1 ENS Live Breaking News

2020-10-02 17:27:19

కక్షగట్టి సిసి కెమెరాలతో వేధిస్తున్నాడు..

ఎస్.రాయవరంలో మాజీ ఎంపీటీసీ బొలిశెట్టిగోవిందరావు అక్రమాలు బయటపెడుతున్నాడనే అక్కసుతో సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు ఇంటి ముందు సిసి కెమెరాలతో అనుమతి లేకుండా రికార్డింగులు చేయించి మరీ వేధింపులకు దిగడం చర్చనీయం అవుతోంది. రాజు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకునేందు ఏకంగా విద్యుత్ స్థంబాలను, టెలీఫోను స్థంబాలను వినియోగించి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలిసినా సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన బోలిశెట్టిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. రాజు ఇంటిముందు ఒకటి, ఎంపిపి స్కూలు విద్యుత్ స్థంబానికి ఒకటి,  మరొకటి పక్కనే వున్న టెలీఫోన్ స్థంబానికి సిసికెమెరాలు అమర్చి రాజు ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు. రాజ్యాంగ బద్ధంగా తాను జీవించే హక్కుకి బంగం కలిగించేలా వ్యవహరిస్తున్న బోలిశెట్టిపై  చర్యలు తీసుకోకపోగా, ఆయనకే ప్రభుత్వ అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు సోమిరెడ్డి రాజు. ఒకరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక ప్రైవేటు వ్యక్తి సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం అయినా అధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే ఒక మాజీ ఎంపీటీసీ అధికారులను ఏ స్థాయిలో కట్టడి చేశాడో అర్ధం చేసుకోవాలని రాజు వాపోతున్నాడు. నాలుగు నెలలుగా సిసి కెమెరాల ద్వారా మా ఇంట్లో ఏం జరుగుతుందో అన్ని రికార్డు చేయిస్తున్నారని, కేవలం బొలిశెట్టి అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు, లోకాయుక్తాకు ఫిర్యాదు చేశాననే అక్కసుతో ఇదంతా చేస్తున్నారని సోమిరెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లో మహిళలు ఉన్నా నిరంతరాయంగా తమ ఇంటిలో జరుగుతున్నదంతా రికార్డు చేయిస్తున్నారని చెప్పాడు. పోలీసులు, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు  అనుమతి లేకుండా వినియోగిస్తున్న స్థంబాల విషయంలో నేటికీ ఎవరూ బోలిశెట్టిపై చర్యలు తీసుకోలేదన్నాడు. ఈవిషయమై డిఐజి ఆఫ్ పోలీస్, విశాఖపట్నం జిల్లా పంచాయతీ అధికారి, ఎస్.పి, రూరల్, విశాఖపట్నం, ఏఎస్పీ, నర్సీపట్నం, సిఐ, నక్కపల్లి, ఎస్.ఐ, యస్.రాయవరం కు ఫిర్యాదు చేస్తున్నట్టు రాజు మీడియాకి వివరించాడు. 

ఎస్.రాయవరం

2020-10-02 17:25:27

2020-09-30 20:58:28

2020-09-30 20:57:30

డ్రైనేజీలేక మురుగునీటితో సహవాసం..

అధికారుల అనాలోచిత నిర్ణయం ఆ గ్రామస్తుల పాలిటి శాపంగా మారింది. చినుకు పడితే చాలు నీరంతా గుమ్మంముందు తిష్టవేయడంతో ఎటూ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండలంలో చినగుమ్ములూరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యం లో గతంలో సైడ్ డ్రైన్స్ లేకుండా రోడ్డు నిర్మాణాలు చేపట్టడంతో ఈ దుస్థితి వచ్చినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరుపోయే మార్గం లేకపోవడంతో రోడ్లన్నీ మురికి కాలువలను తలపిస్తున్నాయి. ఇక్కడ మురికిగా తయారైన పంచాయితీ రోడ్లు, అపరిశుభ్రతతో దుర్గంధం వెదజల్లుతున్న కనీసం పట్టించుకునేనాధుడే కరువయ్యాడని ఈ గ్రామస్తులు వాపోతున్నారు. చినగుమ్ములూరు గ్రామంలో ఏ వీధిలోనూ సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో స్నానపానాలు చేసిన వ్రుధానీరు కూడా రోడ్లపైకి వచ్చేస్తుంది. గ్రామస్తులు పంచాయితీకి ఎన్ని సార్లు పిర్యాదు చేసిన సైడ్ కాలువ కూడా నిర్మించపోవడంతో ఈ విషయాన్ని గ్రామస్తులు మీడియాకి ముందుకి తీసుకు వచ్చారు. మురికి, దుర్గంధం వలన పిల్లలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు లేని తమ గ్రామంలో ప్రభుత్వం తక్షణమే డ్రేనేజీలు తవ్వించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

