ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా పూర్తిచేసింది. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తిచేయబోతుంది. ఈ ఊపులోనే కొత్త జిల్లాల ప్రక్రియ కూడా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోందట. దానికి అధికార వర్గాల నుంచి కూడా అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయాలని తొలుత యోచించినా అవి దానికి మరో మూడు జిల్లాలు ఆయా ప్రాంతాల సెంటిమెంటు ఆధారంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు ముందు ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సముదాయాలు ఇలా అన్నింటిని పరిశీలించి ఎక్కడ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే విషయమై ఒక నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధులు విజయఢంకా మోగించడంతో ఆ ఉత్సాహం, ఊపులో వున్న ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తే ఒక పనైపోతుందని భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నతరుణంలో కొత్త రాష్ట్రంలో కొత్త జిల్లాలు కూడా పూర్తయితే మిగతా రెండేళ్లు పూర్తిగా ప్రజా సంక్షేమం మీద ద్రుష్టి పెట్టాలని అధికార పార్టీ భావిస్తోంది. దానికి అనుగుణంగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ అన్ని పనులూ పూర్తిచేస్తుంది. కొత్తజిల్లాల ఏర్పాటు వివిధ కార్పోరేషన్లకు చైర్మెన్లు, మార్కెట్ కమిటీలకు చైర్మన్లకు కూడా నియమిస్తే పదేళ్లుగా పనిచేసిన కేడర్ కి ఒక గుర్తిపంపు ఇచ్చినట్టు అవుతుందని ప్రభుత్వ బావన అసలే గత ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికలూ లేవు, వివిధ కార్పోరేషన్లకు చైర్మన్ పదవులూ లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశచెంది ఎన్నికల్లో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎక్కడో కొద్దిమేర అసమ్మతి, అసంత్రుప్తిలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ అదిగమించాలంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే మరికొంత మంది నేతలకు పదవులు అందుతాయని కూడా పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. అన్నిపనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూ ప్రజా సంక్షేమాన్ని కూడా పూర్తిచేస్తాయిలో చేపడితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఎన్నికల హడావిడి మొత్తం పూర్తయితే కొత్త జిల్లా ల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వస్తుంది. కొత్త జిల్లాలు ఏర్పడితే కొత్త నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, కొత్తగా ప్రైవేటు కంపెనీలు పెరిగి నిరుద్యోగం కూడా తగ్గుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మే, జూన్ నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కొత్త జిల్లాల విషయంలో తీసుకుంటో వేచి చూడాలి మరి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలో కొన్నిశాఖ సిబ్బంది తాము ఏశాఖకి చెందిన ఉద్యోగులమో తెలియ తికమక పడుతున్నారు(రెండు మూడు శాఖలకు చెందిన విధులు నిర్వహిస్తుండటంతో). ఉద్యోగం పొందినది ఒక శాఖ నుంచి అయితే వారు చేస్తున్నది రెండు మూడు ప్రభుత్వ శాఖలకు చెందిన సేవలు అందిస్తుండటంతో వారు ఏశాఖ తమకు మాత్రుశాఖ అవుతుందో..