1 ENS Live Breaking News

ప్రభుత్వాన్ని కదిలించిన ఈఎన్ఎస్ కథనం..

ఆంధ్రప్రదేశ్ లోపంచాయతీ ఎన్నికల పోరులో వార్తలను కవర్ చేసే అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే కవరేజీ పాసుల విషయంపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక యాప్ ఈఎన్ఎస్ లైవ్ ప్రచురించిన ప్రత్యేక కథనంపై ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించాయి. గాల్లో జర్నలిస్టుల ఎలక్షన్ కమిషన్ పాసులు శీర్షికన వచ్చిన న్యూస్ కార్డ్ అంశం ఎన్నికల కమిషన్ వరకూ చేరడంతో, కాలం చెల్లిన అక్రిడిటేషన్ల ఆధారంగానే ఎలక్షన్ కమిషన్ పాసులు జారీచేయాలని ప్రభుత్వం సమాచారశాఖకు ఆదేశాలిచ్చింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల డిపీఆర్వోలకు ఆదేశాలు జారీచేసింది. దీనితో జర్నలిస్టుల వివరాలు సమాచారశాఖ సేకరిస్తోంది. స్టేట్ రిపోర్టర్లకు జిల్లా పాసులు, మండల విలేకరులకు మండలస్థాయి ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఎన్నికల వార్తలను కవర్ చేయడానికి అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం పాసులు జారీచేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కాలపరిమితి తీరిపోయి 2021వ సంవత్సరంలో రెండవ నెల వచ్చినా నేటికీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదు. దీనితో ఎన్నికల వార్తలు కవర్ చేసే జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసుల విషయమై సందిగ్దత ఏర్పడింది. అదే సమయంలో జర్నలిస్టుల సమస్యలను, అక్రిడిటేషన్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ పాసులు రావనే విషయాన్ని ప్రత్యేక కథనం ద్వారా ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ ద్వారా న్యూస్ కార్డు ప్రచురించింది. దీంతో ఈ విషయాన్ని అన్నిజిల్లాల రిటర్నింగ్ అధికారులు ప్రభుత్వ ద్రుష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించి. అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు పాలసును సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల కమిషన్ పాసులు లేకపోతే ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపును జర్నలిస్టులు కవర్ చేయడానికి గానీ, అక్కడ జరిగే విషయాలను తెలుసుకోవడానికి గానీ వీలుపడదు. అదే సమయంలో ఎన్నికల సిబ్బంది కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గరకు రానీయరు సరికదా, జర్నలిస్టులని కూడా చూడకుండా పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తారు. వర్కింగ్ అక్రిడేటెడ్ జర్నలిస్టుల విధులకు ఎక్కడా ఆటంకం రాకుండా ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ పాసులను  మంజూరు చేయాలని నిర్ణయించడం విశేషం. ప్రభుత్వానికి సంబందించిన విషయాలను కవర్ చేసే జర్నలిస్టులకు,  ప్రాధాన్యతను గుర్తించి కొత్త అక్రిడిటేషన్లు  ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

Visakhapatnam

2021-02-06 14:46:00

శ్రీవారి భక్తులకు విశేషంగా సేవలందాలి..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమలలో పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ నిబంధనల సడలింపు అనంతరం భక్తులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనేకమంది భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు, సమస్యల గురించి తెలుసుకున్నారు.  అన్న ప్రసాదం భవనంలోని భోజన శాలల్లోకి వెళ్లి భోజనం చేస్తున్న భక్తులతో మాట్లాడారు. భక్తులు తిరుమలకు ఎప్పుడు వచ్చారు? వసతి సులువుగానే దొరికిందా? దర్శనంలో ఇబ్బందులు ఉన్నాయా? అన్న ప్రసాదం నాణ్యత, రుచి ఎలా ఉందని అనేకమంది మంది భక్తులతో మాట్లాడి వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. సుమారు గంట పాటు తనిఖీలు చేసిన ఛైర్మన్   శ్రీవారి సేవలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. శ్రీవారి సేవకులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందుతున్న వసతి, భోజనం, ఇతర సదుపాయాల గురించి తెలుసుకున్నారు.  భక్తులు అన్న ప్రసాదం పారేయకుండా జాగ్రత్తగా వడ్డించేలా చర్యలు తీసుకువాలని అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ నాగరాజును ఆదేశించారు.             భోజనశాలల్లో వడ్డించేప్పుడు అన్నం కింద పదుతోందనీ, భక్తులు అన్నం తొక్కుతున్నారని ఛైర్మన్ అధికారులకు చెప్పారు. అన్నం కింద పడకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలో  తమకు అందుతున్న సేవల గురించి భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్న ప్రసాదం రుచి,నాణ్యత బాగున్నాయని చెప్పారు. అన్న ప్రసాదం నాణ్యతను పరిశీలించడానికి అకస్మాత్తుగా అక్కడే భోజనం చేశారు. వసతి, ఇతర సదుపాయాలకు సంబంధించి తిరుమలలో సూచిక బోర్డులు లేనందువల్ల ఇబ్బంది పడ్డామని వరంగల్లు కు చెందిన యజ్ఞం శ్రీను చైర్మన్ కు చెప్పారు. తగిన చర్యలు తీసుకుంటామని  సుబ్బారెడ్డి చెప్పారు.   మాడ వీధుల్లో....             ఈ నెల 19వ తేదీ రథ సప్తమి సందర్భంగా మాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లో భక్తులను భౌతిక దూరం పాటిస్తూ ఎలా అనుమతించాలి ? గ్యాలరీల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలను పరిశీలించారు.           లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్లను చైర్మన్ తనిఖీ చేశారు. భక్తులతో మాట్లాడి లడ్డూలు సిఫారసు లేకుండా దొరుకుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. లడ్డూల పంపిణీకి పేపర్, బట్ట కవర్లను ఉపయోగిస్తున్న తీరు గమనించారు. కవర్లు ఎంతకు విక్రయిస్తున్నారని భక్తులను అడిగారు. అనంతరం బూందీ పోటులో ప్రమాదాలు జరక్కుండా, పోటు కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి  అధునాతన " థర్మో ఫ్లూయిడ్" టెక్నాలజీతో నిర్మించిన బూందీ పోటును చైర్మన్  సుబ్బారెడ్డి పరిశీలించారు. ఇండియా సిమెంట్స్ సంస్థ విరాళం కింద నిర్మించిన నూతన పోటులో ట్రయల్ రన్ చేశారని, త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త పోటు ప్రారంభిస్తామని చైర్మన్ మీడియాతో చెప్పారు.  శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  హరీంద్ర నాథ్, పోటు పేష్కార్  శ్రీనివాస్, విజివో  బాలిరెడ్డి, ఏవి ఎస్వో  గంగరాజు చైర్మన్ వెంట ఉన్నారు.