చిన్నగుమ్ములూరు

2020-09-30 20:56:43

అంగన్ వాడీలో ఎర్రబాట సేవలు..

అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మంచి ఆరోగ్యం వారి సొంతమవుతుందని ఎర్రబాట పత్రిక సంపాదకులు పితాని రాము అన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ, రేపూరు అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్ర బాట  108 మంది పిల్లలకు టూత్ పేస్టులు, బ్రష్ లు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో  పత్రిక ద్వారా తమ వంతు సహాయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అలాగే జిల్లాలోని పలు  ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్కులు, శానిటైజర్ లు కూడా అందించడం జరిగిందన్నారు. అనంతరం కొవ్వాడ పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ, కొవ్వాడ, రేపూరు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న మూడు సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు పేస్టులు, బ్రష్ లు ఇవ్వడం అభినందనీయమన్నారు. అన్నివర్గాల దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నిరుపేద కుటుంబాలకు కాస్త ఆసరా దొరుకుంతుందని సూచించారు. దన సహాయం కన్నా కరోనా సమయంలో వస్తు సహాయం ఎంతో ఉపయోగంగా వుంటుందని దాతల సహాయాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2020-09-30 14:31:05

బొలిశెట్టి అనుమతుంటే చాలు.. అక్రమ నిర్మాణమే

విశాఖజిల్లాలో ఒక సాధారణ మాజీ ఎంపీటీసీ ఎస్.రాయవరంలో రూలింగ్ చేయడం ప్రభుత్వ అధికారులకు, సిట్టింగ్  ఎమ్మెల్యే గొల్లబాబూరావుకి విస్మయాన్ని కలిగిస్తోంది... ఏదైనా నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్నా, తీసుకోకపోయినా బొలిశెట్టి గోవిందరావు అనుమతి తీసుకుంటే చాలు...ఆ కట్టడాలను తనిఖీలు చేయడానికి ఏ ఒక్క అధికారి ఆ ఇరుప్రక్కలకు రాడు... వచ్చినా ఓహో ఇది బొలిశెట్టి అనుచరుడి నిర్మాణం కదా దీని జోలికి వెళ్లినా ఫలితం లేదనుకొని వెనక్కి వెళ్లిపోతారు..అలా ప్రభుత్వ అనుమతి లేకుండా బొలిశెట్టి అనుచరుడినని చెప్పుకుంటూ కేవలం జి ప్లస్ టు నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉన్న గ్రామ సచివాలయ పరిదిలో ఏకంగా నాలుగు అంతస్తుల కళ్యాణ మండపాన్ని నిబంధనలన్నీ మా చుట్టాలే నంటూ అధికారులను బెదిరించి మరీ నిర్మించేశారు..ఒక నిరుపేద ఒక్కసెంటు భూమిలో పాక వేసుకుంటే ఎక్కడలేని రూల్సు అకస్మాత్తుగా గుర్తుకొచ్చేసి ఆ పాకు కూల్చే వరకూ నిద్రపోని ప్రభుత్వ అధికారులు.. ఇక్కడ ప్రభుత్వ అనుమతి కంటే పెద్ద అనుమతి బొలిశెట్టి గోవిందు అనుమతి ఉండటంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అంతస్తులు శ్రీ వెంకటేశ్వరా కళ్యాణ మండపాన్ని స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల ముందే నిర్మించేసినా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. పైగా