1 ENS Live Breaking News

వైఎస్సార్సీపీ లో రెబల్ రాజకీయాలు తొక్కిపడేస్తారా..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా  11 కార్పొరేషన్లలో (621 వార్డులు), 75 మున్సిపాలిటీల్లో భారీ విజయం సాధించిన  అధికార పార్టీ వైఎస్సార్సీపీ సొంతింటిలోనే రెబల్ బెడద వెంటాడుతోంది.. ఆవిషయం నగిరి ఎమ్మెల్యే ఆర్కెరోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా వున్న వైఎస్సార్సీపీ రెబల్ కేడర్ లో భారీ చర్చకు దారితీసింది. పార్టీని ఓడించడానికి సొంతగూటికి చెందిన  రెబల్స్ తెరవెనుక రాజకీయాలు చేయడం  సరైన పద్దతి కాదని, అలాంటి వారిని తొక్కిపడేస్తామని మీడియా ముఖంగా బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన రోజా వ్యాఖ్యలు ఇపుడు పార్టీలోనూ, వ్యతిరేక వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే రెబల్ అభ్యర్ధుల గొడవ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కనిపించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీ పేరుతో బరిలోకి దింపిన అభ్యర్ధులు కాకాకుండా రెబల్ అభ్యర్ధులు కాస్త అధికంగా నెగ్గి ఆపై పార్టీ కండువాలు కప్పుకున్నారు. దీనితో పార్టీ పేరుతో బరిలోకి దిగి ఓడిపోయిన అభ్యర్ధులంతా ఇపుడు పీకల దాకా బాధను మింగుతూనే, బయటకు మాత్రం మామూలుగా కొనసాగుతూనే తెర వెనుక రాజకీయం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకూ ఏ ఎమ్మెల్యే కూడా బహిరంగంగా రెబల్ కేండిడేట్ లపై వార్నింగ్ లు ఇవ్వలేదు. కానీ ఫైర్ బ్రాండ్ రోజా నేరుగా వార్నింగ్ ఇవ్వడంతో మిగిలిన నేతలు, సమన్వయ కర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. రెబల్ అభ్యర్ధులను ప్రోత్సహించకుండా పార్టీలో ఉన్న పలుకుబడి మొత్తం గాలి తీసేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతుంది. పార్టీ కోసం నిశ్వార్ధంగా పనిచేసిన వారికే పట్టం కట్టాలని కూడా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఆయా జిల్లాల మంత్రులు, ఇన్చార్జి మంత్రులకు సూచించారనే విషయం రోజా వార్నింగ్ తరువాత బట్టబయలు అయ్యింది. అయితే పార్టీ గెలుపొందిన సీట్ల సంఖ్యను భారీగా చూపాలనే ఒకే ఒక్క సాంకేతిక కారణంతో ఇప్పటి వరకూ ఎవరూ రెబల్ కేండిడేట్ లకోసం మాట్లాడలేదు..వార్నింగులు కూడా ఇవ్వలేదు.. కానీ రోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రతీ ఒక్కరినీ ఆలోచింప జేస్తున్నాయి. మరోవైపు పార్టీ అధిష్టానమే రెబల్ కేండిడేట్ ల గాలి పక్కన పెట్టడానికి ఈ విధమైన వార్నింగ్ ను ఫైర్ బ్రాండ్ రోజాతో ఇప్పించి తద్వారా రెబల్ రాజకీయాలకు తెరదించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే ఇప్పటి వరకూ రెబల్ రాజకీయాలు చేసి, పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపునకు అడ్డు పడిన వారిని దూరం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికితోడు...నిన్నటి మున్సిపల్ ఫలితాలు రోజునే నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన తొక్కిపడేస్తాం అనే డైలాగ్ ఇపుడు రాష్ట్రంలోని రెబల్ కేండిడేట్స్ లో భయం గంట మోగిస్తుంది. తమకు ఏ స్థాయిలో అన్యాయం జరిగిందో బయటకు చెప్పుకోలేక మదన పడుతూ ఇప్పటివరకూ ఎన్నికల బరిలో ఓడిపోయి ఉన్నవారికి ఆర్కేరోజా వ్యాఖ్యలు కాస్త ఊరట నిచ్చాయి. చాలా మంది ఈ వార్నింగ్ ను లైట్ తీసుకున్నా.. ఈ వార్నింగ్ వెనుక పార్టీలో చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ వార్నింగ్ ఫలితాలు, రెబల్ కేండిడేట్ లను, నాయకులను అధికారపార్టీ  ప్రభుత్వం వైఎస్సార్సీపీ ముఖ్యనాయకులు ఏవిధంగా పరిగణిగనిస్తారో వేచి చూడాలి. అదే సమయంలో ఎంతో ఖర్చుపెట్టి ఎన్నికల్లో ఓడిపోయిన నిజమైన పార్టీ అభ్యర్ధులను ఏరకంగా ఆదుకుంటుందో కూడా వేచి చూడాలి..!

