1 ENS Live Breaking News

ప్రజా, పోలీసు సేవల్లో ఎల్లప్పుడూ ఉపకార్ ముందుంటుంది.. డా.కంచర్ల

మహావిశాఖలో ఉపకార్ ట్రస్ట్ నిరంతర సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. అన్ని వర్గాల ప్రజలతోపాటు, ప్రభుత్వ, పోలీసుశాఖలకు కూడా తమవంతుగా అవసరమైన సామాగ్రిని అందిస్తూ.. అందని మన్ననలు పొందుతోంది.. కోరి కొలిచేవారికి కొంగుబంగారంగా.. ఆపద, సహా యం అన్నవారికి లేదనకుండా.. కాదనకుండా నిరాటంకంగా.. నిర్విరామంగా..నిశ్వార్ధంగా  సేవలు అందించే ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, కళాభోజ, ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా.కంచర్ల అచ్యుతారావు పోలీసుల సేవలోనూ తరిస్తున్నారు.

 ప్రజలను పోలీసులు కంటికి రెప్పలా కాపాడుతుంటే.. వారికి కావాల్సిన వస్తు సామాగ్రిని ఇవ్వడానికి నేనున్నాంటూ ముందుకి వచ్చి అడిగిందే తడువుగా అన్ని సమకూరుస్తున్నారు.. అన్ని వర్గాల ప్రజలే కాదు.. పోలీసులు కూడా ఇపుడు డా.కంచర్ల అందిస్తున్న సేవలను కీర్తిస్తున్నారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ సేవల్లో ప్రతినిధులనే సేవకులుగా మార్చి అడిగిన వస్తుసామాగ్రి అందిస్తూ.. అందరివాడిగా నిలుస్తున్నారు డా.కంచర్ల..!

సమాజంలో మూడో స్థంభంగా ఉన్న పోలీసుశాఖకు సేవ చేయడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందడానికి ఆస్కారం వుంటుందని ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా. కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రజలు ప్రశాంత జీవనం సాగించడానికి పోలీసులు చేసే విధి నిర్వహణ సమాజానికి చాలా అవసరని చెప్పారు. ఆరిలోవ క్రైమ్ పోలీస్ స్టేషన్ అభ్యర్ధన మేరకు సుమారు రూ.60వేలు విలువచేసే కలర్ ప్రింటర్, కంప్యూటర్లను ఉపకార్ ట్రస్టు ద్వారా వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకి పోలీసుల రక్షణ చాలా అవసరమన్నారు. 

అలాంటి పోలీసులకు ఉపకార్ ట్రస్టు ద్వారా కోరిన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ఇప్పుడే కాకుండా ఎప్పుడు అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చునని కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులకు ఆడియో ఎక్విప్ మెంట్.. సిసి కెమెరాలను అందజేసిన డా. కంచర్ల ఇపుడు ఇపుడు ఖరీదైన ప్రింటర్, కంప్యూటర్లను కూడా అందించి పోలీసు సేవలో కూడా భాగస్వా మిగా నిలుస్తున్నారు. కాగా ఉపకార్ ట్రస్టు ద్వారా అందించే కంప్యూటర్,ప్రింటర్లను ఆరిలోపవ పోలీసులకు ఉపకార్ ట్రస్టు సిబ్బంది సుధీర్, రాజు, అందజేశారు.

 ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, తమ ఉపకార్ ట్రస్టు చైర్మన్ గా కాకుండా అందరు మెచ్చే నిశ్వార్ధ సేవకుడి వద్ద సహాయకులుగా పనిచేయడం ఆనందంగా ఉందని.. ఆయన చేసే ప్రతీ సేవలో భాగస్వాములు కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు.  ఉపకార్ ఛారిట బుల్ ట్రస్టుని  ఎల్లప్పడూ సేవల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు జీవనదిలా తమ చైర్మన్  సేవలు చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ప్రజల తోపాటు, పోలీసులకు కూడా తమ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

visakhapatnam

2024-12-31 05:39:52

అర్చకులు, పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి - మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్ర బాబు

ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంచే అర్చకులు, పురోహితుల సమస్యలు పరిష్కారం కావాలంటే సమిష్టిగా పనిచేస్తే సాధ్యపడుతుందని ప్రముఖ సినీ సంఘ సేవకులు, నటులు, మిలీనియం స్టార్  కంచర్ల ఉపేంద్ర బాబు అన్నారు. ఆదివారం బాలభాను పురోహిత, అర్చక సం ఘం ఆధ్వర్యంలో కంబాలకొండలో నిర్వహించిన వనమహోత్సవంలో హీరో ఉపేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో  మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి అర్చకులు పురోహితులు ఏకతాటిపై రావాలన్నారు. వీరి సంక్షే మం కోసం ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు కృషి చేస్తుందని..అదేవిధంగా తానూ అండగా ఉంటానని భరోసాఇచ్చారు. 

సర్వేజనా సుఖినోభవంతు అంటూ అందరినీ మంచి మనసుతో ఆశీర్వదించే అర్చకుల సమస్యల పరిష్కారానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే తన తండ్రి.. ప్రముఖ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు పురోహితుల సమస్యలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం వద్దకు కూడా తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అర్చకులు, పురోహితులు లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాల్లో విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ పూజ లు చేయాలని కోరారు. అంతేకాకుండా  సినిమాల్లో నటించాలనే ఉత్సాహం ఉన్న యువతీ యువకుల కోసం ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ కార్యాలయంలో  సంప్రదించాలని కోరారు. 

అర్చక సంఘం అధ్యక్షులు జ్యోషుల కామేశ్వర శర్మ మాట్లాడుతూ,  తమ సంఘానికి స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సాయం అందించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం యువ హీరో కంచర్ల ఉపేంద్రబాబు అర్చక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలభాను అర్చక, పురోహిత సంఘం వ్యవస్థాపకులు పంతుల వెంకటరమణ , మావుడూరు కిషోర్ కుమార్ శర్మ తో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-12-29 10:20:48

విశాఖ జూ క్యూరేటర్ గా జి.మంగమ్మ బాధ్యతలు

విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్కు క్యూరేటర్ గా జి. మంగమ్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అధికారిక ఉత్తర్వుల నేపధ్యంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. కాగా ఆమె అక్టోబర్ 7 నుంచి ఎఫ్ఏసి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంద ర్బంగా సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, జంతు ప్రదర్శన శాలలో ప్రజలకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంతోపాటు, అన్ని వర్గాల వారికి చేరువ చేస్తామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. 

visakhapatnam

2024-12-26 12:47:22

కూటమి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం..సచివాలయ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులమంతా కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలను అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని సచివాలయ ఉద్యోగ సంఘాల జేఏసి పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే గణబాబుని కలిసి వినతి పత్రం సమర్పించి. అపరిష్క్రుతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగానే ఖచ్చితమైన పనిగంటలు అమ లు చేయాలని, ప్రభుత్వం బకాయి ఉన్న 3 నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. 

ప్రస్తుతం ఇస్తున్న రూ.30వేలు జీతం ఎక్కడా తమ కుటుంబాలకు సరిపోవడం లేదని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయాలని, ప్రభుత్వం మంజూరు చేసిన సెలవులను మంజూరు చేయాలని, సెలవు రోజుల్లో ప్రత్యేక విధుల నుంచి తప్పించాలని, కార్యాలయంలో స్టేషనరీ, ఇతర ఖర్చులు భారం ఉద్యోగుల మోపకుండా ప్రభుత్వమే అన్నీ మంజూరు చేయాలని, తాము చేస్తున్న సేవలు గుర్తించాలని, నేటికీ అమలు చేయాలని సర్వీసులు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలని, అధికారుల వేధింపులు, సమావేశాల్లో చులకన చేసి మాట్లాడాన్ని నియంత్రించాలని, తదితర సమస్య లు పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరారు. 

