1 ENS Live Breaking News

ఏపీ సమాచార శాఖలో భారీగా సిబ్బంది కొరత..

ఆంధ్రప్రదేశ్ లో సమాచార శాఖ సిబ్బంది లేమితో కొట్టిమిట్టాడుతోంది..ఏపీఆర్వోలు, డిపీఆర్వోలు,డిప్యూటీ డైరెక్టర్లు, ఏడీస్థాయి అధికారుల ఖాళీలు భారీగా ఏర్పడటంతో ప్రభుత్వ కార్యక్రమాలు, కరోనా సమయం అత్యవసర సమాచారం మీడియాకి ప్రెస్ నోట్లు ద్వారా ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో సమాచారశాఖలో సినిమా ఆపరేటర్లను ఫోటో గ్రాఫర్లుగానూ, ఏపీఆర్వోలగాను వినియోగిస్తుండగా, మరికొన్ని చోట్ల ఏపీఆర్వో చేసే ఉద్యోగాన్ని ఏడీలు, డిడిలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఏపీఆర్వోలను ప్రభుత్వం నియమించినా వారికి ప్రెస్ నోట్లు రాయడం రాకపోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. దీనితో  సిబ్బంది కొరత ఉన్న విభాగాల్లో వారిని వినియోగించుకుంటున్నారు సమాచారశాఖ అధికారులు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు మంత్రులు ఉండటంతో వారి ప్రెస్ కవరేజీ సమాచారశాఖకు తలనొప్పిగా తయారైంది. కొన్ని జిల్లాల్లో కార్యక్రమం జరిగిన వెంటనే వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారాన్నిపంపుతున్నా...మరికొన్ని జిల్లాల్లో సమాచారశాఖ కనీసం ప్రెస్ కోసం వాట్సప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయలేదు. కాదు కాదు చేస్తే మరింత ఒత్తిడి పెరుతుందని మానేశారు. ఇంకా పాత జీమెయిల్ విధానంలోనే ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు అరకొరగా పంపుతున్నారు. మంత్రులు వద్ద పీఆర్వోలు ఉన్నప్పటికీ వారు ఆయా జిల్లాలకే కొద్దిమంది మీడియాకే పరిమితం అవుతున్నారు. మంత్రుల కార్యక్రమాలు నేరుగారు సమాచారశాఖ కు కాకుండా వారే మీడియాలకు పంపుతున్నారు. దీనితో మంత్రుల కార్యక్రమాలకు సమాచారశాఖ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లే సమయంలో మిగిలిన ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కార్యాలయాల్లోని టైపిస్తులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫోటో గ్రాఫర్లు ఇలా చాలా పోస్టులే సమాచారశాఖలో ఖాళీగా ఉండిపోయాయి. రాష్ట్ర రాజధాని రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్న తరుణంలో ముఖ్యమైన మూడు జిల్లాల్లోని సమాచారశాఖ శాఖలో ఏపీఆర్వోలు, కార్యాలయ సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుందని అంతా భావించినా సిబ్బంది నియామకంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా చాలా చోట్ల ప్రభుత్వ పథకాల సమాచారం కూడా పత్రికలు, ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలకు రాకుండా పోతుంది. ప్రతీ జిల్లా నుంచి అరకొరగానే ప్రెస్ నోట్లు వస్తున్నాయి. మంత్రులు కార్యక్రమాలు తప్పా సమాచారశాఖకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కార్యక్రమాలు కవర్ చేసే అవకాశం లేకుండా పోతుంది. డిడి, ఏడీ, డిపీఆర్వో, డివిజనల్ పీఆర్వోల మీద భారం మొత్తం పడిపోతుంది. దానికితోడు రాష్ట్రవ్యాప్తంగా సమాచారశాఖలోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పాతబడినవి కావడం కూడా వేగంగా మీడియాకి సమాచారం అందించే విషయంలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం ఒక్కో జిల్లాకి ముగ్గురు ఏపీఆర్వోలను నియమిస్తే తప్పా ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి కష్టంగా మరుతోంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే సమాచారశాఖలో ఖాళీలను భర్తీ చేస్తే పరిస్థితి కొలిక్కి వచ్చేటట్టు కనిపించడంలేదు..ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి..

