కేంద్ర,రాష్టప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను గ్రామస్థాయిలో ఎండగట్టాలని సిపిఎంశాఖ కార్యదర్శులు, సభ్యులు ప్రతినబూనారు. సిపిఎం రాష్ట్రకమిటీ ఆదేశాలమేరకు శనివారం మండలంలోని డౌనూరు పంచాయితీ ముళ్లిమెట్ట, నిమ్మలపాలెం, మూలపేట పంచాయితీ జాజులబంద గ్రామాల్లో సిపిఎం శాఖ సమావేశాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వాలు సామాన్యుడిని ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ముళ్లిమెట్టలో పి.బాలరాజు, సీతారామయ్య, జయశంకర్, ఆర్బికరిష్ణ, బాలరాజు, చంద్రబాబు, నిమ్మలపాలెంలో జి.సాన, సోమయ్య, రాజు, సిద్ధు, జాజులబందలో కె.చిట్టిబాబు, రంగన్న, కరిష్ణ, మర్రివెంకటరావు, జి.సతీష్ పాల్గొన్నారు.
గొలుగొండ మండలం ఎఎల్పురంలో మరో కరోనా కేసు నమెదైయ్యింది. మధ్యప్రదేశ్ నుండి ఎఎల్పురం బిసి కాలనీ వచ్చిన వ్వక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని డాక్టర్ ప్రణతి తెలిపారు. ఇప్పటికే గ్రామంలో 2 కేసులు నమెదుకాగ దీంతో 3 కేసులుకు చేరాయి. పాజిటివ్ వ్యక్తిని తక్షణమే నర్సీపట్నం ఏరియీ అసుపత్రికి అంబులెన్సులో తరలించారు. ఈయన ప్రైమరరీ, సెకండరీ కాంటాక్ట్ లకు పరీక్షలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పనులకు తప్పా ఎవరూ బయటకు రాకూడదన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు దరించి తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలన్నారు.
పాడేరు పీహెచ్సీ పరిధిలోని కరోనా లక్షణాలతో ఉన్న రోగులకు ప్రతి సోమవారం, గురువారం , శనివారం సంజీవిని వాహినం ద్వార జి.యం.ఆర్ పాలిటెక్నిక్ పాడేరు గ్రౌండ్ వద్ద కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కే లీలప్రసాద్ తెలియజేశారు. ఈ పరీక్షలను నోడల్ అధికారి డా. ప్రవీణ్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. పాడేరు డివిజన్ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున ముందస్తుగా కరోనా నిర్ధారణకాబడిన రోగుల ప్రధమ కాంటాక్ట్స్, సెకండరి కాంటాక్ట్స్, కరోనా సింటోమేటిక్ కాంటాక్ట్స్ గలవారికి కరోనా నిర్ధారణ కిట్ల లభ్యతను అనుసరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. ఈ కార్యాక్రమంలో కోవిడ్ కేర్ సెంటర్ వై.టి.సి పాడేరు నోడల్ అధికారి డా. ప్రవీణ్ వర్మ తదితరులు పాల్గున్నారు.
గాజువాక జివిఎంసి 76 వ వార్డ్ పెదగంట్యాడ చిన్ననడుపూరు గ్రామంలో ఈ రోజు శ్రీ కృష్ణ జనమ్మాస్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవంశీ కృష్ణ యూత్, కార్పోరేటర్ అభ్యర్ధి దొడ్డి రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వై ఎస్ ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, సకలచరాచర జీవరాసులకు రక్షకుడు శ్రీ క్రిష్ణ భగవానుడేనన్నారు. దొడ్డి రమణ మాట్లాడుతూ, వార్డు ప్రజలంతా కరోనా నుంచి రక్షింపబడాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మార్డ్ పూడి పరదేశి, నక్క వెంకట రమణ,తాటికొండ అచ్చుత్, ప్రసాద్,డి.వెంకి,శేఖర్,మధు,రమేష్,బి ఎస్ఎఫ్ సాద్,శ్రవణ్,వంశి,శివరాం,శివ,అండిబోయిన సన్నీ,ప్రసాద్,గురుమూర్తి,బాబురావు,వార చైతన్య తదితరులు పాల్గొన్నారు.