ఒక లక్షా 23 వేల పైచిలుకు ఉద్యోగులు వారి యొక్క కుటుంబాలతో సహా, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమకు మంచి చేస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్తున్నామన్నారు.  ఉద్యోగుల సమస్యలు విన్న ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి సచివాలయ ఉద్యోగుల ఇబ్బందులను తీసుకెళతానని చెప్పారన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో బండారు శ్రీనివాస్,శిష్టు నాగేశ్వరరావు, పార్ధసారది, సురేష్ కుమార్, సుమంత్ అబ్రహం,  భార్గవ్ సుతేజ్, వెస్లీ, ధనుంజయ్, వరప్రసాద్ ,రాధిక, ఇంద్రజ , కృష్ణవేణి, వెంకన్న పాత్రుడు,   తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-12-20 19:09:07

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఉపకార్ ట్రస్ట్ సౌండ్ సిస్టమ్, సిసి కెమెరాలు వితరణ

విశాఖలోని ఆరిలోవ దరి హనుమంతువాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉపకార్ ట్రస్టు అధినేత, సినీ నిర్మాత, కళాభోజ, నిశ్వార్ధ సేవకులు డా.కంచర్ల అచ్యుతరావు సిసి కెమెరాలు, నూతన సౌండ్ సిస్టమ్ ను శుక్రవారం సమకూర్చారు. ట్రస్టు కార్యాలయ సిబ్బంది నాగు ఆధ్వర్యంలో వాటిని పోలీసులకు అందజేశారు. ఇటీవల ఈ ప్రాంతంలో అవసరమైన సామాగ్రిని మార్పుచేయడానికి ట్రాఫిక్ పోలీసులు చేసిన అభ్యర్ధ మేరకు ఉపకార్ ట్రస్టు నుంచి వెంటనే వాటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డా.కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సేవలందించేందుకు ఉపకార్ ట్రస్టు ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.  ప్రజా, ప్రభుత్వ సేవలు ఇకపై కూడా కొనసాగుతా యన్నారు. 

అందునా ట్రాఫిక్ పోలీసులు ప్రయాణీకుల రక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ విధులు నిర్వహిస్తారని కొనియాడారు.  వారికి ఎప్పుడు ఏవిధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసు హెచ్చరికలు ప్రతీ ఒక్కరూ పాటించాలని కోరారు. పోలీసులు హెచ్చరికలు పాటించడం ద్వారా సురక్షితంగా గమ్యం చేరడానికి ఆస్కారం వుంటుందన్నారు. తోటివారికి తమ వంతు సహాయం చేసే విషయంలో ప్రతీ ఒక్కరూ ముందు రావాలని ఈ సందర్భంగా డా.కంచర్ల అచ్యుతరావు పిలుపునిచ్చారు. 

Visakhapatnam

2024-12-20 13:38:25

ప్రమాద బాధితునికి ‘మేమున్నాం’టీమ్ ఆర్థిక చేయూత

 ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకునేందుకు ‘మేమున్నాం టీం’ వ్యవస్థాపకుడు అనిశెట్టి చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులు ఎల్లప్పుడూ ముం దుంటారు. కోవిడ్ సమయంలో బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పడిన మేమున్నాము టీం ప్రతినిధులు నాటి నుండి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎవరు ఆపదలో ఉన్నారని తెలుసుకున్న టీమ్ అధ్యక్షుడు చిరంజీవి తనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొయ్యూరు మండలం డౌనూరు గ్రామానికి చెందిన యాళ్ల శ్రీను గత నెల 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులు తక్షణసాయంగా రూ. 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వైద్య సేవలకు తోడ్పాటు అందించారు.

