గ్రామీణ జర్నలిస్ట్ లతో పాటు ఫోటో, వీడియో జర్నలిస్ట్ ల్లో వృత్తి నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రెస్ అకాడమీ క్రుషి చేస్తుందని ఛైర్మన్ శ్రీనాథ్ అన్నారు. ఒక ప్రభుత్వ సంస్థగా కాకుండా ప్రెస్ అకాడమీ రాజ్యాంగ బద్ధమైన విధులతో నైతికత కూడిన జర్నలిస్ట్ ల కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రెస్ అకాడమీ కార్యాలయంలో అకాడమీ ఏపీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ మంగళవారం ఉదయం పాత్రికేయుల సమావేశంలో అకాడమీ కార్యదర్శి ఎం. బాల గంగాధర్ తిలక్ తో కలిసి పాల్గొన్నారు. చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుండి వినూత్న పంధాలో కార్యక్రమాలను నిర్వహిస్తూ జర్నలిస్టులకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితిల్లో కూడ రాష్ట్రంలోని 13 జిల్లాలలో పర్యటించి స్వయంగా జర్నలిస్టులను కలుసుకుని, వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రెస్ అకాడమీ విడతల వారీగా పాత్రికేయులకు ఆన్ లైన్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోందన్నారు. తద్వారా వారిలో జర్నలిజం లోని నైతికత విలువలపై అవగాహన పెంపొందించే దిశలో అకాడమీ కృషి చేయాలన్నా ధ్యేయం తో అడుగులు వేస్తున్నామన్నారు. తొలివిడత పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల జర్నలిస్టులకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయి.
తొలివిడత శిక్షణలో దాదాపు 4 వేల మంది జర్నలిస్టులు పాల్గొన్నారని, వారిని అభినందించడంతో పాటు కృతజ్ఞత వ్యక్తం చేస్తాన్నామని తెలిపారు. 30 మంది నిష్ణాతులైన సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం అధ్యాపకులచే, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తో కూడి శిక్షణ తరగతుల నిర్వహించామని తెలిపారు. 15 విలక్షణ అంశాలపైన శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువత జర్నలిజం పై ఆసక్తి చూపుతున్నారని, ఔత్సాహిక జర్నలిస్ట్ లను అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. జర్నలిజం కోర్సుల్లో ప్రావీణ్యం పెంపొందించే దిశగా ప్రెస్ అకాడమీ అడుగులు వేస్తోందని శ్రీనాథ్ తెలిపారు. పాత్రికేయుల నైపుణ్యాన్ని పెంచేలా రూపకల్పన చేసిన ఈ- పుస్తకాలను ఆన్ లైన్ లో 7 వేలకు పైగా జర్నలిస్టులు డౌన్ లోడ్ చేసుకున్నారని, ఇది వారిలోని జిజ్ఞాసకు ఉదాహరణ గా పేర్కొన్నారు.
జర్నలిజం కోర్సులను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, యోగి వేమన విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలతో ప్రెస్ అకాడమీ ఒప్పందం చేసుకున్నామన్నారు. జర్నలిజం కోర్సుల ఫీజుల రాయితీ విషయంలో ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. యూనివర్సిటీ లు నిర్ధారించిన ఫీజుల్లో 40 నుంచి 50 శాతం అకాడమీ ద్వారా జర్నలిస్ట్ ల తరపున చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరిన్ని యూనివర్సిటీలతో ఒప్పందాన్ని చేసుకునేందుకు ప్రెస్ అకాడమీ సిద్ధంగా వుందన్నారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు ఒప్పందం చేసుకున్న యూనివర్సిటీల్లో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నామన్నారు. విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం ద్వారా ఆన్ లైన్ లో సర్టిఫికేషన్ డిప్లామో కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.
