1 ENS Live Breaking News

Tadepalle

2021-05-14 08:57:14

2021-05-14 08:49:21

2021-05-14 07:06:21

Tadepalle

2021-05-14 06:06:10

Tadepalle

2021-05-14 04:05:56

Tadepalle

2021-05-14 04:03:15

టిఎన్ఆర్ కుటుంబాని అండగా ఐడ్రీమ్ మీడియా..

ఏదైనా మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టు మ్రుత్యువాత పడితే ఆరోజు సంతాపం తెలిపి, ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేసి  చేతులు దులుపుకోవాలని చూసే మీడియా సంస్థలున్న ఈరోజుల్లో.. ఐడ్రీమ్ మీడియా తమసంస్థ కోసం పనిచేసే వారి బాధ్యత అంతా మాదేనని నిరూపించింది.  నటుడు, ప్రముఖ యాంకర్‌,  టీఎన్‌ఆర్‌ని కరోనా కాటు వేస్తే..ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ సంస్థ చైర్మన్ చిన్నవాసుదేవ ముందుకి వచ్చారు. స్వయంగా ఆయన టిఎన్ఆర్ ఇంటికి వెళ్లి రూ.10లక్షలు ఆర్ధిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. అంతేకాకుండా వారి పిల్లల చదువు బాధ్యతను కూడా తమ సంస్థే భరిస్తుందని భరోసా ఇచ్చారు.  మీడియా సంస్థలో పనిచేసిన ఒక జర్నలిస్టు కోసం సదరు సంస్థ యజమాని నేరుగా వచ్చి కుటుంబం రోడ్డున పడకుండా చేసిన సహాయం నేడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఎన్నో మీడియా సంస్థల యాజమాన్యాలకు కనువిప్పుగా కూడా మారింది. చిన్నవాసుదేవ లాంటి చైర్మన్ లు ఉన్న మీడియా సంస్థలుంటే జర్నలిస్టులకు ఉద్యోగాలకు, జీవితాలకు భరోసా ఉంటుందనే భావన నేడు జర్నలిస్టుల్లో వ్యక్తమవుతుంది. 

