ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు అంతరాయం లేని స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని వైఎస్ జగన్ సర్కారు భావిస్తుంది. మైదాన, పట్టన ప్రాంతాల్లో సచివాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా ఏజెన్సీ గ్రామాల్లోని సచివాలయాలకు ఆ ఇబ్బందులు చాలా అధికంగా వున్నాయి. చాలా గ్రామ సచివాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వలన గిరిజన ప్రాంతాల్లో చాలా ఆన్ లైన్ పనులకు అంతరాయం ఏర్పడుతుంది. అదే సమయంలో ప్రతీగ్రామానికి ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ నెట్ సౌకర్యం కల్పించాలనే భావనతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలోని ఒక ఇంటర్నెట్ స్టేషన్ ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందించాలని చూస్తుంది. గతంలోనే ఈ ప్రాజెక్టు కోసం అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకల కారణంగా వాటి సేవలు ప్రజలకు పెద్దగా అందలేదు. ప్రస్తుతం అన్ని సచివాలయ పనులకు, సంక్షేమ పథకాల నమోదుకు ఇంటర్నెట్ అత్యవసరం కావడంతో ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని చూస్తుంది. ఇప్పటికే ఆఫ్ లైన్ లోవున్న కేబుల్ వ్యవస్థను అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థల్లోకి మార్పులు చేస్తూ వస్తుంది. ఇకపై గ్రామాల్లో ఎవరికి ఇంటర్నెట్ కావాలన్నా గ్రామసచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే..దాని నుంచి ఆ గ్రామంలో వున్న కేబుల్ ఆపరేటర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులోనూ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా టెలీఫోన్, ఇంటర్నెట్, కేబుల్ టివి, వైఫై అన్ని వస్తుండటంతో వాటినే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు వర్తింపచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 5400 గ్రామాల్లో ఈ ఏపీ ఫైబర్ నెట్ సేవలను విస్తవరించగా, దానికోసం 24వేల కిలోమీటర్ల పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ను ఏర్పాటు చేశారు. సుమారు 15వేల గ్రామ, వార్డు సచివాలయాలలు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, అన్ని ప్రభుత్వ పాఠశాఠశాలలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు, ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవడంతోపాటు పది లక్షల మంది కుటుంబాలకు ఏపీ ఫైబర్ నెట్ సేవలను దగ్గర చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వారికి కూడా ప్రత్యేక ప్యాకేజీల ద్వారా ఇంటర్నెట్ అందించాలని కూడా చూస్తుంది. ప్రతి విద్యార్ధికి ప్రస్తుతం ఇంటర్నెట్ భాగం అయిపోవడంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ విస్తరించి ప్రభుత్వసేవలు అందించాలని చూస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా పనులు నడుస్తుండగా, రాష్ట్రంలోని అన్ని నూతన గ్రామ సచివాలయాలు నిర్మాణాలు పూర్తి అయ్యే నాటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులను ఆదేశించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2022 మార్చినాటి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలతోపాటు 10 నుంచి 15 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు వేయనున్నారు. ఇప్పటి వరకూ 2800 గ్రామ, వార్డు సచివాలయాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. వీటితో పాటు 11274 గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సేవలను విస్తవరించనున్నారు. వీటితోపాటు గ్రామాల్లో ఉచిత వైఫై టవర్లు కూడా పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో గ్రామాల్లోకి ఇంటర్నెట్ కనెక్షన్ లు అందుబాటులోకి వస్తే ఆన్ లైన్ సేవలకు, ప్రభుత్వ పథకాల అమలకు, విద్యార్ధుల ఆన్ లైన్ క్లాసులకు ఎలాంటి డోకా లేకుండా ఇంటర్నెట్ అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన పనులను చకచకా చేపడుతుంది..!