అనంతరం అతని పరిస్థితిని టీం సభ్యులు, స్నేహితులు శ్రేయోభిలాషులకు తెలియజేసి సేకరించిన 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిసిసి మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ ద్వారా బాధిత కుటుంబీకులకు అందజేసి మేమున్నాము అనే భరోసా కల్పించారు. అలాగే క్షతగాత్రుడు శ్రీను భార్య బాలింత కావడంతో అనిశెట్టి బ్రదర్స్ 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు కూరగాయలను అందజేశారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆదుకున్న చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులతో పాటు మేమున్నాము టీం సభ్యులు తమకు సహాయ సహకా రాలు అందించిన అందరికీ బాధిత కుటుంబీకుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థన మన్నించి బాధిత కుటుంబీకులకు సహాయ సహకారాలు అందించిన దాతలు శ్రేయోభిలాషులకు చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు, మాజీ ఎంపీటీసీ బి శివరామరాజు, టిడిపి నేతలు రొంగల గోవిందు చంద్రరావు కిముడు శ్రీరాములు కృష్ణ తదితర పలువురు పాల్గొన్నారు.

koyyuru

2024-12-20 13:30:27

సినిమా కార్మికులు ఆధార్ అప్డేషన్, ఈ-శ్రమ్ నమోదు చేయించుకోవాలి.. డా.కంచర్ల అచ్యుతరావు

ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమలోని కళాకారులు, ఉద్యోగులు, కార్మికులు ఆధార్ అప్డేడేషన్ తప్పని సరిగా చేయించుకోవాలని ఏపీ ఫిల్మ్ ఎంప్లా యిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, ప్రముఖ సంఘసేవకులు, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు కోరారు.  ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుడూ, భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో 6 నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులు వారి ఆథార్ ను అప్డేట్ చేసుకోవడంతోపాటు, ఈ-శ్రమ్ కార్డులు కూడా పొందాలన్నారు. తద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కల్పించే ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం వుంటుందన్నారు. తెలంగాణలో ఉండిపోయిన ఆంధ్రా కళాకారులు, కార్మికులు, ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ లో వివరాలు నవీకరణ చేసుకోవాలన్నారు. 

తద్వారా ఆంధ్రప్రదేశ్ అడ్రస్, వివరాలు నమోదుకి అధికారికంగా అవకాశం కలుగుతుందన్నారు. ఇపుడు పాఠశాలలో అడ్మిషన్ మొదలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం వరకూ ప్రతి అంశంలోనూ ఆధార్ కార్డు తప్పనిసర అయిందని... ఒకసారి ఆధార్ నమోదు చేసుకున్న వారు ప్రతి పదేండ్లకోసారి అప్‌డేట్ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచించిందని పేర్కొన్నారు.  అందుకు అనుగుణంగా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు  ముగిసిపోగా.. అన్ని వర్గాల నుంచి వస్తున్న అభ్యర్ధనల ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో ఆరు నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదని తెలియజేశారు.పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి అంశాల్లో మార్పులు చేసుకోవచ్చునన్నారు. వెంటనే ఆధార్ వివరాలను పెద్ద ఎత్తున సినీ కార్మికులు నవీకరణ చేయించుకోవాలన్నారు. 

ఇప్పటికే అన్నిజిల్లాలకు ఈ సమాచారాన్ని పంపించామని చెప్పారు.  ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే ముందు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని... అటుపై మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ కాగానే, అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయన్నారు. అందులో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. చెక్ చేసుకొని... వాటిని సవరించాల్సి వస్తే సవరించాలిని పేర్కొన్నారు. వాటిని ధృవీకరించుకుని నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలని... తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లు ఎంచుకోవాలన్నారు. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ పత్రాలు అప్ లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే... 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ రావడంతో అప్ డేట్ స్టేటస్ ఎక్కడి వరకూ వచ్చిందో చెక్ చేసుకోవచ్చునని డా.కంచర్ల అచ్యుతరావు వివరించారు.  స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు, బాధ్యతగల మీడియా  ఉచిత ఆధార్ అప్డేట్ పై సమాచారాన్ని సామాజిక మాద్యమాల్లో షేర్ చేస్తూ అన్ని వర్గాలప్రజలను చైతన్య పరచాలని కోరారు. ఈ అవకాశాన్ని సినిమా కార్మికులంతా తప్పసరిగా సద్వినియోగం చేసుకోవాలని డా.కంచర్ల సూచించారు.

visakhapatnam

2024-12-17 12:50:34

రాష్ట్రవ్యాప్తంగా చాత్తాద శ్రీ వైష్ణువుల బలం, బలగం ఏంటో తెలియజేస్తాం..!