Tadepalle

2021-05-11 03:59:28

Tadepalle

2021-05-10 15:27:36

Tadepalle

2021-05-10 15:02:02

ఆ ఉత్తర్వులు సచివాలయాలకు చేరడం లేదు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు, సేవలకు ఉన్నతాధికారులే గాలితీసే కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్రస్థాయిలో సచివాలయ శాఖకు సంబంధించిన ఏరకమైన ఉత్తర్వులు జారీ చేసినా అవి గ్రామ, వార్డు సచివాలయాలకు సక్రమంగా చేరడం లేదు. వాస్తవానికి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఏ నోటీసులు, ఉత్తర్వులు, సూచనలు జారిచేసినా జిల్లా అధికారులు వాటిని అమలు అమలు చేయడానికి ఎంపీడీఓల ద్వారా సచివాలయాలకు చేర్చాల్సి వుంది.  అన్ని శాఖలు ఒకేచోట ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలి. కానీ రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఈ విధానం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేటికీ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రోటో కాల్ ప్రకారం అధికారులు, జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు ఎవరో కూడా తెలియని పరిస్థి నెలకొంది.. రాష్ట్ర అధికారుల ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు, వారి నుంచి జిల్లా శాఖల అధికారులకు, అక్కడి నుంచి మండల పరిషత్ లకు, ఆఖరిగా అక్కడ నుంచి గ్రామసచివాలయాలకు చేరాల్సివుంది. కేవలం ఈఫైలింగ్ విధానం లేకపోవడం వలన రాష్ట్ర ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలు జిల్లా కార్యాలయాలకు వచ్చినా వాటిని పూర్తిస్థాయిలో ఎంపీడీఓల ద్వారా సచివాలయాలకు చేర్చడంలో జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో విఫలం అవుతున్నారు. దీనితో ప్రభుత్వ ఉత్తర్వులు ఎప్పుడు, ఏవిధంగా ఏఏ అంశాలమీద వస్తున్నాయో సచివాలయ సిబ్బందికి తెలియడం లేదు. ఫలితంగా వచ్చిన విషయం తెలియక వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు.  గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది పనిచేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు జిల్లా పంచాయతీ అధికారి అధీనంలోనూ, వీఆర్వోలు, సర్వేయర్ లు జాయింట్ కలెక్టర్లు అధీనంలోనూ, ఆరోగ్యసహాయకులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధీనంలోనూ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ అధ్వర్యంలోనూ, గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోనూ, అగ్రికల్చర్ అసిస్టెంట్లు  అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోనూ, హార్టికల్చర్ అసిస్టెంట్లు జాయింట్ డైరెక్టర్  హార్టికల్చర్ ఆధ్వర్యంలోనూ, సెరీ కల్చర్ అసిస్టెంట్లు అసిస్టెండ్ డైరెక్టర్ సెరీకల్చర్ ఆధ్వర్యంలోనూ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎస్ఈ పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలోనూ పనిచేస్తారు. వీరందరికీ అంటే సచివాలయశాఖకు ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్ ను ప్రభుత్వం నియమించడంతో వారి ఆధ్వర్యంలోనే గ్రామ సచివాలయాల సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఉత్తర్వులైనా  ఆయా జిల్లా అధికారులు ఎంపీడీఓల ద్వారా సచివాలయాలకు పంపాల్సి వుంది. కానీ ఆ విధంగా అధికారులు సక్రమంగా పంపడం లేదు. ఏ విషయం తెలుసుకోవాలన్నా మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఇతర జిల్లా సచివాలయ సిబ్బంది సహకారంతోనూ, వారు నిర్వహించే టెలీగ్రామ్ గ్రూపుల ద్వారానూ తెలుసుకోవాల్సి వస్తుంది. కొన్ని పనులకు, అనుమతులకు  సచివాలయ ఉద్యోగులు తాము చేసుకునే ఏ దరఖాస్తైనా నేరుగా జిల్లా కార్యాలయాలకు స్వయంగా తీసుకెళ్లి ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని శాఖల  జిల్లా కార్యాలయాల సిబ్బంది సచివాలయ సిబ్బందిని దారుణంగా జిల్లా కార్యాలయాలకు పదే పదే తిప్పిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు నేరుగా మండల అధికారుల ద్వారా సచివాలయాకు చేరవేస్తే ఆవిధంగా ప్రోటోకాల్ ప్రకారం సచివాలయ సిబ్బంది పనిచేయడానికి ఆస్కారం వున్నా జిల్లా కలెక్టర్లు, సచివాలయ జాయింట్ కలెక్టర్లు ఎందుకనో ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో ఆ విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ మండల కార్యాలయాల్లోనే జిల్లా కార్యాలయాల నుంచి వచ్చే ప్రభుత్వ ఉత్తర్వులు నిలిచిపోతున్నాయి. అవి సచివాలయాలకు చేరకపోవడంతో ఇక్కడ పనిచేసే సిబ్బందిలో కాస్త గందగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఈఫైలింగ్ విధానం లేకపోవడం, జిల్లా శాఖల అధికారుల నుంచి ఎంపీడీఓలకు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ముఖ్యమైన ఉత్తర్వులు, జీఓ, నోటీసులు, సూచనలు వచ్చినపుడు జిల్లా కార్యాలయాల అధికారులు మండల కార్యాలయాలకు పంపకపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లోకి చేరిన సిబ్బందికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏవిధంగా ఏ జిల్లా అధికారిని ఏ ఉత్తర్వులతో సంప్రదించాలో తెలియడం లేదు. అలాగని ఎంపీడీఓ కార్యాలయాలను సంప్రదించినా అక్కడ కూడా సరైన సమాచారం, జీఓలు, లిఖిత పూర్వక ఆదేశాలు లేకపోవడంతో వారు కూడా సచివాలయ సిబ్బందికి వివరించడానికి వీలులేకుండా పోతుంది. ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన ఉత్తర్వులు ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకూ పూర్తిస్థాయిలో చేర్చగలిగితే గ్రామస్థాయిలో సిబ్బంది ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడంతోపాటు, సిబ్బంది చేయాల్సి, చేపట్టాల్సిన పనులు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సచివాలయ నూతన సిబ్బంది  ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ సమస్యలు, డిపార్టమెంటల్ పరీక్షలు, శాఖపరమైన సమస్యలు, సాధారణ సెలవులు, ప్రత్యేక సెలవులు, ప్రసూతి సెలవులు, లాస్ ఆఫ్ పే సెలవులు, బయో మెట్రిక్ సీఎఫ్ఎంఎస్ ఐటీ సమస్యలు,  వాటికి దరఖాస్తులు, తిరిగి విధుల్లో చేరిన తరువాత వచ్చే జీతభత్యాలు, ఇతర అంశాలకు మార్గం సుగమం అవుతుంది.  గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్లు, జిల్లాల్లో గ్రామ సచివాలయ శాఖ జాయింట్ కలెక్టర్లు ఈ విషయంలో పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాల్సి వుంది. లేదంటే ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సచివాలయ వ్యవస్థ సేవలు ప్రజలకు అందే పరిస్థితి లేదు. సిబ్బంది సమస్యలు పరిష్కారం అయ్యే మార్గం అసలే కనిపించడం లేదు..!

