1 ENS Live Breaking News

నూతన విద్యా విధానాలతో విప్లవాత్మక మార్పులు..

నాణ్యమైన విద్యను అందిస్తూ సృజనాత్మక ఆవిష్కరణల వైపు యూనివర్సిటీ అడుగులు వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఒకటి, రెండు, మూడు స్నాతకోత్సవాలు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి నుండి ఆన్ లైన్ విధానంలో మంత్రి సురేష్ పాల్గొన్నారు. మంత్రి తన ప్రసంగం ఆద్యంతం ఉర్దూ లో కొంసాగించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్ మాట్లాడుతూ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఉర్దూ భాష అభివృద్ధికి, ఒకేషనల్ టెక్నీకల్ విద్యను ఉర్దూ భాషలో బోధించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మాతృ భాషలో విద్యార్థులను బోధనా మరియు శిక్షణ ఇస్తూ ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం పొందేలా చేయాలన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒక విప్లవాత్మక మార్పు రానుందని ఇది ఉర్దూ యూనివర్సిటీ కి మంచి ప్రయోజనం కలిగిస్తుందన్నారు. యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా డిగ్రీలు పొందిన గ్రాడ్యుయేట్లను మంత్రి అభినందించారు. డిగ్రీలు పొందిన వారిలో ఎక్కువ మంది బాలికలే ఉండటం తో వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ మొహమ్మద్ అస్లాం పర్వైజ్, వైస్ ఛాన్సలర్ అచార్య ముజాఫర్ అలీ, రిజిస్ట్రార్ అచార్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Kurnool

2021-03-19 18:59:09

Tadepalle

2021-03-19 15:50:52

విభాగాలను పరిశీలించిన రిజిస్ట్రార్‌ ‌క్రిష్ణమోహన్‌..

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పలు విభాగాలను రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌గురువారం ఉదయం పరిశీలించారు. సెమిష్టర్‌  ‌పరీక్షలు ప్రారంభమైన నేపధ్యంలో ఆయన విభాగాలను తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఆర్టస్, ‌కామర్స్ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.రాజేంద్రకర్మార్కర్‌తో కలసి ప్రత్యక్షంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణ విధానాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆంధ్ర యూనివర్శిటీ

2021-03-18 20:05:15

సెంట్రల్ వర్శిటీ పనులు పూర్తిచేయండి..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణపు పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) నిశాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో ని తన చాంబర్లో  యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ఏ కొరీ, రిజిష్ట్రార్ శశిభూషణ్  ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్  చిన్నారావు, ఆర్డిఓ గుణ భూషణ్ రెడ్డి, తహశీల్దార్ మహబూబ్ బాషా, డిఈఈ ఆర్ఐ సి మధుసూదన్ రెడ్డి తదితర అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న యూనివర్సిటీ నిర్మాణపు పనుల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రహారి గోడ నిర్మాణం కొరకు రూ. 9 కోట్ల 15 లక్షలు మంజూరైన నేపథ్యంలో నాణ్యమైన పనులు చేపట్టాలని పేర్కొన్నారు.  అనంతరం ఓపెన్ ఎయిర్ జైలు మరియు యూనివర్సిటీ ప్రహారి గోడ నిర్మాణం కొరకు చర్చించి హద్దుల తీర్మానం చేశారు

Anantapur

2021-03-18 18:23:25

క్రెడిట్‌ ‌కోర్సుగా ఐపిఆర్‌..

ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో బిఇ, బిటెక్‌ ‌విద్యార్థులకు ఇంటలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్(ఐపిఆర్‌)‌ను క్రెడిట్‌కోర్సుగా నిర్వహించనున్నారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి దీనిని విద్యార్థులకు క్రెడిట్‌ ‌కోర్సుగా అందించాలని ఏయూ ప్రతిపాదించింది. ఏయూ ప్రతిపాదనను ఉన్నత విద్యా మండలి అమోదం తెలిపింది. ఈ సదర్భంగా ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులను ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌  ‌నుంచి ఐపిఆర్‌ ‌చెయిర్‌ ‌ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌హెచ్‌.‌పురుషోత్తం స్వీకరించారు. ఐపిఆర్‌ ‌కోర్సును క్రెడిట్‌ ‌కోర్సుగా అమలు చేయడానికి ఉన్నత విద్యామండలి ఆమోదం తెలపడం పట్ల వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కోర్సును అందిస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా ఏయూ నిలుస్తుందన్నారు. నూతన విద్యా విధానం 2020లో భాగంగా నైపుణ్యాభివృద్ధికి ఈ కోర్సులు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2021-03-15 17:14:39

కెజిబీవీ విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలి..

