తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్కుమార్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మన్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఐజి శశిధర్ రెడ్డి, టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, విజివో మనోహర్, డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కడపజిల్లాలోని గండికోట ప్రాంతం. ఇక్కడ కోట, పెన్నానదీ ప్రవాహక ప్రాంతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈప్రాంతాన్ని సందర్శించిన వారంతా ఏదో విదేశాల్లోని కౌ బాయ్ సినిమాను చూసినట్టుగా అనుభూతి పొందుతారు. గండికోట కూడా చూడ ముచ్చటగా వుంటుంది. అదే సమయంలో పెన్నా నదీ ప్రాంతం నుంచి చూస్తున్న ప్రాంతంలో కొండలు కూడా చాలా చక్కగా కనిపిస్తాయి. గండికోటను గ్రాండ్ కెన్యన్ గా అభివర్ణిస్తారంటే ఇక్కడి పర్యాటక అందాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా ఈ ప్రవాహం చూడటానికే చాలా అందంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని చూడాల్సిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గంటి కోట ఒకటి.
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చిన గవర్నర్ కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పతి భిశ్వభూషణ్ హరిచందన్ లుస్వాగతం పలికారు. వీరితోపాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎపిఐఐసి ఛైర్మన్ రోజా, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి, రెడ్డెప్ప, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి , ఎం.ఎల్.సి. యండపల్లి శ్రీనివాసులురెడ్డి, శాసన సభ్యులు ఆదిమూలం, బియ్యపు మధుసూధన రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, నవాజ్ బాషా , వెంకటే గౌడ, పెద్దిరెడ్డి ద్వారకానాధ రెడ్డి, జంగాలపల్లి నివాసులు, బాబు , డిసీసీబీ చైర్మన్ రెడ్డెమ్మ, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త,టిటిడి ఇఓ జవహర్ రెడ్డి, జెసి మార్కండేయులు, నగరపాలక కమిషనర్ గిరీషా, ఐజి శశిధర్ రెడ్డి, డిఐజి కాంతిరణా టాటా, తిరుపతి ఆర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, సివి అండ్ ఎస్ ఓ గోపినాధ్ జెట్టి,ఎయిర్ పోర్టు డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, చిత్తూరు ఎస్.పి.సెంధిల్ కుమార్ , జెసి (సంక్షేమం) రాజశేఖర్ , డిఆర్ఓ మురళి, ఆర్డీఓ కనక నరసా రెడ్డి, స్వాగతం పలుకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన తహశీల్దార్లు శివప్రసాద్ , ఉదయ్ సంతోష్, డిఎస్ పి లు గంగయ్య, చంద్రశేఖర్ లు పర్యటనలో వి వి పి ల లైజన అధికారులు తుడ సెక్రటరీ లక్ష్మి, సెట్విన్ సి ఈ ఓ మురళీకృష్ణ , తహశీల్దార్ సురేష్ బాబు, సిడిపిఓ శాంతి దుర్గా , రెవెన్యూ ,పోలీస్ అధికారులు, సిబ్బంది వున్నారు.