Tadepalle

2021-03-15 09:11:55

కర్పోరేషన్లలో 3 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం..

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వేగంతో అపుడే రాష్ట్రంలో మూడు మున్సిపల్ కార్పోరేషన్ల(కడప, చిత్తూరు) ను వైఎస్సార్సీపీ  సొంతం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా తన స్పష్టమైన ఆధిక్యతను కొనసాగిస్తూ వస్తుంది. ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధి పార్టీలు తమ స్థాలనా పరిస్థితి ఏంటనే విషయంపైనే లెక్కలు వేసుకుంటున్నారు.  వైఎస్సార్సీపీ లో తొలిగా కనిగిరి మున్సిపాలిటీతో క్లీన్ స్వీప్ తో బోణి కొట్టి తన వైఎస్సార్సీపీ మొత్తంగా ఇప్పటి వరకూ 75 మున్సిపాలిటీల్లో 37 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ తన మెజార్టీని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ మున్సిపాలిటీల్లో టిడిపి ఒవార్డు, జనసేన  5 వార్డులు తన ఖాతాలో వేసుకోగా, బీజేపీ ఒక్క దగ్గర కూడా తన బోణి కొట్టలేదు. ప్రస్తుత మున్సిపల్ ఫలితాలన్నీ వైఎస్సార్సీపీ పరిపాలనకు రిఫరెండంగానే వస్తున్నాయనే విషయాన్ని విశ్లేషకులు సైతం ప్రకటిస్తున్నారు.  విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం ఓట్ల తోపాటు  సేవ్ స్టీల్ ప్లాంట్,  అనే పత్రాలు కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకిత్తిస్తుంది. దేశంలోనే ఈ అంశం ఇపుడు చర్చనీయాంశమైంది. ఈ ఎన్సికల్లో బీజేపీ పార్టీకి ప్రజలు చాలా స్పష్టంగా తమ ఆలోచన ఎలా వుందో తెలియజేశారు. ప్రస్తుతం ఇదే విషయం అన్ని మీడియా సంస్థల్లోనూ డిబేట్లలో కొనసాగుతుండటం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది..

Tadepalle

2021-03-14 10:57:24

ఏపీలో వైఎస్సార్సీపీ ఫ్యాన్ గాలి జోరు..

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుపెంచింది. ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధి పార్టీలు ఎగిరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్సార్సీపీ లో తొలిగా కనిగిరి మున్సిపాలిటీతో క్లీన్ స్వీప్ తో బోణి కొట్టి తన వైఎస్సార్సీపీ మొత్తంగా ఇప్పటి వరకూ 75 మున్సిపాలిటీల్లో 30 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ తన మెజార్టీని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ టిడిపి ఒ వార్డు, జనసేన కూడా తన స్థానాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంది ఇప్పటి వరకూ 4 స్థానాలను జనసేన తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఎక్కడా ఇప్పటి వరకూ బోణీ కొట్టలేదు.  విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం సేవ్ స్టీల్ ప్లాంట్,  అనే పత్రాలు కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకిత్తిస్తుంది. దేశంలోనే ఈ అంశం ఇపుడు చర్చనీయాంశమైంది.

Tadepalle

2021-03-14 10:44:32

మున్సిపోల్స్ లో వైఎస్సార్సీపీ ఫ్యాన్ హవా..

ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధి పార్టీలు ఎగిరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్సార్సీపీ లో తొలిగా కనిగిరి మున్సిపాలిటీతో క్లీన్ స్వీప్ తో బోణి కొట్టి తన వైఎస్సార్సీపీ మొత్తంగా ఇప్పటి వరకూ 75 మున్సిపాలిటీల్లో 22 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ తన మెజార్టీని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ టిడిపి ఒ వార్డు, జనసేన కూడా తమ ఖాతాలు తెరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో మాత్రం సేవ్ స్టీల్ ప్లాంట్ అనే పత్రాలు కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకిత్తిస్తుంది. దేశంలోనే ఈ అంశం ఇపుడు చర్చనీయాంశమైంది.

