నేల నలు చెరగుల్లో(News-North, East, West, South) ఏం జరుగుతోందో తెలుసుకొని ఏరి,కోరి, కూర్చి, ఒక అంశాన్ని విషయంగా పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో రాయడాన్నే వార్త అంటారు. అసలు మనకి వచ్చినట్టు ఏదో ఒక విషయాన్ని ఏదోలా రాసేస్తే అదివార్త..అదేనండి మీ పరిభాషలో న్యూస్ అయిపోతుందా..అంటే కాదనే చెప్పాలి. ఒక వార్తను మనం రాసేటపుడు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా అనే అంశాలను ప్రామాణికంగా తీసుకొని రాసినపుడు మాత్రమే అది నిర్ధిష్టమైన న్యూస్ ఫార్మాట్ న్యూస్(వార్త) అవుతుంది. ప్రధాన మీడియా సంస్థలు, పేరున్న న్యూస్ ఏజెన్సీలు అన్నీ న్యూస్ ఫార్మాట్ లో మాత్రమే వార్తలను ప్రజలకు అందిస్తాయి. అలా న్యూస్ ఫార్మాట్ లో ఒక వార్త రాయడానికి పైన పేర్కొన్న ఐదు అంశాలపై అవగాహన మాత్రమే కాదు వాటిని ఎలా ఉపయోగించాలనే విషయంపై పట్టు కూడా
రావాలి. అలా పట్టు రావాలంటే ప్రతినిత్యం కాస్త గట్టిగానే శ్రమించాల్సి వుంటుంది. చాలా మంది అనుకోవచ్చు. డిగ్రీలో జర్నలిజం చేసినా, పీజీలో జర్నలిజం చేసినా జర్నలిస్టు అయిపోవచ్చు గదండీ అంటారు చాలా మంది నాలాంటి తెలివైనోళ్లు..? అదెలా వుంటుందంటే వైట్ అండ్ వైట్ డ్రస్సు వేసిన ప్రతీవాడు రాజకీయ నాయకుడు ఎలా కాలేడో.. డిగ్రీ, పీజీల్లో జర్నలిజం చేసినంత మాత్రన జర్నలిస్టు అనుకోవడానికి లేదు. మనం ఎంత చదువు చదువుకున్నా ఎపుడైతే ఒక విషయాన్ని పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో చక్కగా న్యూస్ ఫార్మాట్ లో రాయగలిగామో అపుడే మనం నిజమైన జర్నలిస్టు అయినట్టు లెక్క. డిగ్రీ తరువాత మనం పీజి ఒక సబ్జెక్టులో మాస్టర్స్ ఎలా చేస్తామో..అలాగే జర్నలిస్టుగా అయిన తరువాత కూడా చాలా మంది తమ ప్రావీణ్యాన్ని వివిధ విభాగాల్లో పెంచుకోవడానికి, పనిచేయడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం కాలంలో ఒక్కో దిన పత్రిక ఒక్కో న్యూస్ ఫార్మాట్ ను వినియోగిస్తుంది. ఒక పత్రిక విషయాన్ని మాత్రమే పాఠకుడికి తెలియజేస్తుంది. మరో పత్రిక విషయంతో పాటు ఒక రెండు అంశాలను కూడా తెలియజేయాలని అనుకుంటుంది. మరో పత్రిక ఆ రెండు విషయాలతోపాటు జరగబోయే క్రమాన్ని కూడా పాఠకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. వివిధ అంశాలపై మనకున్న పట్టును బట్టీ మీడియా సంస్థలు ఆయా విభాగాలు, ప్రభుత్వ శాఖలు మనకి జర్నలిస్టుగా పనిచేయడానికి అవకాశాలు కేటాయిస్తాయి అదీ మీరు పూర్తిస్థాయి జర్నలిస్టుగా అయిన తరువాత.. అదేంటండీ న్యూస్ అని మొదలు పెట్టి అపుడే శిక్షణ మొత్తం అయిపోయి జర్నలిస్టుగా బాధ్యతలు చేపట్టినట్టుగా ముగించేస్తున్నారే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. జర్నలిస్టు అనే వ్యక్తి ఎపుడైతే నిత్య విద్యార్ధిగా ఉన్నానని భావిస్తాడో అపుడే మంచి అంశాలను శోధించి వాటిని పాఠకుడికి వార్తలు, వార్తా కధనాలుగా, ప్రత్యేక కధనాలుగా అందించగలుగుతాడు. అలా జర్నలిస్టుగా మారాలంటే దానికి ముందు చాలా శ్రమపడి అన్ని విషయాలను నేర్చుకుంటే తప్పా జర్నలిస్టుగా మారడం కష్టం. మాకు ఇవన్నీ వద్దుకానీ మేము డైరెక్టుగా ఏదైనా పత్రికలోనో, టీవీలోనో, న్యూస్ ఏజెన్సీలోనో చేరిపోతే జర్నలిస్టు అనరా? అంటే అంటారని చెబుతాను. కానీ పూర్తిగా శిక్షణ తీసుకుని రాసే జర్నలిస్టుకి, ఏమీ రాకుండా పెన్నూ పేపరు పట్టుకొని ఫీల్డులోకి వెళ్లి, ఆ తరువాత సేకరించిన సమాచారాన్ని ఆఫీసుకో కూర్చొని ఒక సింగిల్ కాలమ్ వార్త రాయడానికి పడే కష్టం, పట్టే చెమటలు, చిరిగే పేపర్లు, అంతా రాసిన తరువాత స్వీకరించే పేపరు ఆఫీసువాళ్లు తిట్టే తిట్ల దండకం ఏ స్థాయిలో వుంటుందో ఏమీ తెలియకుండా నేనూ జర్నలిస్టుననే తెగఫీలైపోయిన వారిని అడిగితే చెబుతారు...కాదు కాదు ఎపుడైనా అలాంటి వారు పత్రికా కార్యాలయంలో వార్తలు రాస్తున్న సమయంలో వెళ్లిచేస్తే తెలుస్తుంది. కానీ ఎవరికీ వెళ్లి చూసే అవకాశం వుండదు. కానీ ఇది వాస్తవం. తాము సీనియర్ జర్నలిస్టులమని చెప్పుకునే వారు సైతం నేటికీ న్యూస్ ఫార్మాట్ లో వార్తలు రాయలేరంటే అతిశయోక్తి కాదు..