ప్రభుత్వం తమను ప్రతిష్టాత్మక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోకి ఉద్యోగులుగా తీసుకుంది.. ఆడుతూ పాడుతూ పనిచేసినా ఎవరూ పట్టించుకోరు..ఒక వేళ వచ్చినా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతున్నారు.. పెద్దగా అధికారుల పర్యటనలు..డ్యూటీ చార్ట్ పట్టించుకోవాల్సిన పనిలేదు..దిల్ ఖుష్ రాజా అంటూ విధులు నిర్వహించేయొచ్చు.. అనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏకంగా 9 మంది గ్రామసచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇపుడు రాష్ట్రంలోనే సంచనలంగా మారింది. గ్రామసచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి, అక్కడి ఉద్యోగుల్లో జవాబుదారీ తనాన్ని పెంపొందించడానికి జిల్లా కలెక్టర్లు, జెసి, ఇతర ప్రత్యేక అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యటనలు చేస్తున్నా... ఇప్పటి వరకూ ఎక్కడా ఎవరినీ సస్పెండ్ చేయలేదు. అదే కొందరు గ్రామసచివాలయ ఉద్యోగులకు, సిబ్బందికి అలుసుగా మారింది. అదే సమయంలో కర్నూలు జిల్లాలో కూడా ఇదే విధంగా సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం వహించి కలెక్టర్ వీరపాండియన్ సచివాలయం సందర్శించే సమయానికి ఉద్యోగులు లేకపోవడంతో వెంటనే 9 మంది సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కర్నూలు జిల్లాయే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే హడలి చస్తూ(ఒకటీ, రెండూ పోసుకుంటున్నారు) పైగా కర్నూలు జిల్లా వీరపాండియన్ సస్పెండ్ చేసిన ఉత్తర్వులను సోషల్ మీడియాలో పెడుతూ, అన్ని జిల్లాల సచివాలయ సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నారు. కొత్తగా చేరిన ఉద్యోగులతో ఇంతకాలం ప్రజలకోసం పనిచేయాలని చెప్పి పనిచేయిస్తున్న అధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తీసుకున్న చర్యలతో బలమొచ్చింది. ఇకపై తాము కూడా ఈ విధంగానే వ్యవహించాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అటు ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లు, ప్రత్యేకంగా సచివాలయాల కోసం నియమించిన జెసిలకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడంతో ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు రాష్ట్రంలోని కలెక్టర్లు, జెసిలు. ఇక పనిచేయకుండా పబ్బం గడిపేద్దామనుకునే సచివాలయ ఉద్యోగులందరూ జాగ్రత్తగా ఇంటికెళ్లిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు (115)సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆయన, ఆదివారం రాత్రి మరణించారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు. కొండపల్లి ప్రాంతంలో అప్పట్లో తాను ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్తను విన్న అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈయన మరణ వార్తను విన్న చుట్టుప్రక్కల ప్రాంతాల వారు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24న మంగళవారం తిరుమల పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఛైర్మన్, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, రాంభగీచ వసతి భవనాలు, శ్రీ వరాహ స్వామి ఆలయం, శ్రీవారి ఆలయాలలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి శ్రీవారి దర్శనానికి వస్తున్నందున కోవిడ్ - 19 పరిస్థితుల దృష్ఠ్యా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలలో ప్రతిచోటా పరిమిత సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బందికి ముందస్తుగా కోవిడ్ పరీక్షలు నిర్వహించమన్నారు. సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ భారత్ నారాయణ్ గుప్తా, ఎస్పీ రమేష్ రెడ్డిలు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలియజేశారు. సిఇ రమేష్ రెడ్డి, ఇఇ జగన్మోహన్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరింద్రనాథ్, విజిఓ బాలి రెడ్డి, ఎవిఎస్వో గంగరాజు, టెంపుల్ పేష్కర్ జగన్మోహనాచారి తదితరులు పాల్గొన్నారు.
కార్తీక వన భోజన మహోత్సవం ఆదివారం తిరుమల పార్వేట మండపంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాదీ పవిత్రమైన కార్తీకమాసంలో కార్తీక వన భోజన మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈసారి కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని 250 మంది భక్తులతో ఏకాంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్టు చెప్పారు. ముందుగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడి పార్వేట మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పార్వేట మండపం వద్ద మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. శాక్సాఫోన్, డోలు, నాదస్వర వాయిద్య సంగీతం ఆకట్టుకుంది. అనంతరం గరుడ వైభవం హరికథ పారాయణం చేశారు.ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, బోర్డు సభ్యులు మురళీకృష్ణ, ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, విజివో బాలిరెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, డెప్యూటీ ఈవోలు బాలాజి, నాగరాజ, డిఎఫ్వో చంద్రశేఖర్, ఆలయ పేష్కార్ జగన్ మోహనాచార్యులు, పోటు పేష్కార్ శ్రీనివాస్, ఎవిఎస్వోలు గంగరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.