Tirumala

2021-02-05 21:56:34

టీటీడీకి 2 టన్నుల ఊరగాయ బహూకరణ..

గుంటూరు జిలా తాడేపల్లి మండలం చిర్రావూరు కు చెందిన కాటూరి రాము టీటీడీ కి 2 టన్నుల వివిధ రకాల ఊరగాయలను శుక్రవారం బహూకరించారు. అన్నదానం భవనంలో ఆయన టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ద్వారా ఊరగాయలను అందించారు. స్వామివారి అన్న ప్రసాదంలో భక్తులకు వీటిని వడ్డించాలని దాత కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తులకు శ్రీవారి అన్నప్రసాదంలో వడ్డించడానికి ఈ పచ్చడి ఎంతగానో సహాయ పడుతుందన్నారు. ఇటీవల కాలంలో భక్తులు శ్రీవారిపై భక్తిని అన్నదానంలోకి పనికివచ్చే వాటిని వితరణ చేసి ప్రదర్శించుకోవడం శుభపరిణామన్నారు. అశేష భక్తకోటికి జరిగే అన్నదాన కార్యక్రమంలో ఖచ్చితంగా వీటిని అందిస్తామని దాతలకు హామీ ఇచ్చారు.  టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సలహా మండలి సభ్యులు  పి. పెంచలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tirumala

2021-02-05 21:11:03

కండోమ్ లు ఆరోజు కోట్లలో అమ్ముడవుతాయ్..

భారతదేశంలో వేలంటైన్స్ డేని జనజాగ్రుతి సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని...పాశ్చాత్య సంస్క్రుతి పేరుతో ఆ ఒక్కరోజే కోట్ల రూపాయల కండోమ్ ల వ్యాపారం చేసుకుంటున్నారని సంస్థ ప్రతినిధులు మండిపడ్డారు. విశాల భారత దేశంలో విచ్చలవిడి శ్రుంగారానికి జనజాగ్రుతి సమితి వ్యతిరేకమన్నారు...

Visakhapatnam

2021-02-05 16:40:52

2021-02-05 14:39:54

2021-02-05 11:48:27

జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-8

మీడియారంలో జర్నలిస్టుగా కెరీర్ పదిలంగా ఉండేలా చూసుకోవునే వారికి పర్శనల్ రిలేషన్స్ చాలా బాగా వుండాలి. అలా ఏ జర్నలిస్టు అయితే ఆ తరహా సత్సంబంధాలు అన్ని వర్గాల ప్రజలతోపాటు, ప్రభుత్వ అధికారులతోనూ జర్నలిస్టు అనేవాడు మెయింటేన్ చేయాలి. అలా చేయాలంటే ఏంచేయాలనే ప్రశ్న జర్నలిస్టు అయిన ప్రతీ ఒక్కరికీ మదిలో తొలిచేస్తూ వుంటుంది. మనం ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో, లేదంటే ఏ ప్రభుత్వ శాఖలపై మనం వార్తలు రాస్తుంటామో సంబంధిత అధికారులతో మంచి పరిచియాలు వుండాలి. ఆయా శాఖలకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ ముందుగా మనమే వార్తల్లా రాస్తుండాలి. చేసిన పనుల్లో తేడాలు వచ్చినా, అలసత్వం ప్రదర్శించినా, తక్కు పనిచేసి ఎక్కువడా చూపుకున్నట్టు ప్రయత్నాలు చేసినా, అసలు చేయకుండా చేసినట్టు కాగితాలపై లెక్కలు చూపాలని ప్రయత్నం చేసినా వాటిని కూడా ఆధారాలతో అటు ప్రభుత్వానికి ఇటు పాఠకులకు కళ్లకు కట్టేలా మంచి వార్తా కధనాలు రాయాలి. అంతేకాకుండా ఆయా ప్రభుత్వశాఖల్లో చేయబోయే పనులను ప్రత్యేక కథనాలుగా రాయడానికి ప్రయత్నం చేయాలి. మధ్య మధ్యలో మంచి అధికారులు, విధినిర్వహణలో సేవా భావంతో పనిచేసే అధికారులపై స్పూర్తిదాయకమైన కధనాలు, డిఫరెంట్ స్టోరీలు రాస్తుండాలి. అలా మంచి మంచి కధనాలు రాయడం ద్వారా ఆయాశాఖల అధికారులు మనల్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. అదే సమయంలో జరుగుతున్న అవినీతిపైనా, ఉద్యోగం పేరుతో వివిధ పనులపై తరచూ బయటకు వెళ్లపోవాలని చూసే అధికారులను, సిబ్బందిని ఓ కంట కనిపెడుతూ అప్పుడప్పుడు చురకలు అంటించే విధంగా ఆధారాలతో పాటు వార్తలు రాస్తుండాలి. అలా రాయడం ద్వారా జర్నలిస్టులంటే మంచి గౌరవంతోపాటు, అ విలేఖరికి తెలిస్తే తేడా వ్యవహారాలను కూడా తడుముకోకుండా రాసేస్తారాయన అనే విధంగా మనం వ్యవహరించాలి. అలా చేయడం ద్వారా సమాజంలో మనం మంచి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడాని వీలుపడుతుంది. అవికూడా తరచుగా ఆయాశాఖల కోసం రాస్తూనే ఉండాల్సి వస్తుంది. లేదంటే మనల్ని అధికారులు కూడా మరిచిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. చాలా మంది జర్నలిస్టులు అవసరం వుంటే తప్పా అధికారులతో మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ మనకి అవసరం వున్నా, లేకపోయినా అధికారులతో ఏదో ఒక విషయంలో మాట్లాడుతుండటం వంటివి చేస్తుండాలి. అలా చేయడం ద్వారా సదరు అధికారులు జర్నలిస్టులను గుర్తుంచుకోవడానికి వీలుంటుంది. మనం ఏ జిల్లాలో పనిచేసినా మనం చూసే ప్రభుత్వశాఖలు, రాజకీయపార్టీల నాయకులు, అటెండరు దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకూ మనల్ని గుర్తుంచుకోవాలంటే మనం ఏవిధంగా వారితో వ్యవహరించాలి, ఏ విధమైన వార్త కధనాలు రాయాలి, ఏ తరహా అభివ్రుద్ధి కార్యక్రమాలను, చేయబోయే పనులను, చేసిన పనులకు అధికారులకు వచ్చే గుర్తింపు ఒక జర్నలిస్టు ఏవిధంగా మంచి కధనాలు రాస్తే సదరు అధికారులకు ఆ జర్నలిస్టు చిరస్థాయిగా గుర్తుంటాడు తదితర విషయాలు రేపటి పాఠంలో చర్చిద్ధాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!

