ఆ.. గిరిజన గ్రామంలో ఎవరికి జ్వరమొచ్చినా రోగిని డోలీలో మోసుకు రావాల్సిందే...ఆ గ్రామానికి పారామెడికల్ సిబ్బంది సక్రమంగా వెళ్లరు...వెళ్లినా వారానికో, 15రోజు ల కొకసారో వెళతారు..దీంతో ఈ ప్రాంతంలోని గిరిపుత్రులు వైద్య సహాయానికి నోచుకోవడం లేదు..ఏదో వారికి తోచిన ఆకుపసరలు మింగి ఆరోగ్యాన్ని అనారోగ్యంతోనే నెట్టుకొస్తున్నారు. మరీ రోగం వికటిస్తే డోలీ కట్టుకొని కొత్తకోట పీహెచ్సీకి తీసుకు వస్తారు. ఈ దారుణమైన పరిస్థి విశాఖజిల్లా, రావికమతం మండలం శివారు గిరిజన గ్రామాలైన చలిసింగం, చీమలపాడు పంచాతీ గిరిజనుల దుస్తితి. మలేరియా జ్వరంతో గత వారం రోజులుగా ఇబ్బంది పడుతున్న గిరిజనుడిని వైద్యం కోసం కొత్తకోట ఆసుపత్రికి తరలించేందుకు గిరిజనులు డోలీ కట్టి తీసుకువచ్చారు. ఆ గ్రామ గిరిజనులు. ఏళ్ల తరబడి రావికమతం మండలంలో పలు గిరిజన గ్రామాల గిరిజనులు ఇదే కష్టాన్ని ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ గిరిజనులకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించక లేకపోతున్నారు. దీంతో గిరిజనులకు అత్యవసర సమయంలో ఈ డోలీమోత తప్పకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు తమ ఆవేదన మీడియా ముందు వెళ్లగక్కారు. వారి గ్రామాలకు వెళ్లడానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రాంతాలకు 108 వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. వెరసీ ఎలాంటి అనారోగ్యానికి గురైనా గిరిజులు రోగిని ఆసుపత్రులకు తీసుకువెళ్లాలంటే డోలీమోత తో తీసుకువెళ్లాల్సిందే. ఇలా తీసుకు వస్తున్న సమయంలో మార్గ మధ్యలోనే గిరిజనులు మ్రుత్యువా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు గ్రామాలను సందర్శించినప్పటికీ ఈ గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం కల్పించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 3 నెలల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రామలక్ష్మీని కొండపై నుంచి డోలీపై మోసుకువచ్చి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. మరో మహిళకు పురిటినొప్పులు వచ్చి, తీవ్ర అస్వస్తతకు గురికావడంతో డోలీపై తీసుకువచ్చి కొత్తకోటలో వైద్య చికిత్స చేయించారు. ఇలా డోలీ మోతతో ఎన్నాళ్లు కష్టాలు అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తే తప్పా తమ గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు, రోడ్డు సౌకర్యం వచ్చేటట్టు లేదని గిరిజనులు చెబుతున్నారు...