ఇలాంటి ఇబ్బందులు, అవమానాలు పడకుండా ఉండాలనుకునే వారు మాత్రమే జర్నలిజంలో శిక్షణ తీసుకున్న తరువాత మాత్రమే జర్నలిస్టుగా మారతూ ఉంటారు. ఒకప్పుడు చాలా మంది జర్నలిజం స్కూళ్లు, కాలేజీల్లో వేలకు వేలు ఖర్చు చేసి జర్నలిజంలో శిక్షణ తీసుకునేవారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా మంచి జర్నలిస్టుగా మారదామనుకునే వారిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ జర్నలిజంలో ప్రాధమిక శిక్షణ మొబైల్ యాప్ ద్వారా ప్రత్యేక కధనాల ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో భాగంగానే గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. అంతేకాదు విశాఖలో ఎవరైనా ఔత్సాహికులు జర్నలిజం పట్ల ఆశక్తి వుంటే నేరుగా ఫీల్డులోనే వారికి లైవ్ లో శిక్షణ కూడా ఇవ్వాలని సంకల్పించాం. ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా మంచి జర్నలిస్టులను సమాజానికి అందించాలనే లక్ష్యంతో పైసా ఖర్చులేకుండా జర్నలిజంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. కాకపోతే మీరు ఈ జర్నలిజం పాఠాలను నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా గుగూల్ ప్లే స్టోర్ నుంచి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి వుంటుంది. రేపటి పాఠంలో మళ్లీ కలుద్దాం..
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రతిష్ట దిగజార్చేందుకు సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన కుట్ర పై సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యక్తి గతంగా తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు భక్తుల్లో ఆందోళన చెలరేగేలా జరిగిన ఈ చర్యపై పోలీసు కేసు నమోదు చేయాలని ఆయన టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి లో ఇటీవల జరిగిన ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాల మీద జరిగిన దాడుల గురించి విలేకరులు శ్రీ సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ప్రజలందరినీ భగవంతుడు ( శ్రీ వేంకటేశ్వర స్వామి) జీసస్, అల్లా కాపాడుతున్నారనీ, వారి మీదే దాడులు చేసే వారు ఎవరైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని సుబ్బారెడ్డి చెప్పారు.ఇది ముఖ్యమంత్రి మీద కొన్ని పార్టీలు చేస్తున్న కుట్ర అని చెప్పారు. కొంత మంది వ్యక్తులు ఈ వీడియోను కట్ చేసి ఆయన మాటల్లోని ఉద్దేశం మార్చేలా వీడియో అతికించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే శ్రీ సుబ్బారెడ్డి స్పందించి టీటీడీ అధికారులతో మాట్లాడారు. ఈ దుష్ప్రచారం, కుట్రపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మీరు జర్నలిస్టు కావాలనుకుంటున్నారా...అలా అయితే మీకు ఏం తెలియాలి..ఏం రావాలి..? అనే ప్రశ్న చాలా మంది ఉత్సాహవంతమైన పట్టభద్రుల్లో కలుగుతుంది.. జర్నలిస్టుగా మారాలంటే మీరు ఏం నేర్చుకోవాలి.? ఖచ్చితంగా ఒక పూర్తిస్థాయి జర్నలిస్టుగా మారాలంటే ఎంత సమయం పడుతుంది.? మీరు సాధారణ జర్నలిస్టుగా కావాలనుకుంటున్నారా..? క్రైమ్ జర్నలిస్టు కావాలనుకుంటున్నారా..? ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టు కావాలనుకుంటున్నారా..? ఫ్రీలాన్స్ జర్నలిస్టు కావాలనుకుంటున్నా, ఆన్ లైన్ కంటెంట్ జర్నలిస్టు కావాలనుకుంటున్నా..? న్యూస్ ఏజెన్సీ జర్నలిస్టు కావాలనుకుంటున్నారా..? ప్రెస్ కార్డు మెడలో వేసుకొని ఏదో మొక్కబడి జర్నలిస్టు కావాలనుకుంటున్నారా...? అసలు మీకు ఏమీ రాకపోయినా ఏదో పత్రికలోనో, టివీలోనో, వెబ్ సైటులోనో, న్యూస్ ఏజెన్సీలోనో, మొబైల్ యాప్ లోనో చేరిపోయి నేనూ జర్నలిస్టునని చెప్పుకుంటే జర్నలిస్టు అయిపోతారా..? అసలు ఏం నేర్చుకొని, ఏం రాసి, ఎలా రాస్తే మీరు జర్నలిస్టు అవుతారు?.. ఏమీ రాకపోయినా వచ్చీరాని తెలుగు పదాలతో నేనూ జర్నలిస్టుగా మారిపోతానని ఒక పెన్నూ, పుస్తకం పట్టుకొని, బైక్ పై ప్రెస్ అనే స్టిక్కర్ వేసుకుంటే మీరు జర్నలిస్టు అయిపోయాతారా? అసలు జర్నలిజం అంటే ఏంటి? జర్నలిజంలో ఏముంటుంది. పెద్ద పత్రికలు, న్యూస్ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలో పనిచేవారు కొంతమంది మాత్రమమే ప్రముఖ జర్నలిస్టులుగా సంఘంలో ఎలా ప్రాచుర్యం పొందుతున్నారు..? అందరు జర్నలిస్టులకంటే భిన్నంగా వారు చేసేదేమిటి?.. నిర్ధిష్టమైన వార్త ఒక వార్త ఎలా రాయాలి..? ఏం నేర్చుకుంటే అలాంటి వార్త మనం ఒక జర్నలిస్టుగా రాయగలం? దీనికి ప్రత్యేక మైన శిక్షణ తీసుకోవాలా? ఒక సారి తీసుకున్న శిక్షణ సరిపోతుందా? మనకి ఎన్ని సంవత్సరాల్లో ఒక మంచి జర్నలిస్టుగా గుర్తింపు వస్తుంది..? ఇవన్నీ జర్నలిస్టుగా మారాలి అనుకున్నవారు అవగాహన పెంచుకోవాలని చూస్తారు..