ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మున్సిపాలిటీలు, పురపాలకల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలు తీసుకువచ్చామని, ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్లైన్లోనే జరుగు తాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఆమీడియాతో, సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణపు ప్లాన్ సులభంగా పొందే లా సరళీకరణ చేశామని, నిర్మాణరంగానికి ఊతమిచ్చేలా నిబంధనల్లో సడలింపులు చేశామన్నారు. మరింత వేగంగా భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీ జరుగు తాయన్న మంత్రి ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు 400 శాతం టీడీఆర్ వర్తింపు ఉంటుందన్నారు. ఇకపై ఆన్లైన్లోనే టీడీఆర్ల జారీ ఉంటుందని, పరిశ్రమల అంతర్గత రహదారులు, ఖాళీ స్థలాల నిబంధనల్లో సడలింపులు ఉంటాయన్నారు. అనధికార ప్లాట్లు, భవనాలు, లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ కానున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి దరఖాస్తు దారుడు నుంచి ఫీడ్ బ్యాక్, పకడ్బందీగా తనీఖీలు ఉంటాయన్నారు. బిల్డింగ్ రూల్స్, లే అవుట్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.
గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం(గ్రామసచివాలయ వ్యవస్థ)లో ప్రజలకు సేవలు చేయడానికి ఎన్నో ఆశలతో విధుల్లోకి చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు రిక్తహస్తం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై నేటికి సరిగ్గా ఏడాది పూర్తవుతున్నా గ్రేడ్-5 కార్యదర్శిల అధికార బదలాయింపు ఉత్తర్వులు జీఓఎంఎస్ నెంబరు 149 అమలు కాకపోవడాన్ని బట్టి అధికారుల చిత్తశుద్ధి గ్రామసచివాలయాల విషయంలో ఏస్థాయిలో ఉందో ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సివుంది. రాష్ట్రంలో గ్రామసచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా జిల్లా అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో గత ఆరో రోజులుగా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ పరిశోధనాత్మక కధనాలు అందిస్తూ వస్తోంది. అంతేకాదు వాటిని అన్ని జిల్లా కలెక్టర్లు, డిపీఓలు చూస్తూనే.. 149 జీఓని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు కూడా.. సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి మనస పుత్రిక, భారత దేశంలో ఒక ఆదర్శ గ్రామసచివాలయ వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు.. ప్రజలకు నేరుగా సేవలు అందించే బ్రుహత్తర వ్యవస్థకు.. కొందరు జిల్లా అధికారులు ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని...కావాలనే గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వాల్సిన జిఓ 149ని అమలు చేయకుండా తొక్కిపెడుతున్నట్టు ఏడాది పూర్తిచేసుకున్న గ్రామసచివాలయ వ్యవస్థ వెక్కిరిస్తోంది. అంతేకాదు కావాలనే జిల్లా అధికారులు ఈజీఓని తొక్కిపెట్టారని, ఒక వర్గం రాజకీయ పార్టీకి సపోర్టుగానే ఈ పనికి కొందరు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అనుకునే పూనుకున్నారని నిఘావర్గాలు గుర్తించాయని తెలుస్తుంది. పూర్తిస్థాయిలో గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇస్తే..ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, తద్వారా దేశానికే ఈ వ్యవస్థ మార్గదర్శి అయిపోతుందనే అక్కసుతో అధికార బదలాయింపు చేయకుండా నూతన కార్యదర్శిల విధులేంటో చెప్పకుండానే అధికారులు వారితో పనిచేయిస్తుండటం వారిని ఎంతగానో బాధకు గురిచేస్తుంది. ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా వస్తున్న కథనాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న నిఘావర్గాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7వేల మంది గ్రేడ్-5 కార్యదర్శిలు రెండు మూడు సచివాలయాలు ఉన్నచోట.. తమ అధికారాల బదాలాయింపు జీఓ 149 అమలు చేయాలని ఎంతమంది డిపీఓ(జిల్లా పంచాయతీ అధికారులు)లకు లేఖలు రాశారు, వాటిపై ఎంతమంది డిపిఓలు ఎంపీడీఓలకి, ఈఓపీఆర్డీలకు, సీనియర్ కార్యదర్శిలకు అర్జెంట్ మెమోలు జారీచేశారో తదితర వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ మెమోకాపీలను రాష్ట్రంలో ఎంత మంది జిల్లా కలెక్టర్లకు నకలుగా పంపారు, ఈ విషయంలో గ్రేడ్-5 కార్యదర్శిలు పడుతున్న ఇబ్బందులపైనా పూర్తిస్థాయి సమాచారం కేంద్ర నిఘా వర్గాలు రికార్డు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. జిల్లా అధికారులు ఈ జీఓను అమలు చేయకపోవడంపై గ్రామస్థాయిలో ఎలాంటి అధికారాలు లేని గ్రేడ్-5 కార్యదర్శిల ఉద్యోగాలు ఏవిధంగా చేస్తున్నారనే విషయంపై సమగ్ర సమాచారం సేకరించినట్టు బోగట్టా. రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు అయితే జిల్లా అధికారులకు అనుకూలంగా నివేదికలు ఇస్తాయనే మంచిపేరుంది. అదే కేంద్ర నిఘా వర్గాలైతే ఉన్నది ఉన్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తాయనే నమ్మకం కూడా ఉంది. కొందరు జిల్లా పంచాయతీ అధికారులు అర్జెంటు మెమోలు ఇచ్చి, ఆ జీఓని అమలు చేయకుండా ఎందుకు చేతులు దులిపేసుకున్నారనే కోణంలో కేంద్ర నిఘా వర్గాలు గ్రౌండ్ లెవల్ లో వాస్తవ విషయాలను సేకరిస్తున్నాయని తెలుస్తుంది. కంచ పెట్టి అన్నం తిను అన్నట్టుగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం...ఆ ఉద్యోగంతో ప్రజలకు నేరుగా సేవలు అందించడానికి అధికారాలు మాత్రం ఇవ్వలేదు. అలా అధికారాలు ఖచ్చితంగ ఇవ్వాలని జీఓఎంఎస్ నెంబరు 149ని విడుదల చేసినా, దానిని అమలు చేయడంలో జిల్లా పంచాయతీ అధికారులు చూపిస్తున్న తాత్సారంతోనే కొత్తగా విధుల్లోకి చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలు గమగోడును ఫిర్యాదు రూపంలో ప్రభుత్వానికి తెలియజేశారు. అలా ఫిర్యాదు చేసినందుకు నేటికీ చాలా మంది జూనియర్ కార్యదర్శిలు సీనియర్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు...ఉద్యోగంలోకి చేరి ఏడాది కాలేదు...ఇంకా సర్వీసు రెగ్యులర్ కాకుండా మీకు అధికారాలు కావాల్సి వచ్చాయా అంటూ ప్రశ్నించడం కూడా చర్చనీయాంశం అవుతుంది. అసలు జిల్లా అధికారులు జీఓఎంఎస్ నెంబరు 149ని ఎందుకు రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రధాన కారణం ఏంటనే విషయాన్ని...గ్రామ సచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-7 లో చూడవచ్చు..!
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై అక్టోబరు 4వ తేదీ ఆదివారం ఐదో విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు ఉన్న 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. కాగా, ఇప్పటివరకు నాలుగు విడతల్లో అఖండ పారాయణం జరిగింది. జూలై 7న మొదటి విడతలో మొదటి సర్గలోని 211 శ్లోకాలు, ఆగస్టు 6న రెండో విడతలో 2 నుండి 7వ సర్గ వరకు 227 శ్లోకాలు, ఆగస్టు 27న మూడో విడతలో 8నుండి 11వ సర్గ వరకు 182 శ్లోకాలు, సెప్టెంబరు 12న నాలుగో విడతలో 12 నుండి 14వ సర్గ వరకు 146 శ్లోకాల అఖండ పారాయణం జరిగింది.
జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల వాటరుసుముతో కట్టించుకున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కార్డులను ప్రభుత్వమే సొంత ఖర్చులతో రెవిన్యువల్ చేసిందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని గురువారం ప్రకటించారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో 8, 456 జర్నలిస్టుల ప్రయోజనం చేకూరనుంది. కరోనా సమయంలో జర్నలిస్టులు హెల్త్ కార్డు ప్రీమియం చెల్లించే పనిలేకుండానే ప్రభుత్వం వీటిని రెవిన్యువల్ చేసిందని, జర్నలిస్టుల కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేస్తుందని ప్రకటించారు. తద్వారా వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం రెన్యూవల్ 31.3.2021వరకు చేస్తూ నేడు ఉత్తర్వులు వచ్చాయి. కరోనా సమయంలో ఏఒక్క జర్నలిస్టు కుటుంబం ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకూడదని, జర్నలిస్టులంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశ్యంలో ఈ సౌకర్యంకల్పించామని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో నిబద్ధతో ఉన్నారని కూడా ఆళ్ల వివరించారు. రెవిన్యువల్ చేసిన కార్డులతో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో ఉచితంగా జర్నలిస్టులు వైద్య సేవలు పొందవచ్చనన్నారు. ఈ అవకాశాన్ని అత్యవసర సమయంలో జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆళ్ల సూచించారు.
గ్రామసచివాలయాల్లో సీనియర్ కార్యదర్శిలు చేతి వాటం చూపిస్తూ.. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టిస్తున్నా ఇటు జిల్లా కలెక్టర్లుగానీ, జిల్లా పంచాయతీ అధికారులు గానీ.. కొత్తగా వచ్చిన గ్రామసచివాలయశాఖ జెసిలుగానీ జీఓఎంఎస్ నెంబరు 149 ను అమలు చేయడానికి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఒక్క జిల్లా కలెక్టర్ సైతం ఈ జీఓను అమలు చేసే విషయంలో స్పందించకపోవడం విశేషం. మరో వైపు రాష్ట్రప్రభుత్వం గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలను బదలాయించే ఈ జీఓని అమలు చేయకుండానే గ్రామస్థాయిలో ప్రజలకు విశేషంగా సేవలు అందించాలని జిల్లా అధికారులు తమ పర్యటనల్లో గ్రామసచివాలయ సిబ్బందిని హెచ్చరించడం హాస్యాస్పదంగా మారుతోంది. అసలు అధికారమే లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా 7వేల మంది గ్రేడ్-5 గ్రామకార్యదర్శిలు ఏం పనిచేస్తారో అధికారులే చెప్పాల్సి వుంది. గ్రామసచివాలయానికి వెళ్లే ప్రతీ అధికారి, అక్కడ సిబ్బందికి క్లాస్ పీకడం తప్పితే ప్రజలకు నేరుగా సేవలు చేయడానికి అడ్డంగా వున్న 149 జిఓ లక్ష్మణ రేఖను చెరిపే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో విధుల్లోకి చేరిన గ్రామ కార్యదర్శిలు తమ అధికారాలు తమకి ఇస్తే తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ జిల్లా పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నారు. దీనిపై డిపీఓలు ఎంపీడీఓలకి,ఈఓపీఆర్డీలకి, గ్రామ సచివాలయాలకి మెమోలు జారీచేశారు తక్షణమే జీఓ నెంబరు 149 ప్రకారం ఏ గ్రామ సచివాలయ పరిధిలోని ప్రాంతాన్ని ఆ సచివాలయానికి అప్పగించి, విధులు, అధికారాలు బదలాయింపు చేయాలని. కానీ వచ్చిన మోమె సచివాలయంలో కార్యదర్శి టేబుల్ మీదనే ఉన్నా...