మలిదశ శిక్షణలో గ్రామీణ విలేకరులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులతో పాటు ఆయా బీట్ లు , అంశాల వారీగా అవసరమయ్యే మెళకువలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునే దిశలో రూ.5 లక్షల పరిహారం అందచేసే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది అని తెలిపారు. అదేవిధంగా కోవిడ్ బారిని పడి, చికిత్స పొందిన వారిని కూడా ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. జర్నలిస్టులు సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్యులు సానూకూలంగా వున్నారని ఛైర్మన్ తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్ అందుతోంది..విశాఖజిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారిని కదపకూడదని హైకోర్టు స్టే విధించింది. గద ఏడు రోజుల క్రితం విఖజిల్లా డిపీఓను బాదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో డీపీఓ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈమెకు ఏ జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడి కి రిపోర్టు చేయాలని ఆ జీఓలో పేర్కొన్నారు. దీనితో తనకు అన్యాయం జరిగిందని భావించిన డిపిఓ క్రిష్ణకుమారి ప్రభుత్వ జీఓను సవాల్ చేస్తూ హై కోర్టు ఆశ్రయించారు. ఆమె వినతపై సోమవారం కోర్టు సదరు జీఓని సస్పెండ్ చేస్తూ స్టే విధించింది. దీనితో ప్రభుత్వం ఒక ఎంపీడీఓను డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ విడుదల చేసిన జీఓ నిలిచిపోయినట్టు అయ్యింది. భారీ స్థాయిలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి కూడా పోస్టింగ్ విశాఖలో ఇవ్వకుండా వీలులేకుండా పోయింది. అయితే ఈ కోర్టు ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఈ ఉత్కంఠగా మారింది. మరోపక్క విశాఖజిల్లా డిపీఓను బదిలీ చేస్తున్న విషయం జిల్లా మంత్రికి తెలియకుండా జరగడం ఒక విషయమైతే, అవినీతి ఆరోపణలు ఎదర్కొంటున్న ఎంపీడీఓ విషయంలో చాలా కేసులపై విచారణలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో అధికారులను ప్రసన్నం చేసుకొని సదురు అధికారిణి తనపై విచారణలు అన్నీ పెండింగ్ లో ఉన్న ప్పటికీ పదోన్నతితో పాటు బదిలీకి జీఓ తెప్పించుకునే విషయంలో సఫలీక్రుతులయ్యారు. కానీ విశాఖజిల్లా డీపీఓ క్రిష్ణకుమారి కోర్టును ఆశ్రయించడంతో అదికాస్త నీరుగారిపోయినట్టు అయ్యింది. విశాఖజిల్లా డీపీఓ ను బదిలీ చేస్తూ కోర్టు సస్పెండ్ చేసిన జడ్జిమెంట్ కాపీలు సాయంత్రానికి గానీ రేపు ఉదయానికి గానీ అటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి, విశాఖజిల్లా కార్యాలయానికి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది..!
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతికి తావుండదు..అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదు..పనిచేసే అధికారులకే పట్టం కడతాం..ప్రజాసేవే పరమావధి.. ప్రజల కోసం మంచి అధికారుల సేవలే ప్రామాణికం..తేడా వస్తే ఎంతటివారైనా, ఎలాంటి అధికారులపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం అనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, ఆదేశాలను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరవు అక్షరాలా నిజంచేసి చూపించారు. కోట్ల రూపాయల అవినీతి, ఆరోపణలు, విజిలెన్సు విచారణలు ఎదుర్కొంటున్న అవినీతి ఎంపీడీఓ సుభాషిణి ని విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి(ఎఫ్ఏసీ)గా రానీయకుండా చేసి పెర్ ఫెక్ట్ అండ్ డైనమిక్ స్టేట్ మినిస్టర్ గా వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరించే జిల్లా మంత్రి ఒక అవినీతి అధికారిణిని జాల్లాలోకి రానీయకుండా చేసి జిల్లాయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలోనే అత్యధిక అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు(Govt of ap vigilance and enforcement department