1 ENS Live Breaking News

మహిళా ఉద్యోగులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళా ఉద్యోగులకు ఉన్న15 ప్రత్యేక సెలవుల(క్యాజువల్ లీవ్స్) ను మరో 5 సెలవులను కలిపి 20కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహరెడ్డికి మహిళా ఉద్యోగులకు ఈ వరం ప్రకటించారు. ప్రకటించిన రెండు రోజుల్లోనే అనగా ఈరోజే ప్రభుత్వం జీఓ నెంబరు 18ను తీసుకు వచ్చి అమలు చేయడానికి వీలుగా అన్ని ప్రభుత్వ శాఖలకూ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే మహిళా ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించింది. దీనితో రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సెలవులకు సుమారు నాలుగు యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వానికి  ముందస్తుగా లేఖలు సమర్పించాయి.

Tadepalle

2021-03-10 19:55:15

విశాఖ డీపీఓ పోస్టు బదిలీ జీఓకి తాక్కాలిక తెర..

విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి బదిలీ జీఓ అంశానికి తాత్కాలికంగా తెరపడినట్టు అయ్యింది.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశాఖ డీపీఓను బదిలీ చేసిన జీఓని హైకోర్టు  నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. కోర్టు ఉత్తర్వులు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికార మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ కి అందాయి.  విశాఖజిల్లాలో రెగ్యులర్ డీపీఓ  పనిచేస్తుండగా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి పనిష్మెంట్ పై తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓగా పనిచేస్తున్న సుభాషిణిని విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ పదిరోజుల క్రితం జీఓ జారీ చేశారు. అదే సమయంలో ఇక్కడ పనిచేస్తున్న డీపీఓని జిఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని హైకోర్టులో విశాఖజిల్లా డిపీఓ హైకోర్టులో సవాల్ చేశారు. దీనితో హైకోర్టు ఆ జీఓని  నాలుగు వారాల వరకూ ఆ జీఓని సస్పెండ్ చేసింది. వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులుగానీ, ఎంపీడీఓలు గానీ, డీపీఓలపై అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు, అధికారిక పనిష్మెంట్ వ్యవహారాలు జరుగుతున్న సమయంలో అలాంటి అధికారులను రెగ్యులర్ డిస్ట్రిక్ట్ కేడర్ పోస్టు లైవ్ లో ఉన్నచోటుకి బదిలీ చేయకూడదు. కానీ ఎంపీడీఓ సుభాషిణి విషయంలో ఆ నిబంధనలు ఏమీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు అడ్డు రాలేదు, సదరు అధికారిణిపై అవినీతి ఆరోపణలు, అభియోగాలు ఏమీ రుజువుకాకపోవడంతో ఆమెను అక్కడి నుంచి విశాఖకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీఓ జారీచేశారు. విశాఖలో జివీఎంసీ ఎన్నికలు జరగడానికి ఎన్నికల కోడ్ అమలులో ఉండి.. అక్కడ డీపీఓ ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ కనీసం ఎన్నికల సంఘం ద్రుష్టికి బదిలీ వ్యవహారం తీసుకెళ్లకుండానే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ జీఓని జారీచేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది. అంతేకాకుండా ఈ జీఓ  వ్యవహారం మొత్తం జిల్లా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావుకి తెలియకుండా కూడా ఆగమేఘాలపై జరిగిపోవడం కూడా జిల్లా యంత్రాంగానికి తెలియడంతో ఆమెను జాయిన్ చేసుకునే విషయంలో చుక్కెదురైంది. దానికి ప్రత్యక్ష కారణం జీవిఎంసీ మున్సిపల్ ఎన్నికలైతే రెండో కారణంగా ఆమె అవినీతి తారాస్థాయికి చేరుకోవడం మరొక కారణం. అదే సమయంలో ఇవన్నీ ఆరోపణలు, అభియోగాలు, విచారణలు పెండింగ్ లోనే ఉన్న విషయం కావడంతోనే తాము సుభాషిణి విషయంలో బదిలీతో కూడిన డిపీఓ(ఎఫ్ఏసీ)గా జీఓ జారీ చేశామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ అధికారులు సమర్ధించుకున్న తరుణంలోనే ఈ కోర్టు ఉత్తర్వు విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతస్థాయిలో నెట్వర్క్ నడిపినా, కొందరు ప్రజాప్రతినిధులు సపోర్టింగ్ లెటర్స్ ఇచ్చినా, సదరు అధికారిణిపై అవినీతి ఆరోపణలు, ప్రస్తుతం పెండింగ్ లో వున్న విజిలెన్స్ నివేదికలు, ఇతన ఫిర్యాదులన్నీ బటకు వచ్చి మీడియా హడావిడీ చేయడంతో విశాఖలో  సదరు ఎంపీడీఓ డీపీఓ(ఎఫ్ఏసీ)గా జాయిన్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే తరుణంలో అటు నాలుగు వారాల వరకూ కోర్టు జీఓను సస్పెండ్ చేయడంతో సదరు అధికారిణి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగువారాల పాటు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జీఓని సస్పెండ్ చేసినా, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇచ్చిన జీఓని రద్దు చేసినా, సదరు అధికారిణికి తిరిగి ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆప్రాంతానికి తిరిగి పంపినా విషయం సద్దు మనుగుతుంది. అలాకాకుండా అటు ప్రభుత్వం కూడా డిపీఓ క్రిష్ణకుమారి కోర్టుని ఆశ్రయించినట్టుగా ప్రభుత్వంగానీ, సదరు ఎంపీడీఓ గానీ కోర్టువెళ్లినా తిరిగి ఈ విషయం మొదటికొస్తుంది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ బదిలీ జీఓ రద్దు అవుతుందా, లేదంటే 4 నాలుగు వారాల తరువాత తిరిగి పునరుద్దరిస్తారానే అనేది కూడా ఇపుడు ఉత్కంఠగా మారింది. ఈలోగా ఇదే కేసుపై డిపీఓ క్రిష్ణకుమారి కోర్టు కేసుపై కెవియట్ కి వెళ్లినా మళ్లీ కోర్టులో వాదోపవాదాలు జరిగి అటు పంచాయతీరాజ్ శాఖకు, ఇటు విశాఖజిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు కాస్త గట్టిగానే పనికల్పించే అవకాశం ఏర్పడినా ఏర్పడవచ్చు.. ఎంతో ఆశక్తిని రేకెత్తించి, ప్రస్తుతానికి కోర్టు ఉత్తర్వులతో తాత్కాలికంగా తెరపడిన విశాఖజిల్లా డీపీఓ బదిలీ జీఓ విషయంలో ఏంజరుగుతుందనేది వేచి చూడాలి. కానీ డిపీఓ బదిలీ, అటు డీపీఓ(ఎఫ్ఏసీ) జాయినింగ్ విషయంలో ఏం జరిగినా వాటి వివరాలు లైవ్ అప్డేడ్స్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా అందరికంటే ముందుగా అందిస్తామని ప్రకటిస్తున్నాం..! 