విజయవాడలో వేంచేసియున్న శ్రీ కనక దుర్గమ్మ వారి ఆలయంలో అవినీతి ,కుంభకోణాలపై విజయవాడ దుర్గ గుడిలో పనిచేసే ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా నిరవధికంగా వస్తున్న ఆరోపణలపై సకాలంలో అవినీతికి తావియ్యకుండా,అవినీతిపరుల అక్రమాలు అరికట్టేంచుదుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఆలయ భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. అయితే అంతా అనుకున్నట్టుగానే ఈఓపై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీనిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల సంతోషం,హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ,పుణ్యక్షేత్రాన్ని అక్రమాల అడ్డాగా మార్చుకున్న అవినీతి,అసాంఘిక శక్తుల కబంధ హస్తముల నుండి విడుదల అయ్యేలా చూడాలని ప్రజలు,అమ్మవారి భక్తులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరుతున్నారు. మరోవైపు ఈఓ కూడా తనను వేరోచోటుకి బదిలీ చేయాలని, లేదంటే లాంగ్ లీవ్ పై వెళ్లిపోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. గ్రామీణ ప్రజానీకం మొత్తం సానుకూలంగా స్పందించి బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తంగా 13,081 గ్రామ పంచాయతీలు ఉండగా, 10,536 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. దీంతో పార్టీ గుర్తింపు ప్రజల్లోకి మరింగి వెళ్లినట్టు అయ్యింది. ఇదే ఉత్సాహంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్ధులు పురపాలికపై పార్టీ జెండా ఎగురవేస్తారనే ధీమాతో వుంది వైఎస్సార్సీపీ అధిష్టానం. చంద్రుడికో నూలు పోగు అన్నట్టు అక్కడక్కడా పార్టీపై చిన్నా చితకా టిడిపి అసంత్రుప్తి ఉన్నా దాని ప్రభావం ఎన్నికల్లో కనిపించలేదు. అంతేకాకుండా గెలుపొందిన సర్పంచులంతా చాలా వరకూ యువకులు, కొత్తవారే కావడం కూడా గ్రామాభివ్రుద్ధికి మార్గం సుగమం అవుతుందని పార్టీ భావిస్తుంది. పదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని వున్నచాలా మందికి ఈ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓ మంచి స్థానం కల్పించి ప్రజలకు మరింతగా సేవలు అందిచాలని చూస్తుంది ప్రభుత్వం. గ్రామ పంచాయతీల్లో ఎగిరిన పార్టీ జెండా మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోకూడా ఎగురవేస్తామే ధీమాతో వుంది అధికార పార్టీ. దానికి తగ్గట్టుగా అభ్యర్ధులు కూడా వారి వారి ప్రచారాల్లో నిమగ్నమై వున్నారు. మార్చి 14న ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయో తేలనుంది..
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామసచివాలయ సేవలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే కార్యక్రమానికి వైఎస్ జగన్ సర్కారు ఉపక్రమించింది. గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటి వరకూ ఆడుతూ పాడుతూ విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఇక అలాంటి విధులకు కాలం చెల్లినట్టే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 15వేల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బయోమెట్రిక్ హాజరు దగ్గర నుంచి వారు చేపడుతున్న విధులు, ప్రజలకి అందిస్తున్న సేవలపై మండలాల వారీగా ప్రత్యేకంగా ద్రుష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దానికి గాను ఉద్యోగులకు నిర్ధేశించిన డ్యూటీ చార్టు ప్రకారంగా ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంత మంది ఉద్యోగులు నెలలో ఎన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు, అసలు వారికి ఇచ్చిన టూర్ డైరీలు, మూమెంట్ రిజిస్టర్ లలో సంతకాలు చేస్తున్నారా, సచివాలయాల్లో కార్యదర్శిలు ఎంత ఖర్చు చేస్తే, ఎంత మొత్తానికి బిల్లులు ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు తదితర అంశాలపై ప్రభుత్వం ద్రుష్టి సారిస్తుంది. కరోనా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సచివాలయ కార్యదర్శిలు బ్లీచింగ్, ఫినాయిల్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాల కొనుగోలులో చేతివాటం