కె.జి.బి.విలలో చదువుతున్న విద్యార్థుల సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కె.జి.బి.వి సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు. కెజిబివిల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేకంగా బాలికల విద్య కోసమే కె.జి.బివిలు స్థాపించబడ్డాయని, వీటికి కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందని అన్నారు. ప్రతీ 10 మంది విద్యార్థులకు ఒక టీచింగ్ లేదా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 32 కెజిబివిలు ఉండగా అందులో 21 కెజిబివిలు ఇంటర్మీడియట్ వరకు విద్యను అందిస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేశారు. ప్రతీ కెజిబివిలో సిబ్బంది పూర్తిగా ఉన్నారని కలెక్టర్ చెప్పారు.  బాలికల విద్య కోసం ప్రభుత్వం  ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కొన్ని కె.జి.బి.విలలో సమస్యలు తలెత్తుతుండటం విచారకరమని అన్నారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించడం సెక్టోరియల్ అధికారులపై ఉందని అన్నారు.  కెజిబివిలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే విద్యార్థులు నష్టపోయే అవకాశముందని తెలిపారు. కాబట్టి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులతో పాటు ప్రామాణిక విద్యను అందించాలని సూచించారు. ప్రతీ కెజిబివి విద్యార్థులు ఐఐటీ, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎంపికయ్యేలా వారిని తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతీ కెజిబివిలో గల విద్యార్థుల కదలికలను నిత్యం గమనిస్తూ ఉండాలని, వారికి ఏదైనా సమస్య తలెత్తితే సరియైన సమయంలో ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు.  తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రహరిగోడలు లేని పాఠశాలలకు ప్రహరిగోడలు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని,అందుకు అవసరమైన సామగ్రి ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ కె.జి.బి.వి ఒక ఆదర్శ పాఠశాల కావాలని, ఆదిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకుసాగాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సమగ్ర శిక్ష ప్రొజెక్ట్ అధికారి పైడి వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి కుసుమ చంద్రకళ, ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష ఉపకార్యనిర్వాహక ఇంజినీర్ వెంకట కృష్ణయ్య,జిల్లాలోని కెజిబివి సెక్టోరియల్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-03-12 20:27:15

గిరిజన విద్యార్దులకు డిగ్రీ ప్రవేశం కల్పిస్తాం..

విశాఖ మన్యంలోని గిరజనులు ఆన్‌లైన్ విధానంలో డిగ్రీ కళాశాలలో చేరలేకపోయిన అలాంటి వారికి ప్రవేశం కల్పిస్తామని పాడేరు సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల సష్టం చేసారు. బుధవారం పలువురు గిరిజన విద్యార్దులు డిగ్రీ కళాశాల ప్రవేశాలు కల్పించాలని ఐటిడి ఏ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారిని కలిసి విజ్ఞప్తి చేసారు. ఈసందర్బంగా ఆయన విద్యార్దులతో మాట్లాడుతూ, ఉన్నత విద్యాశాఖ కమీషనర్‌తో ఇప్పటికే చర్చించామని అన్నారు. ఈ విషయమై సానుకూలంగా ఉన్నారన్నారు. త్వరలోనే ప్రవేశాలు జరుగుతాయని విద్యార్ధులెవరూ ఈ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని పీఓ విద్యార్ధులకు భరోసా ఇచ్చారు.

Paderu

2021-03-10 16:40:30

విద్యార్ధులకు భాషా నైపుణ్యం అవసరం..