case number 04/RVEO/Estt./RJVM/2020, Dt.21.07.2020 వీటితో పాటు క్రిమినల్ కేసులు మరికొన్ని) ఎదుర్కొన్న విషయాలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఆధారాలతో సహా వచ్చిన ప్రత్యేక వార్తాకధనాల ద్వారా తెలుసుకొని ఆమెను జిల్లాలోకి రానీయకుండా అడ్డుకొని ఎంతో చాకచక్యంగా జిల్లా పరువుని కాపాడాగలిగారు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆమె పనిచేసిన కాలంలో జరిగిన అవినీతికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాష్ట్రమంతా వైరల్ కావడం కూడా చర్చనీయాంశం అయ్యి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వరకూ ఈ విషయం వెళ్లింది. దీనితో సదరు అధికారిణిపై ఇచ్చిన జీఓని రద్దు చేసే యోచనలో సెక్రటేరియట్ అధికారులు అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో తూర్పుగోదావరి జిల్లాలోని వీఆర్ పురం జిల్లా అధికారుల పనిష్మెంట్ పై బదిలీగా వెళ్లి అక్కడ విధుల్లోకి చేరకుండా కేవలం, విశాఖపట్నం జిల్లా పంచాయతీ అధికారిణిగా జీఓ రావడం కోసమే రెండు రోజులు ముందుగా విధుల్లో చేరి, ఆపై విశాఖ వచ్చిన అంశాన్ని కూడా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ను అందిస్తూ వచ్చింది. ఆ కధనాలన్నీ రాష్ట్రంలో వైరల్ అయ్యి మంత్రి వరకూ చేరడంతో అప్పటికే ఈయొక్క అధికారిణి మంత్రికి తెలియకుండానే ఈ జీవో తెప్పించుకోవడం లో సఫలీక్రుతురాలైంది. ఈ అవినీతి అధికారిణి విషయం తనకు తెలియకుండా జరగడం కూడా ఇపుడు జిల్లా మంత్రిపై మచ్చపడకుండా చేయడంలో కీలక భూమిక వహించిందనే చెప్పాలి.. లేదంటే ఆ అవినీతి అధికారి మంత్రి ప్రోద్భలంతోనే విశాఖ వచ్చిందనే మచ్చ పడే అవకాశాలు చాలా అధికంగా ఉండేవని జనాల్లోకి, అధికారుల్లోకి నెగిటివ్ ప్రచారం జరిగేది. సదరు అధికారిణి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడకు రావడానికి చాలా నిబంధనలను పక్కనపెట్టి జీఓ రప్పించుకోవడంలో అటు సెక్రటేరియట్ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ అధికారులు కీలక భూమిక వహించినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఓ పక్క రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఒక రెగ్యులర్ డీపీఓ ఉన్న జిల్లా స్థానానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఎంపీడీఓగా వున్న అధికారిణి పంపే ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న డీపీఓ ఎన్నికల అధికారిగా ఉన్న అధికారిణిని బదిలీ చేసి, ఆమెకు ఎలాంటి జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడీకి రిపోర్టు చేయాలని చెప్పడం, అన్నింటికంటే ముఖ్యంగా విశాఖజిల్లా డిపీఓకి సర్వీసు కూడా ఒక ఏడాది మాత్రమే ఉండటం.. తదితర అంశాలు అధికారులను ఇరుకునపెట్టేవిగా కనిస్తున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఏ డీపీఓ నైతే బదిలీ చేశారో సదరు అధికారిణికి బదిలీ స్థానం చూపకుండానే బదిలీకి ఉత్తర్వులు జారీచేయడం.. తదితర అంశాలన్నీ ఆ ఎంపీడీఓను విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీచేయడానికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయ అధికారులు జీఓ ఇచ్చిన తీరు మొత్తం అవినీతికి పరాకాష్టగా నిలిచినట్టుగా విశాఖజిల్లాలో కోడైకూస్తుంది. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయం సదరు ఎంపీడీఓపై వచ్చినవన్నీ అభియోగాలేనని, ఏ ఒక్కటీ రుజువుకాలేదని ఆ కారణంతోనే తాము ఆమె పనిష్మెంట్ ప్రాంతానికి వెళ్లినా విశాఖ జిల్లా డీపీఓగా పంపడానికి జీఓ ఇచ్చామని సమర్ధించుకున్నా ఇక్కడ పొంతన కుదరడం లేదు. డీపీఓగా పంపాలనుకుంటే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో డీపీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని జాల్లాలను వదిలేసి ఒక్క విశాఖజిల్లాకే ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిణికి ప్రత్యేక జీఓ ద్వారా పంపడంలో, ఇక్కడ ప్రజాప్రతినిధులపైనా