ప్రదర్శించిన విషయం ప్రభుత్వం జిల్లాలు, మండలాలు వారిగా నివేదికలు తయారు చేసినట్టు సమాచారం అందుతుంది. అలా బిల్లుల్లో తేడాలు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శిలపైనే ఇపుడు మొత్తంగా నిఘా ఉంచింది ప్రభుత్వం. అంతేకాకుండా ప్రజలకు సేవలు అందించాల్సిన సిబ్బందిని కార్యాలయాల్లోనే సమావేశాల పేరిట గంటలు గంటలు కూర్చోబెట్టే కార్యదర్శిల తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం, కార్యదర్శిలు కూడా గ్రామాల్లోని సమస్యలు గుర్తించేలా ప్రభుత్వం దిశా నిర్ధేశం చేయనుంది. మున్సిపల్ ఎన్నికల తరువాత గ్రామ, వార్డు సచివాయాలశాఖకు చెందిన జెసిలుకి ఖాళీ ఏర్పడటంతో ఇక గ్రామసచివాలయాల సిబ్బంది, అధికారులపైనే పూర్తిస్థాయిలో ద్రుష్టి సారించి తేడా సిబ్బందిని తప్పించే పనికి ఉపక్రమిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం. దానికి కారణం కూడా లేకపోలేదు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయి సుమారు 18నెలలు కావస్తున్నా చాలా మంది సిబ్బందికి ప్రభుత్వం నిర్ధేశించిన ఆయా శాఖల డ్యూటీ చార్టు ప్రకారం విధులు నిర్వహించడం లేదు. సమస్యల పరిష్కారంలో కూడా చొరవ చూపకపోవడంతో ఈ శాఖను పూర్తిగా గాడిలో పెట్టాలంటే జెసి స్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా సచివాలయాల్లోని తేడాలను గుర్తించడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందని భావించిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు చేపట్టనుంది. అదే జరిగితే ఆడుతూ, పాడుతూ పనిచేసే గ్రామ సచివాలయ ఉద్యోగుల తేడా విధులకు కాలం చెల్లినట్టే. ప్రజల ఇంటి ముంగిట సేవలు అందించాలని భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ గ్రామసచివాలయ వ్యవస్థకు సిబ్బందే నీరు గార్చుతున్న విషయాన్ని ప్రభుత్వం కాస్త సీరియఎస్ గానే తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నిల తరువాత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాలి మరి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా పూర్తిచేసింది. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తిచేయబోతుంది. ఈ ఊపులోనే కొత్త జిల్లాల ప్రక్రియ కూడా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోందట. దానికి అధికార వర్గాల నుంచి కూడా అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయాలని తొలుత యోచించినా అవి దానికి మరో మూడు జిల్లాలు ఆయా ప్రాంతాల సెంటిమెంటు ఆధారంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు ముందు ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సముదాయాలు ఇలా అన్నింటిని పరిశీలించి ఎక్కడ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే విషయమై ఒక నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధులు విజయఢంకా మోగించడంతో ఆ ఉత్సాహం, ఊపులో వున్న ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తే ఒక పనైపోతుందని భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నతరుణంలో కొత్త రాష్ట్రంలో కొత్త జిల్లాలు కూడా పూర్తయితే మిగతా రెండేళ్లు పూర్తిగా ప్రజా సంక్షేమం మీద ద్రుష్టి పెట్టాలని అధికార పార్టీ భావిస్తోంది. దానికి అనుగుణంగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ అన్ని పనులూ పూర్తిచేస్తుంది. కొత్తజిల్లాల ఏర్పాటు వివిధ కార్పోరేషన్లకు చైర్మెన్లు, మార్కెట్ కమిటీలకు చైర్మన్లకు కూడా నియమిస్తే పదేళ్లుగా పనిచేసిన కేడర్ కి ఒక గుర్తిపంపు ఇచ్చినట్టు అవుతుందని ప్రభుత్వ బావన అసలే గత ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికలూ లేవు, వివిధ కార్పోరేషన్లకు చైర్మన్ పదవులూ లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశచెంది ఎన్నికల్లో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎక్కడో కొద్దిమేర అసమ్మతి, అసంత్రుప్తిలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ అదిగమించాలంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే మరికొంత మంది నేతలకు పదవులు అందుతాయని కూడా పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అన్నిపనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూ ప్రజా సంక్షేమాన్ని కూడా పూర్తిచేస్తాయిలో చేపడితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఎన్నికల హడావిడి మొత్తం పూర్తయితే కొత్త జిల్లా ల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వస్తుంది. కొత్త జిల్లాలు ఏర్పడితే కొత్త నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, కొత్తగా ప్రైవేటు కంపెనీలు పెరిగి నిరుద్యోగం కూడా తగ్గుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మే, జూన్ నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కొత్త జిల్లాల విషయంలో తీసుకుంటో వేచి చూడాలి మరి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలో కొన్నిశాఖ సిబ్బంది తాము ఏశాఖకి చెందిన ఉద్యోగులమో తెలియ తికమక పడుతున్నారు(రెండు మూడు శాఖలకు చెందిన విధులు నిర్వహిస్తుండటంతో). ఉద్యోగం పొందినది ఒక శాఖ నుంచి అయితే వారు చేస్తున్నది రెండు మూడు ప్రభుత్వ శాఖలకు చెందిన సేవలు అందిస్తుండటంతో వారు ఏశాఖ తమకు మాత్రుశాఖ అవుతుందో..వారికి తరువాత ఏశాఖ నుంచి పదోన్నతులు వస్తాయో తెలియని పరిస్థి నెలకొంది. దీనితో ఈ గ్రామసచివాలయ శాఖలో వివిధ శాఖల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఒకే శాఖ ఉద్యోగులుగా గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. దానికోసం వారి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలని యోచిస్తుంది. ఇప్పటికే ఈ శాఖకు సెక్రటేరియట్ లో ఒక కమిషనరేట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇపుడు సచివాలయాల్లో పనిచేస్తున్న 14శాఖల సిబ్బందిని ఆయా శాఖలకు ఎండార్స్ చేయనుంది. ఇప్పటి వరకూ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీష్, వెటర్నరీ, వీఆర్వో, కార్యదర్శిలకు మాత్రమే ఆయా ప్రభుత్వ శాఖలు మాత్రుశాఖలు గా ఉన్నాయి. వీరిలో ప్రధానంగా ఉన్న మహిళా సంరక్షణా కార్యదర్శిలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్, ఇక నగరాల్లో శానిటేషన్ అసిస్టెంట్లు తదితరులకు ఇప్పటి వరకూ ఏ శాఖకు వీరిని అటాచ్ చేస్తున్నారో ప్రభుత్వం నిర్ధేశించలేదు(అపాయింట్ మెంట్లు ఒక శాఖ నుంచి అత్యధిక విధులు మరో ప్రభుత్వ శాఖలకు చెందినవిగా ఉన్నాయి). ఉదాహరణకు తీసుకుంటే మహిళా సంరక్షణా కార్యదర్శిలు వీరికి ఉద్యోగాలు హోం డిపార్ట్ మెంట్ నుంచి ఇచ్చినా, వీరి విధులు అధికంగా ఐసీడిఎస్ మరియు ఆరోగ్యశాఖకు చెందినవి వుంటున్నాయి. గ్రామ శాంతి భద్రతలు, కేసులు, ఇతరత్రావి చాలా తక్కువగా వుంటున్నాయి. అదే విధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లను తీసుకుంటే వీరికి ఇంజనీరింగ్ విభాగం నుంచి వీరికి ఉద్యోగాలు కల్పించినా అన్ని రకాల ఇంజనీరింగ్ శాఖల పనులూ వీరు చేయాల్సి వస్తుంది( పీఆర్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, గ్రామస్థాయిలో శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, పబ్లింగ్ తదితర) పనులన్నీ వీరు చేయాల్సి, చూడాల్సి వస్తుంది. వీరికి ఒక డిపార్ట్ మెంట్ అంటూ లేదు. ఇక డిజిటల్ అసిస్టెంట్లు ఇటు కార్యాలయ పనులతోపాటు, మీసేవా సర్వీసులన్నీ సచివాలయాల్లో చేస్తున్నారు. వీరికి ఏ శాఖ కేటాయించారో ఇంకా క్లారిటీ రాలేదు. అదే విధంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లు వీరిని అటు విద్యాశాఖకు, ఇటు వెల్పేర్ శాఖకు కాకు మధ్యలో ఉంచారు. అదేవిధంగా నగరాల్లో శానిటేషన్ అసిస్టెంట్లు, లేదా కార్యదర్శిలు వీరు కూడా అటు వైద్య ఆరోగ్యశాఖకు లేదా పురపాలక శాఖకు ఏ శాఖకు చెందిన ఉద్యోగులో కూడా తెలియడంలేదు. ఇలా గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని సిబ్బందికి తమ మాత్రుశాఖ ఏమిటో, వీరికి రేపు పొద్దున్న పదోన్నతులు ఏశాఖ నుంచి వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వం ఈ శాఖ ఉద్యోగులను పని అధికంగా ఏ డిపార్డుమెంటుకి చెందినదిగా ఉందో వారిని గుర్తించి వారికి సదరు శాఖలోనే పదోన్నతులు కల్పించాలిని, ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఈశాఖకు చెందిన ముఖ్యకార్యదర్శి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అంశాలు చర్చచి వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో ఉద్యోగులు తికమక పడకుండా వారికి అపాయింట్ మెంట్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలే వారికి మాత్రుశాఖలుగా ఉంటాయని, ఆవిధంగానే వారికి పదోన్నతులు కూడా కల్పించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అయితే కొన్ని శాఖల కార్యదర్శిలు దానికి విముఖత చూపినట్టుగా తెలుస్తుంది. రెండు మూడు శాఖలకు చెందిన విధులు నిర్వహిస్తున్నప్పుడు వారికి ఏ శాఖకు కేటాయిస్తున్నట్టో నిర్ధిష్టంగా తెలిసినపుడు మాత్రమే వారికి పదోన్నతులు, సర్వీసు రూల్సు వర్తింపచేయడానికి వీలుపడుతుందని లేదంటే రానున్న రోజల్లో ఇబ్బందులు తలత్తే సమ్యలు ఉత్పన్నం అవుతాయనే అనుమానాలను వ్యక్తం చేశారట. ఆ కారణంగా ముందు గ్రామసచివాలయ శాఖ ఉద్యోగులందరికీ సర్వీస్ రికార్డులు ప్రారంభించిన తరువాత వారికి అందిచాల్సిన సదుపాయాలను, సెలవులను, ఇతరత్రా అంశాలను పొందు పరచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. మార్చి 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులందరికీ సర్వీస్ రిజిస్టర్లు ఓపెన్ అయిన తరువాత ఈ అనుమానాలకు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఆయా శాఖల ఉద్యోగులు చేస్తున్న సర్వీసుకి, అందుకున్న అపాయింట్ మెంట్లకి పొంతన లేకుండా ఉంటుంది. అలాంటి అనుమానాలన్నీ నివ్రుత్తి చేయడం కోసమే వీరికి సర్వీర్ రూల్సు వర్తింపజేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు మూడు శాఖల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచిచూడాలి..!
ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సోషల్ మీడియా తన ఉనికిని కొద్దికొద్దిగా కోల్పోవలసి వుస్తుంది. ఈ కోవకె చెందినది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై నమ్మకం తగ్గించే దిశగా కొందరు దుండగలు అదేపనిగా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. వారి పేర్లతోనూ ఫోటోలతోనే నకిలీ అకౌంట్లను క్రియేట్ చేసి అక్రమ సంపాదనకు తెరతీస్తున్నారు. మొదట్లో కొందరు ఈ హ్యాకర్ల మాటలు నమ్మి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినా..అదే పనిగా చాలా మంది అకౌంట్లు ప్రతినిత్యం హ్యాకర్లు హ్యాక్ చేస్తుండటంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. అయినా ఫేస్ బుక్ ఈ హ్యాకింగ్ ని నియంత్రించలేకపోతుంది. ఈ హ్యాకర్లు ముఖ్యంగా జర్నలిస్టులు, మహిళలు, సంఘంలో కాస్త పలుకుబడి వున్నవారి అకౌంట్లనే హ్యాక్ చేయడం విశేషం. ఈ హ్యాకింగ్ కి ఎక్కడో ఒక చోట పులుస్టాప్ పడుతుందని భావిస్తున్నప్పటికీ హ్యాకర్లు వారి పని వారు చేసుకుంటూనే పోతున్నారు. తద్వారా చాలా మందికి చెందిన సమాచారం, ఫోటోలను డౌన్ లోడ్ చేసి మార్ఫింగ్ చేసి కొందరు బెదిరింపులకు కూడా దిగుతున్నారు. దీనితో చాలా మంది మహిళలే కాకుండా, పురుషులు కూడా తమ ప్రొఫైల్ ను లాక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ హ్యాకింగ్ మాత్రం ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కి ఆదరణ ఉన్నప్పటికీ, ఇందులో వున్నవారి ఖాతాలకు రక్షణ లేకుండా పోతుంది. ఈ విషయంలో ఫేస్ బుక్ నిర్వాహకులు కూడా ఎన్నో రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ హ్యాకర్లు వారికంటే తెలివిగా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారంటే టెక్నాలజీ ఏ స్థాయిలో అభివ్రుద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. సాఫ్ట్ వేర్ రంగంలో హ్యాకింగ్ కి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. చాలా మంది తెలివైనవారు ఈ హ్యాకింగ్ ను దేశ అభివ్రుద్ధికి కాకుండా దేశవినాశనానికి వినియగించడం