వారికి తరువాత ఏశాఖ నుంచి పదోన్నతులు వస్తాయో తెలియని పరిస్థి నెలకొంది. దీనితో ఈ గ్రామసచివాలయ శాఖలో వివిధ శాఖల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఒకే శాఖ ఉద్యోగులుగా గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. దానికోసం వారి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలని యోచిస్తుంది. ఇప్పటికే ఈ శాఖకు సెక్రటేరియట్ లో ఒక కమిషనరేట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇపుడు సచివాలయాల్లో పనిచేస్తున్న 14శాఖల సిబ్బందిని ఆయా శాఖలకు ఎండార్స్ చేయనుంది. ఇప్పటి వరకూ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీష్, వెటర్నరీ, వీఆర్వో, కార్యదర్శిలకు మాత్రమే ఆయా ప్రభుత్వ శాఖలు మాత్రుశాఖలు గా ఉన్నాయి. వీరిలో ప్రధానంగా ఉన్న మహిళా సంరక్షణా కార్యదర్శిలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్, ఇక నగరాల్లో శానిటేషన్ అసిస్టెంట్లు తదితరులకు ఇప్పటి వరకూ ఏ శాఖకు వీరిని అటాచ్ చేస్తున్నారో ప్రభుత్వం నిర్ధేశించలేదు(అపాయింట్ మెంట్లు ఒక శాఖ నుంచి అత్యధిక విధులు మరో ప్రభుత్వ శాఖలకు చెందినవిగా ఉన్నాయి). ఉదాహరణకు తీసుకుంటే మహిళా సంరక్షణా కార్యదర్శిలు వీరికి ఉద్యోగాలు హోం డిపార్ట్ మెంట్ నుంచి ఇచ్చినా, వీరి విధులు అధికంగా ఐసీడిఎస్ మరియు ఆరోగ్యశాఖకు చెందినవి వుంటున్నాయి. గ్రామ శాంతి భద్రతలు, కేసులు, ఇతరత్రావి చాలా తక్కువగా వుంటున్నాయి. అదే విధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లను తీసుకుంటే వీరికి ఇంజనీరింగ్ విభాగం నుంచి వీరికి ఉద్యోగాలు కల్పించినా అన్ని రకాల ఇంజనీరింగ్ శాఖల పనులూ వీరు చేయాల్సి వస్తుంది( పీఆర్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, గ్రామస్థాయిలో శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, పబ్లింగ్ తదితర) పనులన్నీ వీరు చేయాల్సి, చూడాల్సి వస్తుంది. వీరికి ఒక డిపార్ట్ మెంట్ అంటూ లేదు. ఇక డిజిటల్ అసిస్టెంట్లు ఇటు కార్యాలయ పనులతోపాటు, మీసేవా సర్వీసులన్నీ సచివాలయాల్లో చేస్తున్నారు. వీరికి ఏ శాఖ కేటాయించారో ఇంకా క్లారిటీ రాలేదు. అదే విధంగా చూసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లు వీరిని అటు విద్యాశాఖకు, ఇటు వెల్పేర్ శాఖకు కాకు మధ్యలో ఉంచారు. అదేవిధంగా నగరాల్లో శానిటేషన్ అసిస్టెంట్లు, లేదా కార్యదర్శిలు వీరు కూడా అటు వైద్య ఆరోగ్యశాఖకు లేదా పురపాలక శాఖకు ఏ శాఖకు చెందిన ఉద్యోగులో కూడా తెలియడంలేదు. ఇలా గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని సిబ్బందికి తమ మాత్రుశాఖ ఏమిటో, వీరికి రేపు పొద్దున్న పదోన్నతులు ఏశాఖ నుంచి వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వం ఈ శాఖ ఉద్యోగులను పని అధికంగా ఏ డిపార్డుమెంటుకి చెందినదిగా ఉందో వారిని గుర్తించి వారికి సదరు శాఖలోనే పదోన్నతులు కల్పించాలిని, ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఈశాఖకు చెందిన ముఖ్యకార్యదర్శి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అంశాలు చర్చచి వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో ఉద్యోగులు తికమక పడకుండా వారికి అపాయింట్ మెంట్లు ఇచ్చిన ప్రభుత్వ శాఖలే వారికి మాత్రుశాఖలుగా ఉంటాయని, ఆవిధంగానే వారికి పదోన్నతులు కూడా కల్పించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అయితే కొన్ని శాఖల కార్యదర్శిలు దానికి విముఖత చూపినట్టుగా తెలుస్తుంది. రెండు మూడు శాఖలకు చెందిన విధులు నిర్వహిస్తున్నప్పుడు వారికి ఏ శాఖకు కేటాయిస్తున్నట్టో నిర్ధిష్టంగా తెలిసినపుడు మాత్రమే వారికి పదోన్నతులు, సర్వీసు రూల్సు వర్తింపచేయడానికి వీలుపడుతుందని లేదంటే రానున్న రోజల్లో ఇబ్బందులు తలత్తే సమ్యలు ఉత్పన్నం అవుతాయనే అనుమానాలను వ్యక్తం చేశారట. ఆ కారణంగా ముందు గ్రామసచివాలయ శాఖ ఉద్యోగులందరికీ సర్వీస్ రికార్డులు ప్రారంభించిన తరువాత వారికి అందిచాల్సిన సదుపాయాలను, సెలవులను, ఇతరత్రా అంశాలను పొందు పరచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. మార్చి 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులందరికీ సర్వీస్ రిజిస్టర్లు ఓపెన్ అయిన తరువాత ఈ అనుమానాలకు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఆయా శాఖల ఉద్యోగులు చేస్తున్న సర్వీసుకి, అందుకున్న అపాయింట్ మెంట్లకి పొంతన లేకుండా ఉంటుంది. అలాంటి అనుమానాలన్నీ నివ్రుత్తి చేయడం కోసమే వీరికి సర్వీర్ రూల్సు వర్తింపజేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు మూడు శాఖల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచిచూడాలి..!
ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సోషల్ మీడియా తన ఉనికిని కొద్దికొద్దిగా కోల్పోవలసి వుస్తుంది. ఈ కోవకె చెందినది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై నమ్మకం తగ్గించే దిశగా కొందరు దుండగలు అదేపనిగా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. వారి పేర్లతోనూ ఫోటోలతోనే నకిలీ అకౌంట్లను క్రియేట్ చేసి అక్రమ సంపాదనకు తెరతీస్తున్నారు. మొదట్లో కొందరు ఈ హ్యాకర్ల మాటలు నమ్మి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినా..అదే పనిగా చాలా మంది అకౌంట్లు ప్రతినిత్యం హ్యాకర్లు హ్యాక్ చేస్తుండటంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. అయినా ఫేస్ బుక్ ఈ హ్యాకింగ్ ని నియంత్రించలేకపోతుంది. ఈ హ్యాకర్లు ముఖ్యంగా జర్నలిస్టులు, మహిళలు, సంఘంలో కాస్త పలుకుబడి వున్నవారి అకౌంట్లనే హ్యాక్ చేయడం విశేషం. ఈ హ్యాకింగ్ కి ఎక్కడో ఒక చోట పులుస్టాప్ పడుతుందని భావిస్తున్నప్పటికీ హ్యాకర్లు వారి పని వారు చేసుకుంటూనే పోతున్నారు. తద్వారా చాలా మందికి చెందిన సమాచారం, ఫోటోలను డౌన్ లోడ్ చేసి మార్ఫింగ్ చేసి కొందరు బెదిరింపులకు కూడా దిగుతున్నారు. దీనితో చాలా మంది మహిళలే కాకుండా, పురుషులు కూడా తమ ప్రొఫైల్ ను లాక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ హ్యాకింగ్ మాత్రం ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కి ఆదరణ ఉన్నప్పటికీ, ఇందులో వున్నవారి ఖాతాలకు రక్షణ లేకుండా పోతుంది. ఈ విషయంలో ఫేస్ బుక్ నిర్వాహకులు కూడా ఎన్నో రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ హ్యాకర్లు వారికంటే తెలివిగా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారంటే టెక్నాలజీ ఏ స్థాయిలో అభివ్రుద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. సాఫ్ట్ వేర్ రంగంలో హ్యాకింగ్ కి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. చాలా మంది తెలివైనవారు ఈ హ్యాకింగ్ ను దేశ అభివ్రుద్ధికి కాకుండా దేశవినాశనానికి వినియగించడం ఇపుడు అందరినీ ఆందోలనకు గురి చేస్తుంది. ఒక మంచి విషయం పంచుకుందామని సోషల్ మీడియా వేదికలో ఖాతా తెరిస్తే అదే వివరాలు, ఫోటోలతో మరో నకిలీ ఖాతా వెంటనే క్రియేట్ అవుతుంది. స్నేహాలు, బంధాలు, పరిచియాలను అడ్డం పెట్టుకొని హ్యాకర్లు అక్రమ, అడ్డదారి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియా దిగ్గజం తన ఫేస్ బుక్ లోని ఖాతాదారులను కాపాడుకోకపోతే చాలా ముఖ్య మైన సమాచారం హ్యాకింగ్ కి గురవడంతోపాటు, ఫేస్ బుక్ నుంచి హ్యాకింగ్ గురైన వారు ఒక్కొక్కరుగా ఫేస్ బుక్ ని వీడే ప్రమాదాలు లేకపోలేదు. ఈ విషయంలో ఫేస్ బుక్ నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయ ఉద్యోగుల విధినిర్వహణపై నిఘాపెట్టింది. ఎవరు ఏవిధంగా విధినిర్వహణ చేస్తున్నారనే విషయమై తెలుసుకునేందుకు ఈ శాఖకు చెందిన జాయింట్ కలెక్టర్లు ఆకస్మికంగా సచివాలయాలను తనిఖీలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయి సుమారు 16నెలలు కావస్తున్నా నేటికీ చాలా మంది సచివాలయ సిబ్బందికి వారి డ్యూటీ చార్టును ఏవిధంగా అమలు చేయాలో కూడా తెలియడం లేదు...