Visakhapatnam

2021-03-10 14:41:44

Tadepalle

2021-03-10 12:04:32

సచివాలయాల్లో స్పందన సరే సేవల మాటేమిటి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామసచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోలకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా..ఇక్కడ ఏ తరహా సేవలు అందుతున్నాయనే విషయం నేటికీ చాలా గ్రామాల్లోని ప్రజలకి తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినపుడే ఇక్కడ పనిచేసే సుమారు 14శాఖల సిబ్బందికి వారి డ్యూటీలు ఏమీటో ఒక చార్టు ప్రకారం తెలియజేసింది. అయితే వారు ఆ విధంగా డ్యూటీలు చేస్తున్నారా అంటే లేదనే సమాధానం చెప్పాలి. ఇదేదో కావాలని చెబుతున్న మాటకాదు గ్రామస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసేందుకు చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వ లెక్కట ప్రకారం ఏ గ్రామసచివాలయంలో ఎన్నిశాఖ సిబ్బంది ఇప్పటి వరకూ విధుల్లో చేరారో..ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలియాలి. ఆపై వారు ఏరకమైన సేవలు అందిస్తారో కూడా తెలియాలి. అలా ఇప్పటి వరకూ ఎన్ని గ్రామసచివాలయాల కార్యదర్శిలు ప్రజలకు అవగాహన కలించారు అంటే సిబ్బందే నీళ్లు నములుతున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు తప్పా మిగిలిన ఏఏ శాఖల సిబ్బంది సచివాలయాల్లో ఉన్నారో నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియలేదంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందాలని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినటప్పటికీ ఆ విధంగా సేవలు అందటం లేదు. ప్రభుత్వం వాస్తవాలు నేరుగా నమోదు చేస్తే ఆ విషయం తేటతెల్లమవుతుంది. దానికి ప్రత్యక్ష కారణం కూడా లేకపోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు లక్షా 26వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాయాలకు సిబ్బందిని నియమించినా..నేటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయం, పట్టణాల్లో నగరాపలక సంస్థ కార్యాలయాలకు నేటికీ స్పందన అర్జీలు వస్తూనే ఉన్నాయి. అంటే దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. గ్రామాల్లో ప్రజలకు సేవలు అందంటం లేదనేది తేటతెల్లమవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో ప్రతినిత్యం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిచించింది. అయినప్పటికీ ప్రజల్లో చైతన్యం రావడం లేదు. ఒక వేళ గ్రామసచివాలయాల్లో స్పందన కార్యక్రమం పెడితే మనం ఏ సమస్యపై అక్కడ అర్జీ పెట్టాలని తెల్ల మొహం వేస్తున్నారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలాయాల్లో ఇప్పటి వరకూ చాలా శాఖల్లో ఖాళీలు భర్తీ కాలేదు. భర్తఅయిన ప్రభుత్వ శాఖలేంటో, వారు ఎలాంటి సేవలు అందిస్తారో ప్రజలు తెలియపోవడం వలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు జోక్యం చేసుకొని గ్రామ సచివాలయాల పరిధిలో ప్రజలకు ఏ తరహా సేవలు అందుతాయనే విషయంపై చైతన్యం కల్పిస్తే తప్పా రాష్ట్రప్రభుత్వం అనుకున్నట్టుగా సచివాలయాల్లో స్పందనకు దరఖాస్తుల సంఖ్య పెరిగి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు స్పందన దరఖాస్తులు తగ్గుతాయి. అలాకాకుండా జిల్లా అధికారులు, మండల అధికారలు తాము బాగా పనిచేసేస్తున్నామని ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వాన్ని మభ్య పెట్టాలని చూస్తే మాత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో చాలాశాఖల సిబ్బందికి కూర్చోబెట్టి జీతాలు ఇచ్చినట్టే అవుతుంది. పైగా గ్రామస్వరాజ్యం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందకుండా పోతాయి. ఈవిషయంలో ప్రభుత్వం వాస్తవాలను గుర్తిస్తే తప్పా ప్రభుత్వ సేవలు, ఖర్చు, విలువైన సమయం వ్రుధాకాకుండా ఉంటాయి. 