ఇపుడు అందరినీ ఆందోలనకు గురి చేస్తుంది. ఒక మంచి విషయం పంచుకుందామని సోషల్ మీడియా వేదికలో ఖాతా తెరిస్తే అదే వివరాలు, ఫోటోలతో మరో నకిలీ ఖాతా వెంటనే క్రియేట్ అవుతుంది. స్నేహాలు, బంధాలు, పరిచియాలను అడ్డం పెట్టుకొని హ్యాకర్లు అక్రమ, అడ్డదారి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియా దిగ్గజం తన ఫేస్ బుక్ లోని ఖాతాదారులను కాపాడుకోకపోతే చాలా ముఖ్య మైన సమాచారం హ్యాకింగ్ కి గురవడంతోపాటు, ఫేస్ బుక్ నుంచి హ్యాకింగ్ గురైన వారు ఒక్కొక్కరుగా ఫేస్ బుక్ ని వీడే ప్రమాదాలు లేకపోలేదు. ఈ విషయంలో ఫేస్ బుక్ నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయ ఉద్యోగుల విధినిర్వహణపై నిఘాపెట్టింది. ఎవరు ఏవిధంగా విధినిర్వహణ చేస్తున్నారనే విషయమై తెలుసుకునేందుకు ఈ శాఖకు చెందిన జాయింట్ కలెక్టర్లు ఆకస్మికంగా సచివాలయాలను తనిఖీలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయి సుమారు 16నెలలు కావస్తున్నా నేటికీ చాలా మంది సచివాలయ సిబ్బందికి వారి డ్యూటీ చార్టును ఏవిధంగా అమలు చేయాలో కూడా తెలియడం లేదు...కాదు కాదు తెలిసినా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు. దీనితో గ్రామాల్లో ప్రజల సమస్యలు ఎక్కడవి అక్కడే వుంటున్నాయి. అంతేకాకుండా సచివాయలయంలో ఇప్పటి వరకూ ఎన్ని శాఖల సిబ్బంది ఉన్నారు, వారు ఏ సమస్యలు పరిష్కారం చేస్తారు, ప్రజలు ఎవరిని ఏ సమస్య కోసం కలవాలి అనే విషయమై కనీసం గ్రామవాలంటీర్ల ద్వారా కూడా అవగాహన చేపట్టే కార్యక్రం చేపట్టడం లేదు. సిబ్బంది ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నా ప్రభుత్వం జీతాలు మాత్రం క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తుంది. ఇదే సమయంలో గ్రామసచివాలయ వ్యవస్థపైనా, కొన్ని ప్రాంతాల్లోని గ్రామవాలంటీర్ల సేవలపైనా నిఘా వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాయని సమాచారం ఆ నివేధికలో చాలా పంచాయతీల్లో కార్యదర్శిలు వాలంటీర్లను, ఇతర శాఖ సిబ్బందిని కార్యాలయానికే పరిమితం చేసి ఉంచడంతో గ్రామంలో ప్రధాన సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయినట్టు నివేదించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పారిశుధ్యం, మంచినీటి ట్యాంకుల పరిశుభ్రత, వీధి దీపాలు, సంక్షేమ పథకాలు రాని వారి దరఖాస్తులను మండల కేంద్రాలకు పంపకపోవడం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, గ్రామంలో గొడవలపై చర్యలు తీసుకోకపోవడం, భూ ఆక్రమణలపై ద్రుష్టిపెట్టకపోవడం తదితర వ్యవహారాలన్నింటిపైనా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులపై నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది. దీనితో గ్రామసచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేయడానికి, ఉద్యోగుల డ్యూటీ చార్టు అమలు చేయడానికి గ్రామసచివాలయశాఖ జాయింట్ కలెక్టర్లుతో చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమారం. అదే సమయంలో బాగా పనిచేసే గ్రామసచివాలయ సిబ్బందిని ఉత్తేజపరుస్తూ వారి సేవలను ప్రజలకు మరింతగా అందించే కార్యక్రమం కూడా చేపట్టనున్నారని తెలుస్తుంది. గ్రామసచివాలయశాఖ జెసిలు రంగంలోకి దిగితే తప్పా ఆడుతూ, పాడుతూ పనిచేస్తూ కార్యాలయాలకే పరిమితమయ్యే సచివాలయ సిబ్బంది వ్యవహరం ఒక కొలిక్కిరాదు. అదేసమయంలో కొన్ని పనులకు సంబంధించి చేయితడుపుడు వ్యవహారాలు, చేసిన గోరంత ఖర్చుకి కొండంత నకిలీ బిల్లులు సమర్పించే కార్యదర్శిలపై వేటు తదితర చర్యలను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండంలోని ఒక ఈఓపీఆర్డీ, మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలపై వేటు వేసే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. వారిని సస్పెండ్ చేస్తారో, విధుల నుంచి తప్పిస్తారోననే ఉత్కంఠ ఇప్పటికే నెలకొనగా, పనిచేయని సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం, నిఘావర్గాలు ద్రుష్టిపెట్టారనే సమాచారం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.