కానీ ఒక ప్రత్యేక విధానం, మరో ప్రత్యేక శిక్షణ, ప్రధాన పత్రికలు, మీడియా సంస్థలు నిర్వహించే జర్నలిజం కళాశాలలు తప్పితే మరెవరూ శిక్షణ ఇచ్చే పరిస్థితి లేదు..ఇదంతా ఒకప్పటి మాట. ఇపుడు మీరే ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఒక మంచి జర్నలిస్టుగా మారవచ్చు...ఏంటి నమ్మసఖ్యంగా లేదా.. దానికి మేము గేరంటీ.. దానికోసం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఒక వేదికను కల్పిస్తోంది.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి జర్నలిస్టులుగా మారాలనుకునే వారందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. దానికోసం ఉత్సాహవంతులైన పట్టభద్రులు చేయాల్సిందల్లా ఒక్కటే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రతీరోజూ ఒక ప్రత్యేక కధనం జర్నలిస్టుగా మారాలంటా ఏం చేయాలనే అంశంపై మీరు తెలుసుకోవాల్సి వుంటుంది...వాటితో యాప్ లో వచ్చే వార్తలు ఏ విధమైన న్యూస్ ఫార్మాట్ లో వస్తున్నాయో గమనిస్తూ..శిక్షణ పొందుతూ, మీరే జర్నలిస్టుగా మారి మీ యొక్క నైపుణ్యాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా పెంచుకోవచ్చు.. తద్వారా మీరు మంచి జర్నలిస్టుగా తయారు కావడంతోపాటు, మీరు జర్నలిస్టుగా మారితే ఎలావుంటుందో బాహ్య ప్రపంచానికి తెలియజేయవచ్చు. జర్నలిజంలోని వివిధ అంశాలను, ప్రస్తావిస్తూ సాగే శిక్షణా కధనాలను ప్రతీరోజూ తెలుసుకోవడం తోపాటు అదే రోజు మీరు కూడా వార్తలు రాయడం మొదలు పెట్టి అనతి కాలంలో మంచి జర్నలిస్టుగా మారవచ్చు.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా మీరు పొందిన జర్నలిజం శిక్షణ నిజమైన న్యూస్ ఫార్మాట్ విధానంలో వుంటుంది కనుక. ఇక్కడ నేర్చుకున్న శిక్షణతో మీరు ఎక్కడైనా ఏ మీడియా సంస్థలో అయినా పనిచేయడానికి ఎంతో దోహద పడుతుంది... ఇది తొలిరోజు ప్రోమో లెసన్ మాత్రమే..ఇంకెందుకు ఆలస్యం మీకు ఆండ్రాయిడ్ ఫోను ఉంటే మీరు ఆరునెలల్లో పెర్ ఫెక్ట్ జర్నలిస్టుగా మారిపోవచ్చు.. వెంటనే మీ మొబైల్ లో ఈఎన్ఎస్ లైవ్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి. జర్నలిస్టుగా మారి మీ ఆదాయాన్ని వార్తలు రాయడం ద్వారా సంపాదించుకోండి..బెస్టాఫ్ లక్..!
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు నగరా మోగింది. ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు, అర్హతలు, రాజకీయపార్టీలకు అనుకూలంగా ఉన్నచోట ఆశావహులు పంచాయతీ పోరుకు సన్నద్ధమవుతున్నారు. సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. వీటిని అనుసరించి మాత్రమే అభ్యుర్ధులు పంచాయతీ ఎన్నికల్లో నిలబడాలి..అవేంటో ఒక్కసారి తెలుసుకుంటే సాధారణ ప్రజలకు కూడా ఈ ఎన్నికలపై ఒక అవగాహన వస్తుంది.. వివరాలివే..
➡️పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో తప్పని సరిగా ఓటరుగా నమోదై ఉండాలి.
➡️పరిశీలన నాటికి అభ్యర్థి వయస్సు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి.
➡️ఒక వ్యక్తి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదు.
➡️ఒక వేళ ఆ వ్యక్తికి 31-5-1995 కంటే ముందే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే ఆమె, అతడు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత కలిగి ఉంటారు.
➡️01.06.1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే ఆ వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు.
➡️ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వులు డబ్ల్యూపీ నంబర్ 17947/2005లో తేది 19-7-2006 తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలను స్వంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణిస్తారు. వారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగా పరిగణించరు. ఒక వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో ఒకరిని దత్తత ఇచ్చినా అనర్హుడిగానే పరిగణిస్తారు.
➡️ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తరువాత రెండో భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతనికి ముగ్గురు సంతానంగా పరిగణిస్తారు. అతని రెండో భార్య ఒక్క సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీ చేయడానికి అర్హురాలు.
➡️ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తికి నామినేషన్ పరిశీలనకు ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకుని అతని అర్హతలను నిర్ణయిస్తారు.