Visakhapatnam

2021-02-05 11:03:42

ఆర్టీసీ బస్సుల్లో శ్రీవారి దర్శన టిక్కెట్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో రూ.1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించారు. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చు. ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటువుంటుంది. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు దర్శన నిమిత్తం సహాయం చేస్తారు.  తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని టిటిడి, APSRTC అధికారులు కోరుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యంగా వుంటుంది. 

Hyderabad

2021-02-04 19:27:30

జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-7

మీడియా రంగంలో జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెట్టేవారంతా మంచి జర్నలిస్టుగా రాణించాలన్నా, పాఠకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నా ప్రధానంగా పంచ సూత్రాలు పాటించాల్సి వుంటుంది. ముందుగా చక్కనైన భాషను మనం రాసే వార్తల్లో వినియోగించాలి, పాఠకుడిని వార్త మొత్తం చదివించేలా చక్కటి వాడుక బాష పదాలను వార్తాలో రాయాలి, రాసే వార్తలో కొత్తదనం కనిపిస్తూ వైవిధ్యభరితంగా ఉండాలి, వార్తకు అనుగుణంగా మంచి ఫోటోలను వినియోగించాలి, చూడగానే గుర్తుండిపోయేలా మంచి శీర్షికను రాసే జర్నలిస్టే పెట్టే సామర్ధ్యం సంపాదించాలి. ఈ పంచసూత్రాలు ఒక జర్నలిస్టు ఏరోజైతే చక్కగా వినియోగించి పాటించడం మొదలు పెడతాడో అపుడు ఆ జర్నలిస్టుకి మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాదు మనం ఏదైతే డేట్ లైన్ తో వార్తలు రాస్తామో, ఆయా మీడియా సంస్థలు మనకి ఇచ్చే గుర్తింపుకి వన్నె తీసుకు రావాలి. అది ఏ స్థాయిలో ఉండాలంటే ఈరోజు పలానా డేట్ లైన్ వార్త కోసం పాఠకుడు పత్రికను చూడాలి, అదే మీడియా రంగంలో అయితే ఆ జిల్లాల వార్తకోసం ఛానల్ చూస్తూ వుండాలి, న్యూస్ ఏజెన్సీలు నిర్వహించే వెబ్ సైట్ అయితే మంచి వార్తల నోటిఫికేషన్ కోసం పాఠకులు ఎదురు చూడాలి, మొబైల్ యాప్ విషయానికొస్తే ఆ రిపోర్టర్ ఇచ్చే న్యూస్ కార్డ్ కోసం ఆత్రుతగా వేచిఉండాల.. ఇలా ఒక జర్నలిస్టు పంచసూత్రాలతో ఎపుడైతే వార్త కధనాలను పాఠకులకు అందిస్తాడో ఆ రోజున మంచి గుర్తింపు వస్తుంది. ఏడాదికో శివరాత్రి అన్నట్టు ఒకటీ అరా మంచి వార్తలు రాసినంత మాత్రన ఆ గుర్తింపు రాదు. అనునిత్యం మనం రాసే వార్తల్లో కొత్తదనం కనిపిస్తూనే ఉండాలి. దానికోసం నిరంతరం శ్రమించి పనిచేస్తే తప్పా మంచి జర్నలిస్టు అనే గుర్తింపుని నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. ఉదాహరణకు ఒక్కో పత్రికలో ప్రముఖంగా భూ ఖబ్జాలు వార్తలు మాత్రమే వస్తుంటాయి. మరికొన్ని పత్రికల్లో ప్రముఖుల జీవిత చరిత్రలు, వారు చేసిన సేవలు మాత్రమే వస్తుంటాయి. ఇంకొన్ని పత్రికల్లో సినిమాలు, సాధారణ, ప్రభుత్వ  కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయి. ఇక ప్రధాన పత్రికలైతే అన్ని రకాల వార్తలను తమ పత్రికలో వివిధ పేజీల్లో ప్రత్యేక కథనాలుగా పాఠకుడికి అందిస్తాయి. ఒక అవినీతివార్త మనకి తెలిస్తే తెలిసింది అని రాయడం వలన ఆ వార్తకు గుర్తింపు రాదు. పలాన చోట ఇంత మొత్తంలో అవినీతి జరిగిందని ఎపుడైతే ఆ జర్నలిస్టు ఆధారాలతో సహా  వార్తలు రాస్తాడో అపుడు ఆ వార్తకు పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చి ఆ వార్త రాసిన వ్యక్తికి గుర్తింపు వస్తుంది. అలా మనకి అవినీతి వార్తలు, విషయలు మనకి డైరెక్టుగా తెలుస్తాయా? మనం పెద్ద పత్రికలు, టీవీ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు, న్యూస్ యాప్స్ లో పనిచేస్తున్నామని అందరూ మనదగ్గరకి వచ్చి చెప్పేస్తారా? అంటే అవేమి జరగవనే చెప్పాలి. దానికోసం మనం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. అన్ని వర్గాల వారితో ఎప్పుడూ మాట్లాడుతూ, వారి సాదక బాధలను వార్తలుగా రాస్తూ ఉండాలి, ఎపుడైనా వారికి సహాయం కావాల్సి వస్తే ఒక జర్నలిస్టుగా సహాయం చేస్తూ రావాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనకి వివిధ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అలా అందిన ప్రాధమిక సమాచారంతో మనకున్న నెట్వర్క్ ను వినియోగించి వార్తకు కావాల్సిన ఆధారాలు సేకరించి ప్రత్యేక కధనం రాస్తే ఆ వార్తకు మంచి ఆదరణ వస్తుంది. అదే ప్రభుత్వ శాఖలో జరిగిన అవినీతి వార్త అయితే సదరు ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం వుంటుంది. అసలు ప్రభుత్వ శాఖల నుంచి మనకి సమాచారం ఎలా అందుతుంది? ఎవరు ఇస్తారు? ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఏ విధంగా చోటుచేసుకుంటుంది? ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సేవ చేసేవారు ఉంటారా? అలా ఉంటే వారికోసం ఏ విధమైన వార్త కధనాలు రాయాలి? ఎలా రాస్తే మనం అనుకున్న సమాచారం మనకి అందుతుంది? అది ప్రభుత్వశాఖల్లోని సిబ్బంది, అధికారుల ద్వారా ఎలా వైరల్ అవుతుంది? తదితర అంశాలను రేపటి పాఠంలో చర్చిద్దాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!

