ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమానికి తమవంతు విరాళంగా లారస్ ల్యాబ్స్ రూ.4కోట్లు విరాళం ఇచ్చింది. ఈమేరకు ఆ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి కంపెనీ ప్రతినిధులు అందజేశారు. నాడు నేడు పధకం మొదటి విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం) ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం వీటిని అందజేసినట్టు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. అంతేకాకుండా.. రెండు, మూడో విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్ ల్యాబ్స్ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు సీఎం జగన్ కి కంపెనీ ప్రతినిధిలు వివరించారు. సీఎంని కలిసిన వారిలో లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహరావు, సీనియర్ మేనేజర్ రామకృష్ణ , పాల్గొన్న కనెక్ట్ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ తదితరులు ఉన్నారు.
కలియుగంలో మోక్ష సాధనకు యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనవసరం లేదని, హరినామస్మరణ చేస్తే చాలని కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు బుధవారం తిరుమలలోని ఆస్థానమండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ శ్రీవేంకటేశ్వరుడు శ్రీ వైకుంఠం నుంచి తిరుమలపై కాలుమోపి సకల జీవరాశులను రక్షిస్తున్నారని అన్నారు. శ్రీ పురందరదాసులవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతిసారి సహస్ర దళ సంకీర్తన రత్నాలతో స్వామివారి పాదపద్మాలను సేవించినట్లు తెలిపారు. శ్రీగిరి పర్వతానికి అధిపతి అయిన శ్రీనివాసుడిని ఉదయం ఏళు నారాయణ....ఏళు లక్ష్మీ రమణ ....అనే సంకీర్తనతో స్వామివారిని మేల్కొలిపే వారన్నారు. శ్రీవారి అనుగ్రహం కొరకు ఆకాశరాజు శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారికి సమర్పించినట్లు, మనము సంకీర్తనలు, మంత్ర, స్త్రోత్ర పారయణంతో శ్రీనివాసుడి అనుగ్రహం పొందవచ్చన్నారు. కావున సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో చెడు విషయాలపై దృష్టి పెట్టకుండా భగవన్నామస్మరణ చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు హైందవ సనాతనధర్మ ప్రచారానికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని వివరించారు.
అంతకుముందు దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ''గురుపురందర దాసరే...., వండిదే పురందరదాసర....దేవ బంధ నమ్మ స్వామి బంధ....'' తదితర సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు. కోవిడ్ - 19 మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 300 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అక్కడ పురందరదాసుల సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తారు.
రాష్ట్రంలో పంచాయతీ మొదటిదశ పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ మరియు రూరల్ డవలప్మెంట్ కమీషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ మొదటి దశ ఎన్నికలకు సంబంధించి 3,249 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు గాను 525 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, 32,502 వార్డు మెంబర్లకు గాను 12,185 వార్డు స్దానాలు ఏకగ్రీవం అయ్యాయని ద్వివేది వివరించారు. ఇంకనూ మిగిలిన 2,723 సర్పంచ్ స్ధానాలకు 20,157 వార్డు మెంబర్ల స్థానాలకు 43,601 మంది అభ్యర్దులు పోటీలో ఉన్నారన్నారు. ఈనెల 9న పోలింగ్ జరుగుతుందని నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్తిచేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మంగళవారం నిర్వహించే మొదటి దశ పోలింగ్ 12 జిల్లాలో జరుగుతుందని, విజయనగరం జిల్లాలో మొదటి దశ పోలింగ్ లేదని ఆయన వివరించారు. ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి 29,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అందులో 3,458 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లకుగాను, 3,594 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి పటిష్టమైన శాంతి భద్రతలు నిర్వహణకు అవసరమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
పోలింగ్ సిబ్బంది సోమవారం సాయంత్రానికే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని ఆయన అన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధి స్టేజ్ -1 రిటర్నింగ్ ఆఫీసర్లుగా 1,130 మంది, స్టేజ్-2 రిటర్నింగ్ ఆఫీసర్లుగా 3,249 మందిని, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా 1,432 మందిని, ప్రెసైడింగ్ ఆఫీసర్లుగా 33,533 మందిని ఇతర పోలింగ్ సిబ్బందిగా 44,392 మందిని మొదటి దశ పోలింగ్ నిర్వహణలో విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి జోనల్ అధికారులుగా 519 మందిని, రూట్ అధికారులుగా 1,121 మందిని, పోలింగ్ సరళిని పర్యవేక్షించుటకు మైక్రో అబ్జర్వర్లుగా 3,047 మందిని నియమించి వీరందరికి సమర్దవంతంగా ఎన్నికలు నిర్వహించుటకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. మొదటి దశ పోలింగ్ లో 16,688 పెద్ద బ్యాలెట్ బాక్స్లు, 8,503 మీడియం బ్యాలెట్ బ్యాక్స్లు, 21,338 చిన్న బ్యాలెట్ బాక్స్లు ఈ పోలింగ్ లో వినియోగిస్తున్నామని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. పోలింగ్ సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయుటకు 215 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైన పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిద్దంగా ఉంచి సోమవారం సాయంత్రానికి
పోలింగ్ మెటీరియల్తో పాటు ఆయా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొనేలా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. 5 కి.మీల కన్నా ఎక్కువ దూరం ఉన్న పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ సిబ్బందిని, సామాగ్రిని తరలించుటకు 2,216 పెద్ద వాహనాలను, 5 కి.మీ ల కన్నా తక్కువ ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 1,412 చిన్న వాహనాలను పోలింగ్ సిబ్బందిని, సామాగ్రి తరలించుటకు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొదటి సారిగా “నోటా”ను తీసుకువచ్చామని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి, మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ గ్లౌజులు అన్ని పోలింగ్ కేంద్రాల్లోను సిద్దంగా ఉంచామని ఆయన అన్నారు. చివరి గంట పిపిఇ కిట్లతో కోవిడ్ బాధితులు ఓటు వినియోగించుకోవచ్చుః- కోవిడ్ పాజిటివ్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారికి పిపి ఇ కిట్లను ఏర్పాటు చేశామని వారు పోలింగ్ చివరి గంటలో వారి ఓటు హక్కును వినియోగించు కోవచ్చని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. పోలింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం తగు రక్షణ కల్పించామని, మహిళా పోలింగ్ సిబ్బందికి తగిన వసతులు ఏర్పాటు చేశామని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, పోలింగ్ స్టేషన్ల వద్ద పోలింగ్ సిబ్బందికి అవసరమైన అల్పాహార, భోజన వసతిని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. మొదటిదశ పోలింగ్ సందర్భంగా అదేరోజు కౌంటింగ్ నిర్వహణకు కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, కోవిడ్ రక్షణకు చర్యలు తీసుకున్నామని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు.