Tadepalle

2021-03-14 10:20:21

ఏపీలో మొదలైన మున్సిపల్ కౌంటింగ్..

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నకల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. కాగా 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల క్రమంలోనే పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం  కౌంటింగ్‌ చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. ఈ క్రమంలోనే తొలి ఫలితాల సంఖ్య ఉదయం పదిగంటలకు వచ్చే అవకాశం వుంది.

Tadepalle

2021-03-14 09:36:25

Tadepalle

2021-03-13 21:59:45

Tadepalle

2021-03-13 21:58:10

Tirupati

2021-03-13 13:37:52

యాదాద్రికి పూర్వ వైభవం..

యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.  ప్రగతిభవన్ లో శుక్రవారం సిఎం సమీక్షించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది రూపుదాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం ( ఆర్నమెంటల్ లుక్ ) కోసం కార్యాచరణ గురించి సిఎం ఆలయ అధికారులతో చర్చించారు. ఇటీవల యాదాద్రిలో పర్యటించి  క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని పరిసర ప్రాంతాలను కలియదిరిగి పలు సూచనలు  చేసిన నేపథ్యంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందనే విషయాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం  నిర్మిస్తున్న క్యూలైన్  నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సిఎం ముందుంచారు. వీటిని పరిశీలించిన మీదట నాలుగింటిలో ఒకదాన్ని సిఎం ఖారరు చేశారు. ఉత్తర దిక్కున వున్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15 కల్లా క్యూలైను నిర్మాణం పూర్తికావాలని సిఎం గడువు విధించారు. దీప స్థంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడస్టల్ కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని అన్నారు. శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్న సిఎం, ఆలయ ప్రహరి గోడలకు ఇత్తడితో  తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలన్నారు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా (ఐకానిక్ ఎలిమెంట్ లాగా) కనిపించే విధంగా తుదిమెరుగులు దిద్దాలని సిఎం అన్నారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శనం చక్రం ఏర్పాటు చేసినట్టు గానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమీయాలని అన్నారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్ తో తీర్చిదిద్దాలన్నారు. విష్ణు పుష్కరిణీ కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడలమీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలన్నారు. 80 ఫీట్ల పొడవు వున్న దీప స్థంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలన్నారు.అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమౌతున్నదని సిఎం కితాబిచ్చారు. చివరి అంకం చేరుకున్న ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాలను చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన  లైటింగ్ డెమో వీడియోను సిఎం తిలకించారు.  ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్,  సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటిడిఏ ప్రత్యేకాధికారి కిషన్ రావు, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఆర్కిటెక్ట్ మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.

Pragathi Bhavan

2021-03-12 18:35:34

డా.వైఎస్సార్ ఆశయాల ప్రతిబింబమే ఈ వైఎస్సార్సీపీ..