Visakhapatnam

2021-02-04 09:16:16

2021-02-03 23:26:16

500 ఆలయాలకు టిటిడి శ్రీకారం..

హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రెండో విడ‌త‌లో 500 ఆల‌యాల నిర్మాణానికి స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్, సంస్కృతి సంవ‌ర్ధిని సంస్థ‌ల ద్వారా శ్రీ‌కారం చుట్టాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఆయా సంస్థ‌ల‌ ప్ర‌తినిధులు, హెచ్‌డిపిపి అధికారుల‌తో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తిరుప‌తి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని త‌మ కార్యాల‌యంలో బుధ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఎపిలో స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ కార్య‌క్ర‌మాలు చ‌క్క‌గా ఉన్నాయ‌ని ప్ర‌శంసించారు. ఆ సంస్థ నిర్వ‌హిస్తున్న బాల‌వికాస కేంద్రాల‌కు ఆధ్యాత్మిక, దేశ‌భ‌క్తిని పెంపొందించే పుస్త‌కాలు పంపాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ కేంద్రాల్లో ప‌నిచేస్తున్న టీచ‌ర్ల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌న్నారు. మారుమూల గ్రామాల్లోని ఎస్సి, ఎస్టీ మ‌త్స్య‌కార కాల‌నీల్లో అర్చ‌క వృత్తిపై ఆధార‌ప‌డ్డ‌వారికి షోడ‌శ సంస్కారాల‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని హెచ్‌డిపిపి అధికారుల‌ను ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదివ‌ర‌కే టిటిడి నిర్మించిన 500 ఆల‌యాల్లో క‌ల్యాణోత్స‌వం ప్రాజెక్టు ద్వారా శ్రీ‌నివాస క‌ల్యాణాలు నిర్వ‌హించాల‌న్నారు. ఈ ఆల‌యాల కోసం టిటిడి ఇప్ప‌టికే కొనుగోలుచేసిన మైక్‌సెట్లు, గొడుగులు, భ‌జ‌న సామ‌గ్రి, పెన్‌డ్రైవ్‌ల ద్వారా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు అందించాల‌ని ఆదేశించారు.           ఎపిలో స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్, తెలంగాణ‌లో సంస్కృతి సంవ‌ర్ధిని సంస్థ‌ల ద్వారా 500 ఆల‌యాల నిర్మాణానికి అనుమ‌తి కోసం రాబోయే హెచ్‌డిపిపి కార్య‌వ‌ర్గ‌ స‌మావేశానికి ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని ఈవో చెప్పారు. నూత‌నంగా నిర్మించే ఒక్కో ఆల‌యానికి టిటిడి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు స‌మ‌కూర్చ‌నుంద‌ని ఈవో వెల్ల‌డించారు. ఆల‌యాల నిర్మాణానికి అనువైన స్థ‌లం ఎంపిక చేసే బాధ్య‌త‌ను ఆ రెండు సంస్థ‌ల‌కు అప్ప‌గించారు. గ్రామ గ్రామాన హిందూ ధ‌ర్మ విస్తృత ప్ర‌చారం కోసం టిటిడి ధ‌ర్మ‌ర‌థాలు సిద్ధం చేస్తోంద‌న్నారు. ఇవి రాగానే ఇప్ప‌టికే నిర్మించిన 500 ఆల‌యాల‌కు వెళ్లేలా రూట్‌మ్యాప్ త‌యారు చేయాల‌న్నారు. ఆయా గ్రామాల్లోని శ్రీ‌వారి భ‌క్తులకు తిరుమ‌ల‌లో శ్రీ‌వారిసేవ చేసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఈవో చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ఉన్న టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల‌ను ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించేలా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌న్నారు.  ఈ స‌మావేశంలో ఎఫ్ఏ అండ్ సిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్  ర‌మేష్‌రెడ్డి, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, స‌మ‌ర‌స‌త ఫౌండేష‌న్ కార్య‌ద‌ర్శి  త్రినాథ్, సంస్కృతి సంవ‌ర్ధిని ప్ర‌తినిధి  అమ‌ర‌లింగ‌న్న‌ పాల్గొన్నారు.