అవినీతి బురద మరక అంటించాలనే ఆలోచన ఉన్నట్టు ఈ బదిలీ జీఓ ద్వారా స్పష్టంగా తెలియజేస్తుందని జిల్లాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ జీఓ రావడంలో జిల్లా యంత్రాంగానికి, జిల్లా మంత్రికి తెలియకుండా జరగడంతో వీరు తొలుత ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని నియామకాన్ని ఎన్నికల తరువాత చూద్దామని చెప్పి పంపినా, తరువాత వాస్తవాలను తెలుసుకొని ఒక్కసారిగా కంగారుపడి ఆపై తేరుకొని జిల్లాపై అవినీతి మరక పడకుండా మంత్రి కాపాడగలిగారు.. సదరు అధికారిణిపై నేరుగా మీడియాలో వరసు కధనాలు వాస్తవాలు, విచారణ నివేదికలు( Efile no DI/ZPP/296618/2020, dated 27.08.2020, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీపీఓ కార్యాలయం, కాకినాడ/ efile number 340677/2020a3, 9.10.2020 krrc, Thasildar, subcollector office rajamundry report, Regd number H.3153/2020 date 12.10.2020 subcollector report) ఇలా చాలా ఆధారాలతోనే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ కూడా రంగంలోకి దిగడంతో అసలు విషయం కాస్త అటు అధికారులకు, ఇటు ఈ అధికారిణికి సపోర్టింగ్ లెటర్స్ ఇచ్చిన ప్రజాప్రతినిధులకు తెలిసి వారంతా చేతులెత్తేశారు. ఈ ట్రాన్స్ ఫర్ కమ్ డిపీఓ(ఎఫ్ఏసీ) ఎపిసోడ్ లో సదరు ఎంపీడీఓ ఉదయంతా కలెక్టర్ కార్యాలయం, మధ్యాహ్నాం అంతా మంత్రి వెనుక తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇక విశాఖలో పనిజరగదని భావించిన అధికారిణి నేరుగా జీఓని అమలు చేయించుకోవడానికి అమరావతి బయలుదేరిన విషయాన్ని కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందించింది. ఈ ఆధారాలతో ఇపుడు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయంలోని అధికారులు కూడా డైలమాలో పడ్డారు. ఇన్ని విషయాలు మీడియాకి తెలిసిన తరువాత ఈ అధికారిణి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లినా ప్రతీ అధికారి, సిబ్బంది న్యాయపరమైన చిక్కులు ఎదొర్కోవాలసి వస్తుందని, ఈ జీఓని రద్దుచేసే యోచనకు ఉపక్రమించారని తెలుస్తుంది. దానికితోడు జిల్లా మంత్రి, కలెక్టర్లు కూడా మున్సిపల్ ఎన్నికల ద్రుష్ట్యా తిరస్కరించడం, ఈమె అవినీతి సంబంధించిన ఆధారాలు, ప్రభుత్వ, విజిలెన్సు నివేదికలు వీరికి కూడా చేరడం కూడా ఈ అధికారిణి విశాఖలో చేరకుండా ఉండేందుకు ముఖ్య కారణాలు అయ్యాయి. ఇంకా ఇప్పటికీ ఈ అధికారిణి చేసిన అవినీతిపై తూర్పుగోదారి జిల్లాలోని మీడియా, మరికొందరు జర్నలిస్టులు, ప్రభుత్వ సిబ్బంది, చాలా మందే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ కార్యాలయాలనికి ఆధారాలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు పంపుతూనే ఉన్నారు. దీనిని బట్టి చూసుకుంటే ఏ స్థాయిలో ఈ ఎంపీడీఓ అవినీతికి పాల్పడిందనేది అర్ధం చేసుకోవచ్చు. వాటి ఆధారంగా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ప్రత్యేక కధనాలు లైవ్ అప్డేట్స్ ఇస్తుండటంతో జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆలోచనలో పడేలా చేశాయి. ఈ ఆశక్తి కర అడ్డగోలు డీపీఓ ట్రాన్స్ ఫర్ జీఓ విషయంలో మరిన్ని తాజా అప్డేట్స్ ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అందిస్తూనే ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వంలో పెద్దలు, అధికారులు అవినీతిని నియంత్రించడానికి చేసే మంచికార్యక్రమంలో ఈఎన్ఎస్ ఎల్లప్పుడూ భాగస్వామ్యం అవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు, అధికారులకు తేలియజేశాం. అదే పందాను కొనసాగిస్తూనే ఉంటామని కూడా ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ ఎవరికీ వ్యతిరేకం కాదు, అలాగని ఎవరి దగ్గర కూడా కాదు కేవలం న్యాయం వైపు మాత్రమే వుంటుందని తెలియజేయజేస్తున్నాం. ఎల్లప్పుడూ వాస్తవాలను సకాలంలో మీ కళ్లముందుంచే ఈఎన్ఎస్ లైవ్ యాప్ ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు..!