మొదటి దశ కౌంటింగ్ కు సంబంధించి 14,535 సూపర్ వైజర్లను, 37,750 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన శిక్షణ కూడా ఇచ్చామని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లాలో జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇందుకుగాను రాష్ట్ర స్దాయిలో 13 మంది అధికారులతో కమీషనర్, పంచాయతీరాజ్ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంట.ర్ ఏర్పాటు చేశామని, అన్ని జిల్లాలోను ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లు పనిచేస్తున్నవని ఆయన అన్నారు. రాష్ట్రంలో మంగళవారం జరగనున్న మొదటి దశ పోలింగ్ గ్రామ పంచాయతీలోని ఓటర్లు ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్య స్పూర్తితో ఈఎన్నికల్లో పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ కమీషనర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుని అనేక రకాల బాషలు నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ తెలిపారు. ఆదివారం భారత రాష్ట్రపతి మదనపల్లె సమీపంలోని సత్సంగ్ ఫౌండేషన్ లో ఆశ్రమం నిర్మాణానికి శంకుస్థాపన, భారత్ యోగా విద్యాకేంద్రను ప్రారంభించారు. ఆశ్రమం లోని శివాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చారు. అలాగే విశ్వ విద్యాలయ ఆవరణ లో మొక్కలు నాటారు, 38 పడకల స్వాస్థ్య ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సత్సంగ్ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి విద్యాలయంలో 6 నుండి 10 వ తరగతి వరకు చదివే విద్యార్థులను వారి పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, వృత్తి వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. భారత రాష్ట్రపతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మంచి విద్యాలయంలో చదువుతున్నారని, విద్యార్థులు తనలా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. అంతకు మునుపు సత్సంగ్ ఫౌండేషన్ లో ఆశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సత్సంగ్ ఫౌండేషన్ కు రావడం సంతోశంగా ఉందని, సత్సంగ్ నిర్వాహకులు తమ విద్యార్థుల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల వైపు వెళ్లారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విద్యార్థులు మదనపల్లెకి వచ్చి విద్యను అభ్యసించడం ఈ సంస్థ పై ఉన్న నమ్మకాన్ని తెలుపుతోందన్నారు. ఆ తరువాత భారత రాష్ట్రపతి భారత్ యోగా విద్యాకేంద్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతి రోజు ఉదయం యోగా చేయడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. యోగా, ధ్యానం చేయడం వల్ల ఆలోచనా శక్తి మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్, అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా, ఎస్.పి సెంథిల్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, పద్మభూషన్ అవార్డ్ గ్రహీత మరియు సత్సంగ్ ఫౌండేర్ ఎం (ముంతాజ్ అలీ) సత్సంగ్ విద్యాలయ డైరెక్టర్ స్టీఫెన్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర హెడ్ కృష్ణ, అధికారులు, విద్యాలయ టీచర్ లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదననపల్లెలోని సత్సంగ్ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ సత్సంగ్ ఆశ్రమం, శంకుస్థాపన, భారత యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్నికల కమిషన్ చైర్మన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను కొట్టివేసింది. ఈనెల 21 వరకూ ఇంటికే పరిమితం కావాలని ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ గ్రామీణాభివ్రుద్ధి శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డి వేసిన హైస్ మోషన్ పిటీషన్ పై హై కోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది. అంతేకాకుండా మంత్రిని మీడియాతో మాట్లాడొద్దని సమర్ధించి ఆ ఆదేశాలు జారీచేసింది. దీనితో మంత్రికి ఊరట లభించినట్టు అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో మంత్రి ఇంటికే కాకుండా ప్రజల్లోకి తిరిగే అవకాశం వచ్చినట్టు అయ్యింది.