Tadepalle

2021-05-10 01:31:02

వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి..

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net)సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సచివాలయంలో వారం రోజుల్లో పది మంది ఉద్యోగులు మ్రుతిచెందితే వారి విధులను ఒక పూటకు తగ్గించిన ప్రభుత్వం రాష్ట్రంలో పదుల సంఖ్యలో జర్నలిస్టులు కరోనా వైరస్ తో మ్రుతిచెందినా జర్నలిస్టుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడం శోచనీయమన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ తక్షణమే హెల్త్ ఇన్స్యూరెన్స్ రెవిన్యువల్ చేయడంతోపాటు, అవి పనిచేయడానికి వీలుగా అక్రిడిటేషన్లు కూడా మంజూరు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల కాలపరిమితి ముగిసిపోయిందని, అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులతో డెస్క్ జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి రాష్ట్రంలో ఏం జరుగుతుందో సమాచారం మీడియా, ప్రసార మాద్యమాల ద్వారా అందిస్తున్నారని అన్నారు. అలాంటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కోవిడ్ వేక్సిన్ తొలి ప్రాతిపదికన వేయాలన్నారు. కరోనాతో మ్రుతిచెందిన జర్నలిస్టులకు  ప్రభుత్వం ప్రకటించిన మొత్తాన్ని తక్షణమే అందజేయాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టులు కూడా విధి నిర్వహణకు బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలన్నారు. నిత్యం శానిటైజర్లు వినియోగించాలన్నారు. మీ ఆధారపడి వెనుక కుటుంబాలున్నాయనే విషయాన్ని ప్రతీ జర్నలిస్టూ గుర్తించాలని సూచించారు.