బొలిశెట్టి ప్రధాన అనచరుడినంటూ కర్రిధనరెడ్డి ఈ ఓనరుగా ఉన్న ఈ కళ్యాణ మండపాలకు వెళ్లడానికి నాలుగు వెపులా ఇరిగేషన్ కాలువలపై నిబంధనలకు విరుద్దంగా వంతెనలు కూడా నిర్మించాడు. ఈ విషయంపై సమాచారహక్కు చట్ట కార్యకర్త సోమిరెడ్డిరాజు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో విచారణకు వచ్చిన డిఇఇ సుజాత, ఏఈ చిన్నారావులను బొలిశెట్టి, ఎమ్మెల్యే గొల్లబాబూరావు పేర్లు చెప్పి బెదిరించి మరీ తరిమికొట్టాడు సదరు కళ్యాణ మండపం యజమాని. ఒక మాజీ ఎంపీటీసి పేరుతో జరుగుతున్న అక్రమనిర్మాణాలపై అటు రెవిన్యూ, గ్రామసచివాలయం, ఇటు ఇరిగేషన్, పోలీసు అధికారులు సైతం నోరు మెదకపపోవడం విచిత్రంగా వుందని సోమిరెడ్డి రాజు మీడియా ముందు వాపోయారు. ఎవరైనా నిరుపేదలు సెంటు స్థలంలో ఇళ్లు కట్టుకుంటే అనుమతులున్నాయా అంటూ ఆ పాకను పెకలించేంతవరకూ నిద్రపోని అధికారులు ఎస్.రాయవరంలో మాజీ ఎంపీటీసీ రూలింగ్ చేస్తూ, అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నా చోద్యం చూస్తున్నారని రాజు ఆరోపిస్తున్నారు. తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే జిల్లా కలెక్టరుని ఆశ్రయిస్తామని, లోకాయుక్తాకి ఫిర్యాదు చేస్తామని కూడా సోమిరెడ్డి హెచ్చరిస్తున్నారు. పైగా అభివ్రుద్ధి పనులకే పెద్దపీట వేసే ఎమ్మెల్యే గొల్లబాబూరావుని అక్రమాల ఊబిలోకి బొలిశెట్టి, అతని అనచరులు నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

s.rayavaram

2020-09-29 13:38:05

దళితులపై దురాగతాలు సహించేది లేదు..

దళితుల పై దురాగతాలను చేపడితే ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య హెచ్చరించారు. సోమవారం రావికమతం మండలంలోని గుమ్మళ్ళపాడు గ్రామాన్ని సందర్శించి అక్కడ దళితుల గ్రామ బహిష్కరణ పై విచారణ చేపట్టారు. అక్కడ జరిగిన విషయాలను గ్రామ ప్రజలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, దళిత సామాజిక వర్గానికి చెందిన యువతిని అగ్రవర్ణానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో సంబంధిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ గావించడం ఎంతో విచారించదగిన విషయం అన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సంబంధిత కుటుంబాల వారికి కౌన్సిలింగ్ చేయాల్సిందిగా మండల అధికారులకు ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు మరి ఏ మండలం లోనూ, గ్రామాలలో నూ పునరావృతం కాకూడదని, మరలా ఇటువంటి సంఘటనలు జరిగినట్లు తన దృష్టికి వస్తే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ తో పాటు రావికమతం మండల తాసిల్దార్ కనకారావు, సీ ఐ లక్ష్మణ మూర్తి, ఎస్ ఐ చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Ravikamatham

2020-09-28 18:46:43

నిధులు దారిమళ్లింపు కఠిన చర్యలు..!