Tirumala

2021-02-03 22:29:35

2021-02-03 21:44:18

జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-6

మీడియా రంగంలో వేలకొలదీ జర్నలిస్టులు పనిచేస్తారు...కొందరికి మాత్రమే మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఆ స్థాయిలో మనకి కూడా మంచి గుర్తింపు రావాలంటే, మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవాలంటే ఒక్కరాత్రిలోనే వచ్చే పరిస్థితి అయితే ఉండదు. మనం ముందుగా చెప్పుకున్నట్టు మీడియాలో జర్నలిస్టుగా పనిచేసే ప్రతీ ఒక్కరూ తాను నిత్య విద్యార్ధిగానే పనిచేయాల్సి వుంటుంది. కొత్త ప్రయోగాలు చేస్తూ, బాహ్య ప్రపంచంలోని విషయాలను మంచి వార్తలు రూపంలో పాఠకులకు అందించాలి. ఇలా అందించడంలో ఒక్కో జర్నలిస్టు ఒక్కో స్టైల్ లో ప్రెజంటేషన్ చేస్తుంటారు. కొందరు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా రాస్తారు. కొందరు అదే విషయాన్ని మన కళ్లకి కట్టినట్టుగా రాస్తారు. మరికొందరు ఆ వార్త ఎందుకు రాస్తారో వారికే తెలియదు...ఆయా మీడియా సంస్థలు దాని ఎలా  చూపిస్తాయో వారికే తెలియదు అన్నట్టుగా వుంటాయి. అందరితోపాటు మనం అన్నట్టుగా పనిచేస్తే మీడియా రంగంలో గుర్తింపు అనేది రాదు. అందరిలోనూ మనం మేటి అన్నట్టుగా పనిచేస్తే తప్పా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అదే సమయంలో మనకు జీతాలు ఇచ్చే మీడియా సంస్థలను కూడా నిశితంగా పరిశీలించి మరీ ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది. దానికి ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్ అనేది చాలా చక్కగా ఉండాలి. ఏ వ్యక్తికైనా మీకోసం ముందు తెలియాలి. అలా తెలియాలంటే అందరితోనూ పరిచియాలు పెంచుకోవాలి. మంచి వార్తలు, అవినీతి వార్తలు, పాఠకుడికి ప్రేరణ ఇచ్చే వార్తలు అన్నీ ప్రముఖంగానే రాయాలి. అలా ఎపుడైతే మనం రాయగలుగుతామో అపుడే  ఒక మంచి జర్నలిస్టుగా సమాజం గుర్తిస్తుంది. ఒక్కోసారి మనం పనిచేసే మీడియా సంస్థను బట్టి కూడా మనకి గుర్తింపు వస్తుంది. ఒక్కోసారి మనం పనిచేసే మీడియా సంస్థకు మన ద్వారా కూడా పేరువస్తుంది. ఎప్పుడైనా మనం పనిచేసే సంస్థ ద్వారా మనకు గుర్తింపువస్తే అది నీటి మీద రాతలానే వుంటుంది. కానీ మనం పనిచేసే సంస్థకు మీరు రాసిన వార్తల ద్వారా గుర్తింపు వస్తే అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీకంటూ ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. ఎపుడైతే మీకంటూ ఒక బ్రాండ్ వచ్చిందో అప్పటి నుంచి మీ గుర్తింపు నలుదిశలా(News-Norths, East, West, South) పాకుతుంది. ఒక్కో సందర్భంలో మీ పనితనమే మీకు మంచి ఉద్యోగాన్ని కూడా తెచ్చిపెడుతుంది. మీపనితనాన్ని బట్టి మీరు ఏ సంస్థలో జర్నలిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసినా ఖచ్చితంగా మీకు ఆ ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఆ స్థాయిలో జర్నలిస్టు గా మారాలంటే మనకి మనం పనిచేసే ప్రాంతీయ భాషపై మంచి పట్టు ఉండాలి. పూర్తిగా పత్రికా భాష తెలిసి వుండాలి, భాషను సందర్భానికి అనుగుణంగా వినియోగించే సమయస్పూర్తి కావాలి. అది కూడా ఒకేసారి జర్నలిస్టుకి వచ్చే పరిస్థితి ఉండదు.. దానికోసం కూడా ఎంతో కఠోర శ్రమ పడాలి. వందల సంఖ్యలో మంచి మంచి వార్తలు రాసినపుడు మాత్రమే అది సాధ్యపడుతుంది.  ఏ రోజైతే మనం జర్నలిజం శిక్షణ పూర్తయి జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభిస్తామో మొదటి రోజు నుంచి తాజా వార్తలను ఇవ్వడంలో మనం ముందుండాలి. ఎవరూ ఇవ్వలేని సమాచారాన్ని మనం ఇవ్వడానికి కొత్త కొత్త వ్యక్తులను పరిచియం చేస్తుండాలి. ఇప్పటికే అలాంటి వారు వివిధ మీడియాల్లో పాఠకులకు ప్రజలకు పరిచియం అయినా..మీ స్టైల్ లో మరోసారి కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఏ జర్నలిస్టు మనం మాట్లాడే వాడుక భాషను వార్తలను, వార్తా కధనాలను రాయడానికి వినియోగిస్తాడో అలాంటి జర్నలిస్టుకి అనతి కాలంలోనే మంచి గుర్తింపు వస్తుంది. అలా వాడుక బాషను నేరుగా వాడేస్తే గుర్తింపు వచ్చేస్తుందా?..కొత్త విషయాలను మనం చూపినంత మాత్రన మనల్ని సహచర జర్నలిస్టులు గుర్తిస్తారా?, మనం పనిచేసే మీడియా సంస్థలు ప్రోత్సహిస్తాయా? అంటే అవి ఒక్కో సందర్భంలో మాత్రమే జరుగుతాయి. మనపై అందరి ద్రుష్టి ఉండాలంటే మనం కూడా అన్ని విషయాలపైనా ద్రుష్టిపెట్టాలి. అది ఎలా పెట్టాలి?, ఏవిధంగా పెట్టాలి?, ఎప్పుడు పెట్టాలి?, ఏ సందర్భంగా పెట్టాలి? అనే విషయాలు మనకి తెలిస్తే...ఆవిధంగా మనం మంచి వార్తా కధనాలు రాయగలిగితే మనకంటూ జర్నలిస్టుగా ఓ గుర్తింపు వస్తుంది. జర్నలిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏఏ విభాగాల్లో మనం ఏ విధంగా వార్తలు రాయాల్సి వుంటుందనే  అంశాలు రేపటి పాఠంలో చర్చిద్దాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!