➡️ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత భార్య గర్భవతి అయినా పోటీకి అనర్హులు.
➡️కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు.
➡️ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం నామినేషన్ పరిశీలన తేది నాటికి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తరువాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్ పరిశీలన చేస్తారు.
➡️రేషన్ దుకాణం డీలర్ ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హులు. ఉమ్మడి హైకోర్టు డబ్ల్యూపీ నంబర్ 14189/2006లో సోమ్నాథ్ వి విక్రం, కె అరుణ్కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని రేషన్ షాప్ డీలర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని తీర్పు చెప్పింది.
➡️అంగన్వాడీ వర్కర్లు ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హులు కారు.
➡️నీటి వినియోగదారుల సంఘం సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు.
➡️సహకార సంఘాల సభ్యులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. సహకార సంఘాల చట్టం 1954 కింద సహకార సంస్థలు రిజిష్టర్ అవుతాయి.వారు ప్రత్యేక శాసనసభ ద్వారా చేసిన చట్టం ద్వారా నియమించలేదు కాబట్టి వారికి అవకాశం ఉంది.
➡️స్వచ్ఛంద, మత సంబంధ సంస్థల చైర్మన్లు, సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. 1987 హిందూ మత సంస్థల చట్టం, దేవాదాయ శాఖ సెక్షన్ ప్రకారం సంస్థలు ఏర్పాటయ్యాయి.
➡️ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థయందు పని చేయువారు కూడా అనర్హులు.
➡️ అభ్యర్థికి ప్రతిపాదకుడుగా ఉన్న వ్యక్తి అదే వార్డు, ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు. అభ్యర్థి తప్పడు సమాచారం ఇచ్చినప్పటికి నామినేషన్ తిరస్కరించరు.
➡️అభ్యర్థి పై ఇతరులు ఫిర్యాదు చేస్తే దానికి రిటర్నింగ్ అధికారి అభ్యర్థి ఇచ్చిన నామినేషన్ పత్రాలలో ఇచ్చిన సమాచారం తప్పు అని భావించినట్లయితే ఐపీసీ సెక్షన్ 177, క్రిమినల్ పోసీసర్ కోడ్ 195 ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి. కానీ నామినేషన్ తిరస్కరించవద్దు.
➡️మతిస్థిమితం లేని వ్యక్తి పోటీకి అనర్హుడు.
➡️నామినేషన్ వేస్తున్న వ్యక్తి ఎలాంటి దృవీకరణ పత్రాలు అదే రోజు ఇవ్వకపోయినా నామినేషన్ తీసుకుంటారు.
➡️చెక్లిస్టులో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేయాలి. ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లు నామినేషన్ల చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినా స్వీకరించరు. నామినేషన్ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయిస్తారు.
➡️పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడు నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టకుంటే అఫిడవిట్ సమర్పించాలి. కానీ దానికి రిటర్నింగ్ అధికారి తనంతటతాను సంతృప్తి పొందాలి.
➡️ప్రతిపాదనకుడి సంతకం ఫోర్జరీ అని తేలితో దానికి రిటర్నింగ్ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ తర్వాత నిర్ధారించి ఆ నామినేషన్ తిరస్కరించవచ్చు.
➡️ఒక వ్యక్తి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గరిష్టంగా నాలుగు నామినేషన్లను వేయవచ్చు.
➡️ఒక అభ్యర్థి ఎక్కువ నామినేషన్లను వేసినా చెల్లుబాటు జాబితాలో అతని పేరు ఒక్కసారి మాత్రమే రాస్తారు.
➡️అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరణకు చెల్లుబాటు జాబితా ప్రకటించే వరకు నిరీక్షించి ఉపసంహరించుకోవాలి.
➡️నామినేషన్ వేయడానికి అభ్యర్థి, ప్రతిపాదకుడితోపాటు మరో ముగ్గురిని రిటర్నింగ్ అధికారి తన గదిలోకి అనుమతి ఇస్తారు.
➡️నామినేషన్లో అభ్యర్థి సంతకం మర్చిపోతే దానిని తిరస్కరించవచ్చు. ఒక్కసారి నామినేషన్ వేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం లేదు.
➡️అభ్యర్థి నామినేషన్ ఉపంసహరణ నోటీసుపై స్వయంగా సంతకం చేసి నమూనాలో సమయంలోపు రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. అభ్యర్థి ఇవ్వలేని సమయంలో రాతపూర్వకంగా అధికారం ఉన్న ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించవచ్చు.
➡️అభ్యర్థి ఒక్కసారి నామినేషన్ ఉపంసహరణ తర్వాత దానిని రద్దు చేసుకోవడానికి వీలు లేదు.
➡️రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరిస్తే దానికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మరుసటిరోజు సబ్ కలెక్టర్, ఆర్డీవోకు అభ్యర్థి రిటర్నింగ్ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయవచ్చు.
➡️ఒక వ్యక్తి ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాల్లో, వార్డుల్లో పోటీ చేయకూడదని పంచాయతీరాజ్ చట్టంలో ఎక్కడా లేదు.
➡️ ఓటు హక్కు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాలి.
➡️పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణపై శిక్షపడి దోషిగా నిర్ధారిస్తే పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు.
➡️శిక్ష అనుభవించకుండా బెయిల్పై ఉంటే అనర్హత నుంచి బయటపడినట్లు భావించారు. ఇలా అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది.
డిపాజిట్ల ఈ విధంగా..
➡️వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నామినేషన్ రుసుం కింద 250.
➡️ఇతరులు 500 రూపాయలు చెల్లించాలి.
➡️సర్పంచ్ పదవికి పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000,ఇతరులు రూ. 2 వేలు చెల్లించాలి.