Visakhapatnam

2021-05-09 11:12:36

Visakhapatnam

2021-05-09 05:32:27

Tadepalle

2021-05-09 05:31:34

సచివాలయాల్లోనూ ఆన్ లైన్ పేమెంట్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ పన్నులు చెల్లించేందుకు ఆన్ లైన్, యూపిఐ పేమెంట్లు విధానాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని యోచిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా పంచాయతీల్లో కొందరు కార్యదర్శిలు వసూలైన మొత్తాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, కొన్ని చోట్ల ఇదే విషయమై సస్పెండ్లు కావడం, బదిలీల సమయంలో రికార్డులు పూర్తిస్థాయిలో కొత్తగా వచ్చేవారికి అప్పగించకపోవడం వంటి కారణాలను పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. మూడు నెలల వ్యవస్ధిలో సుమారు పదిమందికి పైగా పంచాయతీ కార్యదర్శిలు అవినీతి వ్యవహారాల్లో స్పెండ్ అవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. చాలా చోట్ల ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులుగా ఉన్న చోట ఇప్పటికే అవినీతికి పాల్పడినందుకు సదరు మొత్తాలను వారే బాధ్యత వహించాలని నోటీసులు కూడా జారీచేశారు. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా కెఆర్ పురం ఎంపీడీఓకి సుమారు రూ.3లక్షల విషయంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా కరనో సమయంలో ప్రజలు ఏ పనులు కావాలన్నా, పన్నులు కట్టాలన్నా సచివాలయాలకు వస్తున్నారు. దీనితో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయాలను పరిశీలించిన ప్రభుత్వం పట్టణ పురపాలక శాఖలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్లలోనూ, విద్యుత్ శాఖ ఏపీఈపీడీసిఎల్ లోనూ అమలు చేసిన ఆన్ లైన్ బిల్  పేమెంట్లు, ఆన్ లైన్ టేక్స్ విధానాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోకూడా అమలు చేయడం ద్వారా సిబ్బందికి కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేకుండా కట్టిన మొత్తం నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరేలా యోచన చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని లావాదేవీలకు ఆన్ లైన్ పేమెంట్లకు అనుసంధానించడంతో, గ్రామ, వార్డు సచివాలయాల్లో పొందే సేవలకు కూడా ఆన్ లైన్ పేమెంట్ విధానం అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది ప్రభుత్వ ఆలోచన. ఈ మేరకు సచివాలయ వెబ్ సైట్, యూపీఐ ఐడిలకు సంబంధించి సాఫ్ట్ వేర్ రూపకల్పన జరుగుతున్నట్టుగా సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. నిజంగా యూపీఐ, ఆన్ లైన్ పేమెంట్ విధానం అందుబాటులోకి వస్తే చాలా మందికి ఇంటిపన్నులు, కుళాయి పన్నులు సచివాలయాలు, పంచాయతీల చుట్టూ తిరిగి కట్టే పనుండదు. అంతేకాకుండా ఈ సందర్భంతో కొందరు పంచాయతీ సిబ్బంది పాల్పడే చేతివాటాలకు కూడా అడ్డుకట్ట పడటానికి కూడా ఆస్కారం వుంటుంది. కరోనా నియంత్రణ చర్యల్లో కాస్త బిజీగా వున్న ప్రభుత్వం మరో మూడు నాలుగు నెలల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తుందని చెబుతున్నారు. అన్ని పనులూ ఆన్ లైన్ ద్వారా టెక్నాలజీతో జరిపించే ప్రభుత్వం గ్రామసచివాలయం విషయంలో అదే టెక్నాలజీని వినియోగించుకోనుంది..

Tadepalle

2021-05-09 02:11:09

Tadepalle

2021-05-08 13:57:49

Tadepalle

2021-05-08 12:42:57

Tadepalle

2021-05-08 11:52:22

2021-05-08 09:49:52

తాడేపల్లి

2021-05-08 07:43:02

Visakhapatnam

2021-05-08 07:16:26

అల్లూరి ఏదీ భరత భూమిలో నీకు స్థానం..