కాదు కాదు తెలిసినా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు. దీనితో గ్రామాల్లో ప్రజల సమస్యలు ఎక్కడవి అక్కడే వుంటున్నాయి. అంతేకాకుండా సచివాయలయంలో ఇప్పటి వరకూ ఎన్ని శాఖల సిబ్బంది ఉన్నారు, వారు ఏ సమస్యలు పరిష్కారం చేస్తారు, ప్రజలు ఎవరిని ఏ సమస్య కోసం కలవాలి అనే విషయమై కనీసం గ్రామవాలంటీర్ల ద్వారా కూడా అవగాహన చేపట్టే కార్యక్రం చేపట్టడం లేదు. సిబ్బంది ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నా ప్రభుత్వం జీతాలు మాత్రం క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తుంది. ఇదే సమయంలో గ్రామసచివాలయ వ్యవస్థపైనా, కొన్ని ప్రాంతాల్లోని గ్రామవాలంటీర్ల సేవలపైనా నిఘా వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాయని సమాచారం ఆ నివేధికలో చాలా పంచాయతీల్లో కార్యదర్శిలు వాలంటీర్లను, ఇతర శాఖ సిబ్బందిని కార్యాలయానికే పరిమితం చేసి ఉంచడంతో గ్రామంలో ప్రధాన సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయినట్టు నివేదించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పారిశుధ్యం, మంచినీటి ట్యాంకుల పరిశుభ్రత, వీధి దీపాలు, సంక్షేమ పథకాలు రాని వారి దరఖాస్తులను మండల కేంద్రాలకు పంపకపోవడం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, గ్రామంలో గొడవలపై చర్యలు తీసుకోకపోవడం, భూ ఆక్రమణలపై ద్రుష్టిపెట్టకపోవడం తదితర వ్యవహారాలన్నింటిపైనా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులపై నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది. దీనితో గ్రామసచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేయడానికి, ఉద్యోగుల డ్యూటీ చార్టు అమలు చేయడానికి గ్రామసచివాలయశాఖ జాయింట్ కలెక్టర్లుతో చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమారం. అదే సమయంలో బాగా పనిచేసే గ్రామసచివాలయ సిబ్బందిని ఉత్తేజపరుస్తూ వారి సేవలను ప్రజలకు మరింతగా అందించే కార్యక్రమం కూడా చేపట్టనున్నారని తెలుస్తుంది. గ్రామసచివాలయశాఖ జెసిలు రంగంలోకి దిగితే తప్పా ఆడుతూ, పాడుతూ పనిచేస్తూ కార్యాలయాలకే పరిమితమయ్యే సచివాలయ సిబ్బంది వ్యవహరం ఒక కొలిక్కిరాదు. అదేసమయంలో కొన్ని పనులకు సంబంధించి చేయితడుపుడు వ్యవహారాలు, చేసిన గోరంత ఖర్చుకి కొండంత నకిలీ బిల్లులు సమర్పించే కార్యదర్శిలపై వేటు తదితర చర్యలను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండంలోని ఒక ఈఓపీఆర్డీ, మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలపై వేటు వేసే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. వారిని సస్పెండ్ చేస్తారో, విధుల నుంచి తప్పిస్తారోననే ఉత్కంఠ ఇప్పటికే నెలకొనగా, పనిచేయని సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం, నిఘావర్గాలు ద్రుష్టిపెట్టారనే సమాచారం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలో ఎన్నికలలో ప్రశాంతంగా ఓటింగు వేసే పరిస్ధితిని కల్పించామని రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సవాంగ్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనకు శనివారం విచ్చేసిన డిజిపి స్ధానిక సంస్ధల ఎన్నికలపై పోలీసు అధికారులతో సమీక్షించి తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కీలకమన్నారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క అర్హమైన వ్యక్తికి ఓటు వేసుకునే సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటును వేసుకునే పరిస్ధితి ప్రస్తుతం తీసుకువచ్చామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటును వేసుకునేందుకు పోలీసు వ్యవస్ధ సహాయకారిగా ఉంటుందని చెప్పారు. గత మూడు విడతలలో ప్రశాంతంగా పోలింగు జరిగిందని ఆయన అన్నారు. ఇదే పరిస్ధితిని కొనసాగించాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రతి రోజు డిఐజి, ఎస్.పిలతో జిల్లాల్లో పరిస్ధితులను గురించి, ఏర్పాట్లు, సంసిద్ధత గురించి మాట్లాడటం జరుగుతుందని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్.