అధికారాలు ఇవ్వడానికి మాత్రం రాష్ట్రంలో ఒక్క సీనియర్ కార్యదర్శి కూడా ముందుకి రాలేదు. దీంతో ఇపుడు కొత్తగా వార్డు, గ్రామ సచివాలయ శాఖలను అప్పగించిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డ, బొత్స సత్యన్నారాయణలను కలవడానికి గ్రేడ్-5 కార్యదర్శిలు సిద్ధమవుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ గ్రామసచివాలయాల్లో తాము ఎలాంటి అధికారాలు లేకుండా ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలని వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు ఎంపీడీఓలకు, తమ సీనియర్ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీలకు మెమోలు జారీచేసినా ఏ ఒక్కరూ అమలు చేయకపోతే ఇక ఆవిషయాన్ని మంత్రులు, వారూ వినక పోతే నేరుగా సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కి మాత్రమే చెప్పాలని నూతన కార్యదర్శిలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై 11 నెలలు గడుస్తున్నా.. నేటి వరకూ తమ విధులు, తమ అధికారాలేంటో తమకి తెలియకపోతే మిగిలిన 10శాఖల సిబ్బందిని ఎలా కలుపుకుంటూ ఉద్యోగాలు చేయాలని గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సీనియర్లు ప్రశ్నిస్తే మీ ఉద్యోగాలు ఇంకా రెగ్యులర్ కాలేదు...ఆలోగానే ఇంటికి వెళ్లాలని ఉందా.. అంటూ బెదిరిస్తున్నారని కూడా కొందరు కార్యదర్శిలు మీడియా ముందు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓనే అమలు చేయాలని అడుగుతున్నాం తప్పితే కొత్తగా ఏమీ చేయమనడం లేదని కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై ఈఎన్ఎస్ నెట్వర్క్ రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్ లెవర్ రియాలిటీని ప్రత్యేక కధనాలతో అన్ని జిల్లాల డీపీఓ ద్రుష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంలో కొందరు డీపీఓలు స్పందించి తాము కూడా అర్జెంట్ సర్కులర్ ద్వారా లేఖలు రాసినా ఎవరూ స్పందించకపోవడం తమకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. అదే సమయంలో అన్ని చోట్ల సచివాలయ భవనాలు నిర్మాణం జరుగుతున్న వేళ ఈ విషయాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి అధికారాలు బదలయింపులు జరగకపోతే సీనియర్లు చేసే తప్పులకు కొత్త కార్యదర్శిలపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని కూడా చెప్పడం విశేషం. దానికి అనుగుణంగా రాష్ట్రంలో చాలా గ్రామసచివాలయాల్లో ఈఓపీఆర్డీలుగా వున్నవారు ప్రభుత్వ నిధులు వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించిన కేసులపై డివిజనల్ పంచాయతీ అధికారులు విచారణలు కూడా చేస్తున్నారు. విశాఖజిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షల రూపాయలు తమ సొంత అవసరాలకు ఈఓపీఆర్డీలు, కార్యదర్శిలు నిధులు దుర్వినియోగం చేసినట్టు రుజువైంది కూడా. ఈ తరుణంలో జీఓఎంఎస్ నెంబరు 149 అమలు విషయం కీలకంగా మారింది...ఈ జీఓని అమలు చేస్తే కొందరు చేతివాటం వున్న సీనియర్లు చేసిన తప్పులన్నీ ఏ రకంగా బయటపడతాయో గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-6లో చూడవచ్చు..