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమని అ దిశగా విద్యార్థులకు ప్రత్యేక తర్పిదు యూనివర్శిటీలో ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ యూనివర్సిటీ విసి టి. వి. కట్టిమని పేర్కొన్నారు. బుధవారం యూనివర్సిటీలో  వివిధ కోర్సుల కు చెందిన అధ్యాపకులు, విద్యార్థుల తో వ్యక్తిత్వ వికాస అంశాలపై సమీక్ష్ నిర్వహించారు. ఈ సందర్భంగా విసీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు సంస్కృతి, కళలు, భాష కు సంబందించి వివిధ యూనివర్సిటీ పరిశోధన, అధ్యయనాల ద్వారా విద్యార్ధులను ప్రోత్సహిస్తామని చెప్పారు. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ అంశాలలో బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. విజయనగరం జిల్లాకు చెందిన గురజాడ అప్పారావు, ఘంటసాల, ఆదిభట్ల నారాయణ దాసు వంటి వారి రచనలు, కళలు, బొబ్బిలి వీణ విషయాల పై యూనివర్సిటీ లో ప్రత్యేక అధ్యయనాలు చేపడతామని వివరించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్, ఇంచార్జ్ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు.

central tribal university

2021-03-03 18:08:38

హిందీ పరీక్షలకు ఈనెల 15 ఆఖరు..

పాడేరు ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్ధులు హిందీ పరీక్షలు వ్రాయడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చునని హిందీ ప్రచార సభ పాడేరు ఐటిడిఏ శాఖ  కన్వీనర్ శెట్టి సూరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ  ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో వివిధ హిందీ పరీక్షలు జరగనున్నాయని అందులో వివరించారు. ఆసక్తిగల 6 నుండి 9 వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు ఈనెల 15 వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. హిందీ పరీక్షలు వ్రాసి, అనంతరం హిందీ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు ప్రభుత్వ,  ప్రైవేటు విద్యా సంస్థలలో ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. విద్యార్థులకు జాతీయ భాషా పరిజ్ఞానం తోపాటు, ఉపాధి అవకాశాలు  మెరుగుపడతాయని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు 9490087286 నెంబర్ కు సంప్రదించి తెలుసుకోవచ్చునని సూరిబాబు తెలిపారు.  

Paderu

2021-03-03 16:20:21

అనంతలో తెలుసుకో..ఎదుగు..

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరిపాలన మరియు కార్యకలాపాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన, నిర్ణయ సామర్థ్యం మరియు నాయకత్వ లక్షణాలు వెలికి తీయడానికి, వారిని రేపటి మార్గదర్శకులుగా తయారుచేయడానికి  "తెలుసుకో... ఎదుగు..." (Know & Rise) అనే కార్యక్రమంను బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.  తెలుసుకో..ఎదుగు..(Know & Rise) కార్యక్రమంలో భాగంగా తొలిరోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డి ఈ ఓ, ఎం ఈ ఓలు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను జిల్లా కలెక్టర్ భాగస్వాములను చేశారు. అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ కు చెందిన 15 మంది విద్యార్థినీవిద్యార్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశం ముగిసిన అనంతరం సమావేశంలో ఎలాంటి అంశాలు గమనించారు అనే విషయంపై విద్యార్థులను జిల్లా కలెక్టర్ అడగగా, పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలన పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కల్పించడం, జిల్లా పరిపాలనా యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందనే దానిపై అవగాహన కల్పించడానికి తెలుసుకో..ఎదుగు లో భాగంగా ఇకపై కూడా ఇలాంటి సమీక్షా సమావేశాల్లో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులను భాగస్వాములను చేసి వారి ఎదుగుదలకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో 8 - 10 తరగతి ఆ పైన ఉన్న విద్యార్థులను అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లా స్థాయిలో జరిగే సమావేశాల్లో,  ప్రభుత్వ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేలా చేసి భవిష్యత్తులో వారిని నాయకులుగా, పరిపాలకులుగా, సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా, అధికారులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయిలో జరిగే వివిధ రకాల సమావేశాలు లేదా భవిష్యత్తులో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కి విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామన్నారు.  ఒక పాఠశాల నుంచి 10 నుంచి 15 మంది విద్యార్థులను వ్యాసరచన పోటీలు లేదా ఇతర రకాల పోటీలు నిర్వహించి ఎంపిక చేసి, ఎంపికైన విద్యార్థులను తెలుసుకో.. ఎదుగు.. అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలకు హాజరయ్యేలా చూస్తామన్నారు. భవిష్యత్తులో జిల్లా కలెక్టరేట్ లో జరిగే సమావేశాలలో, ఇతర అన్ని జిల్లా స్థాయి కార్యక్రమాలలో కూడా విద్యార్థులను భాగస్వాములను చేసే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు పిల్లలే రేపటి పౌరులని, వారే కాబోయే పరిపాలకులని, చిన్న స్థాయి నుంచే పరిపాలనలో ఏం జరుగుతోంది అనే విషయాన్ని తెలియజెప్పేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవిష్యత్తులో మంచి పౌరులుగా, మంచి అధికారులుగా, పరిపాలకులుగా మార్చేందుకు ఇప్పటినుంచే వారిని జిల్లా స్థాయి సమావేశాలలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాలలో ఈ తరహా కార్యక్రమాలు జరుగుతున్నాయని, తెలుసుకో.. ఎదుగు కార్యక్రమం వల్ల పరిపాలన మీద మంచి అవగాహన కలిగి విద్యార్థులు దేశాన్ని ముందుకు నడిపించగలరన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఎన్నికలు, ఓటింగ్ ప్రక్రియ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో విద్యార్థులు తెలియజేసిన అంశాలపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ "తెలుసుకో... ఎదుగు.." (Know & Rise) అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య, డీఈవో శామ్యూల్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎన్ఎన్ మూర్తి, సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్, ఎంఈ ఓ లు, హెడ్మాస్టర్ లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Anantapur