Tadepalle

2021-03-10 11:16:02

Tadepalle

2021-03-10 10:55:10

Tadepalle

2021-03-09 16:43:44

జర్నలిస్టులకు చేరువుగా ప్రెస్ అకాడమి..

గ్రామీణ జర్నలిస్ట్ లతో పాటు ఫోటో, వీడియో జర్నలిస్ట్ ల్లో వృత్తి నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రెస్ అకాడమీ క్రుషి చేస్తుందని ఛైర్మన్ శ్రీనాథ్ అన్నారు.  ఒక ప్రభుత్వ సంస్థగా కాకుండా ప్రెస్ అకాడమీ రాజ్యాంగ బద్ధమైన  విధులతో  నైతికత  కూడిన జర్నలిస్ట్ ల కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రెస్ అకాడమీ కార్యాలయంలో అకాడమీ ఏపీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ మంగళవారం ఉదయం పాత్రికేయుల సమావేశంలో అకాడమీ కార్యదర్శి ఎం. బాల గంగాధర్ తిలక్ తో కలిసి పాల్గొన్నారు.  చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుండి వినూత్న పంధాలో కార్యక్రమాలను నిర్వహిస్తూ జర్నలిస్టులకు, ప్రజలకు మరింత  చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితిల్లో కూడ రాష్ట్రంలోని 13 జిల్లాలలో పర్యటించి స్వయంగా జర్నలిస్టులను కలుసుకుని, వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు.  ప్రెస్ అకాడమీ విడతల వారీగా పాత్రికేయులకు  ఆన్ లైన్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోందన్నారు. తద్వారా వారిలో జర్నలిజం లోని నైతికత విలువలపై అవగాహన పెంపొందించే దిశలో అకాడమీ కృషి చేయాలన్నా ధ్యేయం తో అడుగులు వేస్తున్నామన్నారు. తొలివిడత పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల జర్నలిస్టులకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయి.                 తొలివిడత శిక్షణలో దాదాపు 4 వేల మంది జర్నలిస్టులు పాల్గొన్నారని, వారిని అభినందించడంతో పాటు కృతజ్ఞత వ్యక్తం చేస్తాన్నామని తెలిపారు.  30 మంది నిష్ణాతులైన సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం అధ్యాపకులచే, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తో కూడి శిక్షణ తరగతుల నిర్వహించామని తెలిపారు. 15 విలక్షణ అంశాలపైన శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువత జర్నలిజం పై ఆసక్తి చూపుతున్నారని,  ఔత్సాహిక జర్నలిస్ట్ లను అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. జర్నలిజం కోర్సుల్లో ప్రావీణ్యం పెంపొందించే దిశగా ప్రెస్ అకాడమీ అడుగులు వేస్తోందని శ్రీనాథ్ తెలిపారు. పాత్రికేయుల నైపుణ్యాన్ని పెంచేలా రూపకల్పన చేసిన ఈ- పుస్తకాలను ఆన్ లైన్ లో 7 వేలకు పైగా జర్నలిస్టులు డౌన్ లోడ్ చేసుకున్నారని, ఇది వారిలోని జిజ్ఞాసకు ఉదాహరణ గా పేర్కొన్నారు.                జర్నలిజం కోర్సులను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, యోగి వేమన విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలతో ప్రెస్ అకాడమీ ఒప్పందం చేసుకున్నామన్నారు.  జర్నలిజం కోర్సుల ఫీజుల రాయితీ విషయంలో ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.  యూనివర్సిటీ లు నిర్ధారించిన ఫీజుల్లో 40 నుంచి 50 శాతం అకాడమీ ద్వారా జర్నలిస్ట్ ల తరపున చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరిన్ని యూనివర్సిటీలతో ఒప్పందాన్ని చేసుకునేందుకు ప్రెస్ అకాడమీ సిద్ధంగా వుందన్నారు.  ఇప్పటికే  వర్కింగ్ జర్నలిస్టులు ఒప్పందం చేసుకున్న యూనివర్సిటీల్లో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నామన్నారు. విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం ద్వారా ఆన్ లైన్ లో సర్టిఫికేషన్ డిప్లామో కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.                 మలిదశ శిక్షణలో  గ్రామీణ విలేకరులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులతో పాటు ఆయా బీట్ లు , అంశాల వారీగా అవసరమయ్యే  మెళకువలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు.  కోవిడ్ సమయంలో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునే దిశలో రూ.5 లక్షల పరిహారం అందచేసే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది అని తెలిపారు. అదేవిధంగా కోవిడ్ బారిని పడి, చికిత్స పొందిన వారిని కూడా ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.   జర్నలిస్టులు సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్యులు సానూకూలంగా వున్నారని ఛైర్మన్ తెలిపారు. 