Visakhapatnam

2021-02-03 11:36:41

జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-5

మీడియారంగంలో మంచి జర్నలిస్టు కావాలంటే కఠోర దీక్ష..పట్టుదల..మంచి శిక్షణ..చూసింది చూసినట్టు అక్షర రూపంలోకి తీసుకువచ్చే నేర్పు కావాలి. అది ఎలా వస్తుంది..డిగ్రీ చదివి, జర్నలిజంలో పోస్టు గ్రాడ్యూషన్ చేసేసి, ఏదైనా మీడియా సంస్థ నిర్వహించే జర్నలిజం స్కూలులో శిక్షణ పొందితే మంచి జర్నలిస్టు అయిపోతామా అంటే కాదనే చెప్పాలి. చదువు, శిక్షణ, అవగాహన మనం జర్నలిస్టుగా మారడానికి సరిపోతాయి తప్పితే మంచి జర్నలిస్టుగా, పేరున్న జర్నలిస్టుగా మారాలంటే మాత్రం దానికి సత్యశోధన చాలా అవసరం. అది మనం జర్నలిస్టుగా మారిన తరువాత కాలక్రమంలో వస్తుంది. అలా రావాలంటే మనం మీడియా రంగంలో ఎంచుకునే విభాగాన్ని బట్టీ కూడా ఆధారపడి వుంటుంది. జర్నలిస్టుగా మారిన వారికి ఆయా మీడియా సంస్థలు అన్ని రకాల వార్తలను రాయడానికి అవకాశం ఇవ్వవు. కొందరిని ప్రభుత్వశాఖలు, మరికొందరిని క్రైమ్, ఇంకొందరిని ఇన్వెస్టిగేషన్, కొందరిని సినిమా, మిగిలిన వారిని సాంస్క్రుతిక విభాగం, వంటలు, సాధారణ కార్యక్రమాలు కవర్ చేసే జర్నలిస్టులుగా ఆయా మీడియా సంస్థలు నియమిస్తాయి. మనం పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తరువాత మనం ఏ విభాగంలో మనల్ని నియమించా పనిచేయడానికి సిద్ధంగా వుండాలి. మనం పనిచేసే విభాగంలోనే మనం సేకరించిన సమాచారాన్ని కొత్తగా, సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో పట్టు సాధించాలి. తద్వారా అలా మనకి కొత్తదనం అలవాటు అవుతుంది. మనం రాసే వార్తలకు కూడా పాఠకుల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది.  మనం పాత్రికేయ పాఠశాలలో శిక్షణ పొందే సమయంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని వుంటే.. దానిని మనం కాపాడుకుంటూ వస్తూ మనకి మనమే ఒక న్యూస్ బ్రాండ్ గా మారడానికి పునాదులు వేసుకూంటూ వెళ్లాల్సి వుంటుంది. ఎప్పుడూ మనం రాసే వార్తల్లో వాస్తవాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అసత్యవార్తలకు ఎలాంటి సమయంలోనైనా తావివ్వకూడదు. సాధారణ వార్తలు రాసినా కూడా మనం ప్రజెంట్ చేసే వార్తలో వైవిధ్యం కనిపిస్తూనే ఉండాలి. అదే మనం మంచి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఒక మంచి జర్నలిస్టుగా మారాలనుకునే వారు ఎవరైనా సరే తాను నిత్యవిద్యార్ధినే అన్నట్టుగా విధినిర్వహణ లో ముందుకు వెళ్లాలి. ఎందుకంటే బాహ్య ప్రపంచంలోని అన్ని విషయాలు మనకి తెలియాలని లేదు. మనకి తెలియని విషయాలు రాసేకొద్ది పుట్టుకొస్తూనే వుంటాయి. అందుకోసమే జర్నలిస్టు అనేవాడు ఎపుడైనా నిత్యవిద్యార్ధిగా కొత్త విషయాలు.. కొత్తదనాన్ని తెలుసుకోవడానికి దానిని పాఠకులకు దగ్గర చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అది ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. మనం తెలుగు మీడియా, ఇంగ్లీషు, హిందీ ఏ భాషలో మనం జర్నలిస్టుగా పనిచేసినా వాస్తవాలకు మాత్రమే పెద్దపీట వేయాలి. అనునిత్యం కొత్త విషయాలను పాఠకులకు చేరవేయడం ద్వారా మనకు మంచి సీనియారిటీ లభిస్తుంది. చాలా మంది సంవత్సరాలకు సంవత్సరాలు పనిచేసినా ఒక సింగిల్ కాలమ్ వార్తను న్యూస్ ఫార్మాట్ లో రాయడానికి చాలా పేపర్లు చింపుతుంటారు. దానికి కారణం ఒక్కటే..వారు ఎంత కాలం పనిచేసినా ఒక విధానంలో పనిచేయకపోతే పరిస్తితి అలానే వుంటుంది. కానీ మనం జర్నలిజంలో ఒక విధానపరమైన శిక్షణ తీసుకొని పనిచేస్తే మాత్రం అలాంటి ఇబ్బందులు, ఏమీ రాదనే బావన మన దరిపాల్లోకి కూడా రాలేవు. ఎలాంటి సమయంలోనైనా మనమే ఎదుటికి వ్యక్తికి కొత్త విషయం చెప్పగలగిలే ఎదగడానికి అవకాశం వుంటుంది.ఇవన్నీ చేస్తే ఒక మంచి జర్నలిస్టుగా గుర్తింపు వస్తుందా? వచ్చేసినట్టేనా? ఇంకా ఏమైనా నేర్చుకోవాలా? అంటే నేర్చుకుంటూనే ఉండాలనే చెప్పాలి...జర్నలిస్టుగా మంచి గుర్తింపు పొందాలంటే మన చదువు, శిక్షణ, సీనియారిటీ టాలెంట్  ఏరకంగా వినియోగించాలనే విషయాన్ని రేపటి పాఠంలో చర్చిద్దాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!