పి నేతృత్వంలో టీమ్ స్పిరిట్ తో పనిచేస్తున్నారని ప్రశంసించారు. జిల్లా యంత్రాగం, పోలీసు వ్యవస్ధ మంచి సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని కొనియాడారు. ఎక్కడా సమస్యలు లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఒక వేళ సమస్య తలెత్తనా వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతున్నారని, ఇది శుభసూచకమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మంచి పాజిటివ్ వ్యక్తిత్వంతో మంచి సామర్ధ్యంతో ముందుచూపుతో పనిచేస్తున్నారని అభినందించారు. విజయవాడ మునిసిపల్ కమీషనర్ గాను మంచి సేవలు అందించారని చెప్పారు. పోలీసు వ్యవస్ధపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందని డిజిపి అన్నారు. మానవతా ధృక్పదంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలకు చేయూతను పోలీసు వ్యవస్ధ అందిస్తుందని చెప్పారు. మనం చేసిన పనుల వలన ప్రజల అభిప్రాయం ఉంటుందని అన్నారు. ప్రజల కోసం పోలీసు పనిచేయాలని, పోలీసు అనేది సేవా ధృక్పధం గల వ్యవస్ధ అని తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా మంచి సేవలు అందించాలని సూచించారు. సర్వ్ ద సొసైటి బెటర్ అన్నారు. పోలీసు అధికారులు మంచి పర్యవేక్షణ చేసి క్రింది స్దాయి అధికారులు, సిబ్బందిలో స్ఫూర్తిని నింపాలని సూచించారు. ఇప్పటి వరకు బాగా చేసామని, భవిష్యత్తులో బ్రహ్మాండంగా చేయాలని అన్నారు.
కోవిడ్ సమయంలో సేవలు ఎనలేనివి : కోవిడ్ సమయంలో పోలీసులు అందించిన సేవలు ఎనలేనివని డిజిపి అన్నారు. కోవిడ్ అనే భయంకరమైన మహమ్మారి ఏమి చేస్తుందో, ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్ధితుల్లో పోలీసు యంత్రాంగం మొత్తం రోడ్డుపైకి వచ్చి ప్రజలను కాపాడటం బాధ్యతగా తీసుకుందని అన్నారు. ప్రజల కోసం పోలీసు వ్యవస్ధ నిలబడిందంని చెప్పారు. కోవిడ్ లో 109 మంది పోలీసు అమరులు అయ్యారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం పోలీసులు ప్రశంసనీయమైన మంచి సేవలు అందించారని కొనియాడారు. జిల్లా యంత్రాగం సైతం అండగా నిలబడిందని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్.పి అమిత్ బర్దార్ చక్కగా పనిచేసారని అన్నారు. డిప్యూటి ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిఐజి) ఎల్.కె.వి.రంగారావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల మూడు దశలలో కేవలం 22 కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. గతంలో 87 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లా యంత్రాగం, పోలీసు మద్య జిల్లాలో మంచి సమన్వయం ఉందన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి చక్కని పనితీరు ప్రదర్శించారని చెప్పారు. డిజిపిగా చక్కని ప్రేరణ కలిగిస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది మంచి పనిచేయుటకు ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. అనాధ శవాన్ని మోసిన పలాస ఎస్.ఐ శిరీషకు మరుచటి రోజున పిలిచి అభినందించడం ప్రోత్సాహానికి మచ్చుతునక అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికలను చక్కగా నిర్వహించామని, నాలుగవ విడత ఎన్నికలను సైతం చక్కగా నిర్వహిస్తామని అన్నారు.
పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాలను అంచనా వేస్తూ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో అక్రమ మద్యం రవాణా, నాటు సారాను అరికట్టడం వంటి విషయాలలోను ప్రత్యేక దృష్టిసారించామని అన్నారు. ఈ సందర్భంగా మూడు విడతలలో చక్కటి సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను డిజిపి పంపిణీ చేసారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఎస్.ఇ.బి ఎ.ఎస్.పి కె.శ్రీనివాస రావు, డిపిటిసి డి.ఎస్.పి జి.శ్రీనివాస రావు, ఇచ్చాపురం సిఐ ఎం.వినోద్ బాబు, పాతపట్నం సి.