Hyderabad

2021-05-13 13:26:45

తాడేపల్లి

2021-05-12 15:56:54

Tadepalle

2021-05-12 15:30:06

సచివాలయ ఉద్యోగులవి ప్రాణాలు కాదేమో..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని జీఓలు వర్తించడం లేదు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 8 గంటల నుంచి 11.30  మాత్రమే కార్యాలయ పనివేళలు కుదించి విధులు నిర్వహించాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.. తీరా దానిని గ్రామ, వార్డు సచివాలయాలకు మాత్రం అమలు చేయలేదు. సచివాలయ ఉద్యోగులవి ప్రాణాలు కావని ప్రభుత్వం భావించి తమలు అమలు చేయలేదని.. దీనితో ఎప్పటి మాదిరిగానే సచివాలయ ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ విధులు నిర్వహించాల్సి వస్తుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల గ్రామాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ కోవిడ్ వేక్సినేషన్ విధులు కూడా సచివాలయ సిబ్బందే చేపడుతున్నారు. అందులో గర్భిణీలు, బాలింతలు కూడా విధులు నిర్వహిస్తుండటం విశేషం. విజయనగరం లాంటి జిల్లాల్లో సచివాలయ సిబ్బందికి కూడా ఆ జిల్లా కలెక్టర్ డా.హరిజవర్ లాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేశారు తప్పా చాలా జిల్లాల్లో మాత్రం కలెక్టర్లు సచివాలయ సిబ్బందికి ఆ వెసులుబాటు అమలు చేయకపోవడం విశేషం. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ జిఓనైనా అమలు చేయడంలో విజయనగరం జిల్లా ఎప్పుడూ ముందే వుంటుందనే విషయం ఇపుడు అందరికీ తెలిసొచ్చింది. జిల్లా కలెక్టర్ల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ తాము ఎప్పటిమాదిరిగానే విధులు నిర్వహించాల్సిందేనని సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలు. పంచాయతీ కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగుల కంటే గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందికే కరోనా నుంచి ప్రమాదం అధికంగా వుంటుంది. ప్రతినిత్యం ఏదో పనిపై గ్రామస్తులు సచివాలయానికి వస్తూనే ఉంటారు. ఎవరి దగ్గర కరోనా వుందో తెలియని పరిస్థితుల్లో వీరంతా భయపడుతూ విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఇలాంటి భయకరమైన పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో 80శాతం సచివాలయాల్లో కనీసం శానిటైజర్లు ఏర్పాటు చేయలేదు...సిబ్బందే స్వయంగా ఎవరి శానిటైజర్ వారు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. మరో విచిత్రం ఏంటంటే సోడియం హైపోక్లోరైడ్ ద్వావణాన్ని కూడా స్పేయింట్ బాటిళ్లలో తెచ్చుకొని తాము కూర్చున్న సీటు చుట్టూ చల్లుకుంటున్నారు సచివాలయ సిబ్బంది. ఇక సోడియం హైపోక్లోరైడ్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసిందని సచివాలయ కార్యదర్శిలే చెబుతున్నారు.. అది లేకపోవడం వలనే బ్లీచింగ్ ఫౌడర్ చల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. కాకపోతే ఈ సమయంలో ప్రభుత్వం కల్పించి వెసులుబాటు ఒక్కటే సచివాలయాల్లో కరోనా తగ్గేంత వరకూ బయో మెట్రిక్ నిలుపుదల చేయడం.. అది తప్పా మరే ఇతర సదుపాయాలు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం కల్పించడలేదు..   ఇటీవలే కొన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది కరోనాతో మ్రుత్యువాత పడినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. పంచాయతీల్లో వుండే శానిటేషన్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు గ్రామాల్లో పారిశుధ్య, అత్యవసర క్లోరినేషన్ పనులు నిర్వహించాల్సి వుంది. కానీ అన్ని సచివాలయాల్లోని అన్ని శాఖల సిబ్బంది ప్రస్తుతం కరోనా సమయంలోనూ విధులు నిర్వహిస్తున్నారు. అన్నిప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం కరోనా సమయంలో ప్రభుత్వం కల్పించిన వెసులు బాటు సచివాలయ సిబ్బందికి అమలు చేయకపోవడం వలన సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులవే తప్పా..మావి ప్రాణాలు కావా అని ప్రశ్నిస్తున్నారు. బహుసా ప్రొభిషన్ లో వున్న తమని ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం వలనే, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కరోనా సమయంలో కార్యాలయ పనిసమయాల్లో మినహాయింపు ఇచ్చి తమను పక్కన పెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, ఈ శాఖ కమిషనర్ గిరిజాశంఖర్ లు ఏ విధమైన చర్యలు తీసుకుంటో వేచిచూడాలి..!

Tadepalle

2021-05-12 03:39:22

తాడేపల్లి

2021-05-11 15:08:12

ఈఎన్ఎస్ ఎఫెక్ట్.. గ్రామ, వార్డు సచివాలయాల్లో బయో మెట్రిక్ నిలుపుదల..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో బయో మెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది.. కరోనా సమయంలో సచివాలయాల్లో బయో మెట్రిక్ విధానం అమలు చేయడం వలన సిబ్బంది కూడా కరోనా వైరస్ భారిన పడుతున్నారనే విషయాన్ని.. ‘కరోనాలోనూ సచివాలయాల్లో బయోట్రిక్’ శీర్షికన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ లో న్యూస్ కార్డ్ పబ్లిష్ చేసింది. దీనితో స్పందించిన ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది, వాలంటీర్ల బయో మెట్రిక్ విధానాన్ని నిలుపుదల చేసింది. ప్రభుత్వం మళ్లీ ప్రకటించే వరకూ బయో మెట్రిక్ అమలు చేయకూడదనే విషయాన్ని సచివాలయాలకు వర్తమానం పంపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో భయం భయంగా బయోమెట్రిక్ అటెండెన్సు వేసేవారమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ భయం తగ్గిందని ఆనందం వ్యక్తం చేశారు. నిత్యం గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి అన్ని రకాల తాజా సమాచారం అందించే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ కార్యాలయానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఫోన్లు చేసి తమ సమస్య ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడం వలన కరోనా వైరస్ భయాన్ని తొలగించారని తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

Tadepalle

2021-05-11 14:35:31

Tadepalle

2021-05-11 14:04:33

ఏపీ సమాచార శాఖలో భారీగా సిబ్బంది కొరత..

