కిషోర్ చావుకు కారణమైన కానిస్టేబుల్ ను తక్షణమే సస్పెండ్ చేసి, ఆ కుటుంబాన్ని అరెస్టు చేయాలని నర్పీట్నం పోలీసుస్టేషన్ బయట రోడ్డుపై మృతుడి తల్లిదండ్రులు మంగళవారం ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి మద్దతుగా కాలనీ వాసులంతా కలసిరోడ్డుపైకి వచ్చారు. నర్సీపట్నం పెద్దచెరువులో రగ్గుచుట్టి దొరికిన మృతదేహాం నర్సీపట్నం యస్.సి కాలనీకి చెందిన గారా కిషోర్ గా గుర్తించారు. కిషోర్ నర్సీపట్నం పోలీసు స్టేషన్లో పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అందువల్లే కిషోర్ ను అమ్మాయి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని ఆరోపించారు. రెండేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, దీని నుంచి వదిలించుకునేందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ కిషోర్ తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని చెప్పారు.
విశాఖ జిల్లా, గొలుగొండ మండలం గుమ్మాల వద్ద పోలీసులు సో మవారం 132 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వ హిస్తుం డగా పాకలపాడు నుంచి గుమ్మాల వైపు వస్తున్న కారులో లోడ్ చేసిన 132 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈకేసులో రాజ మండ్రి ప్రాంతానికి చెందిన కొవ్వూరు రమేశ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చింతపల్లి మండలం అన్నవరం నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్సై నారాయణరావు మీడియాకి వివరించారు. సంఘవిద్రోహ చర్యలకి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలో2020-21 విద్యాసంవత్సరం కు సంబం ధిం చి అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కా ర్పొరేట్ స్కూల్స్ లో 100 శాతం రాయితీ కల్పిస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఉత్తర్వులు జారీచేశారని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ర్ట కార్యదర్శి శాసపు జోగినాయుడు తెలిపారు. ప్రతీ ఏటా జర్నలిస్టుల పిల్లల చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసికొనని రాయితీలు కల్పిస్తూ సహాయపడుతున్న కలెక్టర్ ను జర్నలిస్టుల సంఘాల ఐక్యవేధిక జర్నలిస్టులు అభినందించారు. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాల విధిగా జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం రాయితీ ఇవ్వాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం శుభపరిణామం అన్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ, ప్రతీ ఒక్కరూ మెలగాలని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్రిడేషన్ కలిగిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించే సమయంలో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు కాపీ సమర్పించాలని శాసపుజోగినైడు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, డెస్క్ జర్నలిస్టులు, చిన్న,మధ్యతరహా పత్రికల ప్రతినిధులు ఈ సర్కులర్ పై ఎటువంటి సందేహాలు ఉన్నా జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యా శాఖ అధికారులను జర్నలిస్టుల ఐక్యవేధిక ప్రతినిధులు కొంఖ్యాన వేణుగోపాల్,అల్లు యుగంధర్,ఎం.ఏ. వి.సత్యనారాయణ, డోల అప్పన్న,చింతపల్లి నాగబాబు ,సూరి చంద్రశేఖర్,రౌతు సూర్యనారాయణలు మీడియాతో మాట్లాడిన వారిలో ఉన్నారు.
కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్ లోని వీధి కుక్కలకు మాస్ వాక్సినేషన్ (టీకాలు) కార్యక్రమాన్ని కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ కమషనర్ స్వప్నిల్ దినకర్ ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచ జునిసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక వివేక నంద పార్క్ వద్ద వీధి కుక్కలకు టీకాలు కార్యక్రమాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు సహకారం తో కమిషనర్ ప్రారంభిస్తూ, ఈ టీకాలు కార్యక్రమ ము 2 నెలలు నగరంలో కొనసాగుతుంది అని వివరించారు. నగర ప్రజలు, స్వాచంద్ద సంస్థలు మరియు జంతు సంరక్షణ మరియు ప్రేమికులు ఈ కార్యకరమానికి సహకరించాలని, అలాగే మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది వీధి కుకలను తీసుకువెళ్లే సమయాలలో వారికి స్థానిక నాయకులు ప్రజలు అవరోధాలు కల్పించకుండా ఈ టీకాలు కార్యక్రమాన్ని విజయంతంగా పూర్తి చేయాలని కమిషనర్ దినకర్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమషనర్ నాగ నరసింహ రావు, హెల్త్ ఆఫసర్ ప్రశాంత్, కుక్కల కుటుంబ నియంత్రణ సమన్వయ కర్త డాక్టర్ బెహరా, ఆంధ్ర ప్రదేశ్ గోశాల ఫెడరేషన్ కో ఆర్డినేటర్ శ్యామ్, జంతు ప్రేమికులు చంద్ర మౌళి, గోపాల్,సుసి, యితర జంతు ప్రేమికులు మరియు మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి పర్యటించిన చారిత్రక ప్రదేశాలపై లోతుగా పరిశోధన జరగాలని అల్లూరిచరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు అన్నారు. రంపచోడవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను పరిశోధన చేసిన అంశాలను అల్లూరి మ్యూజింలోకి డాక్యుమెంటరీగా తయారు చేసి అందించనున్నామని చెప్పారు. విశాఖ కలెక్టరేట్ లో ఉన్న అల్లూరికి చెందిన గెజిట్లను ప్రభుత్వం బహిర్గతం చేయాలన్నారు. త్వరలోనే అల్లూరి వెంట నడిచిన సైన్యం కుటుంబాలను కలవనున్నామని వివరించారు. మన్యం పితూరిలో అల్లూరితో పాటు ప్రాణాలు అర్పించిన వారి విషయాలు బాహ్య ప్రపంచానికి నేటికీ తెలియలేదన్నారు. అదేవిధంగా అల్లూరి చరిత్రకి సంబంధించి చాలా విషయాలు మరుగున పడిపోయాయని అన్నారు.అలాంటి చారిత్రిక అంశాలన్నీ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశ్యంతో తన పరిశోధన లోతుగా జరుగుతోందన్నారు. ఆరునెలలుగా తూర్పుగోదావరి జిల్లాలో అల్లూరి సంచరించిన ప్రదేశాలన్నీ తిరగడమతో పాటు చాలా కొత్త విషయాలను కనుగొనడం జరిగిందన్నారు. తన పరిశోధన అంశాలన్నీ ఒక పుస్తకరూపంలో తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగున్నాయని బాలు వివరించారు...