రవి అస్థమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడ గడలాడించన యోధుడు..విశాఖ మన్యంలో మహోదయాన్ని స్రుష్టించిన ధీరుడు.. విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు  భరతమాత దాస్యశ్రుంఖలాలను తెంచడానికి అతి పిన్న వయస్సులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణత్యాగం త్యాగం చేసిన మహానుభావుడు. ఆయన భరతజాతికోసం చేసిన ఉద్యమం ప్రపంచం మొత్తం నేటికీ గర్విస్తుంది. కానీ ఆ మహోన్న వ్యక్తి పుట్టిన దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నేటికీ పాలకులు ఆయనకు ఒక సముచిత స్థానాన్ని కల్పించలేదు. 07-05-1897 ఆయన ఈ పుణ్యభూమిపై తుది శ్వాస వదిలిన రోజు. నేటికి 97 సంవత్సరాలు పూర్తవుతుంది. స్వాతంత్ర్య భారత దేశంలో నేటికీ అల్లూరిని పూర్తిస్థాయిలో పట్టించుకున్న ప్రభుత్వాలు లేవంటే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదు..ప్రతీ భారతీయుడూ తలదించుకునే సందర్భం..సిగ్గు పడుతూనే ఆయన వీరోచిత పోరాటాన్ని మననం చేసుకుంటూ ఈ పధాలను వల్లెవేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాటానికి గుర్తుగా నేటికీ పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన పేరుతో కనీసం ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయలేదు. ఏ  రాజకీయపార్టీ అయినా తమ ఎన్నికల ప్రచారంలో అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామనే ప్రచారంతోనే గద్దెనెక్కుతున్నాయి ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెడుతున్నాయి. నేటికీ అల్లూరి సీతారామరాజు చరిత్రపైనా, బ్రిటీషు కాలం నాటి గెజిట్ల పైనా నేటికీ తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేయలేదంటే అల్లూరి సీతరామరాజుకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్థాయిలో గౌరవాన్ని, స్థానాన్ని ఇస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. రాజకీయనాయకులకు ఊరూరా విగ్రహాలు, పాదయాత్రలకు పైలాన్లు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకొని రాజకీయం చేసే రాజకీయపార్టీలు అల్లూరి సీతారామరాజు వర్ధంతి, జయంతిలను అధికారికంగా ఏర్పాటు చేసి(వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రం గత ఏడాది అధికారికంగా చేశారు) ఆయన చరిత్రను పాఠ్యాంశంగా అందించే యోచన చేయడం లేదు. బ్రిటీషు సేనలపై అల్లూరి చేసిన పోరాటం అత్యధికంగా విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట వేదికగానే సాగింది. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా, విశాఖ ఏజెన్సీలోని మన్య ప్రాంతంలోనూ సాగింది. కనీసం ఈ ప్రాంతాల్లోనైనా అల్లూరి విగ్రహాలను ఏర్పాటు చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏజెన్సీలక్ష్మీపురం గ్రామంలో మాత్రం అల్లూరి స్మారక మందిరాన్ని అభివ్రుద్ధి చేసి చేతులు దులుపుకున్నారు. అల్లూరి పుట్టిన ప్రదేశంలోగానీ, పోరాటం చేసిన ప్రాంతాల్లో గానీ ఆయన పేరుతో కనీసం గ్రంథాలయాలను సైతం ఏర్పాటు చేయలేకపోయింది. ప్రస్తుతం అధికారంలో వున్న వైఎస్సార్సీపీ సర్కారు కూడా అల్లూరిపేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి అపుడే రెండేళ్లుపూర్తవుతుంది. నేటికీ అతీ గతీ లేదు. అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలను ఎదిరించి సమాంతర వ్యవస్థను క్రిష్ణదేవిపేటలో రచ్చబండ పంచాయతీల పేరుతో ఏర్పాటు చేసి మన్యం పితూరి ఉద్యమం ద్వారా తెల్లవాడిపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆయన పోరాటానికి గుర్తుగా క్రిష్ణదేవిపేట ప్రాంతాన్ని లేదా..దీనికి అనుబంధంగా వున్న ప్రస్తుతం రెవిన్యూ డివిజన్ కేంద్రంగా వున్న నర్సీపట్నం ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లగా ఉన్న డిమాండ్ కి అతీగతీ లేదు. ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చి అందులో ఒక జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చెప్పినా అదీనేటికీ జరగలేదు. భారతీయుల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరునికి ఏ ప్రభుత్వమూ సముచిత స్థానం కల్పించలేదనే విషయం 97 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నా పాలకుల్లో మాత్రం చలనం రావడం లేదు..అల్లూరి మన్నించు..నీకోసం ఇన్నేళ్లైనా ఏమీ చేయని మమ్మల్ని క్షమించు..ఇంకా ఇంకా నీ పేరుతో రాజకీయ హామీలు ఇస్తూ అధికారం వెలగబెడుతున్న మా హామీలు నీ విషయంలో 100ఏళ్లైయినా పూర్తయ్యేటట్టు లేవు. అల్లూరి సీతారామరాజుకి సముచిత స్థానం దక్కేవరకూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారిక మొబైల్ న్యూస్ యాప్ తరపున పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటిస్తున్నాం..జై అల్లూరి జై జై అల్లూరి..జోహార్ అల్లూరి..!

క్రిష్ణదేవిపేట

2021-05-07 02:52:30