ఐ రవిప్రసాద్, ట్రాఫిక్ ఎస్.ఐ ఎం.లక్ష్మణ్, విమెన్ పోలీసు ఎం.సరోజిని, ఎ.ఎస్.ఐ కె.కాంతయ్య, కానిస్టేబుల్ పి.రమణ, ఎం.నరసింహ మూర్తి, ఎస్.ఇ.బి ఎస్.ఐ కె.కృష్ణారావు, కానిస్టేబుల్ అబ్దుల్ ఖలీమ్., గ్రామ సచివాలయ సిబ్బంది టి.దుర్గా భవాని (ఉణుకూరు), గాయత్రి (కొత్తూరు), సూర్యకుమారి (ఇచ్చాపురం), డి.మధుబాల (పాతపట్నం) ఉన్నారు. సీతంపేట ప్రాంతంలో మద్యం నివారణలో పనిచేస్తున్న ప్రేరణ బృందంతో డిజిపి మాట్లాడుతూ అబినందించారు. అంతకముందు ఎచ్చెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోగల పోలింగు కేంద్రాన్ని డిజిపి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పిలు పి.సోమశేఖర్, కె.శ్రీనివాస రావు, డి.ఎస్.పిలు శ్రావణి, ఎన్.ఎస్.ఎస్.శేఖర్, జి.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గౌతమ్ సవాంగ్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనకు శని వారం విచ్చేసిన డిజిపి స్ధానిక సంస్ధల ఎన్నికలపై పోలీసు అధికారులతో సమీక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కీలకమన్నారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క అర్హమైన వ్యక్తికి ఓటు వేసుకునే సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటును వేసుకునే పరిస్ధితి ప్రస్తుతం తీసుకువచ్చామని అన్నారు. గత మూడు విడతలలో ప్రశాంతంగా పోలింగు జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడు విడతలలోనూ 80 శాతంకు పైగా పోలింగు నమోదు అయ్యిందని అన్నారు. జిల్లా యంత్రాగం, పోలీసు వ్యవస్ధ మంచి సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని కొనియాడారు. పోలీసులు మానవతా ధృక్పదంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలకు చేయూతను పోలీసు వ్యవస్ధ అందిస్తుందని చెప్పారు. కోవిడ్ సమయంలో పోలీసులు అందించిన సేవలు ఎనలేనివని డిజిపి అన్నారు. కోవిడ్ అనే భయంకరమైన మహమ్మారి ఏమి చేస్తుందో, ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్ధితుల్లో పోలీసు యంత్రాంగం మొత్తం రోడ్డుపైకి వచ్చి ప్రజలను కాపాడటం బాధ్యతగా తీసుకుందని అన్నారు. ప్రజల కోసం పోలీసు వ్యవస్ధ నిలబడిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం పోలీసులు ప్రశంసనీయమైన మంచి సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిఐజి) ఎల్.కె.వి.రంగారావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, ఎఎస్పిలు పి.సోమశేఖర్, కె.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయిందని కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తే నష్టాన్ని పూడ్చుకునే వెసులుబాటు వస్తుందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కోరారు. శనివారంప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో జరిగిన నీతి ఆయోగ్ 6వ పాలక మండలి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, పారిశ్రామికంగా వేగంగా ఎదగడం వంటివి ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’తోనే సాధ్యమవుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉత్పత్తి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో సేవల డెలివరీ, ఆరోగ్యం, పౌష్టికాహారం అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఏపీలో కనీసం టయర్-1 నగరం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు-నేడు క్రింద కొత్తగా ఆసుపత్రులను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ‘భారత్ నెట్ ప్రాజెక్ట్ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కోసం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియామకం చేసినట్లు వివరించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా సీఎం వైఎస్ జగన్ చర్చించారు.