Visakhapatnam

2021-02-02 13:58:34

జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-4

మీడియా రంగంలో మంచి జర్నలిస్టుగా ఎదగాలంటే ముందుగా డిగ్రీ చదువు తప్పని సరిగా ఉండాలి. ఆపై జర్నలిజంలో పోస్టు గ్రాడ్యూషన్ చేస్తేనే ప్రధాన మీడియా సంస్థలు జర్నలిస్టులుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అయితే జర్నలిస్టుగా సుస్థిర స్థానాన్ని కల్పించుకోవాలంటే ముందుగా జర్నలిస్టుకి కంప్యూటర్ వినియోగంపై అవగాహన, తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషల్లో ముందుగా టైపింగ్ రావాల్సి వుంటుంది. దానికోసం డిగ్రీ తరువాత గానీ, పీజీ చదివే సమయంలో గానీ శిక్షణ తీసుకుంటే మంచి ఉపయోగం. అదే సమయంలో డిటిపి(డెస్క్ టాప్ పబ్లిషింగ్) లోనూ శిక్షణ పొందాల్సివుంటుంది. ముఖ్యంగా పత్రిక, టివీ రంగాల్లో జర్నలిస్టుగా ఉద్యోగం సంపాదించాలనుకుంటే మూడు భాషల్లో ఏ భాష మీడియాలోకి వెళ్లాలని ముందుగా అనుకుంటామో దానికి సంబంధించి టైపింగ్ లో శిక్షణ పొందాలి. జర్నలిజంలో పీజీ పూర్తి అయ్యేనాటికి పత్రికా రంగంలో ఉన్న పోస్టుల్లో ఫోటోజర్నలిస్టు, సబ్ ఎడిటర్, పేజి డైజనర్, గ్రాఫిక్ డిజైనర్ ఇలా ఉండే విభాగాల్లో చేరాలనుకుంటే మళ్లీ వివిధ  అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందాలి. ఉదాహరణకు ఫోటో జర్నలిస్టుగా చేరాలనుకుంటే ఖచ్చితంగా డిప్లమా ఇన్ ఫోటో గ్రఫీ గానీ, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ ఫోటో గ్రఫీ గానీ చేయాల్సి వుంటుంది. అదే వీడియో జర్నలిస్టుగా మారాలనుకుంటే అదే కోర్సులో వీడియోగ్రఫీ కోర్సు చేసి వీడియో కెమెరాను వినియోగించడంలో శిక్షణ పొందాలి. అదే సబ్ ఎడిటర్ గా ఉద్యోగం పొందాలనుకుంటే డిటిపి లో శిక్షణ తీసుకోవాలి. ముఖ్యంగా పేజ్ మేకర్, క్వార్క్ ఎక్స్ ప్రెస్, ఫోటోషాప్ లలో ప్రావీణ్యం సంపాదించాలి. అన్నింటికంటే ముఖ్యంగా మనం పనిచేసే ప్రాంతీయ భాషపై పట్టు సంపాదించాలి. అంటే తప్పులు లేకుండా భాషను వినియోగించాల్సి వుంటుంది. పాఠకుడి అభిరుచికి అనుగుణంగా శీర్షికలు పెట్టాలన్నా, సబ్ హెడ్డింగ్స్ మంచిగా పెట్టాలన్నా భాషపై పట్టు చాలా ముఖ్యం. అదే సమయంలో వార్తలతోపాటు ఫోటోలు కూడా డిజైన్ చేయడానికి అదనంగా ఫోటోషాప్ వచ్చి వుండాలి. ఇక పేజి డిజనర్ గా మీడియా రంగంలో కెరీర్ మొదలు పెట్టాలనుకున్నవారు క్వార్క్ ఎక్స్ ప్రెస్, ఫోటోషాప్, పేజ్ మేకర్ కోర్సులు నేర్చుకోవాలి. వాటితో పాటు ఫోటోషాప్ కూడా పూర్తిస్థాయిలో నేర్చుకోవాలి. ఈ ఉద్యోగంలో సబ్ ఎడిటర్లు ఇచ్చిన వార్తలను పేజ్ డిజైనర్ అందంగా పేజిలో డిజైన్ చేయాల్సి వుంటుంది. కలర్ కాంబినేసన్ తెలియడం కోసం ఖచ్చితంగా డిటిపీ కోర్సు నేర్చుకోవాల్సి వుంటుంది. జర్నలిజంలో శిక్షణ కూడా తీసుకొని వుంటే ఒక్కోసారి సబ్ ఎడిటర్ పెట్టిన శీర్షికలు బాగాలేకపోయినా సొంతంగా శీర్షికలు పెట్టడానికిగానీ, మార్పులు చేర్పులు చేయడానికి గాని అవకాశం వుంటుంది. ఇకపోతే