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన ప్రభుత్వం కరోనా వైరస్ ఉద్రుతి ద్రుష్ట్యా.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది. పాఠశాలలను ప్రారంభించిన వెంటనే అదేరోజు జగనన్న విద్యాకానుక పథకాన్ని కూడా ప్రారంభించాలని వైఎస్ జగన్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు. ఏపీలో స్కూల్స్ను ప్రారంభించాలని జగన్ సర్కార్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను మరింతగా మెరుగు పరిచేందుకు నాడు నేడు అనే కార్యక్రమం మొదలుపెట్టిన ప్రభుత్వం.. ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిందింది. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలనే సమూలంగా మార్చివేసింది.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా భవనాలను, ప్రాంగణాలను ప్రభుత్వ పాఠశాలలు మార్చేసింది. విద్యార్ధులు కూర్చోవడానికి సైతం మంచి ఫర్నిచరును కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరులో విశేష ఉత్సవాలను నిర్వహించడానికి టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ ను ద్రుష్టిలో పెట్టుకొని స్వామివారికి నిర్వహించే అన్ని కార్యక్రమాలను ప్రత్యక్ష్యంగా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా అందించనుంది. అక్టోబరు నెలలో స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు ఈ విధంగా ఉంటాయి... అక్టోబరు 1, 31వ తేదీల్లో పౌర్ణమి గరుడ సేవ,15న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ,16న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, 20న గరుడసేవ, 21న పుష్పక విమానం, 24న చక్రస్నానం, 25న పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. స్వామివారికి నిర్వహించే ఉత్సవాల్లో పరిమిత సంఖ్యలో మాత్రమాలే ఆలయ అర్చకులు అధికారులు పాల్గొంటారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ, కేసుల ఉద్రుతి అలాగే ఉన్నందున భక్తులను స్వామివారి ఉత్సవాల్లోకి అనుమతించడం లేదని పేర్కొంది..
ప్రధాని మోదీ కాళ్లను సీఎం వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరూ పట్టుకుంటున్నారని సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కూడా ఆయన కాళ్లను పట్టుకుంటున్నారని అన్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేసుకున్నాడని చెప్పారు. గత ఎన్నికల్లో బుద్ధి తక్కువై పవన్ ని తాము నమ్మామని అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్... చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. వీరివల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎంతో నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో వైసీపీ, టీడీపీలు మద్దతు పలకడం దారుణమని విమర్శించారు. బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాననే భయం జగన్ లో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు పడుతుందని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతే అని అన్నారు. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదనితేల్చి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ముగుస్తున్నందున కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడానికి పాత్రికేయుల సౌలభ్యం కోసం ఆన్లైన్ వెబ్సైట్ www.ipr.ap.gov.in ను అందుబాటులో ఉంచామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్కుమార్ రెడ్డి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు అదే లాగిన్ ఐడి ఉపయోగించి, తమ దరఖాస్తులకు అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం కలుగుతుంది. గతంలో తమ దరఖాస్తుతో పాటు సమర్పించే డాక్యుమెంట్స్ సర్టిఫికెట్లో అప్లోడ్ చేయవలసినదిగా కోరడమైనది. గత దరఖాస్తులలో అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు పిడిఎఫ్ ఫార్మెట్లో అప్ లోడ్ చేయనందున, వారు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో కనబడలేదు కావున, అభ్యర్థులు విధిగా వారు సమర్పించాల్సిన పత్రాలు 'పిడిఎఫ్ ఫార్మెట్'లో మాత్రమే