ఒక మహోన్న వ్యక్తి ఆశయం..ఒక మహానువుడి ముందు చూపు..ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత స్థానం..అశేష జనవాహిని విశేషంగా గుర్తుపెట్టుకున్న వ్యక్తి..ఆయనే దివంగత ప్రియతమనేత డా.వైఎస్.రాజశేఖరరెడ్డి. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు అతీతంగా డాక్టర్ వైఎస్సార్ ఆలోచనలు ప్రజలకు చేరువ కావాలని నాడు యువనేత సంకల్పించింది ప్రాణం పోసిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ) ఆ పార్టీ ఆవిర్భవా(12 మార్చి 2011 నికి నేటితో పది వసంతాలు(12 మార్చి 2021) నిండాయి. పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ప్రజల కోసమే కష్టపడిన పార్టీగా, అత్యతం ప్రాధాన్య కలిగిన పార్టీగా, ఒక వ్యక్తికోసం ప్రజల నాడితెలుసుకున్న పార్టీగా ఆవిర్భవించడం ఒక చారిత్రక ఘట్టం. నాడు డావెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన గుర్తుగా కాంగ్రెస్ అనే పేరు కలిపినా వాస్తవానికి కాంగ్రెస్ అంటే ఒక సమావేశం అని అర్ధం. అందరికోసం సమావేశమై ఏర్పాటైన పార్టీగా వైఎస్సార్సీపీ ఆవిర్భవించి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ ఆశీస్సులు, యువ నేత క్రుషి కష్టంతో నేడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతుంది. అంతేకాదు పార్టీ ఏ ప్రాధమిక సూత్రాలతో అయితే ఏర్పాటైందో వాటినే సంక్షేమ పథకాలుగా అమలు చేసి నవరత్నాలుగా ప్రజలకు అందజేసిన యువ ముఖ్యమంత్రిగా కూడా వైఎస్.జగన్మోహనరెడ్డి చరిత్ర కెక్కారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసేలా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి గ్రామసచివాలయమనే వ్యవస్థతో బాటలు వేశారు. దానికోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు ఒక లక్షా 26 వేలు. ప్రభుత్వ పథకాల అమలు కోసం అక్షరాల 4లక్షల మంది గ్రామవాలంటీర్లను నియమించి గ్రామంలోనే ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తూ వస్తుంది. ఇదొక్కటే కాదు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా అంటే పార్టీ పేరులో వున్న రైతులకు అగ్ర తాంబూలం ఇస్తూ గ్రామాల్లోనే రైతులకు విశేషంగా సేవలు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వతహాగా దివంగత నేత వైఎస్సార్ ఒక వైద్యుడు. ఏ రోజైతే గ్రామాల్లో ప్రాధమిక వైద్యం ప్రజలకు అందుతుందో ఆరోజే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నేటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  గ్రామాల్లో ప్రాధమిక వైద్యం అందించి సుమారు 90 రకాల మందులను అందుబాటులోకి తీసుకు రావడం కోసం ఏర్పాటు చేసే మరొక వ్యవస్థ డా.వైఎస్సార్ విలేజి క్లినిక్ లు.  వీటి ద్వారా ప్రజలకు వైద్య సేవలతోపాటు, బాలింతలకు చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు, ప్రాధమిక రక్త పరీక్షలు కూడా ఇక్కడే చేయనున్నారు. రైతుల పాల, పాడి వ్యవస్తను అభివ్రుద్ధి చేయడానికి డైరీలను పెంచడానికి అమూల్ సంస్థంతో ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేసుకొని గ్రామాల్లోనే పాలను సేకరించి రైతులను ఆర్ధికంగా అభివ్రుద్ధి చేస్తున్నారు. గ్రామాల్లోనే రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇలా అన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతులకు అందనున్నాయి. అదేవిధంగా యువతను అన్ని రంగాల్లో ముందుకి తీసుకెళ్లడం కోసం వైఎస్సార్ నాలడ్జ్ సెంటర్లు, స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేపడుతున్నారు. శ్రామికులను గుర్తించడానికి, ప్రత్యేక సెజ్ లలో ప్రైవేటు కంపెనీల ఏర్పాటు తద్వారా శ్రామికులందరికీ ఉపాది, ఉద్యోగ అవకాశాల కల్పన కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అంటే ఒక పార్టీ ఆవిర్భావం ప్రజల మనసులో గూడు కట్టుకున్న మహోన్నత వ్యక్తికోసం అయినా..ఆయన ఆలోచనకు అనుగుణంగా ఏర్పాటు కావడంతోపాటు ఆయన ఆశయాలను అన్నీ అమలు చేసే పార్టీగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చేపట్టే ప్రతీ కార్యక్రమం నేడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుని చేరువ అయ్యింది. పదేళ్లపాటు ప్రజలకోసమే పనిచేసి, నేడు ప్రజలను పాలిస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ, ప్రభుత్వం రానున్న రోజుల్లో దివంగత మహానేత డా.వైఎస్సార్ ఆశయాలు, ఆలోచనలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనమూ కోరుకుందాం.!

Tadepalle

2021-03-12 08:28:11

ఘనంగా అజాది కా అమృత్ మహోత్సవ్..