గ్రాఫిక్ డిజైనర్ గా మీడియాలో కెరీర్ ప్రారంభించాలంటే దానికోసం డిప్లమా ఇన్ గ్రాఫిక్ డిజైన్ కోర్సులు నేర్చుకోవాల్సి వుంటుంది. పోటోలకి బ్యాక్ గ్రౌండ్, హెడ్డింగ్స్, ఫోటో ఎడిటింగ్, ఫోటోను వార్తలకు అనుగుణంగా అందంగా తీర్చిదిద్దడానికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అదే ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదే గ్రాఫిక్ డిజైన్ పోస్టుకి చాలా డిమాండ్ వుంటుంది. ఏ వార్త బ్రాడ్ కాస్ట్(టివిలో ప్రసారమవడం) కావాలన్నా ఖచ్చితంగా ఒక్కో వార్తకు, లేదంటే మంచి స్టోరీలకు కనీసం నాలుగైదు గ్రాఫిక్ ప్లేట్స్ అవసరం అవుతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే డిబేట్లు, ప్రత్యేక కధనాలు బ్రాడ్ కాస్ట్ చేసే సమయంలో గ్రాఫిక్ డిజనర్ పాత్ర చాలా కీలకంగా వుంటుంది.  అదే విధంగా వీడియో ఎడిటర్ కావాలనుకుంటే దానికి ప్రత్యేకంగా వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, టుడీ, త్రీడి యానిమేషన్ తదితర కోర్సులన్నీ నేర్చుకోవాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే వీడియో ఎడిటర్ పాత్ర చాలా ప్రాముఖంగా వుంటుంది. న్యూస్ రీడర్ చదివే వార్తలకు అనుగుణంగా విజువల్స్ ప్లే అవుతూ, ప్లే బ్యాక్ లో వాయిస్ రావాలంటే దానికి ప్రధాన భూమిక వీడియో ఎడిటర్ పోషించాల్సి వుంటుంది. ఇన్ని నేర్చుకుంటే తప్పా మీడియా సంస్థలో జర్నలిస్టుగా గానీ, సబ్ ఎడిటర్ గానీ, వీడియో ఎడిటర్ గా గానీ, గ్రాఫిక్ డిజైనర్,  పేజ్ డిజైనర్, వీడియో జర్నలిస్టుగా ఉద్యోగ అవకాశాలు రావు. ఇన్ని విషయాలపై మీకు అవగాహన వచ్చిన తరువాత మీడియా రంగంలో జర్నలిస్టుగా గానీ కార్యాలయంలో డెస్కు జర్నలిస్టుగా గానీ కెరీర్ ప్రారంభించాలనుకుంటే ఎంత కష్టమనేది దీనిని బట్టి మీకు అర్ధమై వుండాలి. ఎలాంటి చదువు, శిక్షణ, లేకుండానే మేమూ జర్నలిస్టులమే అని చెప్పుకొని తిరిగేవారికి, అన్నివిషయాల్లో శిక్షణలు పొంది ప్రావీణ్యం సంపాదించిన వారికి ఎంత తేడా వుంటుంటో ఒక్కసారి గమనించుకోవాల్సి వుంటుంది. పైన పేర్కొన్నట్టుగా డిగ్రీ, ఆపై పోస్టు గ్రాడ్యూషన్ లో జర్నలిజం, ప్రాంతీయ భాషలో టైపింగింగ్ కంప్యూటర్ వినియోగం వచ్చేస్తే జర్నలిస్టు అయిపోవచ్చా అంటే అయిపోవచ్చు. కానీ మంచి జర్నలిస్టుగా మారాలంటే మాత్రం దానికి ఎంతో నిరంతర పరిశ్రమ, పాఠకుడికి చేత వార్తను ఖచ్చితంగా చదివేలా చేయడం, సినియారిటీ చాలా అవసరం అవన్నీ ఎలా వస్తాయి? ఏవిధంగా పనిచేస్తే వస్తాయి? జర్నలిజం చదివే సమయంలో దానికి తగ్గట్టు మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలాంటి సూచనలు పాటించాలి? ఏ ఏ విషయాలను ప్రామాణికంగా తీసుకోవాలి? ఏ రకంగా పనిచేస్తే మంచి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకోవచ్చు అనే విషయాలు రేపటి పాఠంలో చర్చిద్దాం. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!

Visakhapatnam

2021-02-01 12:39:59