1 ENS Live Breaking News

సతీష్ బాబు ప్రాణత్యాగం వృధాకాదు..కుమార్ రాజా

భారత్-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన భరతమాత ముద్దు బిడ్డ కల్నల్ సంతోష్ బాబు ప్రాణత్యాగం వ్రుధాగా పోనివ్వమని డిసిసిబి డైరెక్టర్ సిహెచ్ కుమార్ రాజా అన్నారు. అన్నవరం శ్రీ సత్యగణపతి తోపుడు బండ్లు మరియు కాశీ తాళ్ల వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి పాదాల చెంత యుద్ధంలో వీరమణం పొందిన సంతోష్ బాబు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతి గర్వించదగ్గ అని కొనియాడారు. దేశంలో ప్రతీ పౌరుడూ చైనా దురంహకారాన్ని తిప్పికొట్టాలన్నారు. చైనా వస్తువులను, మొబైల్ యాప్ లను నిషేధించాలని అన్నారు. తోపుడు బండ్ల వర్తకులకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ టౌన్ ప్రెసిడెంట్ బొమ్మిడి సత్యన్నారాయణ, సంఘం అధ్యక్షులు తాటిపాక శ్రీను, సభ్యులు ప్రసాద్, నాని, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

2020-06-21 14:48:08

సకల శుభాలకు గణపతి మంత్రమే మూలాధారం

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే... అనే శ్లోకం ప్రతీరోజూ ఏ పూజ చేసినా.. ఏ కార్యక్రమం చేసినా దీనిని చదుకొని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలుు లేకుండా కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు. అంతే కాకుండా ప్రతి నిత్యం గణపతి మూల మంత్రం చదువుకోవడం ద్వారా కూడా  సల శుభాలు సిద్ధిస్తాయనేది ప్రతీతి. దానికోసం ప్రతీ ఒక్కరూ ఆ ఉండ్రాళ్ల రాయుడిని ప్రతినిత్యం ఆయన మూల మంత్రంతో స్తుతించడం చాలా మంచిదని కూడా  గమనించాలి.. దానికోసం .. ఓ గం గణపతియే నమహా.. ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది. 


2020-06-19 12:42:34