ఆంధప్రదేశ్ లో ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజుల కోసం యాజమాన్యాలు పీడిస్తున్న సమయంలో తల్లిదండ్రులంతా ఏకం కావాలని పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ పిలుపునిచ్చింది. కమిషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వివిధ పాఠశాలలు, కళాశాలలు తనిఖీ చేస్తున్నట్టు ఏపి ఎస్హెచ్ ఆర్ అండ్ యం ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బి భవనాల సముదాయంలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ కనీస స్థాయిలో నిర్వహణ లేని 25 పాఠశాలలు, 50 కళాశాలలు పై కఠినమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం కేవలం 70 శాతం ట్యూషన్ ఫీజులు వసూలు చేయవలసి ఉండగా, కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది గత ఏడాది ఫీజులు ఆధారంగా 70 శాతం ఫీజులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే కొన్ని యాజమాన్యాలు గత ఫీజులను అధికంగా పెంచి వసూలు చేస్తున్నాయన్నారు. ఫీజుల వసూల విషయంలో ట్యూషన్ ఫీజులు, ఇతర ఫీజులు అన్ని కలిపి విద్యార్థుల తల్లిదండ్రులపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. యాజమాన్యాలు తల్లిదండ్రులను భయపడుతున్న సంఘటనలను కూడా తమ దృష్టికి వచ్చాయన్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రభుత్వ మార్గదర్శకాలు పట్టించుకోకుండా తల్లిదండ్రులపై విద్యార్ధులపై ఇబ్బందులకు గురి చేసే సంఘటనలు జరిగితే వాటి గుర్తింపును రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటి సంఘటనలపై క్రిమినల్ కేసులు కూడా ఆయా యాజమాన్యాలపై తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరు సంఘటతమై ఇంతకంటే ఎక్కువ ఫీజులు చెల్లించలేమని యాజమాన్యాలకు తెలియజేస్తూ సందేశం పంపాలన్నారు.
కమిషన్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 70 శాతం వరకు మాత్రమే ఫీజు వసూలు చేసేందుకు అనుమతించామని ఇది సముచితమైన సిఫార్సు అని ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 360 కళాశాలలు, పాఠశాలలు తనిఖీలు చేశామన్నారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా అన్నీ ఇస్తున్నట్లు పేర్కొంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. తమ తనిఖీ బృందానికి పలు పాఠశాలలు, కళాశాలలు తనిఖీ సందర్భంగా విద్యార్థులు తమ బాధలు తెలియజేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఏకమై అధిక ఫీజుల విషయమై ఒక త్రాటి పైకి వచ్చి ఇంతే చెల్లిస్తామని ఆయా యాజమాన్యాలకు తెలియజేయాలని ఛైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు కోరారు.
వైస్ ఛైర్మన్ విజయశారదరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు పిర్యాదులు వస్తున్నందున క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. మొదటి సంవత్సరంలోనే రెండు సంవత్సరాల ఫీజులు వసూలు చేస్తూ బోధన , ఇతర వసతులు లేకపోయినా ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. వేరే కళాశాలకి వెళ్ళే ఆలోచనా ఉన్న టిసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నరన్నారు. పశువుల దొడ్డి కన్న హీనంగా తరగతిగదులు హస్టల్స్ నిర్వహణ ఉంటోందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలు చదివే కళాశాలలు, పాఠశాలలు, వసతిగృహాలను తనిఖీ చేయలన్నారు. చాలా యాజమాన్యాలు ఫీజుల వసూలు సంబంధించి రికార్డులను సమర్పించడం లేదని ఈ విషయంపై ఏదోరకంగా దాటవేసే ధోరణి అవలంభిస్తూన్నారన్నారు. ఎక్కౌంటెంట్లును అందుబాటులో ఉంచడం లేదన్నారు. తనిఖీ బృందాలకు యాజమాన్యాలు సహకరించడం లేదన్నారు. కమిటి సభ్యులు మాట్లాడుతూ కొన్ని క్యాంపస్లో రూ.2లక్షల నుండి 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరంగా చేపడతామన్నారు. ఇంటర్ బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన కోర్సులు బొధించవలసి ఉండగా అనుమతి లేని వాటిని కూడా పాఠ్యాంశాలుగా చేరుస్తున్నారన్నారు. కమిషన్ సూచనలమేరకు ఫీజుల వసూల విషయంపై వాటి వివరాలు గ్రామ సచివాలయలు వద్ద ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తగిన సిఫార్సులు చేస్తూ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్దంగా ఉందని సభ్యులు తెలిపారు. వాటి వివరాలను కూడా కమిషన్ వెబ్ పోర్టల్ లో ప్రదర్శిస్తామన్నారు.