విశాఖజిల్లా పంచాయతీ అధికారి పోస్టు, బదిలీ విషయంలో అవినీతి అధికారిణి సుభాషిణికి జిల్లాలో చుక్కెదురైంది..మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ విధినిర్వహణలో వున్న డిపీఓ క్రిష్ణకుమారిని బదిలీచేస్తూ, ఆ స్థానంలో ఇన్చార్జి డిపీఓగా తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం ఎంపీడీఓ పేరు ప్రతిపాదిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆరురోజుల క్రితం జీఓ జారీచేసింది. ఈ తంతు మొత్తం విశాఖజిల్లాలోని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రికి తెలియకుండా జరిగిపోయింది. దీనితో ఆగమేఘాలపై జిల్లా పంచాయతీ అధికారిగా పోస్టులో చేరిపోవడానికి వచ్చిన సదరు అధికారిణికి వ్యతిరేక పవనాలు ఎదురయ్యాయి. నేరుగా కలెక్టర్ ను కలవడానికి ప్రతయత్నిస్తే..ప్రస్తుతం విశాఖలోని మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున, ఆవిధుల్లో డిపీఓ క్రిష్ణకుమారి పనిచేయడంతో ప్రస్తుతం మార్పులు చేర్పులు కుదరవని, ఎన్నికల నిర్వహణ తరువాత చూద్దామని చెప్పడంతో అక్కడి నుంచి ఏ మంత్రికైతే తెలియకుండా జీఓతో విధుల్లో చేరడానికి వచ్చారో ఆమంత్రిని ప్రసన్నం చేసుకోవాలని వచ్చినా అక్కడా వీలు పడలేదు. అయినప్పటికీ తన నెట్వర్క్ మొత్తాన్ని వినియోగించినా ఇద్దరు ప్రజాప్రతినిధులతో విశ్వప్రయాత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనితో వెనుతిరిగిన ఆ అధికారిణి నేరుగా విశాఖ నుంచి రాజధానిలోని పంచాయతీరాజ్ శాఖ సెక్రటేరియట్ ద్వారా కధనడిపించాలని వెళ్లినట్టు సమాచారం అందుతుంది. శుక్రవారం ఉదయం పదిగంటల నుంచి శనివారం మధ్యాహ్నాం వరకూ ఎంత ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించలేదు సదరు అధికారిణికి. ఈమె విశాఖజిల్లాలో డీపీఓ ఇన్చార్జిగా చేరడానికి సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కూడా ఆమె యొక్క అవినీతి వ్యవహారాలు మీడియా ద్వారా వెలుగు చూడటంతో చేతులెత్తేయడంతో ఇక పనిజరగదని భావించిన సదరు అధికారిణి రాజధానికి ఇటు నుంచి ఇటే పయనమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో లక్షల రూపాయల అవినీతి, క్రిమినెల్ కేసులు ఎదుర్కుంటూ, విజిలెన్సు విచారణలు, పరిపాలనాపరమైన విచారణలు ఎదుర్కొంటున్న పెండింగ్ యాక్సన్ కోసం వేచి వున్న ఇలాంటి అధికారిణిని చేర్చుకోవడానికి విశాఖజిల్లాలో ప్రజాప్రతినిధులు సముఖత చూపకపోవడం కూడా చర్చనీయాంశం అయ్యింది. అసలు ఇన్ని కేసులు, విచారణలున్న అధికారిణికి ఎలా బదిలీచేశారు, ఏవిరి ప్రోద్భలంతో జీఓ వచ్చిందనే విషయంలోనూ చాలా పెద్ద ప్రచారమే జరిగింది. ఈ అధికారిణికి విశాఖజిల్లా పంచాయతీ అధికారిగా బదిలీచేస్తూ జీఓ వచ్చిన దగ్గర నుంచి ఆమె యొక్క అవినీతి వ్యవహారాలను తొలుత ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ప్రత్యేక న్యూస్ కార్డ్ కవరేజీ ఇస్తూ వచ్చింది. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ లో పనిచేస్తున్న సమయంలో ఈమె చేసిన అవినీతికి సంబంధించిన అంశాలను కూడా అటు ఆ జిల్లా నుంచి మీడియా కూడా పేపర్ క్లిప్పింగులను, టీవీ ఛానల్స్ కధనాలను ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలతో పాటు వైరల్ అయ్యాయి. దీనితో ఈ విషయం కాస్తా ఆమె విశాఖజిల్లా పంచాయతీ అధికారిణిగా రావడానికి సహకరించిన నేతలందరూ ఈమెయొక్క అవినీతిని స్వయంగా తెలుసుకొని చేతులెత్తేశారు. అయినప్పటికీ సదరు అధికారిణి, ఎలాగూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి తనపేరుతో జీఓ ఇచ్చారని, దానిపై న్యాయనిపుణుల సలహామేరకు ముందుకి వెళతానని, ఎందుకు ఆ జీఓని అమలు చేయరో చూస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసిమరీ వెనుతిరిగినట్టు విశాఖజిల్లాలో తీవ్ర ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మంచి అధికారిణిగా పనిచేస్తూ, ఇటు ప్రజాప్రతినిధుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్న డిపీఓ క్రిష్ణకుమారి కూడా తన ఉద్యోగ విరమణకు కేవలం ఒక్క ఏడాది మాత్రమే సమయం వుందనే విషయాన్ని ఇక్కడి ప్రజా ప్రతినిధులకు చెప్పడం, అన్ని వర్గాలకు సేవలు అందిస్తూ, ఎన్నికల అధికారిగా కూడా చురుకుగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో అటు జిల్లా యాంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ అవినీతి అధికారులను జిల్లాలోకి తీసుకువస్తే ప్రజాప్రతినిధులపై మచ్చ ఏర్పడుతుందని భావించి ఆమెను వెనుతిరిగివెళ్లిపోయేలా చేయడంలో సఫలీక్రుతలయ్యారు.. అన్నిదారులూ మూసుకుపోయినా, చివారఖరి దారి కేవలం రాష్ట్ర కార్యాలయం మాత్రమే అనుకున్న ఆమె రాష్ట్ర కార్యాలయంలోని ముఖ్య కార్యదర్శిని కలవడానికి వెళ్లి అక్కడి నుంచి తన నెట్వర్క్ యాక్టివేట్ చేయాలని భావిస్తున్నారట. ఈ ఆశక్తికర ఎపిసోడ్ లో అనునిత్యం వాస్తవాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచే ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరింత తాజా సమాచారాన్నికూడా ఆధారాలతోనే తెలియజేస్తుందని ప్రకటిస్తుంది. ఇంత జరిగిన తరుణంలో అధికార, ప్రజాప్రతినిధులు ఎలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని కూడా లైవ్ అప్డేట్స్ ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందిస్తుందని కూడా మరోసారి తెలియజేస్తున్నాం..!
ఒక జిల్లా మంత్రికి తెలియకుండా ఒక అవినీతి అధికారి నేరుగా పంచాయతీరాజ్ శాఖ నుంచి రెగ్యులర్ పోస్టు కోసం పైరవీలు చేసి మరీ జీఓ తెచ్చుకుంటే అది అమలు కావడానికి మాత్రం క్షేత్రస్థాయిలో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి.. అవును మీరు చదువుతున్నది నిజమే విశాఖజిల్లా పంచాయతీ అధికారిణిగా వున్న క్రష్ణకుమారిని బదిలీల చేస్తూ జిఏడీఓ రిపోర్టుచేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఐదురోజుల క్రితం జీఓ జారీచేశారు. అదే సమయంలో వీఆర్ పురం ఎంపీడీఓకి ఇదే స్థానాన్ని మంజూరు చేస్తూ డిపీఓ(ఎఫ్ఏసీ)గా చేరాలన్నది ఆ జీఓలోని సారాంశం. అయితే ఒక జిల్లాలో ఏ అధికారికి బదిలీ జిరిగినా, పోస్టింగ్ ఇచ్చినా ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు మంత్రులకు, ఆ అధికారియొక్క ట్రాక్ రికార్డ్ ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ద్వారా తమ జిల్లాలోకి తీసుకొచ్చి పచేయిస్తారు. విచిత్రంగా ఈ ఎంపీడీఓ మాత్రం జిల్లా మంత్రికి తెలియకుండా తాను డిపీఓగా చేరడానికి జీఓ రప్పించుకోవడంలో సఫలీక్రుతారాలయ్యారు. ఆవిషయం కాస్త మంత్రికి, జిల్లా కలెక్టర్ కు తెలియడంతో జిల్లా కలెక్టర్ ఉదయం ఆమెను విధుల్లోకి చేర్చుకోవడానికి విముఖ చూపించారు. పైగా ప్రస్తుతం వున్న అధికారిణి మున్సిపల్ ఎన్నికల్లో అధికారిణిగా ఉండటం, బాగాపనిచేసిన మంచిపేరు సంపాదించారు. అదే సమయంలో ఆ వచ్చే ఎంపీడీఓపై అవినీతి అభియోగాలతోపాటు, క్రిమినల్ కేసులు కూడా కోర్టులో పెండింగ్ లో ఉండటంతో అధికారులు ఈమెను విధుల్లోకి చేర్చుకోవడానికి వెనుకడుగు వేశారు. దీనితో ఉదయమంతా జిల్లా కలెక్టర్ ను కలవడానికి విఫలయత్నం చేసి, ఇక లాభం లేదనుకొని ఏ మంత్రికైతే తెలియకుండా జీఓ తెచ్చుకున్నారో అదే మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావును ప్రసన్నం చేసుకోవడానికి మధ్యాహ్నం నుంచి ఆయన వెంట తిరుగుతున్నారు. అందులోనూ ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జిల్లా మంత్రి పెద్ద ఎత్తున రాష్ట్ర బంద్ లో పాల్గొన్నా, ఎలాగైనా మంత్రిని కలిసి విధుల్లో చేరిపోవాడానికి విఫల యత్నాలు చేస్తున్నారు అ అధికారిణి. వాస్తవానికి జిల్లా కలెక్టర్ సదరు అధికారిణిని తిరస్కరించారంటే దానికి కారణం ఎన్నికల విధులు ఒక కారణమైతే, మరొక కారణం ఆమె విశాఖజిల్లాకు వస్తున్నారని తెలిసి మీడియా మొత్తం ఆమె అవీనిపై కోడై కూయడం రెండో కారణంగా కనిపిస్తోంది. దానికి తోడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఆది నుంచి అవినీతి అధికారిణి సుభాషిణి విషయంలో వాస్తవాలు, ప్రభుత్వ అధికారిక అవినీతి విచారణలు, క్రిమినల్ కేసులు, తూర్పుగోదావరి జిల్లా జెసి, ప్రస్తుత విచారణ అధికారి డిపీఓ ఎంక్వైరీ రిపోర్టులు ఇలా అన్నింటిని అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజాప్రతినిధులకు తెలిసేలా లైవ్ అప్డేట్స్ న్యూస్ కార్డ్స్ గా ఇస్తూ వస్తోంది. ఈ తరుణంలో ఆ అవినీతి అధికారిణిని విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి(ఎఫ్ఏసీ)గా చేర్చుకోవడానికి ఎవరూ సముఖ చూపించలేదు. ఇటు జిల్లా కలెక్టర్ దగ్గర ప్రయత్నంచి విఫలమై, అటు ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటూనే జిఓ అమలు కోసం అటు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చే విషయంలోనూ సదరు అధికారిణి ముందుంటూ వచ్చారు. కానీ పనిమాత్రం జరగలేదు. అసలు ఇన్ని అవినీతి అభియోగాలు, ప్రభుత్వ విచారణలు ఎదుర్కొంటున్న ఒక ప్రభుత్వ అధికారిణి ఎలా మరోచోటికి జిల్లా మంత్రికి కూడా తెలియకుండా బదిలీ చేశారనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గామారింది. ఎలాగైనా తనకు తెలిసిన మరో ఎమ్మెల్యే ద్వారా మంత్రితో మంచి అనిపించుకొని విధుల్లోకి చేరాలన్నది ఆమె యొక్క లక్ష్యం.. అసలు ఇన్ని కారణాల నేపథ్యంలో ఆ అవినీతి అధికారిణిని విశాఖజిల్లా డీపీఓగా చేర్చుకుంటారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ఈ ఆశక్తి కర జిల్లా పంచాయతీ అధికారిణి అడ్డగోలు పోస్టింగ్ ఆర్డర్ విషయంలో ఆ అవినీతి అధికారిణికి జీఓ ప్రకారం పోస్టింగ్ విశాఖలో ఇచ్చేస్తారా..ఇపుడు జరిగే పని కాదని తిరస్కరిస్తారా..లేదంటే న్యాయ పరమైన చిక్కులొస్తాయని నచ్చజెప్పి పంపుతారా..మరికొంత సమయం వేచి ఉండమంటారా అనే తాజా సమాచారాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా మీకు తాజా సమాచారం అందిస్తామని తెలియజేస్తున్నాం.