గ్రామసచివాలయాల్లో  ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారిణయ సిబ్బందిని హెచ్చరించారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని ఎస్.రాయవరం సచివాలయంలో ఈఓపీఆర్డీ ఏవిఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వ నిధులను తన కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించిన వ్యవహారంలో నర్సీపట్నం డీఎల్పీఓ విచారణ చేపట్టారని, ప్రాధమికం రూ.47 వేలు తన కుమారుడి ఖాతాలోకి మళ్లించినట్టు రుజువైందన్నారు. విచారణ నివేదికను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు చర్యలు నిమిత్తం పంపించనున్నట్టు ఆమె వివరించారు. ఈయనతోపాటు మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలు కూడా తమ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి పంచాయతీ నిధులు దారిమళ్లించినట్టు గుర్తించామని, వారిపై చర్యలు తప్పవని డిపిఓ వివరించారు. కరోనా సమయంలో చాలా సచివాలయాల్లో సిబ్బందిని ఫినాయిల్, బ్లీచింగ్, ఇతర ఖర్చుల విషయంలో అధికంగా ఖర్చులు చేసేరా విషయంపై వచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టినట్టు ఆమె వివరించారు. ఎవరైనా నకిలీ బిల్లులు పెట్టినా, నిధులు పక్కదారి పట్టించినా కఠిన చర్యలు తప్పవని డిపిఓ హెచ్చరించారు. కాగా ఎస్.రాయవరం సచివాలయంలో ఈ నిధులతోపాటు మరికొన్ని నిధులు దుర్వినియోగంపైనా లోకాయుక్తాలో కూడా కేసులు నడుస్తుండటం విశేషం. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి..

Visakhapatnam

2020-09-26 14:15:08

నాడు ఈఎన్ఎస్ చెప్పింది.. నేడు నిజమైంది ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కరోనా ఖజనాకి కన్నం పెట్టినా.. గ్రామసచివాలయ కార్యదర్శిలకు మహబాగా నాలుగు రాళ్లు వెనుకేసుకేలా చేసింది. చేతికి ఎంత దొరికితే అంతే అడ్డంగా దోచేశారు.. ఇదే సమయంలో ప్రభుత్వ నిధులను పక్కదానికి పట్టించి ఎవరికీ అనుమానం రాకుండా సచివాలయ కార్యదర్శిలు తమ పిల్లలు, భర్తల పేరనే బ్యాంకుల్లో డిపాజిట్ చేసేకున్నారు. ఈ విషయాన్ని ఎస్.రాయవరం గ్రామసచివాలయ అవకతవకలపై ఈఎన్ఎస్ మూడు నెలల క్రితం వార్తా కథనాలు అందించింది. నేడు నర్సీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారిణి, ఎస్.రాయవరం గ్రామసచివాలయంలో చేసిన విచారణలో ఆశక్తికర వాస్తవాలువ వెలుగు చూశాయి. కొత్తరేవుపోలవరం కార్యదర్శిగా వున్న ఏవిఎస్ఎస్ ప్రసాద్ ని ఎస్.రాయవరం సచివాలయ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అదే సమయంలో కరోనా వైరస్ విజ్రుంభించడంతో సచివాలయానికి కావాల్సిన బ్లీచింగ్, ఫినాయిల్, శానిటైజర్లు ఇలా అన్నింటిని కొనుగోలు చేయడానికి నేరుగా కార్యదర్శిలు తమ కుటుంబ సభ్యులను వినియోగించుకున్నారనే విషయం డిఎల్పీఓ విచారణలో తేలింది. ఏకంగా 47వేల రూపాయలు సదరు కార్యదర్శి తన కొడుకు బ్యాంకు ఖాతాకి మళ్లించినట్టు రుజువు అయ్యింది. దీంతో సచివాలయంలోని రికార్డలన్నింటినీ డిఎల్పీఓ నర్సీపట్నంలోకి కార్యాలయానికి తీసుకువెళ్లారు. మొత్తం ఎస్.రాయవరం పంచాయతీ రికార్డులు మొత్తం తనిఖీలు చేపడితే మరిన్నివిషయాలు వెలుగు చూసే అవకాశం వుంది.

s.rayavaram

2020-09-25 20:45:30

మండపంలో 55 మందికి వైద్య పరీక్షలు..