2021-03-03 16:13:34

అంతర్జాతీయ ప్రమాణాల విద్యకు ప్రయత్నం..

అంతర్జాతీయ ప్రమాణాల విద్యకు ప్రయత్నం జరుగుతుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. జిల్లాలో  నాడు - నేడు పనులు బాగా జరుగుతుందని అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  మనబడి నాడు - నేడు పై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం సమీక్షించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ మురపాక, చిలకపాలెంలో పనులు పరిశీలించామని, పనులు చక్కగా జరుగుతున్నాయని అన్నారు. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15,715, జిల్లాలో 1249 పాఠశాలల పనులు పూర్తి కావాల్సిందే నని స్పష్టం చేసారు. ప్రతి అంశం కంప్యూటరీకరణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జాగ్వార్ వంటి ఉన్నత నాణ్యత గల వస్తువులను ఉపయోగించడం జరుగుతుందని చెప్పారు. చిన్నారుల ప్రాథమిక హక్కులను నాడు - నేడు పనుల ద్వారా కాపాడుతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 4.30 లక్షల మంది ప్రభుత్వ బడులలో ఈ ఏడాది చేరారని చెప్పారు. నాడు - నేడు పనులు మైండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాద్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చుతున్నారని, నెల్లూరు జెసి, పార్వతీపురం ఐటిడిఏ పిఓ తన పిల్లలను చేర్పించారని అన్నారు. నాడు - నేడు పనుల ప్రభావం స్పష్టంగా, దీర్ఘకాలం ఉండాలని, దాని ప్రభావం విద్య, విద్యాబోధనపై ఉండాలని ఆయన సూచించారు. దీనికి నిజమైన, వాస్తవ ఫలితాలు కనిపించాలని అన్నారు. పౌరులకు ప్రామాణిక విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని రాజశేఖర్ తెలిపారు. నాడు- నేడు పనులతో బడుల రూపురేఖలు మారుతున్నాయని, చిన్నారుల బంగారు భవితకు గట్టి పునాదులు పడుతున్నాయని చెప్పారు. పాఠశాలల్లో చెడిపోయిన బల్లలు, కుర్చీలు తదితర సామాగ్రితో నూతన వస్తువులు తయారు చేసి ఉపయోగించే విధంగా చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ 36 మండలాల్లో పనులు పరిశీలించడం శుభ సూచకమని పేర్కొన్నారు. నాడు - నేడు పనులు సివిల్ పనులు మాత్రమే కాదని సామాజిక భాగస్వామ్యం అని వివరించారు. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు క్రియాశీలక భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పారు.  జిల్లాలో నాడు నేడు పనుల్లో  రూ.10.67 కోట్లు ఖర్చు చేయని నిధులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీరు పనులను పూర్తి చేయడంలో ఎటువంటి జాప్యం చేయరాదని పేర్కొన్నారు. ఎం.ఇ.ఓలు, ఏ.ఇలు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ మరుగుదొడ్లు, మరమ్మతులు దాదాపు పూర్తి అయ్యాయన్నారు.పెయింటింగ్ పూర్తి చేయుటకు మరిన్ని బృందాలను నియమించాల్సి ఉందని తెలిపారు. స్థానిక అధికారులతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, మండల ప్రత్యేక అధికారులు కూడా పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని పాఠశాలల్లో ఒకే రకమైన డిజైన్ ను తీసుకోవడం జరిగిందని చెప్పారు. మరుగుదొడ్లకు వాటర్ ప్రూఫ్ డోర్లను వినియోగిస్తున్నామని, గ్రానైట్ ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసామని వివరించారు. ఇందుకు గ్రానైట్ సంఘం సహకరించిందని తెలిపారు. పనుల వలన ఎం.పి.పి పాఠశాలల రూపురేఖలు బాగా మారాయని వివరించారు. కొన్ని పాఠశాలల పనులకు అంచనాలు మరలా తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణకు స్వచ్ఛత ఖాతాలో చేర్చాలని సూచించారు. రెండవ, మూడవ విడతలలో మరింత సమర్థవంతంగా చేస్తామని చెప్పారు. నాడు నేడు ప్రభుత్వ సలహాదారు మురళి మాట్లాడుతూ కొన్ని చోట్ల మరుగుదొడ్లు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ కు అనుసంధానం చేయవచ్చని అన్నారు. ఏ గోడలపై ఏ రకమైన పెయింటింగ్ లు, బొమ్మలు వేయాలో సూచించడం జరిగిందని ఇంకా మంచి విధానం ఆచరించవచ్చని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పనులు చక్కగా చేశారని ప్రశంసించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్షా అభియాన్ ఎస్.పి.డి  వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, ఏ.పి.ఇ.డబ్ల్యు. ఐ. డి.సి ఎం.డి రాజేశ్వర రెడ్డి,విద్యా శాఖ ఆర్.జె.డి నాగేశ్వరరావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పి.వి.రమణ, ఇంజినీరింగ్ అధికారులు భాస్కరరావు, జి.మురళి, వి.వెంకట కృష్ణయ్య, మండల విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-03-02 18:56:23