భారదేశానికి  స్వాతంత్య్రం వచ్చి 2022 స్వాత్రంత్య్ర దినోత్సవం నాటికి  75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా " అజాది కా అమృత్ మహోత్సవ్ " వేడుకల్ని ఘనంగా  నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  దేశంలో  ఎంపిక చేసిన 75 ప్రముఖ నగరాలు, ప్రదేశాల్లో చరిత్రాత్మక నగరంగా  విజయవాడ ను ఎంపిక చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.  రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు.   స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా 75 వారాలుపాటు " అజాది కా అమృత్ మహోత్సవ్ " పేరిట ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  " అజాది కా అమృత్ మహోత్సవ్ " వేడుకల్ని విజయవాడ వేదికగా ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తి ని నింపేలా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు. మార్చి 12 శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకు  పిడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి  బాపూ మ్యూజియం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.   సాయంత్రం 5 గంటల నుంచి ప్రభుత్వ ఘంటశాల సంగీత కళాశాల ప్రాంగణంలో  ఫోటో ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు , స్వాతంత్ర్య సమరయోధులు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర యువజన వ్యవహారాల విభాగం , ఎన్ ఎస్ ఎస్, ఎన్ ఎస్ ఓ, ఎన్ సి సి వాలంటీర్స్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.   దేశంలోని చారితాత్మక, ప్రాముఖ్యత గల నగరాల్లో, పట్టణాల్లో,  ప్రాంతాల్లో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూన్నారు.   మార్చి 12 నుంచి ఏప్రిల్ 5 వరకు 25 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దండి సత్యాగ్రహం   మార్చి 12 ప్రారంభం అయి  ఏప్రిల్ 5  న ముగిసింది. వాటిని గుర్తు చేసునేలా ర్యాలీలు, సైకిల్ ర్యాలీ లు, వివిధ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు భారత దేశ స్వాతంత్ర్య కోసం స్వాతంత్ర్య సమరయోధులు పడిన ఇబ్బందులు   పై సమావేశాలు, చర్చలు,  సెమినార్ లు నిర్వహించడం జరుగుతుందని ఇంతియాజ్ తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీలను పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అదేవిధంగా కళాశాల, యూనివర్సిటీ ల స్థాయి లో కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల , జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ , నేతాజీ, తదితరులకు సంబంధించిన ఫోటో ప్రదర్శనలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.