తాండవ నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నర్సీపట్నం సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట గొలుగొండ మండలం గాదంపాలెం నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ, తాండవ నిర్వాసితులకు మా గ్రామంలో మిగులు భూమి ఇవ్వడం జరిగిందని విప్పలపాలెం గ్రామానికి చెందిన దొరలు ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే పాకలపాడు గ్రామంలో దళితులకు చెందిన స్మశాన వాటిక స్థలంలో ప్రభుత్వ కట్టడాలను నిర్మిస్తూ గ్రామ దళితులుకి అన్యాం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆక్రమణ దారుల నుంచి భూములను విడిపించి నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సబ్కలెక్టర్ మౌర్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల సీపీఐ నాయకులు బాలేపల్లి వెంకటరమణ, మాకిరెడ్డి రామునాయుడు,మేక సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి పాక్షిక లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేస్తున్నట్టు సబ్కలెక్టర్ నారపురెడ్డి మౌర్య చెప్పారు. సోమవారం సబ్కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వర్తక సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోవిడ్ నియంత్రణకు సంబంధించి తీసుకునే చర్యలపై కూలంకుషంగా చర్చించారు. అనంతరం సబ్కలెక్టర్ మౌర్య మాట్లాడుతూ సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి రాత్రి 7గంటల వరకు షాపులు తెరిచి వుంచుకోవచ్చని స్పష్టం చేశారు. ఇంతవరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి వుంచాలని అనంతరం లాక్డౌన్ నిబంధనలు వర్తించేవన్నారు. ప్రస్తుతం ఆ నిబంధనలు ఎత్తివేస్తూ రాత్రి 7గంటల వరకు షాపులు తెరిచి వుంచుకోవచ్చని అధికారులను ఆదేశించేశారు. ఈ విషయం ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. అదే సమయంలో సామాజికి దూరం, మాస్కుల ధారణ తప్పని సరిగా పాటించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, వర్తక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
రావికమతంలో భారీచోరీ జరిగింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో మెయిన్రోడ్డులోని వ్యాపారి దాచేపల్లి లోవరాజు పెయింటింగ్ షాపులోని ఐరన్ లాకర్లో భద్రప రిచిన సుమారు రూ.13.20లక్షల విలువచేసే 18తులాల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండిని దొంగలు ఎత్తుకుపోయారు. మెయిన్రోడ్డు వైపుగల ఇనుపు షట్టర్ను మధ్యలోకి వంచి దాంట్లోంచి లోనికి చొరబడి ఈ చోరీకి పాల్పడ్డారు. ఈ విషయమై పోలీసులకు భాదితుడు దాచేపల్లి రామారావు ఫిర్యాదు చేయడంతో రావికమతం ఎస్ఐ చంద్రశేఖర్ విచారణ చేపట్టారు. ఈ షాపులో అమర్చిన సీసీ కెమెరాలు 2 నెలల క్రితం పాడవడంతో వాటిని బాగు చేయకుండా వదిలేయడంతో చోరీకి సంబం ధించిన ఎలాంటి వీడియోలు చిత్రీకరణ జరగలేదని ఎస్ఐ చెప్పారు. విశాఖ నుంచి వచ్చిన క్లూస్ టీము చోరీకి గురైన షాపులో వేలిముద్రలు సేకరించారు. పెయిం టింగ్ షాపులోకి ఇనుప లాకర్లో భద్రపరిచిన 18తులాల బంగారు ఆభరణాలు నాలుగు కేజీల వెండిని దొంగిలించుకుపోయారని వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా వైద్యఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాలేదు. దీంతో కరోనా సమయంలో అప్పులు చేసుకొని బ్రతకాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. వాస్తవానికి వీరికి ఆరు నెలల ముందు వరకూ ప్రతీనెలా జీతాలు వచ్చేవి. కాని గత మూడు నెలల నుంచి వీరికి జీతాలు లేకపోవడంతో వీరి బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్రంగా మధన పడుతున్నారు. అందులోనూ తమ జీతాల సమస్య బయటకు తెలిస్తే ఎవరిపై ఏ రకమైన వేదింపుల కేసులు పెడతారోనని ఉద్యోగులంతా భయపడిపోతున్నారు. అయిన్నప్పటికీ ఈ విషయం బయటకి పొక్కింది. కరోనా వైరస్ తూర్పు గోదావరిజిల్లాలో కరోనా తన ప్రతాపం తీవ్రంగా చూపిస్తున్న సమయంలో పారామెడికల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కోవిడ్ పరీక్షలు చేస్తే అక్కడికి వెళ్లి తమ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. గతంలో బస్సులు చాలాఎక్కువగా తిరిగేవని, టైముకి విధులకు రావడానికి అవకాశం వుండేదని, ఇపుడు ఎలాంటి వాహనాలు లేకపోవడం వలన అప్పులు చేసుకొని మరీ వాహనాలు కొనుక్కొని విధులకు, టైముకి హాజరవుతున్నట్టు కొందరు మహిళా పారామెడికల్ సిబ్బంది చెబుతున్నారు. తమ జీతాల విషయమై జిల్లా కార్యాలయంలో అడిగితే అదిగో ఇదిగో అని కాలయాపన చేస్తున్నారని పారామెడికల్ సిబ్బంది వావపోతున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రభుత్వం అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే తమకు ప్రతీనెలా సమాయానికి జీతాలు ఇచ్చేలా చేయాలని వీరు కోరుతున్నారు.