అప్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది. అలాగే, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ప్రస్తుతం మీడియా సంస్థ మారి ఉంటే, అటువంటి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సంబంధిత యాజమాన్యం వారి సంస్థలలో పనిచేయుచున్న పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీచేయడానికి రికమండేషన్ లేఖలను మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి సవరించిన లేఖలను అప్ లోడ్ చేయాలన్నారు అలాగే తాజాగా రికమెండేషన్ లేఖలను రాష్ట్రస్థాయిలో కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మరియు జిల్లాస్థాయిలో సంబంధిత సమాచార పొర సంబంధాల శాఖ కార్యాలయాలలో సమర్పించాలన్నారు. కావున, ఇదివరలో అక్రిడిటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు వారి డేటాను మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు వెబ్ సైట్ ను 04-10-2020 వరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పాత్రికేయులు సద్వినియోగం చేసుకుని, పూర్తిస్థాయిలో ఆన్లైన్ ద్వారా అప్ లోడ్ చేయనివారు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను అప్ లోడ్ చేసి నకలు కాపీలను సంబంధిత కార్యాలయములలో అందజేయాల్సిందిగా కమిషనర్ టి.విజయ్కుమార్ రెడ్డి కోరారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం ''భాగ్సవారి'' ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ''భాగ్సవారి'' ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బందీస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బందీనుండి విముక్తురాలుని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తునియొక్క భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ ''భాగ్సవారి'' ఉత్సవంలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్ - 19 నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్సవారి ఉత్సవం సందర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం, శాత్తుమొర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రైతుల కష్టాలను పాదయాత్రచూసి ఇచ్చిన హామీ మేరకు రైతన్నలకు నీటిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ వైఎస్సార్ జల కళ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. సోమవారం ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వాలన్నీ వ్యవసాయాన్ని దండగటా మార్చేశాయని, రైతన్న బాగుంటే దేశం బాగుపడుతుందనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు ఉచితంగా ఈ బోర్లు వేసే పథకానికి రూపకల్పన చేశామన్నారు. తద్వారా ఎలాంటి కాలంలో నైనా రైతులు పంటలు పండించుకోవడానికి ఈ జలకళ బోర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తిస్థాయిలో అదిగమించాలని ఈ సందర్భంగా సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి కలెక్టర్లతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో గ్రామసచివాలయాలకు నూతనంగా గ్రేడ్-5 కార్యదర్శిలు నియమితులైనా..వారంతా ఉత్తుత్తి కార్యదర్శిలుగానే పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబరు 149కి అనుగుణంగా పనిచేసే వీలులేకుండా పోయింది...కాదు కాదు కావాలనే కొందరు అధికారులు, మరికొందరు సీనియర్లు ప్రభుత్వ ఉత్వర్వులను అమలు చేయడం లేదు.. రాష్ట్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఇంటి వద్దే సేవలు అందించేందుకు ప్రారంభించిన గ్రామసచివాలయ వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓను అమలు కాలేదనే విషయాన్ని గుర్తించి.. అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధుల ద్రుష్టికి తీసుకెళ్లేందుకు ఈఎన్ఎస్ నెట్వర్క్ రాష్ట్రవ్యప్తంగా గ్రౌండ్ లెవల్ రిపోర్టింగ్ ను అందిస్తోంంది. ఏపీలో గ్రామసచివాలయ వ్యవస్త ఏర్పాటై సుమారు 11 నెలలు గడుస్తున్న కొత్తగా చేరిన కార్యదర్శిలంతా గత పంచాయతీల వ్యవస్థలో పనిచేసిన సీనియర్ కార్యదర్శిలకు సహాయకులుగానే పనిచేస్తున్నారు. ఇంటి పన్నుల దగ్గర నుంచి కోవిడ్ సేవల వరకూ వీరు చేసిన సేవలు