Vijayawada

2021-03-11 19:31:06

Tadepalle

2021-03-11 19:08:14

Hyderabad

2021-03-11 18:23:08

మహిళా ఉద్యోగుల ప్రసూతి వేదన..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులు కంటతడి పెడుతూ ప్రసూతి వేదన అనుభవిస్తున్నారు..ఇదేదో కాన్పు సమయంలో, బిడ్డను కనడానికి పడే వేదన కాదు..ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో ఇచ్చే సెలవులను తిరిగి జీతంగా తెచ్చుకోవడానికి పడే ఇబ్బంది వేదన, నరకం ఇలా బాధ పెట్టడానికి ఎన్ని పదాలుంటే అన్నింటికీ ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు గుర్తు చేసుకోవచ్చు.. మొన్నటి వరకూ ఆ ఇబ్బంది రెగ్యులర్ ఉద్యోగులకే అనుకుంటే కేవలం 15వేల రూపాయల జీతంతో పనిచేసే నేటి గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులు కూడా ఇదే ఇబ్బందులను ఎదుక్కోవాల్సి వస్తుంది. అవును మీరు చదవుతున్నది అక్షర సత్యం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం చేసే ఆడపడుచు ఆవేదన. ఆరునెలల ప్రసూతి సెలవులు ప్రభుత్వం ఇచ్చినా, ఆపై ప్రసూతి రికార్డులు ప్రభుత్వానికి సంబంధిత శాఖ ద్వారా సమర్పిస్తే జీతం రావాలి. అలా ప్రభుత్వ శాఖల ద్వారా వస్తుంది కూడా. కానీ ఇక్కడే అసలైన చిక్కంతా మహిళా ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆరునెలల జీతం బిల్లుగా మార్చాలంటే సంబంధిత శాఖలో పదిశాతం జీతం మామూలుగా సమర్పించాల్సి వస్తుంది. అలా సమర్పించిన వారికి మాత్రమే బిల్లులు క్షణాల్లో మంజూరవుతున్నాయి. లేదంటే వారు నెలల తరబడి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే జీతానికి వీరికెందుకు మామూళ్లు ఇవ్వాలంటే అది అనాదిగా వస్తున్న ఆచారమని చాలా ఠీవీగా చెబుతున్నారు ఆయా శాఖల్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు ఇతర అధికారులు. మాకు కూడా శాఖ పరమైన ఖర్చులుంటాయని కూడా శెలవిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడే మహిళా ఉద్యోగులు ప్రభుత్వం ద్రుష్టికి ఈ సమస్యను తీసుకెళితే ఎవరైతే మహిళా ఉద్యోగులు ఆరు నెలలు ప్రసూతి సెలవులు పెట్టుకుంటారో అపుడే సంబంధిత జిల్లా శాఖల అధికారులు గానీ, లేదంటే సదరు జిల్లా కలెక్టర్ గానీ సెలవుతో కూడిన జీతం మంజూరు చేస్తున్నారు. ఆ విధంగా లేఖలు ఇస్తున్నారు. అలాంటి వారికి బాగానే ఉన్నా, ఆవిషయం తెలియని వారు మాత్రం ఆరు నెలల తరువాత సాలరీ బిల్లులతోపాటు, ఈ ఆరు నెలల ప్రసూతి సెలవులు బిల్లు పెట్టే సమయంలో సంబంధిత మండలశాఖ కార్యాలయంలో ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆ బిల్లులు మాత్రం పాస్ కావడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు..కేవలం రూ.15వేలతోనే ఉద్యోగం చేసుకునే గ్రామసచివాలయ  మహిళా ఉద్యోగుల నుంచి కూడా సంబంధిత శాఖ సిబ్బంది మామూళ్లకు పాల్పపడటం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. అందులోనూ అత్యధిక సిబ్బంది ఉన్న ఈ శాఖలో మహిళా ఉద్యోగిణిలు కూడా అధికంగా వుండటం చాలా మందికి అధికారులకు, సిబ్బందికి బాగా కలిసి వస్తుంది. ఈ విషయం జిల్లా కలెక్టర్ల వరకూ వెళ్లడంతో వారికి సెలవుతోపాటు, ప్రత్యేక లేఖ ద్వారా మానవతా ద్రుక్పదంతో జీతం కూడా వచ్చే ఏర్పాటు చేస్తున్నారు కొన్ని జిల్లాల కలెక్టర్లు. కాకపోతే ప్రభుత్వమే అధికారికంగా ఈ సర్ధుబాటు చేస్తే మధ్యలో ఈ దలారీ ప్రభుత్వశాఖల సీనియర్ అసిస్టెంట్లకు, ఇతర అధికారులకు మామూళ్లు ఇచ్చే బాధలు తప్పుతాయని ఆవేదన చెందుతున్నారు మహిళా ఉద్యోగులు.  ప్రభుత్వం ఈ విషయంలో మహిళా ఉద్యోగులందరికీ ప్రసూతి సెలవులు ఇచ్చే సమయం నుంచే జీతం ఇవ్వడంతోపాటు, సంబందిత ప్రసూతి పత్రాలు కూడా తిరిగి విధుల్లోకి చేరే సమయంలో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం తల్లీబిడ్డకోసం ప్రసూతి సెలవులు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నా.. అయితే మాకేంటి అన్నట్టుగా పలుశాఖల అధికారులు, సీనియర్ అసిస్టెంట్లు పాల్పడే మామూళ్లకు కళ్లెం పడదని... మహిళా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.  అదే సమయంలో ప్రభుత్వం ప్రసూతి సెలవులు ఇచ్చిన సమయంలో తిరిగి ఆ సెలవులకు సంబంధించిన లీవ్ జీతంగా మారడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనితో మహిళా ఉద్యోగులు ప్రభుత్వం ద్రుష్టికీ ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. ఆ విషయంపై సాంకేతిక సమస్యలపై రాష్ట్రప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయంతీసుకుంటే ప్రసూతి సెలవులపైనా మామూళ్లు వెతుక్కునే సిబ్బంది లంచావతారాలకు ముకుతాడు పడే అవకాశం కలుగుతుంది. ఈ విషయం తెలియజేసిన తరువాత ప్రభుత్వం ఇది తప్పుడు వార్త అనుకోవడానికి లేదు.. అలా లంచాలు తీసుకునే వారిపై ద్రుష్టిసారిస్తే గ్రామసచివాలయ శాఖ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రసూతి సెలవులపై కమిషన్లు మేసే లంచావతారులను పట్టుకోవచ్చు..ఈ సమాచారం కూడా ప్రభుత్వ మహిళా ఉద్యోగిణిలు కంట తడి పెట్టుకుంటూ చెప్పిన వివరాలు ఆధారంగానే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ప్రత్యేక కధనాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువస్తున్నామని కూడా ప్రభుత్వానికి, పలుశాఖల అధికారులకు తెలియజేస్తున్నాం. ఇంత సమాచారం ఇచ్చిన తరువాత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి..!

Tadepalle

2021-03-11 11:46:06