ఏ‌ప్రియల్‌ 7 ‌నుంచి ప్రి పిహెచ్‌డి పరీక్షలు..

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్టస్-‌కామర్స్ ‌కళాశాల పరిధిలో ఎంఫిల్‌, ‌ప్రి పిహెచ్‌డి పరీక్షలను ఏప్రియల్‌ 7 ‌నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.రాజేంద్ర కర్మార్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రియల్‌ 7‌వ తేదీన పేపర్‌ 1, 8‌వ తేదీన పేపర్‌ 2, 9‌వ తేదీన వైవా వాయిస్‌ ‌నిర్వహిస్తామన్నారు. మద్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు వీటిని నిర్వహిస్తామన్నారు. వాత్ర పరీక్షలను కామర్స్, ‌మేనేజ్‌మెంట్‌ ‌విభాగ భవనంలోను, వైవా వాయిస్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌కార్యాలయంలోను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు పరీక్ష హాల్‌ ‌టికెట్లను పరీక్ష తేదీకి మూడు రోజుల ముందుగా అందిస్తామన్నారు.

Andhra University

2021-03-01 16:27:40

ఒకరి రక్తదానం ఐదుగురికి ప్రాణదానం..

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎన్‌సిసి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. ఎన్‌సిసి వలంటీర్లు స్వచ్చందంగా రక్తదానం చేశారు. కార్యక్రమాన్ని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌ప్రారంభించారు. యువత స్వచ్చంద రక్తదాతలుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యం నగరంలో రక్తం అవసరం పెరుగుతోందన్నారు. ఆపద సమయంలో రోగులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను రక్షించడంతో ఎంతో మంచి పరిణామన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, నిర్వహిస్తున్న ఎన్‌సిసి అధికారులను రిజిస్ట్రార్‌ అభినందించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ,  ఎన్‌సిసి లెఫ్ట్‌నెంట్‌ ‌డాక్టర్‌ ఎన్‌.ఎం ‌యుగంధర్‌, ఎన్‌సిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Andhra University

2021-02-28 22:12:14

ఏయూలో జాతీయ సైన్స్ ‌దినోత్సవం..