ఈ సమావేశంలో ఏపి ఎస్హెచ్ ఆర్ అండ్ యం కమిటి సభ్యులు, వివి నారాయణ రెడ్డి, సిఏఈ ప్రసాద్ ఈశ్వరయ్య, అజయ్కుమార్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ జర్నలిస్టులకిచ్చే ప్రభుత్వ గుర్తింపు కార్డు అదేనండీ అక్రిడిటేషన్ విషయంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్ మేషన్ బ్యూరో)లో కూడా లేని నిబంధనలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వంలోని సమాచారశాఖ.. అదే ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు వేజ్ బోర్డు అమలు చేయకపోయినా, కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా జర్నలిస్టుల రక్తమాంశాలతో సంస్థలు నడిపే ఒక్క మీడియా సంస్థపైనా ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోకపోవడంపై సమాధానం చెప్పలేని అధికారులు.. నిజంగా పనిచేసే జర్నలిస్టుల విషయంలో మాత్రం నిబంధనలు పెట్టి అక్రిడిటేషన్లు రాకుండా చేయాలని మాస్టర్ ప్లాన్ వేసింది సమాచారశాఖ. పైకి మాత్రం తాము నిబంధనలు ముక్కుసూటిగా పాటిస్తున్నామనే కాస్త తేడా రంగు పులుముకుంటోంది. అందులో భాగంగానే జిఓ నెంబరు 142ను తెరమీదకు తీసుకువచ్చి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలకు అటు న్యూస్ ఏజెన్సీలు, ఇటు న్యూస్ పేపర్స్ ఫార్మాట్ లో దేనితో దరఖాస్తు చేశారో తెలియక పోయినా పత్రికల పేరుతోనే ఆయా సంస్థల్లోని జర్నలిస్టులకు తొలివిడతగా అక్రిడిటేషన్లు మంజూరు చేసేసింది. అదేమంటే వారు తాము ఇచ్చిన జీఓకి అనుగుణంగా సంబంధిత పత్రాలు ఆన్ లైన్ సమర్పించారని రొమ్ము విరుచుకొని మరీ చెబుతున్నారు. మరి దినపత్రికలు వాటి సొంత న్యూస్ ఏజెన్సీల పేరుతోనూ, క్రెడిట్ లైన్లతోనూ సమర్పించిన ప్రెస్ క్లిప్పింగులను ఎలా పరగణలోకి తీసుకున్నారని ప్రశ్నిస్తే...ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా సమాధానం చెప్పడానికి అడ్డదారులు వెతుకుతోంది సమాచారశాఖ. పైగా చిన్న, మధ్య తరహార పత్రికలను పూర్తిగా నియంత్రించే లక్ష్యంతో జీఎస్టీ పరిధిలోకి రాని పత్రికలకు, న్యూస్ ఏజెన్సీలకు కూడా జీఎస్టీని ఆపాదిస్తూ..కొర్రీలు వేసింది. వాస్తవానికి 40 లక్షల రూపాయల టర్నోవర్ దాటితేనే జీఎస్టీ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వమే సూచించినపుడు సమాచారశాఖ ఆ ప్రాధమిక విషయాన్ని కూడా తెలుసుకోకుండా కనీసం రెండేళ్ల జీఎస్టీ రిటర్న్స్ కావాలని ఏ విధంగా అడుగుతుందో సమాచార శాఖలోని ముఖ్య అధికారులకే తెలియాల్సి వుంది. వీటిని సమర్పించలేదని చిన్న, మధ్యతరహా మీడియా సంస్థలు, న్యూస్ ఏజెన్సీల అక్రిడిటేషన్ల దరఖాస్తులన్నీ పెండింగ్ లో వుంచింది. అంటే పాము చావకుండా కర్ర విరగకుండా, అటు మంజూరు చేయకుండా, అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా ఆపేసి,.. పక్కన పెట్టామని చెప్పకుండా పెండింగ్ అనే పదాన్ని వినియోగించి జర్నలిస్టుల అక్రిడిటేషన్లను గాల్లో వుంచింది సమాచాశాఖ. ఇన్ని నిబంధనలు పెట్టిన సమాచారశాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలమేరకు జర్నలిస్టులకు జీతలు ఇచ్చినా, ఆర్ఎన్ఐ గైడ్ లైన్స్ ను తూచా తప్పకుండా అమలు చేసినా, సమాచారశాఖ ఎన్ని నిబంధనలు పెడితే అన్ని నిబంధనలతో మీడియా సంస్థలు దరఖాస్తులు అక్రిడిటేషన్ కోసం దాఖలు చేసేవి. అలా కాకుండా ఒకేసారి కొత్తనిబంధనలన్నీ పెట్టి...సదరు జీఓ నెంబరులో ఉన్నట్టుగా జిఎస్టీ రిటర్న్స్ లేకపోయినా, మండలానికి 100 కాపీలు అమ్మకపోయినా, నియోజవర్గానికి 300 కాపీలు, జిల్లా కేంద్రంలో 500 కాపీలు అమ్మకపోయినా, అలా అమ్ముతున్నట్టు తహశీల్దార్ల ద్రవీకరణ పత్రాలు లేకపోయినా అక్రిడిటేషన్లు ఇవ్వమని చెప్పడం విడ్డూరంగా వుంది. ఏదైనా ప్రభుత్వశాఖ కొన్ని నిబంధనలు అమలు చేసే సమయంలో ముందుగా విషయాన్ని ప్రకటిస్తుంది. అలాకాకుండా ఒకేసారి కొత్తగా జీఓ తెచ్చి వాటి ఆధారంగా తమకు ద్రువీకరణ పత్రాలు కావాలంటే చిన్న మధ్యతరహా మీడియా సంస్థలు ఏవిధంగా తేగలవో సమాచారశాఖ అధికారులే ఆలోచించాల్సి వుంది. అలా కాకపోయినా ముందునుంచి లేబర్ యాక్టు ప్రకారమైనా మీడియా సంస్థలు కనీసం లేబర్ లైసెన్సులు, జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐలు కట్టేట్టుగా చేసినా ప్రభుత్వం పెట్టే నిబంధనలకు అనుగుణంగా మీడియా సంస్థలు కూడా అనుబంధ పత్రాలను సమర్పించడానికి వీలుపడేది. అలా అయితే ప్రభుత్వం కోరినట్టుగా కేవలం వేజ్ బోర్డు జీతాలు అమలు చేసే మీడియా సంస్థలు తప్పా మరే ఇతర మీడియా సంస్థలు కూడా సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్లకు అర్హత ఉండదు. కానీ అర్హత ఉన్నట్టుగా తొలివిడతలో అడ్డగోలుగా, న్యూస్ ఏజెన్సీల పేరుతో దాఖలు చేసిన క్లిప్పుంగులతో, సదరు