విశాఖ ఏజెన్సీలోని నవజాత శిశువులకు నిరంతరం వైద్యం అందించి శిశుమరణాలు నివారించాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల అధికాకులను ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో 108 అత్యవసర సేవల గోడపత్రికను ఆర్ డిఓ కె.లక్షి శివజ్యోతి తో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో కాల్ అందిన వెంటనే సమస్య తీవ్రతను బట్టి ఆసుపత్రికి తరలించాలని సూచించారు. 108 కు కాల్ వచ్చిన వెంటనే స్పందించి వైద్యం అందేవిధంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖ ఏజెన్సీలో ఈ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుతున్నాయనే భావన, అత్యవసర సేవలకు, ఆపద సమయంలో 108 వాహనాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయనే భరోసా గిరిజనులకు కలగాలన్నారు. అదేసమయంలో శిశు మరణాలు సంభవించకుండా పారామెడికల్ సిబ్బంది డెలివరీ అయిన దగ్గర నుంచి తల్లీ బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, అత్యసర సమయాల్లో 108 సేవలు ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన కలిగించాలన్నారు. దానికోసం గిరిజనులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవాలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 108 ఆపరేషన్ ఎక్సిక్యూటివ్ రంజిత్ కుమార్, ఈఏంటి శ్రీనివాస్, భవాని తదితరులు పాల్గొన్నారు.
కలియుగ ప్రత్యక్ష్య దైవం ఆ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి. ప్రక్రుతిలో ప్రతీచోటా ఆయన ఉంటారనడానికి నిదర్శనమే తిరుమల ఘాట్ రోడ్డులో ఒక కొండపై ఆయన ముఖ భింబపు రాయి పోలి వుంటుంది. ఆ స్వామివారి రూపానికి నిత్యం అక్కడ పూజారులు పూజలు చేస్తుంటారు. అదేదో మామూలు కొండ అయితే పర్లేదు...తిరుమల సప్తగిరులాయే. దీంతో నడుముకి తాడు కట్టుకొని, కవాల్సిన సామాన్లన్నీ కవరులో పెట్టుకొని, మరొకరి సహాయంలో శ్రీవారి రూపానికి దండలు వేయడంతోపాటు, కుంకుమ, పసుపు పెట్టి పూజలు చేస్తారు. అలాంటి అరుదైన ద్రుశ్యకావ్యం ఈఎన్ఎస్ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించాలని సంకల్పించాం. సప్తగిరులలో ఒ శిలపై వెలసిన ఆ దేవ దేవునికి అక్కడి పురోహితులు ఏ స్థాయిలో సాహసం చేసి పూజలు చేస్తున్నారో మీరూ ఒక్కసారి చూడండి...గోవింద నామస్మరణతో స్వామివారికి పూజలు చేసే తీరు ఒక్కసారిగా ఒళ్లు గగుర్పాటుకి గురిచేస్తుంది. కానీ ఆ స్వామివారి లీలలు ఎవరికీ అంతుపట్టవు కదా, స్వామి భక్తులతో ఎప్పుడు ఎక్కడ, ఏ విధంగా పూజలు చేయించుకుంటారో జీవికోటికి తెలియదు అనడానికి గరుడ పర్వతంపై ఉన్న ఆయన రూపానికి పూజలు చేయడం, అదీ భారీ ఎత్తులో ఉన్న కొండపై పురోహితులు సాహసం చేసి మరీ పూజలు చేయడం స్వామివారి మహిమగానే చెప్పవచ్చుననడానికి ఇదో నిదర్శనం...
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలు తెలిపారు. 'తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాల పై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.' అంటూ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. అదేవిధంగా ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహనరెడ్డి, కేసిఆర్ లు కూడా గిడుగుకి ఘనంగా నివాళులు అర్పించారు. అన్ని జిల్లాల్లోనూ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు మంత్రులు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివ్రుద్ధికి పాటుపడతామంటూ ప్రతిన బూనడంతో సహా అధికార భాషా సంఘం(తెలుగు) ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటిస్తామని కూడా స్పష్టం చేశారు....