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆదివారం జాతీయ సైన్స్ ‌దినోత్సవాన్ని ఘనంగా  నిర్వహిచారు. ఏయూ సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.శ్రీనివాస రావు జియో ఫిజిక్స్ ‌విభాగంలోని సి.వి రామన్‌ ‌విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశానికి సి.వి రామన్‌ అం‌దించిన శాస్త్రీయ విజ్ఞానం, ఆవిష్కరణలు ప్రపంచ దేశాల సరసన భారత్‌ను నిలిపాయన్నారు. అనంతరం సైన్స్ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ‌కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌  ‌సి.వి రామన్‌ ‌చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ ప్రజలు శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణలతో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ ‌రాణిస్తోందన్నారు. అంతరిక్ష రంగంలో భారత్‌ అ‌గ్రగామిగా నిలుస్తోదన్నారు.

Andhra University

2021-02-28 21:34:38

ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి..

విద్యార్దులు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుంటే ఉన్నత ఉద్యోగావకాశాలను పొందవచ్చవని పాడేరు సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల వివరించారు. 10 వతరగతి తరువాత తీసుకోవలసిన కోర్సులను ఆయన వివరించారు. ఇంటర్మీడియట్‌లో చేరే ముందు ఏగ్రూపులో చేరాలో ముందుగా ప్రశ్నించుకుని కళాశాలలో చేరాలన్నారు. బైపిసి, ఎంపిసిలో చేరామా అనేది ముఖ్యం కాదని, ఏగ్రూపులో చేరినా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. శనివారం గురుకుల కళాశాల నుంచి రాష్ట్రంలోని గురుకుల విద్యార్దులకు వర్చవల్ విధానంలో కెరీర్‌గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. ప్రభుత్వ రంగంకంటే ప్రైవేటు రంగాల్లో అనేక ఉద్యోగాలు ఉన్నాయని వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. తను డిల్లీ సివిల్స్ శిక్షణకు వెళ్లినపుడు డిల్లీ యూనివర్సీటీలో అనేక మంది విద్యార్దులు ఆర్కియాలజీ, ఆర్కిటెక్చర్, లా, జర్నలిజం, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి డిగ్రీ కోర్సులలో చేరుతున్నారని చెప్పారు.ప్రభుత్వ సెక్టార్ కంటే ప్రైవేటు రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసారు.యూరోపియన్ దేశాలలో సగుటు ఆదాయం ఎక్కవగా ఉందన్నారు. అక్కడ ప్రభుత్వ రంగం కంటే ఎక్కవ మంది ప్రైవేటు రంగాల్లో ఉపాధి పొందుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారన్నారు. ఒకే ఉద్యోగం కోసం ఎదురు చూడడం వలన మన శక్తి సామర్ధ్యాలను తగ్గించుకోవడమన్నారు. మీ అందరిలో మంచి నైపుణ్యాలు ఉన్నాయని వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ప్రపంచంలోనే అతిపెద్ద సంస్ధ గూగుల్ సి ఇ ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుందర్‌పిచాయ్ విజయ ప్రస్తానాన్ని వివరించారు. ఐ ఎస్ ఎస్ , ఐ పి ఎస్, ఐ ఎఫ్ ఎస్ సర్వీసులే కాకుండా ఎకనామిక్స్ చదివిన విద్యార్దులకు ఇండియన్ ఎకనామిక్స్ సర్వీసెస్‌లోను, కామర్స్ తీసుకున్న విద్యార్దులకు చార్టెడ్ అకౌంట్ ఉద్యోగాలు, ఆర్కిటెక్చర్‌లో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. పట్టణాల్లో అధునిక నిర్మాణాలకు , మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్కిటెక్చర్‌లకు అవకావాలు ఉంటాయని చెప్పారు. ఇంటీరియర్ డిజైనింగ్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. అదేవిధంగా లా చదివి న్యాయవాదులుగా స్దిరపడవచ్చని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్దిరపడాలని అన్నారు. అదేవిధంగా క్రీడలలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకులం సెక్రటరీ డా. కె.శ్రీకాంత్ ప్రభాకర్, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి. విజయ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ కిషోర్ బాబు ఎపి ఆర్ జెసి విద్యార్దినులు పాల్గొన్నారు. 

Paderu

2021-02-27 19:55:08