విశాఖజిల్లా పంచాయతీ అధికారి పోస్టు భర్తీ విషయంలో ఆశక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు పెండింగింగ్ లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి పంచాయతీరాజ్ శాఖ విశాఖజిల్లా డిపిఓ(ఎఫ్ఏసి)గా బదిలీచేసింది. దీనితో ఆమె శుక్రవారం విధుల్లో చేరిపోవడానికి విశాఖ వచ్చారు. జిల్లా కలెక్టర్ కలవడానికి కార్యాలయానికి వెళితే అక్కడ కలెక్టర్ లేరు. విశాఖజిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వున్న కలెక్టర్ విధినిర్వహణపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. అయితే ఎలాగైనా కలెక్టర్ ను కలిసి తాను విధుల్లోకి చేరిపోవాలన్నట్టుగా సదరు అధికారిణి కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఆమెను మున్సిపల్ ఎన్నికలు తరువాత రావాలని చెప్పేశారు. అయినప్పటికీ ఆమె అక్కడి వుంటే తన నెట్వర్క్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తూ...కలెక్టర్ చక్కెర్లు కొడుతున్నట్టు సమాచారం అందుతుంది. విశాఖజిల్లా డిపీఓగా చేరాలని ప్రభుత్వం జీఓ జారీచేసిన తరుణంలో సదరు అధికారిణి సుభాషిణి ఆరు నెలలుగా విధుల్లోకి చేరకుండా, కేవలం డీపీఓగా చేరిపోవడానికి ఐదురోజుల క్రితం విధుల్లోకి చేరారు. అదీ తన ట్రాన్సఫర్ కమ్ ఇన్చార్జి డిపీఓ పోస్టు కి జీవో వస్తుందని కన్ఫార్మ్ అయిన తరువాత. అంత పెద్ద భారీ నెట్వర్క్ నడిపిన తరువాత జీఓ రావడంతో ఆఘమేఘాలపై ఆమె తన పోస్టు నుంచి రిలీవ్ అయిపోయారు. ఆమె రిలీవ్ అవుతున్నవిషయం తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా మీడియా ఎంపీడీఓపై అవినీతి ఆరోపణలు, జరుగుతున్న విచారణలు, పెండింగ్ లోవున్న విచారణలు, ప్రభుత్వం ఇచ్చిన మెమో కాపీలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక యాప్ ఈఎన్ఎస్ లైవ్ కి సకాలంలో అందించారు. దీనితో ఈఎన్ఎస్ లైవ్ యాప్ వాస్తవాలను న్యూస్ కార్డ్ గా తీసుకురావడంతో, ఎలాగైనా అడ్డంకులు పెరిగిపోతున్నాయని, తక్షణమే విధుల్లోకి చేరిపోతే అన్నింటికి పులుస్టాఫ్ పెట్టాలని భావించిన అధికారిణి విశాఖ వచ్చేశారు. తీరా విశాఖ వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ని కలవడం కుదరలేదు. పైగా ఈరోజు ప్రభుత్వం అధికారికంగా బంద్ నిర్వహించమని చెప్పడంతో అధికారులంతా నల్ల బ్యాడ్జిలు తగిలించుకొని విధుల్లో ఉన్నారు. అయినప్పటికీ తనకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి జీఓ రావడంతో దానినైనా అధికారులు పాటిస్తారని, తనపై అవినీతి ఆరోపణలు, విచారణలు ఉన్నప్పటికీ జీఓ ప్రకారం విధుల్లోకి చేర్చుకుంటారని విశాఖ వచ్చేసినా ఫలితం లేకపోయింది. దీనితో ఆమె కలెక్టర్ క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, ఇటు రాజకీయంగా, అటు అధికారింగా పైరవీలు మొదులు పెట్టినట్టు సమాచారం అందుతుంది. కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఎంపీడీఓకి చెప్పినప్పటికీ ఎలాగైనా కలెక్టర్ ను కలిసి, విశాఖజిల్లా డిపీఓగా చేరిపోవాలని పట్టుదలతోనే అక్కడే వుండిపోయినట్టు చెతున్నారు. దానికితోడూ, ఒక ప్రజాప్రతినిధికి తెలియకుండా లేఖలు తీసుకొని వెళ్లి, చాలా పెద్ద నెట్వర్క్ వినియోగించి జీఓ తెచ్చుకున్నతరువాత, ఈమె అవినీతి ఆరోపణలు తెరమీదకు రావడం, ఆపై తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడమూ జరిగిపోయాయి. ఇంతజరిగిన్పటికీ తమ శాఖ జారీ చేసిన జీఓ పై ఉన్న నమ్మకంతో విశాఖ వచ్చి ప్రస్తుతం గాల్లో ఉన్నారు ఎంపీడీఓ సుభాషిణి. ఈ ఆశక్తికర ఎపిసోడ్ లో తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలిచిన ఈ ఎంపీడీఓ విశాఖజిల్లా డిపీఓగా(ఎఫ్ఏసీ)గా బాధ్యతలు స్వీకరిస్తారా, లేదంటే ఎన్నికల తరువాత ఈ తతంగానికి శుభం కార్డు పడుతుందా, ఈ లోగా ఈమెపై వున్న అవినీతి ఆరోపణ ఫైల్స్ ను ప్రభుత్వంలోని అధికారులు మళ్లీ తెరపైకి తెస్తారా, తెచ్చినా, తేకపోయినా ఆమెకి పోస్టింగ్ విశాఖలోనే ఇచ్చేస్తారా, ఇచ్చిన తరువాత న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారా అనే విషయమై ఆశక్తికర చర్చ నడుస్తుంది. వాటిటి ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ మీకు అందజేస్తుందని తెలియజేస్తున్నాం.