అనంతం. వీరంతా చేసిన సర్వీసు మొత్తం సీనియర్ల ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రతీ 2500 దాటిన జనాభా కోసం ఒక గ్రామసచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ అక్కడ విధుల్లోకి చేరిన కార్యదర్శిలు ఉత్తుత్తి కార్యదర్శిలుగానే పనిచేస్తున్నారు వీరికి సచివాలయ కార్యదర్శిలుగా ఎలాంటి అధికారాలు, విధులు లేవు. ఇంకో విషయం ఏంటంటే వీరికి పూర్తిస్థాయి రికార్డులు కూడా లేవంటే అతిశయోక్తికాదు. దానికి కారణం వీరికి ప్రభుత్వం నిర్ధేశించిన విధులు, అధికారాలు బదాలాయింపు జరగకపోవడమే. దీంతో సీనియర్ల దగ్గర వీరంతా వారు చెప్పినట్టు పనిచేయాల్సి వస్తుంది. ఇదేమంటే అదంతే అంటున్నారు ఇటు అధికారులు కూడా.. ప్రభుత్వం ఒక జిఓ విడుదల చేస్తే తక్షణమే అది అమల్లోకి వస్తుంది. అదేంటో గ్రామసచివాలయ వ్యవస్థలో మాత్రం జిఓ నెంబరు 149కి మాత్రం బాలరిష్టాలు తీరలేదు. ఆజీఓని అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు ఎంపీడీఓలకి, ఈఓపీఆర్డీలకి, సీనియర్ కార్యదర్శిలు, ప్రస్తుత కార్యదర్శిలు...ఇదే నకలును అటు జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా కలెక్టర్ కు తెలియజేసినా అవేమీ ఉపయోగంలోకి రావకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే జీఓను అమలు చేసే ఉద్దేశ్యం అధికారులకు లేదనే విషయం తేటతెల్లమైపోయింది. ఎలాంటి అధికారాలు లేని సచివాలయ కార్యదర్శిలుగా ప్రస్తుత గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్సవ విగ్రహాల్లా చేసినపంతా సీనియర్లుకు ఆపాదించాల్సి వస్తుంది. మరోవైపు కొన్ని మండల కేంద్రాల్లో సీయర్ కార్యదర్శిల చేసిన చేతివాటానికి, ఖర్చులకు ఒకే సచివాలయ కార్యాలయంలో పనిచేస్తున్న సచివాలయం2, 3 కార్యదర్శిలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల విశాఖజిల్లా ఎస్.రాయవరం గ్రామసచివాలయంలో ఈఓపీఆర్డీ ఏవీఎస్ఎస్ ప్రసాద్ పంచాయతీ నిధులు రూ.47 తన కుమారుడికి ఖాతాకి దారిమళ్లించాడు. ఈ విషయం డిఎల్పీఓ విచారణలో తేటతెల్లమైంది. దానికి ఆయన చెప్పిన సమాధానం గ్రామసచివాలయం-1తోపాటు 2 సచివాలయంలో ఖర్చుచేసిన వాటికే బిల్లులు పెట్టామని అధికారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అధికారులు ఒక సాంకేతిక అంశాలన్ని గుర్తించాల్సివుంది. సచివాలయాల పరిధి, విధులు, రికార్డులు గ్రామసచివాలయ కార్యదర్శిలకు బదలాయింపు జరగకపోవడంతో, సీనియర్లు పాల్పపడే అవినీతికి సహచర గ్రేడ్5 కార్యదర్శిలు మూల్యం చెల్లించాలన్నమాట. ఇలా పంచాయతీ నిధుల్లో చేతివాటం ప్రదర్శించడానికి వీలుపడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా నాటి పంచాయతీ కార్యదర్శిలు, ప్రస్తుత గ్రామసచివాలయ గ్రేడ్5 కార్యదర్శిలకు విధులు, డిడిఓ అధికారాలు బదలాయింపులు చేయడం లేదని క్లియర్ గా అర్దమైపోయినట్టు ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ఈ విషయంలో చాలా చోట్ల మండల అధికారులు, కొన్ని చోట్ల జిల్లా అధికారులు కూడా జీఓ నెంబరు 149 జీఓ అమలు చేయకపోవడంలో సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాదూ కూడదు అంటే మరెందుకు ఆజీఓ ప్రకారం విధుల బదలాయింపు చేయడం లేదని ప్రశ్నిస్తుంటే...కొత్తగా చేరిన గ్రామకార్యదర్శిలకు కొందరు అధికారుల నుంచి బెదరింపులు కూడా ఎదురవుతున్నాయని ప్రచారం జరుగుతుంది. తమ అధికారాలు తమకు బదలాయిస్తే తప్పా తాము ఎలా తమ పరిధిలోని సచివాలయ ప్రజలకు ఎలా సేవలు చేయగలమని గ్రేడ్5 కార్యదర్శిలు ప్రశ్నిస్తున్నారు. ఈజీఓని అమలు చేస్తే ఏం జరుగుతుందుంతనే విషయాలను...