శంఖవరం మండలంలోని మండపం రామాలయంలో గురువారం డా.అభిషేక్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు గ్రామంలో 55 మంది వృద్ధులు వికలాం గులు,మహిళల కు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. సచివాలయ ఏఎన్ఎమ్ సుష్మా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని  గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు జ్వరం ,మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కూనిశెట్టి మాణిక్యం , కార్యదర్శి పి నాగమణి ,మహిళా పోలీస్ గౌతమి ,మాజీ సర్పంచ్ నక్కా మాణిక్యం ,ఏఎన్ఎమ్ కృష్ణ కుమారి,అల్లు బాబు ,ఆశా నాగమణి ,విహెచ్ఏ శ్యామ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.

మండపం

2020-09-24 19:40:45

శంఖవరంలో 2 కరోనా పాజిటివ్ కేసులు..

శంఖవరం పీహెచ్సీలో గురువారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 2 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈరోజు మొత్తం 9 మందికి పరీక్షలు చేయగా 2పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ తీసుకొని మందులు వాడటం ద్వారా వైరస్ నియంత్రణ జరుగుతుందన్నారు. ప్రజలంతా ప్రభుత్వం నిర్ధేశించిన 4.0 అన్ లాక్ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.  అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు

Sankhavaram

2020-09-24 15:50:28

వైఎస్సార్సీపీలోకి మరో టిడిపి ఎమ్మెల్యే జంప్..

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి టిడిపి ఎమ్మెల్యేల జంపింగ్ కోసం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది. ఇందు ముందుగా విశాఖ పశ్చిమ నియోజ కవర్గ ఎమ్మెల్యే గణబాబు పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. వచ్చేనెల ఐదున అధికారపార్టీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారట. ఈయన తరువాత తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే, ఆతరువాత ఉత్తర నియోజవర్గ ఎమ్మెల్యే గంటా ఇలా విశాఖ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీలోకి చేరతారని విశేషంగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో విశాఖ జిల్లా చాలా కీలకంగా వుంది. అలాంటి జిల్లాలో 2019 ఎన్నికల్లో విశాఖ మహానగరంలో ఎంపీ మినహా ఎవరూ పార్టీ నుంచి గెలవలేకపోయారు. ఆ తరువాత ఏడాది దాటిన తరువాత గెలిచిన ఎమ్మెల్యేలంతా యూ టర్న్ తీసుకొని అధికారపార్టీలోకి వచ్చేస్తున్నారు. ముందుగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చేయగా, ఇపుడు గణబాబు సిద్ధమయ్యారు. అయితే వీరంతా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా అధికారపార్టీకి మద్దతు నిస్తూ, పార్టీలోకి రావడం విశేషం.

పశ్చిమ నియోజకవర్గం

2020-09-24 13:20:57

ముగ్గురు పారామెడికల్ సిబ్బంది నియామకం..

శంఖవరం ఆయుష్మాన్ భారత్ వెల్ నెస్ కేంద్రానికి మంజూరైన ముగ్గురు పారామెడికల్ సిబ్బంది విధుల్లోకి చేరారని వైద్యాధికి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. గురువారం ఆయన ఆసుపత్రిలో మీడియాలో మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ ఆసుపత్రికి ఒక ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సులను నియమించిందన్నారు. ఇప్పటి వరకూ సిబ్బంది కొరతతో ఉన్న ఆసుపత్రికి ప్రభుత్వం అందించిన ఈ సిబ్బందితో కాస్త కొరత తీరుతుందని చెప్పారు. అయితే ఈ ఆసుపత్రికి రెండు ల్యాబ్ టెక్నీషియన్లు మంజూరు ఉండగా ప్రస్తుతం ఒక్కరు మాత్రమే వచ్చారన్నారు. ఇద్దరు ఫార్మసిస్టులతో పూర్తిస్థాయిలో మందుల పంపిణీకి వీలుపడుతుందన్నారు. ప్రస్తుతం ల్యాబ్ టెక్నీషియన్ నియామకంతో ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడానికి వీలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు అధికంగా వుండటం వలన ఆ పరీక్షలు మాత్రమే ప్రతినిత్యం చేస్తున్నట్టు చెప్పారు. ఆసుపత్రికి పారామెడికల్ సిబ్బంది మంజూరుకి క్రుషి చేసి ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా డాక్టర్ అభినందనలు తెలియజేశారు.

Sankhavaram

2020-09-24 12:54:17