంటూ చెప్పిన వివరాలు ఆధారంగానే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ప్రత్యేక కధనాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువస్తున్నామని కూడా ప్రభుత్వానికి, పలుశాఖల అధికారులకు తెలియజేస్తున్నాం. ఇంత సమాచారం ఇచ్చిన తరువాత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి..!

Tadepalle

2021-03-11 11:46:06

మహిళా ఉద్యోగులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళా ఉద్యోగులకు ఉన్న15 ప్రత్యేక సెలవుల(క్యాజువల్ లీవ్స్) ను మరో 5 సెలవులను కలిపి 20కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహరెడ్డికి మహిళా ఉద్యోగులకు ఈ వరం ప్రకటించారు. ప్రకటించిన రెండు రోజుల్లోనే అనగా ఈరోజే ప్రభుత్వం జీఓ నెంబరు 18ను తీసుకు వచ్చి అమలు చేయడానికి వీలుగా అన్ని ప్రభుత్వ శాఖలకూ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే మహిళా ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించింది. దీనితో రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సెలవులకు సుమారు నాలుగు యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వానికి  ముందస్తుగా లేఖలు సమర్పించాయి.

Tadepalle

2021-03-10 19:55:15

విశాఖ డీపీఓ పోస్టు బదిలీ జీఓకి తాక్కాలిక తెర..

విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి బదిలీ జీఓ అంశానికి తాత్కాలికంగా తెరపడినట్టు అయ్యింది.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశాఖ డీపీఓను బదిలీ చేసిన జీఓని హైకోర్టు  నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. కోర్టు ఉత్తర్వులు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికార మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ కి అందాయి.  విశాఖజిల్లాలో రెగ్యులర్ డీపీఓ  పనిచేస్తుండగా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి పనిష్మెంట్ పై తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓగా పనిచేస్తున్న సుభాషిణిని విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ పదిరోజుల క్రితం జీఓ జారీ చేశారు. అదే సమయంలో ఇక్కడ పనిచేస్తున్న డీపీఓని జిఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని హైకోర్టులో విశాఖజిల్లా డిపీఓ హైకోర్టులో సవాల్ చేశారు. దీనితో హైకోర్టు ఆ జీఓని  నాలుగు వారాల వరకూ ఆ జీఓని సస్పెండ్ చేసింది. వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులుగానీ, ఎంపీడీఓలు గానీ, డీపీఓలపై అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు, అధికారిక పనిష్మెంట్ వ్యవహారాలు జరుగుతున్న సమయంలో అలాంటి అధికారులను రెగ్యులర్ డిస్ట్రిక్ట్ కేడర్ పోస్టు లైవ్ లో ఉన్నచోటుకి బదిలీ చేయకూడదు. కానీ ఎంపీడీఓ సుభాషిణి విషయంలో ఆ నిబంధనలు ఏమీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు అడ్డు రాలేదు, సదరు అధికారిణిపై అవినీతి ఆరోపణలు, అభియోగాలు ఏమీ రుజువుకాకపోవడంతో ఆమెను అక్కడి నుంచి విశాఖకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీఓ జారీచేశారు. విశాఖలో జివీఎంసీ ఎన్నికలు జరగడానికి ఎన్నికల కోడ్ అమలులో ఉండి.. అక్కడ డీపీఓ ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ కనీసం ఎన్నికల సంఘం ద్రుష్టికి బదిలీ వ్యవహారం తీసుకెళ్లకుండానే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ జీఓని జారీచేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది. అంతేకాకుండా ఈ జీఓ  వ్యవహారం మొత్తం జిల్లా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావుకి తెలియకుండా కూడా ఆగమేఘాలపై జరిగిపోవడం కూడా జిల్లా యంత్రాంగానికి తెలియడంతో ఆమెను జాయిన్ చేసుకునే విషయంలో చుక్కెదురైంది. దానికి ప్రత్యక్ష కారణం జీవిఎంసీ మున్సిపల్ ఎన్నికలైతే రెండో కారణంగా ఆమె అవినీతి తారాస్థాయికి చేరుకోవడం మరొక కారణం. అదే సమయంలో ఇవన్నీ ఆరోపణలు, అభియోగాలు, విచారణలు పెండింగ్ లోనే ఉన్న విషయం కావడంతోనే తాము సుభాషిణి విషయంలో బదిలీతో కూడిన డిపీఓ(ఎఫ్ఏసీ)గా జీఓ జారీ చేశామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ అధికారులు సమర్ధించుకున్న తరుణంలోనే ఈ కోర్టు ఉత్తర్వు విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతస్థాయిలో నెట్వర్క్ నడిపినా, కొందరు ప్రజాప్రతినిధులు సపోర్టింగ్ లెటర్స్ ఇచ్చినా, సదరు అధికారిణిపై అవినీతి ఆరోపణలు, ప్రస్తుతం పెండింగ్ లో వున్న విజిలెన్స్ నివేదికలు, ఇతన ఫిర్యాదులన్నీ బటకు వచ్చి మీడియా హడావిడీ చేయడంతో విశాఖలో  సదరు ఎంపీడీఓ డీపీఓ(ఎఫ్ఏసీ)గా జాయిన్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే తరుణంలో అటు నాలుగు వారాల వరకూ కోర్టు జీఓను సస్పెండ్ చేయడంతో సదరు అధికారిణి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగువారాల పాటు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జీఓని సస్పెండ్ చేసినా, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇచ్చిన జీఓని రద్దు చేసినా, సదరు అధికారిణికి తిరిగి ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆప్రాంతానికి తిరిగి పంపినా విషయం సద్దు మనుగుతుంది. అలాకాకుండా అటు ప్రభుత్వం కూడా డిపీఓ క్రిష్ణకుమారి కోర్టుని ఆశ్రయించినట్టుగా ప్రభుత్వంగానీ, సదరు ఎంపీడీఓ గానీ కోర్టువెళ్లినా తిరిగి ఈ విషయం మొదటికొస్తుంది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ బదిలీ జీఓ రద్దు అవుతుందా, లేదంటే 4 నాలుగు వారాల తరువాత తిరిగి పునరుద్దరిస్తారానే అనేది కూడా ఇపుడు ఉత్కంఠగా మారింది. ఈలోగా ఇదే కేసుపై డిపీఓ క్రిష్ణకుమారి కోర్టు కేసుపై కెవియట్ కి వెళ్లినా మళ్లీ కోర్టులో వాదోపవాదాలు జరిగి అటు పంచాయతీరాజ్ శాఖకు, ఇటు విశాఖజిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు కాస్త గట్టిగానే పనికల్పించే అవకాశం ఏర్పడినా ఏర్పడవచ్చు.. ఎంతో ఆశక్తిని రేకెత్తించి, ప్రస్తుతానికి కోర్టు ఉత్తర్వులతో తాత్కాలికంగా తెరపడిన విశాఖజిల్లా డీపీఓ బదిలీ జీఓ విషయంలో ఏంజరుగుతుందనేది వేచి చూడాలి. కానీ డిపీఓ బదిలీ, అటు డీపీఓ(ఎఫ్ఏసీ) జాయినింగ్ విషయంలో ఏం జరిగినా వాటి వివరాలు లైవ్ అప్డేడ్స్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా అందరికంటే ముందుగా అందిస్తామని ప్రకటిస్తున్నాం..! 