కిషోర్ చావుకు కారణమైన కానిస్టేబుల్ ను తక్షణమే సస్పెండ్ చేసి, ఆ కుటుంబాన్ని అరెస్టు చేయాలని నర్పీట్నం పోలీసుస్టేషన్ బయట రోడ్డుపై మృతుడి తల్లిదండ్రులు మంగళవారం ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి మద్దతుగా కాలనీ వాసులంతా కలసిరోడ్డుపైకి వచ్చారు. నర్సీపట్నం పెద్దచెరువులో రగ్గుచుట్టి దొరికిన మృతదేహాం నర్సీపట్నం యస్.సి కాలనీకి చెందిన గారా కిషోర్ గా గుర్తించారు. కిషోర్ నర్సీపట్నం పోలీసు స్టేషన్లో పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అందువల్లే కిషోర్ ను అమ్మాయి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని ఆరోపించారు. రెండేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, దీని నుంచి వదిలించుకునేందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ కిషోర్ తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని చెప్పారు.
విశాఖ జిల్లా, గొలుగొండ మండలం గుమ్మాల వద్ద పోలీసులు సో మవారం 132 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వ హిస్తుం డగా పాకలపాడు నుంచి గుమ్మాల వైపు వస్తున్న కారులో లోడ్ చేసిన 132 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈకేసులో రాజ మండ్రి ప్రాంతానికి చెందిన కొవ్వూరు రమేశ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చింతపల్లి మండలం అన్నవరం నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్సై నారాయణరావు మీడియాకి వివరించారు. సంఘవిద్రోహ చర్యలకి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలో2020-21 విద్యాసంవత్సరం కు సంబం ధిం చి అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కా ర్పొరేట్ స్కూల్స్ లో 100 శాతం రాయితీ కల్పిస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఉత్తర్వులు జారీచేశారని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ర్ట కార్యదర్శి శాసపు జోగినాయుడు తెలిపారు. ప్రతీ ఏటా జర్నలిస్టుల పిల్లల చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసికొనని రాయితీలు కల్పిస్తూ సహాయపడుతున్న కలెక్టర్ ను జర్నలిస్టుల సంఘాల ఐక్యవేధిక జర్నలిస్టులు అభినందించారు. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాల విధిగా జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం రాయితీ ఇవ్వాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం శుభపరిణామం అన్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ, ప్రతీ ఒక్కరూ మెలగాలని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్రిడేషన్ కలిగిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించే సమయంలో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు కాపీ సమర్పించాలని శాసపుజోగినైడు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, డెస్క్ జర్నలిస్టులు, చిన్న,మధ్యతరహా పత్రికల ప్రతినిధులు ఈ సర్కులర్ పై ఎటువంటి సందేహాలు ఉన్నా జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యా శాఖ అధికారులను జర్నలిస్టుల ఐక్యవేధిక ప్రతినిధులు కొంఖ్యాన వేణుగోపాల్,అల్లు యుగంధర్,ఎం.ఏ. వి.సత్యనారాయణ, డోల అప్పన్న,చింతపల్లి నాగబాబు ,సూరి చంద్రశేఖర్,రౌతు సూర్యనారాయణలు మీడియాతో మాట్లాడిన వారిలో ఉన్నారు.
కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్ లోని వీధి కుక్కలకు మాస్ వాక్సినేషన్ (టీకాలు) కార్యక్రమాన్ని కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కమషనర్ స్వప్నిల్ దినకర్ ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచ జునిసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక వివేక నంద పార్క్ వద్ద వీధి కుక్కలకు టీకాలు కార్యక్రమాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు సహకారం తో కమిషనర్ ప్రారంభిస్తూ, ఈ టీకాలు కార్యక్రమ ము 2 నెలలు నగరంలో కొనసాగుతుంది అని వివరించారు. నగర ప్రజలు, స్వాచంద్ద సంస్థలు మరియు జంతు సంరక్షణ మరియు ప్రేమికులు ఈ కార్యకరమానికి సహకరించాలని, అలాగే మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది వీధి కుకలను తీసుకువెళ్లే సమయాలలో వారికి స్థానిక నాయకులు ప్రజలు అవరోధాలు కల్పించకుండా ఈ టీకాలు కార్యక్రమాన్ని విజయంతంగా పూర్తి చేయాలని కమిషనర్ దినకర్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమషనర్ నాగ నరసింహ రావు, హెల్త్ ఆఫసర్ ప్రశాంత్, కుక్కల కుటుంబ నియంత్రణ సమన్వయ కర్త డాక్టర్ బెహరా, ఆంధ్ర ప్రదేశ్ గోశాల ఫెడరేషన్ కో ఆర్డినేటర్ శ్యామ్, జంతు ప్రేమికులు చంద్ర మౌళి, గోపాల్,సుసి, యితర జంతు ప్రేమికులు మరియు మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి పర్యటించిన చారిత్రక ప్రదేశాలపై లోతుగా పరిశోధన జరగాలని అల్లూరిచరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు అన్నారు. రంపచోడవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను పరిశోధన చేసిన అంశాలను అల్లూరి మ్యూజింలోకి డాక్యుమెంటరీగా తయారు చేసి అందించనున్నామని చెప్పారు. విశాఖ కలెక్టరేట్ లో ఉన్న అల్లూరికి చెందిన గెజిట్లను ప్రభుత్వం బహిర్గతం చేయాలన్నారు. త్వరలోనే అల్లూరి వెంట నడిచిన సైన్యం కుటుంబాలను కలవనున్నామని వివరించారు. మన్యం పితూరిలో అల్లూరితో పాటు ప్రాణాలు అర్పించిన వారి విషయాలు బాహ్య ప్రపంచానికి నేటికీ తెలియలేదన్నారు. అదేవిధంగా అల్లూరి చరిత్రకి సంబంధించి చాలా విషయాలు మరుగున పడిపోయాయని అన్నారు.అలాంటి చారిత్రిక అంశాలన్నీ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశ్యంతో తన పరిశోధన లోతుగా జరుగుతోందన్నారు. ఆరునెలలుగా తూర్పుగోదావరి జిల్లాలో అల్లూరి సంచరించిన ప్రదేశాలన్నీ తిరగడమతో పాటు చాలా కొత్త విషయాలను కనుగొనడం జరిగిందన్నారు. తన పరిశోధన అంశాలన్నీ ఒక పుస్తకరూపంలో తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగున్నాయని బాలు వివరించారు...
అత్యాచారానికి గురైన బాధిత గిరిజన బాలికకు అన్నివిధాల న్యాయం జరిగేలా చూస్తామని ఐటిడిఎ పిఒ డా.వెంకటేశ్వర్ సలిజామల హామీ ఇచ్చారు. జి.మాడుగుల మండలం కె. కోడాపల్లి పంచాయతీ జన్నేరు గ్రామంలో బాలికపై అత్యాచారం ఘటనపై గురువారం పాడేరులో గిరిజన సంఘం రాష్ట్ర నేత అప్పలనర్సతోపాటు ఆ సంఘం జిల్లా నాయకులు కె.పృథ్వి, దీనబంధు, బాధిత కుటుంబ సభ్యులు పిఒను కలసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ..ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకరిపై పోలీసులు కేసు నమోదు చేశారని, మిగతా ముగ్గురుపై కూడా అవకాశమున్న అన్ని కేసులు నమోదుకు డిఎస్ పితో మాట్లాడుతానన్నారు. బాధిత బాలికకు ఉద్యోగ వయస్సు నిండిన తర్వాత ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారంపై గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ తో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధిత కుటుంబం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా తెలపాలని వారితో చెప్పారు.