అత్యాచారానికి గురైన బాధిత గిరిజన బాలికకు అన్నివిధాల న్యాయం జరిగేలా చూస్తామని ఐటిడిఎ పిఒ డా.వెంకటేశ్వర్ సలిజామల హామీ ఇచ్చారు. జి.మాడుగుల మండలం కె. కోడాపల్లి పంచాయతీ జన్నేరు గ్రామంలో బాలికపై అత్యాచారం ఘటనపై గురువారం పాడేరులో గిరిజన సంఘం రాష్ట్ర నేత అప్పలనర్సతోపాటు ఆ సంఘం జిల్లా నాయకులు కె.పృథ్వి, దీనబంధు, బాధిత కుటుంబ సభ్యులు పిఒను కలసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ..ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకరిపై పోలీసులు కేసు నమోదు చేశారని, మిగతా ముగ్గురుపై కూడా అవకాశమున్న అన్ని కేసులు నమోదుకు డిఎస్ పితో మాట్లాడుతానన్నారు. బాధిత బాలికకు ఉద్యోగ వయస్సు నిండిన తర్వాత ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారంపై గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ తో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధిత కుటుంబం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా తెలపాలని వారితో చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులు అందించిన సేవలే పదవికి గుర్తింపునిస్తాయని డిపిఆర్వో యల్.రమేష్ కొనియాడారు. పాలకొండ ఏపిఆర్వో గుర్రాల అప్పారావు పదవీ విరమణ కార్యక్రమం స్థానిక డి.పి.ఆర్.ఓ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డిపిఆర్వో మాట్లాడుతూ, అప్పారావుకు ఏపని అప్పగించిన చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసి పూర్తి చేసేవారన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి సహనం, ఓర్పు అనేది ఉండాలని, అది ఆయన వద్ద చూసానని చెప్పారు. టైపిస్టుగా, సీనియర్ అసిస్టెంటుగా, సహాయ పౌర సంబంధాల అధికారిగా పనిచేసి పాలకొండ అదనపు పౌర సంబంధాల అధికారిగా పనిచేయడం ఆనందదాయకమన్నారు. ప్రతీ పనిని నేర్చుకోవలన్నా దృక్పథం ఆయన సొంతం అని, అలాగే అన్ని కళలు ఆయనకు వచ్చని శాఖలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగి ఆయనను మార్గదర్శకంగా తీసుకోవాలని, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
జగన్నాధస్వామి ఉత్సవాల్లో భాగంగా బలభద్ర, సుభద్ర సమేత శ్రీజగన్నాథ స్వామి శనివారం నరసింహస్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఈఏడాది రథోత్సవాన్ని నిర్వహించకుండా ఆలయంలోనే స్వామి దర్శనం కల్పిస్తున్నారు.. సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భక్తులకు జగన్నాథుడు స్వామి దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శిరీష తెలిపారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు, పలువురు భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
అన్నవరం తారకరామా కాలనీ వాసులు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తారకరామా కాలనీ కొండ దిగువున ఉన్న భారీ మంచినీ పథకం మరమ్మత్తులకు గురికావడంతో ఈ కష్టాలు ఏర్పాడ్డాయని మహిళలు చెబుతున్నారు. నీటి పంపింగ్ కోసం మోటారు వేస్తుంటే పైపుల ద్వారా నీరు బయటకు వచ్చేస్తుందని, దీంతో సిబ్బంది మోటారు వేయడం లేదన్నారు. గత రెండు రోజులుగా నీటికష్టాలు తమను వెంటాడుతున్నాయని, ఈప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ అధికారులు తక్షణమే స్పందించి నీటిపధకం పైపులీకేజీ పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఎండాకాలం కావడంతో మంచినీ మహిళలమంతా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.