ఆంధ్రప్రదేశ్ లో సమాచార శాఖ సిబ్బంది లేమితో కొట్టిమిట్టాడుతోంది..ఏపీఆర్వోలు, డిపీఆర్వోలు,డిప్యూటీ డైరెక్టర్లు, ఏడీస్థాయి అధికారుల ఖాళీలు భారీగా ఏర్పడటంతో ప్రభుత్వ కార్యక్రమాలు, కరోనా సమయం అత్యవసర సమాచారం మీడియాకి ప్రెస్ నోట్లు ద్వారా ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో సమాచారశాఖలో సినిమా ఆపరేటర్లను ఫోటో గ్రాఫర్లుగానూ, ఏపీఆర్వోలగాను వినియోగిస్తుండగా, మరికొన్ని చోట్ల ఏపీఆర్వో చేసే ఉద్యోగాన్ని ఏడీలు, డిడిలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఏపీఆర్వోలను ప్రభుత్వం నియమించినా వారికి ప్రెస్ నోట్లు రాయడం రాకపోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. దీనితో  సిబ్బంది కొరత ఉన్న విభాగాల్లో వారిని వినియోగించుకుంటున్నారు సమాచారశాఖ అధికారులు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు మంత్రులు ఉండటంతో వారి ప్రెస్ కవరేజీ సమాచారశాఖకు తలనొప్పిగా తయారైంది. కొన్ని జిల్లాల్లో కార్యక్రమం జరిగిన వెంటనే వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారాన్నిపంపుతున్నా...మరికొన్ని జిల్లాల్లో సమాచారశాఖ కనీసం ప్రెస్ కోసం వాట్సప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయలేదు. కాదు కాదు చేస్తే మరింత ఒత్తిడి పెరుతుందని మానేశారు. ఇంకా పాత జీమెయిల్ విధానంలోనే ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు అరకొరగా పంపుతున్నారు. మంత్రులు వద్ద పీఆర్వోలు ఉన్నప్పటికీ వారు ఆయా జిల్లాలకే కొద్దిమంది మీడియాకే పరిమితం అవుతున్నారు. మంత్రుల కార్యక్రమాలు నేరుగారు సమాచారశాఖ కు కాకుండా వారే మీడియాలకు పంపుతున్నారు. దీనితో మంత్రుల కార్యక్రమాలకు సమాచారశాఖ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లే సమయంలో మిగిలిన ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. కార్యాలయాల్లోని టైపిస్తులు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫోటో గ్రాఫర్లు ఇలా చాలా పోస్టులే సమాచారశాఖలో ఖాళీగా ఉండిపోయాయి. రాష్ట్ర రాజధాని రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్న తరుణంలో ముఖ్యమైన మూడు జిల్లాల్లోని సమాచారశాఖ శాఖలో ఏపీఆర్వోలు, కార్యాలయ సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుందని అంతా భావించినా సిబ్బంది నియామకంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా చాలా చోట్ల ప్రభుత్వ పథకాల సమాచారం కూడా పత్రికలు, ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలకు రాకుండా పోతుంది. ప్రతీ జిల్లా నుంచి అరకొరగానే ప్రెస్ నోట్లు వస్తున్నాయి. మంత్రులు కార్యక్రమాలు తప్పా సమాచారశాఖకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కార్యక్రమాలు కవర్ చేసే అవకాశం లేకుండా పోతుంది. డిడి, ఏడీ, డిపీఆర్వో, డివిజనల్ పీఆర్వోల మీద భారం మొత్తం పడిపోతుంది. దానికితోడు రాష్ట్రవ్యాప్తంగా సమాచారశాఖలోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పాతబడినవి కావడం కూడా వేగంగా మీడియాకి సమాచారం అందించే విషయంలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం ఒక్కో జిల్లాకి ముగ్గురు ఏపీఆర్వోలను నియమిస్తే తప్పా ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి కష్టంగా మరుతోంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే సమాచారశాఖలో ఖాళీలను భర్తీ చేస్తే పరిస్థితి కొలిక్కి వచ్చేటట్టు కనిపించడంలేదు..ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి..

Tadepalle

2021-05-11 03:59:28

Tadepalle

2021-05-10 15:27:36