Vijayawada

2021-03-09 15:32:37

విశాఖ డిపీఓ బదిలీ జీఓని సస్పెండ్ చేసిన కోర్టు..

బ్రేకింగ్ న్యూస్ అందుతోంది..విశాఖజిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారిని కదపకూడదని హైకోర్టు స్టే విధించింది. గద ఏడు రోజుల క్రితం విఖజిల్లా డిపీఓను బాదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో డీపీఓ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈమెకు ఏ జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడి కి రిపోర్టు చేయాలని ఆ జీఓలో పేర్కొన్నారు. దీనితో తనకు అన్యాయం జరిగిందని భావించిన డిపిఓ క్రిష్ణకుమారి ప్రభుత్వ జీఓను సవాల్ చేస్తూ హై కోర్టు ఆశ్రయించారు. ఆమె వినతపై సోమవారం కోర్టు సదరు జీఓని సస్పెండ్ చేస్తూ స్టే విధించింది. దీనితో ప్రభుత్వం ఒక ఎంపీడీఓను డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ విడుదల చేసిన జీఓ నిలిచిపోయినట్టు అయ్యింది. భారీ స్థాయిలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి కూడా పోస్టింగ్ విశాఖలో ఇవ్వకుండా వీలులేకుండా పోయింది. అయితే ఈ కోర్టు ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఈ ఉత్కంఠగా మారింది. మరోపక్క విశాఖజిల్లా డిపీఓను బదిలీ చేస్తున్న విషయం జిల్లా మంత్రికి తెలియకుండా జరగడం ఒక విషయమైతే, అవినీతి ఆరోపణలు ఎదర్కొంటున్న ఎంపీడీఓ విషయంలో చాలా కేసులపై విచారణలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో అధికారులను ప్రసన్నం చేసుకొని సదురు అధికారిణి తనపై విచారణలు అన్నీ పెండింగ్ లో ఉన్న ప్పటికీ  పదోన్నతితో పాటు బదిలీకి జీఓ తెప్పించుకునే విషయంలో సఫలీక్రుతులయ్యారు. కానీ విశాఖజిల్లా డీపీఓ క్రిష్ణకుమారి కోర్టును ఆశ్రయించడంతో అదికాస్త నీరుగారిపోయినట్టు అయ్యింది. విశాఖజిల్లా డీపీఓ ను బదిలీ చేస్తూ కోర్టు సస్పెండ్ చేసిన జడ్జిమెంట్ కాపీలు సాయంత్రానికి గానీ రేపు ఉదయానికి గానీ అటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి, విశాఖజిల్లా కార్యాలయానికి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది..!