పత్రికలకు సమాచారశాఖ అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చిందనే విషయమై విశాఖలోని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దాఖలైన 15 అంశాల సమాచారహక్కుచట్టం 2005 దరఖాస్తు ఆధారంగా ఇపుడు సమాచారశాఖ అధికారులు కాకుండా కమిటీ చైర్మన్ సమాధానం చెప్పాల్సి వుంటుంది. దీంతో సదరు దరఖాస్తు కోరిన ఆన్ లైన్ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలో ఏ విధంగా దరఖాస్తు దారుడికి ఇవ్వాలనే విషయమై సమాచారశాఖ అవకాశం వున్న అన్ని అడ్డదారులు వెతుకుతోంది. ఇవన్నీ చేస్తూనే తాము విడుదల చేసిన జీఓ నెంబరు142ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సమాచారశాఖ డిడిలు, డీపీఆర్వోలను ఖచ్చితంగా అమలు చేయాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు పంపడం కూడా ఆశ్చర్యానికి తావిస్తోంది. వాస్తవానికి సమాచారశాఖ పెట్టిన నిబంధనలు ప్రభుత్వ అనుకూల మీడియా, ప్రతికూల మీడియాకి ఒకే విధంగా అమలు చేయాలి. కానీ సమాచారశాఖ అలా చేయకుండా ఒక వర్గం మీడియానే టార్గెట్ చేస్తున్నట్టుగా చేస్తున్న చర్యలు ఇపుడు ప్రభుత్వానికి జర్నలిస్టులంతా వ్యతిరేకం అయ్యేలా చేస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, దీని యొక్క అధికారిక మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా సమాచారశాఖ అత్యుత్సాహంతో ఏ రకంగా నిబంధనలు అమలు చేస్తుందనే విషయాన్ని, వర్కింగ్ జర్నలిస్టులను, చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలను ఏ విధంగా నిబంధనలపేరుతో ఇబ్బందులు పెడుతుంతో బాహ్య ప్రపంచానికి తెలియజేసే పనిలో పడింది. అక్రిడిటేషన్ల విషయంలో సమాచారశాఖకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా అయితే నిబంధనలు పట్టవన్నట్టుగానే అధికారులు వ్యవహరించడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అంటే ఈలెక్కన ప్రతీ సమావేశంలో తమ ప్రభుత్వం నీతి, నిజాయితీకి, నిబంధనల అమలకి నిలువుట్టద్దమని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతీ సమావేశంలో గొంతు చించుకొని మరీ తీసుకొస్తున్న చైతన్యం సమాచారశాఖకు జోలపాటలా అనిపించి, జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో ఒక్కో మీడియాకి ఒక్కోలా నిబంధనలు అమలుచేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడంలో శక్తివంచన లేకుండా క్రుషి చేస్తున్నట్టుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ విధంగా ప్రత్యేక కధనాలు రాయడం ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..8 లో ఆంధ్రప్రదేశ్ సమాచారఖ ఏ ప్రాతిపదిక మీడియా సంస్థలకు అక్రిడిటేషన్లు ఇస్తుంది, వార పత్రికలు, పక్షపత్రికలు, మాస పత్రికలు, దినపత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, సాటిలైట్ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టుల విషయంలో నిబంధనలు మార్చి ఏవిధంగా అక్రిడిటేషన్లు మంజూరు చేస్తుంది.. మాసపత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలకి ఒకే అక్రిడిటేష్ మాత్రమే ఎందుకిస్తుంది..అసలు ఒక పత్రిక మీడియా సంస్థలో తయారై బాహ్య ప్రపంచంలోకి రావడానికి ఎన్ని విభాగాలు పనిచేస్తాయి, ఎంత ఖర్చు అవుతుంది తదితర వివరాలతో రేపటి ప్రత్యేక కధనంతో మళ్లీ కలుద్దాం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సమాచారశాఖ వర్కింగ్ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల మంజూరుకి దేశంలోనే లేని నిబంధనలు పెట్టిన అధికారులు ఇదే శాఖలోని అధికారులు అక్రిడేటెడ్ జర్నలిస్టుల పేరుతో పెట్టే అడ్డగోలు బిల్లులు, అవినీతిపై ద్రుష్టి సారించడం లేదు. ఏంటి ఇదేదో కొత్త విషయం అనుకుంటున్నారా కానే కాదండీ..పాత విషయమే కాకపోతే నిబంధన ఎవరికైనా నిబంధనే కదా..అదే నిబంధన ప్రకారం ఎంత మంది వర్కింగ్ జర్నలిస్టులు ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రపతి కార్యక్రమాలకు న్యూస్ కవరేజికి వచ్చిపుడు రాని జర్నలిస్టుల పేరుతో కూడా మంచినీరు, టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, వాహనాలకయ్యే డీజిల్ ఖర్చులు పెట్టినట్టు చూపించే అవినీతి బిల్లులపై ప్రభుత్వం ఎందుకు ద్రుష్టిసారించడంలేదనే విషయాన్ని సమాచారశాఖ శాఖలోని రాష్ట్ర అధికారులకే తెలియజేయడం కోసం, సమాచారశాఖ జరుగుతున్న అడ్డగోలు వ్యవహారంపై జిల్లా అక్రిడిటేషన్ కమిటీకి దాఖలైన సమాచారహక్కుచట్టం 2005 దరఖాస్తు ఆధారంగా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతి చోటు చేసుకుకుండా రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చులను తగ్గిస్తూ వస్తుంది. అన్నిశాఖల్లో ఈ విధానం