రేపటి సచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-3లో చూడవచ్చు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలపడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విఎంఆర్డీఎ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంనకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోటళ్లు, టూర్స్ అండ్ ట్రావెలర్స్, తదితర టూరిజానికి సంబందించిన వాటికి రిజిస్ట్రేషన్స్ ఏర్పాటు చేయడం జరుగిందన్నారు. ప్రపంచంలో 30 శాతం దేశాలు టూరిజం మీదనే ఆదారపడ్డాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 12 పర్యాటక ప్రాంతాలను గుర్తించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అభివృద్థి చేయడం జరిగుతుందని, డిపిఆర్ కూడా తయారుచేయడం జరిగిందని, త్వరలోనే టెండర్లు పిలువడం జరుగుతుందన్నారు. నూతన టూరిజం పాలసీని త్వరలోనే ప్రకటించబడుతుదని వెల్లడించారు. అనుమతులు కోసం ఏ ఒక్కరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదని, పారదర్శకంగా ఉంటుందని, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టం ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచనలో ఉందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు సందర్శించే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. పర్యాటకం ఒక బాధ్యతాయుతమైన రంగంగాను, ఆదాయం తీసుకువచ్చే శాఖగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. పర్యాటకం అభివృద్థి చెందితే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. విశాఖపట్నం ఎంతో సుందరమైన నగరమని, అంతర్జాతీయ పర్యాటక పటంలో విశాఖపట్నంను నిలపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి, మేనేజింగ్ డైరక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్థి చెందితే ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఈ యేడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం థీం “పర్యాటకం అండ్ గ్రామీణాభివృద్థి” అని, రూరల్ టూరిజంలో విశాఖపట్నం జిల్లాలో ఏటికొప్పాక ప్రాంతం అభివృద్థికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతీ జిల్లాలో పర్యాటక ప్రాంతంను గుర్తించి, స్థానిక సంస్కృతి, హెరిటేజ్ లపై చర్చించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్లను ప్రమోట్ చేయడానికి టూరిజం పాలసీని ప్రభుత్వం త్వరలోనే తీసుకువస్తుందని వెల్లడించారు. రూరల్ టూరిజం, డోమెస్టిక్ టూరిజం అభివృద్థి చేయడం జరుగుందని వివరించారు. పర్యాటక రంగంలో రాష్ట్రానికి భారత ప్రభుత్వం నుండి అవార్డులు వచ్చినట్లు వివరించారు. రాష్ట్ర, ప్రపంచ, జాతీయ స్థాయిలో టూరిజం ప్రమోషన్ చేయడం జరుగుతుందన్నారు.
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలోని ఏజన్సీలో పర్యాటక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో పర్యాటక ప్రాంతాలు, విశాఖపట్నంలో తొట్లకొండ, హెరిటేజ్, సహజ సిద్థంగా వచ్చిన అరకు, తదితర ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఈ యేడాది ప్రపంచ పర్యాటక దినోత్సవం థీం “టూరిజం అండ్ రూరల్ డెవలప్ మెంట్” అని, ఏటికొప్పాక ప్రపంచ, జాతీయ స్థాయిలో ప్రసిద్థి గాంచినదని చెప్పారు. లంబసింగిలో 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదౌతుందని, ఆ ప్రాంతానికి గుర్తింపు తీసుకువస్తే అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్థి పరచాలన్నారు. కోవిడ్-19 నేపధ్యంలో పర్యాటక శాఖ మంచి సేవలు అందించిందని ఆయన అభినందించారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ పర్యాటకంతోపాటు టెంపుల్ టూరిజం ఉత్తరాంధ్రాలో మరింత అభివృద్థి చేయవచ్చన్నారు. ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు. శాసన మండలి సభ్యులు పి.వి.వి. సూర్యనారాయణ, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్ రాజ్ లు పర్యాటక ప్రాంతాల గూర్చి వివరించారు. సన్ రే రిసార్ట్స్ అధినేత రాజబాబు, తదితరులు కోవిడ్-19 ను సందర్భంగా ఎదుర్కొన్న ఆటుపోట్లను వివరించారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం హోటల్స్, రిసార్ట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ లకు రిజిస్ట్రేషన్ పత్రాలను సంబంధిత యజమానులకు మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు మళ్ల విజయ్ ప్రసాద్, రెహమాన్, చింతలపూడి వెంకటరామయ్య, విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిషోర్, టూరిజం రీజనల్ డైరక్టర్ రాంప్రసాద్, హోటల్స్, రిసార్ట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానులు, పర్యాటక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.