వన్ దన్ వికాస్ కేంద్రం ద్వారా గిరిజన మహిళలకు ఉపాది పూర్తిస్థాయిలో కలుగుతుందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిలు అన్నారు. శుక్రవారం జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ వనభరంగి పాడు గ్రామంలో వన్ దన్ వికాస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉపాది పొందుతున్నవారితోపాటు వీరు కూడా కుట్టు మిషన్లపై విస్తరాకులు కుట్టి అక్కడి మహిళలను చైతన్య పరిచారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, మహిళలలు, విస్తరాకులర, ప్లేట్స్ తయారీ ద్వారా ఆర్ధికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ ను ద్రుష్టిలో ఉంచుకొని సామాజిక దూరం పాటిస్తూ, ఈ కేంద్రం ద్వారా ఉపాది పొందాలన్నారు. ఇలాంటి కేంద్రాలు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో విస్తరించాలని నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి జెడ్పిటిసి రెడ్డి అభ్యర్థి మత్స్య వెంకట్ లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గాయత్రీ దేవి, రాష్ట్ర కార్యదర్శి విశ్వేశ్వర రాజురు, సోలభం సర్పంచ్ హనుమత్ రావు ,జి మాడుగుల మండల అధ్యక్షుడు సత్యనారాయణ, డీపీఎం సత్యం నాయుడు,వెలుగు ఏపిడివో నాగేశ్వరరావు, వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
గిరిజనులకు లబ్ధిచేకూర్చడమే అటవీ హక్కుల చట్టం లక్ష్యమని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేశారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం నుంచి 11 మండలాల రెవెన్యూ అధికారులతో ఆర్.ఓ.ఎఫ్.ఆర్ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రి కార్యాలయం, గిరిజన సంక్షేమశాఖ శాఖ కార్యదర్శి (నిన్న27వ తేదీన) గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు పక్కాగా అమలుచేయాలన్నారు. నేటికి 12వేల ఎకరాలు మాత్రమే సర్వే పూర్తి చేసారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆమోదించిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల్లో సరిహద్దు రాయిని ఏర్పాటు చేసి, లభ్డిదారుని నిలబెట్టి ఫోటో తీసి గిరిభూమి వెబ్సైటులో నమోదు చేయాలని సూచించారు. డి ఎల్సీలో ఆమోదించిన జాబితాను గిరిభూమిలో నమోదు చేయాలని అన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి రెండు ఎకరాలకు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్న ఆయన అర్హులు, అనర్హులను గుర్తింపు ఎలా చేయాలో వివరించారు.
కరోనా సమయంలో ప్రజలకు నిరంతరం వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని ప్రముఖ వ్యాపార వేత్త వెలగానారాయణ రావు అన్నారు. గురువారం నర్సీపట్నం ఏఎస్పీ తుహిసిన్హాకి ఈ మేరకు సుమారు రూ.25వేలు విలువ చేసే రోగ నిరోదకశక్తి మందులను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, పోలీసు సేవలను గుర్తించి వ్యాపారవేత్తలు సహాయం చేయడం అభినందనీయమన్నారు. నర్సీపట్నంలోని పోలీసులందరికీ వీటిని పంపిణీ చేయిస్తామని అన్నారు. తాము చేపట్టే సేవా కార్యక్రమాల్లో భాగంగా వీటిని అందజేస్తున్నట్టు చెప్పిన నారాయణరావు రానున్న కాలంలోనూ తమ తరపున పోలీసు అధికారులకు సహకరిస్తామని అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది చేస్తున్న సేవలు ఈవిధంగానే కొనసాగించాలని ఆకాంక్షించారు.