జరుగుతున్నా ఒక్క సమాచారశాఖ విషయంలో పెట్టిన బిల్లులకు మాత్రం ఎలాంటి కొర్రీలు వేయకుండా బిల్లులు మంజూరు చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇపుడు ఆంధ్రప్రదేశ్ లోని ఇదే హాట్ టాపిక్. రాష్ట్రంలో లక్షల మంది నిరుపేద ప్రజలకు అడక్కుండా అన్ని సంక్షేమ పథకాలు లక్షలు, కోట్ల రూపాయ వ్యవయంతో వర్తింపజేస్తున్న ప్రభుత్వం ఒక్క సమాచారశాఖ ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల విషయంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ విధించని నిబంధనలు అమలు చేస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనితో ఈ శాఖలో అక్రిడేటెడ్ జర్నలిస్టులను సంఖ్యను అడ్డం పెట్టుకొని వారికి కల్పించని వసతులను కల్పించినట్టుగా..తీసుకెళ్లని స్టడీ టూర్లకు తీసుకెళ్లినట్టుగా, పీఎం, సీఎం, మంత్రులు కార్యక్రమాలకు జర్నలిస్టులు వెళ్లకపోయినా వెళ్లినట్టుగా, అక్కడ ఎలాంటి టీలు, టిఫిన్లు, మంచినీరు, స్నాక్స్, భోజనాలు పెట్టకపోయినా పెట్టినట్టుగా రాష్ట్ర సమాచారశాఖ అధికారులకు చూపించే బిల్లులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో విశాఖలో సమాచారహక్కుచట్టం ద్వారా దాఖలైన దరఖాస్తుకి సమాచారాన్ని ఏవిధంగా ఇవ్వాలనే విషయమై సమాచారశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఇదే సమాచారశాఖలో దాఖలైన సహచట్టం దరఖాస్తు బుట్టదాఖలు కావడంతో ఈ సారి దరఖాస్తు దారుడు నేరుగా జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కు 15 అంశాలతో కూడిన దరఖాస్తు చేశాడు. దీనితో ప్రోటోకాల్ ప్రకారం సమాచారశాఖ అధికారులు సమాచారం ఇవ్వాల్సివుంది. గతంలో మాదిరిగా ఈ దరఖాస్తును కూడా బుట్టదాఖలు చేస్తే సమాచారశాఖ అధికారులు చేసే తప్పులకు, అవినీతికి ఈ సారి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో ఇంత ముక్కుసూటిగా, దేశంలో ఎక్కడా లేని నిబంధనలను పెట్టిన రాష్ట్ర సమాచారశాఖ అధికారులు, అవే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా జర్నలిస్టులకు ఖర్చు చేసినట్టుగా డిడిలు, డీపీఆర్వోలు, పెట్టిన బిల్లుల విషయంలో ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరించాల్సి వుంది. కానీ ఆ విధంగా చేయకుండా ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని పెద్దలకు మచ్చతెచ్చేవిధంగా సమాచారశాఖ అనుసరించడం దేనికి సంకేతమో అధికారులే సమాధానం చెప్పాల్సివుంటుంది. అదే సమయంలో కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి చేయని కళాజాత కార్యక్రమాలకు కూడా కార్యక్రమాలు చేసినట్టుగా నకిలీ బిల్లలు పెట్టినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. పెద్దపత్రికలకు మాత్రమే నెలవారీ బిల్లులు చెల్లించే సమాచారశాఖ చిన్నపత్రికలకు వేసిన పత్రికలకు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదు...ఒక వేళ చెల్లించినట్టుగా బిల్లులు చూపుతుందా అనే కోణంలో కూడా నేటికి ఏ ఒక్క రాష్ట్ర స్థాయి అధికారి కూడా తనిఖీలు చేసిన పాపాన పోలేదు. ఇలాంటి వ్యవహారాలన్నీ బటకు రాకుండా ఒక జర్నలిస్టు యూనియన్ నేత ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములు అయినట్టుగా సమాచారం. ఈ మొత్తం వ్యవహారం సమాచారహక్కు చట్టం ద్వారా అధికారులు ఇచ్చే సమాచారంతో నేరుగా కోర్టుకు వెళ్లడం ద్వారా సమాచారశాఖ లో జరిగిన అవినీతిని అటు ప్రభుత్వానికి, ఇటు జిల్లా మీడియా అక్రిడిటేషన్ చైర్మన్ కు, జర్నలిస్టులకు, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే సమాచార హక్కుచట్టంలో దాఖలైన అంశాలను అడ్డగోలు అక్రిడిటేషన్లపై సహచట్టం దారావాహికం ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా మొదలు పెట్టాం. గత నెల 10వ తేదిన దాఖలైన దరఖాస్తుకి కమిటీ చైర్మన్ ద్వారా 15 రోజుల్లోగా తొలి సమాచారం రావాల్సి వుంది. అలా సమాచారం రాకపోతే మొదటి అప్పిలేట్ అధికారికి దరఖాస్తు దాఖలవుతుంది. అప్పటికీ సమాచారం రాకపోతే రాష్ట్ర సమాచార అధికారికి దరఖాస్తు దాఖలు చేయడానికి దరఖాస్తు దారుడు సిద్ధమవుతున్నాడు. ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..7 లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మీడియా సంస్థలు వేజ్ బోర్డు జీతాలు అమలు చేస్తున్నాయి..ఎన్ని మీడియా సంస్థలు కనీసం లేబర్ లైసెన్సులు కూడా తీసుకోకుండా పత్రికల నిర్వహణ చేస్తున్నాయి.. ఎన్ని న్యూస్ ఏజెన్సీలు అక్రిడిటేషన్ల దరఖాస్తు చేసినపుడు అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు ఇచ్చాయి..ఇవ్వకుండానే ఎన్ని సంస్థలకు అక్రిడిటేషన్లు జారీచేశారు? తదితర వివరాలతో రేపటి ప్రత్యేక కధనంతో మళ్లీ కలుద్దాం..!