Visakhapatnam

2021-03-10 14:41:44

Tadepalle

2021-03-10 12:04:32

సచివాలయాల్లో స్పందన సరే సేవల మాటేమిటి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామసచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోలకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా..ఇక్కడ ఏ తరహా సేవలు అందుతున్నాయనే విషయం నేటికీ చాలా గ్రామాల్లోని ప్రజలకి తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినపుడే ఇక్కడ పనిచేసే సుమారు 14శాఖల సిబ్బందికి వారి డ్యూటీలు ఏమీటో ఒక చార్టు ప్రకారం తెలియజేసింది. అయితే వారు ఆ విధంగా డ్యూటీలు చేస్తున్నారా అంటే లేదనే సమాధానం చెప్పాలి. ఇదేదో కావాలని చెబుతున్న మాటకాదు గ్రామస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసేందుకు చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వ లెక్కట ప్రకారం ఏ గ్రామసచివాలయంలో ఎన్నిశాఖ సిబ్బంది ఇప్పటి వరకూ విధుల్లో చేరారో..ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలియాలి. ఆపై వారు ఏరకమైన సేవలు అందిస్తారో కూడా తెలియాలి. అలా ఇప్పటి వరకూ ఎన్ని గ్రామసచివాలయాల కార్యదర్శిలు ప్రజలకు అవగాహన కలించారు అంటే సిబ్బందే నీళ్లు నములుతున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు తప్పా మిగిలిన ఏఏ శాఖల సిబ్బంది సచివాలయాల్లో ఉన్నారో నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియలేదంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందాలని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినటప్పటికీ ఆ విధంగా సేవలు అందటం లేదు. ప్రభుత్వం వాస్తవాలు నేరుగా నమోదు చేస్తే ఆ విషయం తేటతెల్లమవుతుంది. దానికి ప్రత్యక్ష కారణం కూడా లేకపోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు లక్షా 26వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాయాలకు సిబ్బందిని నియమించినా..నేటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయం, పట్టణాల్లో నగరాపలక సంస్థ కార్యాలయాలకు నేటికీ స్పందన అర్జీలు వస్తూనే ఉన్నాయి. అంటే దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. గ్రామాల్లో ప్రజలకు సేవలు అందంటం లేదనేది తేటతెల్లమవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో ప్రతినిత్యం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిచించింది. అయినప్పటికీ ప్రజల్లో చైతన్యం రావడం లేదు. ఒక వేళ గ్రామసచివాలయాల్లో స్పందన కార్యక్రమం పెడితే మనం ఏ సమస్యపై అక్కడ అర్జీ పెట్టాలని తెల్ల మొహం వేస్తున్నారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలాయాల్లో ఇప్పటి వరకూ చాలా శాఖల్లో ఖాళీలు భర్తీ కాలేదు. భర్తఅయిన ప్రభుత్వ శాఖలేంటో, వారు ఎలాంటి సేవలు అందిస్తారో ప్రజలు తెలియపోవడం వలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు జోక్యం చేసుకొని గ్రామ సచివాలయాల పరిధిలో ప్రజలకు ఏ తరహా సేవలు అందుతాయనే విషయంపై చైతన్యం కల్పిస్తే తప్పా రాష్ట్రప్రభుత్వం అనుకున్నట్టుగా సచివాలయాల్లో స్పందనకు దరఖాస్తుల సంఖ్య పెరిగి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు స్పందన దరఖాస్తులు తగ్గుతాయి. అలాకాకుండా జిల్లా అధికారులు, మండల అధికారలు తాము బాగా పనిచేసేస్తున్నామని ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వాన్ని మభ్య పెట్టాలని చూస్తే మాత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో చాలాశాఖల సిబ్బందికి కూర్చోబెట్టి జీతాలు ఇచ్చినట్టే అవుతుంది. పైగా గ్రామస్వరాజ్యం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందకుండా పోతాయి. ఈవిషయంలో ప్రభుత్వం వాస్తవాలను గుర్తిస్తే తప్పా ప్రభుత్వ సేవలు, ఖర్చు, విలువైన సమయం వ్రుధాకాకుండా ఉంటాయి. 

Tadepalle

2021-03-10 11:16:02

Tadepalle

2021-03-10 10:55:10