విశాఖ ఏజెన్సీలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామాలను విస్తరించి, బయో మండలాలుగా ప్రకటించే విధంగా కోవేల్ ఫౌండేషన్ కృషి చేయాలని ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి కోరారు. గురువారం డి.గొందూరు క్లస్టర్ లో ప్రకటించిన కరకపుట్టు, గుర్రంపనుకు గ్రామాల్లోని రైతులు సాగుచేసిన ఐదంచెల విధానంలోని పంటలు, శ్రీ వరి, కిచెన్ గార్డెన్స్, న్యూట్రీ గార్డెన్స్ ను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న రసాయన విధానం ద్వారా రైతులు పంటలను సాగు చేయడం వల్ల ఆహార ఉత్పత్తులు కలుషితం అవడమే కాకుండా భూమి సారవంతం కోల్పోయి, ఆపై అవి తినే మానవాళిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కోవెల్ ఫౌండేషన్ సీఈఓ కృష్ణారావు, ఎమ్మెల్యేతో కలిసి, ఫౌండేషన్ లు సమకూర్చిన 77 వీడర్లు, 450 మంది రైతులకు ఎల్లో ప్లేట్స్, దీపపు ఎర్రలు, సుమారు 700 మంది రైతులకు రెండు కిలోల బెల్లం, రెండు కిలోల సెనగపిండి చొప్పున ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పంపిణీ చేశారు.
ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నవరం ఎస్ఐ శంకర్, ఎంపీడీఓ జె.రాంబాబులు హెచ్చరించారు. గురువారం టి.అగ్రహారం గ్రామంలో సర్వే నెంబరు 205లో 2.8 ఎకరాల్లో ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని వైఎస్సార్ హౌసింగ్ కాలనీ కోసం చదును చేస్తున్నట్టు వివరించారు. అనంతరం సచివాలయ అధికారులను ఆదేశిస్తూ, వారం రోజుల్లో ఈ భూమిని పూర్తిస్థాయిలో అభివ్రుద్ధి చేసి ప్లాట్లు చేయాలని తహశీల్దార్ కె.సుబ్రమణ్యం రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మళ్లీ ఎవరైనా ఈ భూమిలో ఆక్రమణలకు పాల్పడితే తక్షణమే వివరాలు తెలియజేయాలని కూడా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో నెల్లిపూడి గ్రామసచివాలయ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆక్రమణలను తొలగించిన చెత్తను ప్రొక్లైన్, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు.
ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ( ఐ.టి.పి.ఒ.) న్యూఢిల్లీ అండర్ సి.యస్.ఆర్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్స్ క్రింద 18 బేబీ వార్మర్స్, ఒక ఫొటో థెరపీ యూనిట్, నెబులైజర్స్-24 ఇతర వైద్య పరికరాలు అందజేశారని పాడేరు ఐటిడిఏ పిఓ డా.వెంకటేశ్వర్ సలిజామల తెలియజేశారు. బుధవారం వీటిని ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, వర్షాకాలం, శీతాకాలంలో వాతావరణం చల్లగా వుండటం వల్ల మరియు బరువు తక్కవతో జన్మించిన పిల్లల కు శరీర ఉష్ణోగ్రత తక్కువ వుంటుందని, వాళ్లకి హైపోథెర్మియా నుంచి రక్షించడానికి, టెంపరేచర్ రెగ్యులరైజ్ చెయ్యడానికి ఇది ఉపయోగపడుతుందని, పచ్చకామెర్లతో యున్న పిల్లలకు ఫొటో థెర్మియా ట్రీట్మెంట్ కి ఈ పరికరాలను వినియోగిస్తారని తెలిపారు. అలాగే నెబులైజర్స్ ఆస్త్మా రోగులకు, ఆయాసం అధికంగా వున్న రోగులకు ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఊపిరి తిత్తుల సమస్యలో ఈ పరికరం బాగా ఉపయోగపడుతుందని ఈవిషయాలన్ని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వరప్రసాద్ ఈ సమావేశంలో తెలిపారు. కార్యక్రమం లో డాక్టర్ ప్రవీణ్ వర్మ , ఏజెన్సీ లోని పి.హెచ్. సి. డాక్టర్ లు మిగతావైద్య సిబ్బంది మరియు ఐటీడీఏ. ఏ.పి.ఓ.(జనరల్)ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.