Tadepalle

2021-03-08 14:53:03

Tadepalle

2021-03-08 14:09:19

Tadepalle

2021-03-08 13:15:15

విశాఖజిల్లా పరువుని చాకచక్యంగా కాపాడిన రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి..

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతికి తావుండదు..అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదు..పనిచేసే అధికారులకే పట్టం కడతాం..ప్రజాసేవే పరమావధి.. ప్రజల కోసం మంచి అధికారుల సేవలే ప్రామాణికం..తేడా వస్తే ఎంతటివారైనా, ఎలాంటి అధికారులపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం అనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, ఆదేశాలను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరవు అక్షరాలా నిజంచేసి చూపించారు. కోట్ల రూపాయల అవినీతి, ఆరోపణలు, విజిలెన్సు విచారణలు ఎదుర్కొంటున్న అవినీతి ఎంపీడీఓ సుభాషిణి ని విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి(ఎఫ్ఏసీ)గా రానీయకుండా చేసి పెర్ ఫెక్ట్ అండ్ డైనమిక్ స్టేట్ మినిస్టర్ గా వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరించే జిల్లా మంత్రి ఒక అవినీతి అధికారిణిని జాల్లాలోకి రానీయకుండా చేసి జిల్లాయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలోనే అత్యధిక అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు(Govt of ap vigilance and enforcement department case number 04/RVEO/Estt./RJVM/2020, Dt.21.07.2020 వీటితో పాటు క్రిమినల్ కేసులు మరికొన్ని) ఎదుర్కొన్న విషయాలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ యాప్  ద్వారా ఆధారాలతో సహా వచ్చిన ప్రత్యేక వార్తాకధనాల ద్వారా తెలుసుకొని ఆమెను జిల్లాలోకి రానీయకుండా అడ్డుకొని ఎంతో చాకచక్యంగా జిల్లా పరువుని కాపాడాగలిగారు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆమె పనిచేసిన కాలంలో జరిగిన అవినీతికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాష్ట్రమంతా వైరల్ కావడం కూడా చర్చనీయాంశం అయ్యి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వరకూ ఈ విషయం వెళ్లింది. దీనితో సదరు అధికారిణిపై ఇచ్చిన జీఓని రద్దు చేసే యోచనలో సెక్రటేరియట్ అధికారులు అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో తూర్పుగోదావరి జిల్లాలోని వీఆర్ పురం జిల్లా అధికారుల పనిష్మెంట్ పై బదిలీగా వెళ్లి అక్కడ విధుల్లోకి చేరకుండా కేవలం, విశాఖపట్నం జిల్లా పంచాయతీ అధికారిణిగా జీఓ రావడం కోసమే రెండు రోజులు ముందుగా విధుల్లో చేరి, ఆపై విశాఖ వచ్చిన అంశాన్ని కూడా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ను అందిస్తూ వచ్చింది. ఆ కధనాలన్నీ రాష్ట్రంలో వైరల్ అయ్యి మంత్రి వరకూ చేరడంతో అప్పటికే ఈయొక్క అధికారిణి మంత్రికి తెలియకుండానే ఈ జీవో తెప్పించుకోవడం లో సఫలీక్రుతురాలైంది. ఈ అవినీతి అధికారిణి విషయం తనకు తెలియకుండా జరగడం కూడా ఇపుడు జిల్లా మంత్రిపై మచ్చపడకుండా చేయడంలో కీలక భూమిక వహించిందనే చెప్పాలి.. లేదంటే ఆ అవినీతి అధికారి మంత్రి ప్రోద్భలంతోనే విశాఖ వచ్చిందనే మచ్చ పడే అవకాశాలు చాలా అధికంగా ఉండేవని జనాల్లోకి, అధికారుల్లోకి నెగిటివ్ ప్రచారం జరిగేది. సదరు అధికారిణి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడకు రావడానికి చాలా నిబంధనలను పక్కనపెట్టి జీఓ రప్పించుకోవడంలో అటు సెక్రటేరియట్ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ అధికారులు కీలక భూమిక వహించినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఓ పక్క రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఒక రెగ్యులర్ డీపీఓ ఉన్న జిల్లా స్థానానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఎంపీడీఓగా వున్న అధికారిణి పంపే ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న డీపీఓ ఎన్నికల అధికారిగా ఉన్న అధికారిణిని బదిలీ చేసి, ఆమెకు ఎలాంటి జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడీకి రిపోర్టు చేయాలని చెప్పడం, అన్నింటికంటే ముఖ్యంగా విశాఖజిల్లా డిపీఓకి సర్వీసు కూడా ఒక ఏడాది మాత్రమే ఉండటం.. తదితర అంశాలు అధికారులను ఇరుకునపెట్టేవిగా కనిస్తున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ  ఏ డీపీఓ నైతే బదిలీ చేశారో సదరు అధికారిణికి  బదిలీ స్థానం చూపకుండానే బదిలీకి ఉత్తర్వులు జారీచేయడం.. తదితర అంశాలన్నీ ఆ ఎంపీడీఓను విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీచేయడానికి  పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయ అధికారులు జీఓ ఇచ్చిన తీరు మొత్తం అవినీతికి పరాకాష్టగా నిలిచినట్టుగా విశాఖజిల్లాలో కోడైకూస్తుంది. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయం సదరు ఎంపీడీఓపై వచ్చినవన్నీ అభియోగాలేనని, ఏ ఒక్కటీ రుజువుకాలేదని ఆ కారణంతోనే తాము ఆమె పనిష్మెంట్ ప్రాంతానికి వెళ్లినా విశాఖ జిల్లా డీపీఓగా పంపడానికి జీఓ ఇచ్చామని సమర్ధించుకున్నా ఇక్కడ పొంతన కుదరడం లేదు. డీపీఓగా పంపాలనుకుంటే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో డీపీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని జాల్లాలను వదిలేసి ఒక్క విశాఖజిల్లాకే ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిణికి ప్రత్యేక జీఓ ద్వారా  పంపడంలో, ఇక్కడ ప్రజాప్రతినిధులపైనా అవినీతి బురద మరక అంటించాలనే ఆలోచన ఉన్నట్టు ఈ బదిలీ జీఓ ద్వారా స్పష్టంగా తెలియజేస్తుందని జిల్లాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఈ జీఓ రావడంలో జిల్లా యంత్రాంగానికి, జిల్లా మంత్రికి తెలియకుండా జరగడంతో వీరు తొలుత ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని నియామకాన్ని ఎన్నికల తరువాత చూద్దామని చెప్పి పంపినా, తరువాత వాస్తవాలను తెలుసుకొని ఒక్కసారిగా కంగారుపడి ఆపై తేరుకొని జిల్లాపై అవినీతి మరక పడకుండా మంత్రి కాపాడగలిగారు.. సదరు అధికారిణిపై నేరుగా మీడియాలో వరసు కధనాలు వాస్తవాలు, విచారణ నివేదికలు( Efile no DI/ZPP/296618/2020, dated 27.08.2020, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీపీఓ కార్యాలయం, కాకినాడ/ efile number 340677/2020a3, 9.10.2020 krrc, Thasildar, subcollector office rajamundry report, Regd number H.3153/2020 date 12.10.2020 subcollector report) ఇలా చాలా ఆధారాలతోనే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ కూడా రంగంలోకి దిగడంతో అసలు విషయం కాస్త అటు అధికారులకు, ఇటు ఈ అధికారిణికి సపోర్టింగ్ లెటర్స్ ఇచ్చిన ప్రజాప్రతినిధులకు తెలిసి వారంతా చేతులెత్తేశారు. ఈ ట్రాన్స్ ఫర్ కమ్ డిపీఓ(ఎఫ్ఏసీ) ఎపిసోడ్ లో సదరు ఎంపీడీఓ ఉదయంతా కలెక్టర్ కార్యాలయం, మధ్యాహ్నాం అంతా మంత్రి వెనుక తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇక విశాఖలో పనిజరగదని భావించిన అధికారిణి నేరుగా జీఓని అమలు చేయించుకోవడానికి అమరావతి బయలుదేరిన విషయాన్ని కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందించింది. ఈ ఆధారాలతో ఇపుడు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయంలోని అధికారులు కూడా డైలమాలో పడ్డారు. ఇన్ని విషయాలు మీడియాకి తెలిసిన తరువాత ఈ అధికారిణి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లినా ప్రతీ  అధికారి, సిబ్బంది న్యాయపరమైన చిక్కులు ఎదొర్కోవాలసి వస్తుందని, ఈ జీఓని రద్దుచేసే యోచనకు ఉపక్రమించారని తెలుస్తుంది. దానికితోడు జిల్లా మంత్రి, కలెక్టర్లు కూడా మున్సిపల్ ఎన్నికల ద్రుష్ట్యా తిరస్కరించడం, ఈమె అవినీతి సంబంధించిన ఆధారాలు, ప్రభుత్వ, విజిలెన్సు నివేదికలు వీరికి కూడా చేరడం కూడా ఈ అధికారిణి విశాఖలో చేరకుండా ఉండేందుకు ముఖ్య కారణాలు అయ్యాయి. ఇంకా ఇప్పటికీ ఈ అధికారిణి చేసిన అవినీతిపై తూర్పుగోదారి జిల్లాలోని మీడియా, మరికొందరు జర్నలిస్టులు, ప్రభుత్వ సిబ్బంది, చాలా మందే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ కార్యాలయాలనికి ఆధారాలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు పంపుతూనే ఉన్నారు. దీనిని బట్టి చూసుకుంటే ఏ స్థాయిలో ఈ ఎంపీడీఓ అవినీతికి పాల్పడిందనేది అర్ధం చేసుకోవచ్చు. వాటి ఆధారంగా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్  ప్రత్యేక కధనాలు లైవ్ అప్డేట్స్ ఇస్తుండటంతో జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆలోచనలో పడేలా చేశాయి. ఈ ఆశక్తి కర అడ్డగోలు డీపీఓ ట్రాన్స్ ఫర్ జీఓ విషయంలో మరిన్ని తాజా అప్డేట్స్ ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అందిస్తూనే ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వంలో పెద్దలు, అధికారులు అవినీతిని నియంత్రించడానికి చేసే మంచికార్యక్రమంలో ఈఎన్ఎస్ ఎల్లప్పుడూ భాగస్వామ్యం అవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు, అధికారులకు తేలియజేశాం. అదే పందాను కొనసాగిస్తూనే ఉంటామని కూడా ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ ఎవరికీ వ్యతిరేకం కాదు, అలాగని ఎవరి దగ్గర కూడా కాదు కేవలం న్యాయం వైపు మాత్రమే వుంటుందని తెలియజేయజేస్తున్నాం. ఎల్లప్పుడూ వాస్తవాలను సకాలంలో మీ కళ్లముందుంచే ఈఎన్ఎస్ లైవ్ యాప్ ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు..!

Tadepalle

2021-03-07 15:02:00

కలెక్టర్ లేదన్నారు..మంత్రి కుదరదన్నారు..ఇక తదుపరి సెక్రటేరియటే..

విశాఖజిల్లా పంచాయతీ అధికారి పోస్టు, బదిలీ విషయంలో అవినీతి అధికారిణి సుభాషిణికి జిల్లాలో చుక్కెదురైంది..మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ విధినిర్వహణలో వున్న డిపీఓ క్రిష్ణకుమారిని బదిలీచేస్తూ, ఆ స్థానంలో ఇన్చార్జి డిపీఓగా తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం ఎంపీడీఓ పేరు ప్రతిపాదిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆరురోజుల క్రితం జీఓ జారీచేసింది. ఈ తంతు మొత్తం విశాఖజిల్లాలోని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రికి తెలియకుండా జరిగిపోయింది. దీనితో ఆగమేఘాలపై జిల్లా పంచాయతీ అధికారిగా పోస్టులో చేరిపోవడానికి వచ్చిన సదరు అధికారిణికి వ్యతిరేక పవనాలు ఎదురయ్యాయి. నేరుగా కలెక్టర్ ను కలవడానికి ప్రతయత్నిస్తే..ప్రస్తుతం విశాఖలోని మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున, ఆవిధుల్లో డిపీఓ క్రిష్ణకుమారి పనిచేయడంతో ప్రస్తుతం మార్పులు చేర్పులు కుదరవని, ఎన్నికల నిర్వహణ తరువాత చూద్దామని చెప్పడంతో అక్కడి నుంచి ఏ మంత్రికైతే తెలియకుండా జీఓతో విధుల్లో చేరడానికి వచ్చారో ఆమంత్రిని ప్రసన్నం చేసుకోవాలని వచ్చినా అక్కడా వీలు పడలేదు. అయినప్పటికీ తన నెట్వర్క్ మొత్తాన్ని వినియోగించినా ఇద్దరు ప్రజాప్రతినిధులతో విశ్వప్రయాత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనితో వెనుతిరిగిన ఆ అధికారిణి నేరుగా విశాఖ నుంచి రాజధానిలోని పంచాయతీరాజ్ శాఖ సెక్రటేరియట్ ద్వారా కధనడిపించాలని వెళ్లినట్టు సమాచారం అందుతుంది. శుక్రవారం ఉదయం పదిగంటల నుంచి శనివారం మధ్యాహ్నాం వరకూ ఎంత ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించలేదు సదరు అధికారిణికి. ఈమె విశాఖజిల్లాలో డీపీఓ ఇన్చార్జిగా చేరడానికి సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కూడా ఆమె యొక్క అవినీతి వ్యవహారాలు మీడియా ద్వారా వెలుగు చూడటంతో చేతులెత్తేయడంతో ఇక పనిజరగదని భావించిన సదరు అధికారిణి రాజధానికి ఇటు నుంచి ఇటే పయనమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో లక్షల రూపాయల అవినీతి, క్రిమినెల్ కేసులు ఎదుర్కుంటూ, విజిలెన్సు విచారణలు, పరిపాలనాపరమైన విచారణలు ఎదుర్కొంటున్న పెండింగ్ యాక్సన్ కోసం వేచి వున్న ఇలాంటి అధికారిణిని చేర్చుకోవడానికి విశాఖజిల్లాలో ప్రజాప్రతినిధులు సముఖత చూపకపోవడం కూడా చర్చనీయాంశం అయ్యింది. అసలు ఇన్ని కేసులు, విచారణలున్న అధికారిణికి ఎలా బదిలీచేశారు, ఏవిరి ప్రోద్భలంతో జీఓ వచ్చిందనే విషయంలోనూ చాలా పెద్ద ప్రచారమే జరిగింది. ఈ అధికారిణికి విశాఖజిల్లా పంచాయతీ అధికారిగా బదిలీచేస్తూ జీఓ వచ్చిన దగ్గర నుంచి ఆమె యొక్క అవినీతి వ్యవహారాలను తొలుత ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ప్రత్యేక న్యూస్ కార్డ్ కవరేజీ ఇస్తూ వచ్చింది. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ లో పనిచేస్తున్న సమయంలో ఈమె చేసిన అవినీతికి సంబంధించిన అంశాలను కూడా అటు ఆ జిల్లా నుంచి మీడియా కూడా పేపర్ క్లిప్పింగులను, టీవీ ఛానల్స్ కధనాలను ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలతో పాటు వైరల్ అయ్యాయి. దీనితో ఈ విషయం కాస్తా ఆమె విశాఖజిల్లా పంచాయతీ అధికారిణిగా రావడానికి సహకరించిన నేతలందరూ ఈమెయొక్క అవినీతిని స్వయంగా తెలుసుకొని చేతులెత్తేశారు. అయినప్పటికీ సదరు అధికారిణి, ఎలాగూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి తనపేరుతో జీఓ ఇచ్చారని, దానిపై న్యాయనిపుణుల సలహామేరకు ముందుకి వెళతానని, ఎందుకు ఆ జీఓని అమలు చేయరో చూస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసిమరీ వెనుతిరిగినట్టు విశాఖజిల్లాలో తీవ్ర ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మంచి అధికారిణిగా పనిచేస్తూ, ఇటు ప్రజాప్రతినిధుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్న డిపీఓ క్రిష్ణకుమారి కూడా తన ఉద్యోగ విరమణకు కేవలం ఒక్క ఏడాది మాత్రమే సమయం వుందనే విషయాన్ని ఇక్కడి ప్రజా ప్రతినిధులకు చెప్పడం, అన్ని వర్గాలకు సేవలు అందిస్తూ, ఎన్నికల అధికారిగా కూడా చురుకుగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో అటు జిల్లా యాంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ అవినీతి అధికారులను జిల్లాలోకి తీసుకువస్తే ప్రజాప్రతినిధులపై మచ్చ ఏర్పడుతుందని భావించి ఆమెను వెనుతిరిగివెళ్లిపోయేలా చేయడంలో సఫలీక్రుతలయ్యారు.. అన్నిదారులూ మూసుకుపోయినా, చివారఖరి దారి కేవలం రాష్ట్ర కార్యాలయం మాత్రమే అనుకున్న ఆమె రాష్ట్ర కార్యాలయంలోని ముఖ్య కార్యదర్శిని కలవడానికి వెళ్లి అక్కడి నుంచి తన నెట్వర్క్ యాక్టివేట్ చేయాలని భావిస్తున్నారట. ఈ ఆశక్తికర ఎపిసోడ్ లో అనునిత్యం వాస్తవాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచే ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరింత తాజా సమాచారాన్నికూడా ఆధారాలతోనే తెలియజేస్తుందని ప్రకటిస్తుంది. ఇంత జరిగిన తరుణంలో అధికార, ప్రజాప్రతినిధులు ఎలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని కూడా లైవ్ అప్డేట్స్ ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందిస్తుందని కూడా మరోసారి తెలియజేస్తున్నాం..!

Tadepalle

2021-03-06 17:33:13

Tadepalle

2021-03-06 13:08:00

తాడేపల్లి

2021-03-06 12:37:50