ఆంధ్రప్రదేశ్ లోని చాత్తాద శ్రీ వైష్ణవుల సామాజిక వర్గం బలం, బలగం తెలియజేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీల ద్వారా కుల గణన(వివరాల నమోదు) చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చాత్తాద శ్రీ వైష్ణువుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,  ప్రముఖ సినీ నిర్మాత, టిడిపీ నేత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డా..కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అన్ని రాజకీయపార్టీలకు తమ సామాజిక బలం అధికారికంగా, లిఖిత పూర్వకంగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ కమిటీలను ఒక తాటిపైకి తీసుకు వస్తున్నామన్నారు. 

అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోని తమ సామాజిక వర్గం వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసి.. వివరాలు, ఓట్లు, యువత, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల సమాచారం క్రోడీకరించడం ద్వారా తమ సామాజిక బలం సంఖ్య తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సామాజిక వర్గం తర తరాల నుంచి వెనుకబడి పోతుందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం ఇంకా పెరగాల్సి వుందన్నారు. దానికోసం సామాజిక వర్గంలోని  వివరాలు సేకరించి నమోదు చేయడం ద్వారా ఎవరి పరిస్థితి ఏంటో కూడా ప్రభుత్వాలకి తెలియజేయడానికి  అవకాశం వుంటుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేరుకి కార్పోరేషన్ ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయాలేదన్నారు. 

దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో వున్న చాత్తాద శ్రీ వైష్ణవుల సంఖ్య అధికారికంగా తెలియాలంటే కుల గణన జరగాలన్నారు. వాటిని ప్రభుత్వం చేపట్టడకపోవడంతో రాష్ట్ర సంఘం చొరవ తీసుకొని తమ సామాజిక వర్గం వివరాలు నమోదు చేసే కార్యాచరణకు ఉపక్రమించామని స్పష్టం చేశారు. పూర్వం రోజుల నుంచి వెనుకబడి ఉన్న తమ సామాజిక వర్గం బలం రాజకీయపార్టీలకు తెలియజేయడం ద్వారా తామేంటో తెలియజేస్తామన్నారు. దానికోసం సంక్రాంతి పండుగ తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల జనాభా వున్నతమపై కేవలం 34 వేల మంది మాత్రమే ఉన్నారనే ముద్ర వేయడం సరికాదని.. అలాంటి అసత్యప్రచారాలను పూర్తి వివరాలతోనే త్వరలో ఘాటుగా తిప్పికొడతామన్నారు. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కమిటీలను సమాయత్తం చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ రికార్డుల్లో వున్న యాచక వృత్తి అన్న పదాన్ని తొలగించడం కోసం సమస్త సమాచారంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల దృష్టికి సామాజిక వర్గం వివరాలు తీసుకెళ్ల నున్నట్టు డా..కంచర్ల అచ్యుత రావు మీడియాకి వివరించారు.

visakhapatnam

2024-12-16 14:07:39

చోడవరం పాలిటెక్నిక్ కళాశాలలో లైంగిక వేధింపుల పర్వం

తప్పుచేసిన వారిని కాపాడడానికి ఒక్కోసారి జిల్లా అధికారులు చేసే చేష్టలు.. చర్యలు ప్రభుత్వ తీరుకే మచ్చతెస్తాయి. గతం కొత్త కాలంగా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కెమెస్ట్రీ లెక్చిరర్ విద్యార్ధినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై పోలీసు కూడా నమోదైంది. అయితే దానిని కప్పిపుచ్చేందుకే అన్నట్టుగా జిల్లా అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తున్నది. ఒక ప్రక్క ప్రభుత్వం మహిళలను వేధిస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని హెచ్చరిస్తున్నా.. చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లైంగిక వేధింపులు తారా స్థాయికి చేరుకోవడం.. దానిని అధికారులు లైట్ తీసుకొని మీడియా దృష్టిలో పడకుండా జాగ్రత్త పడటం అనుమానాలకు తావిస్తుంది. తప్పు చేసినా.. విద్యార్ధినిలను బెదిరించి ఏమీ లేదన్నట్టుగా చేయాలని చూస్తున్నారా అనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాలలో ఆర్జేడీ విచారణ కూడా రహస్యంగా సాగడం చర్చనీయాంశం అవుతున్నది.

 చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన కెమిస్ట్రీ అధ్యాపకుడు సూరెడ్డి కనకారావు పై శాఖారమైన చర్యలు తీసుకోపోగా, గురువారం  ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో ఆర్జెడి రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జెడి రాకను గమనించిన స్థానిక విలేఖరులు, ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా, కళాశాల యాజమాన్యం  అనుమతించలేదు. ఈ మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినిలు పట్ల అసభ్యకరంగా, లైంగికంగా దాడి చేస్తున్న కెమిస్ట్రీ అధ్యాపకుడు సూరెడ్డి కనకారావు పై బాధితురాలు వారి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే విద్యార్థిని స్నేహితులు బంధువులు కళాశాలలో తనపై దాడి చేసి గాయపరిచారని  మరో అద్యాపకుడు కనకారావు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ఇరువురు నుండి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారణ చేపడతామని సీ.ఐ.అప్పలరాజు తెలియజేశారు. ఈ నేపధ్యంలో విద్యార్థినిలు పై లైంగిక దాడుల కు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

chodavaram

2024-12-12 16:10:39

కార్పోరేటర్ అనుచిత వ్యాఖ్యలపై..రోడ్డెక్కిన వార్డు సచివాలయ ఉద్యోగులు

విశాఖలో జివిఎంసీ కార్పోరేటర్ కాకి గోవింద రెడ్డి జివిఎం కౌన్సిల్ సమావేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగులు గురు వారం సాయంత్రం జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. సచివాలయ ఉద్యోగులకు ఏం పనిలేదని ఖాళీ ఉన్నారని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగులకు వెంటనే క్షమాపణ చెప్పాలన్న ఉద్యోగులు.. ఒక రోజంతా సచివాలయ ఉద్యోగులతో విధి నిర్వహణలో పాల్గొంటే ఉద్యోలు ఏం చేస్తున్నారో తెలుస్తుందని హితవు పలికారు. ఏ ప్రభుత్వశాఖలో లేనివిధంగా ఒక ఉద్యోగంతో అన్ని ప్రభుత్వశాఖల విధులు చేస్తున్నది సచివాలయ ఉద్యోగులు మాత్రమేనని హితవు పలికారు. 

చేస్తున్నది ఒక శాఖ ఉద్యోగమే అయినా.. అన్ని ప్రభుత్వ శాఖల విధులు చేస్తున్నది ఒక్క సచివాలయ ఉద్యోగులు మాత్రమేనన్నారు. ఇదే సచివాలయ ఉద్యోగులు కోవిడ్ లోప్రాణాలకు తెగించి పనిచేసినపుడు తాము ఏం చేశామో వీళ్లకి కనిపించలేదాని ప్రశ్నించారు. ఈరోజు ఇంటి పన్నులు, నీటి పన్నులు కార్పోరేషన్ కి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో  పెరుగుతున్నాయంటే అది ఒక్క సచివాలయ ఉద్యోగులు పనిచేస్తేనే జరుగు తుందన్నారు. ప్రభుత్వం తమకు అప్పగించే పనులు విధి నిర్వహణలో కాకుండా సాయంత్రం ఐదు దాటిన తరువాత అప్పగించినా ముఖ్య మంత్రి నారాచంద్రబాబునాయుడు పిలుపుతో సేవలు చేస్తున్నామన్నారు. వాలంటీర్లు చేసే క్లస్టర్ మేపింగ్ పనులు, డోర్ టూ డోర్ సర్వేలు కూడా చేస్తున్నామన్నారు. ఎంతో ఉన్నత విధ్యలు చదువుకొని కేవలం ప్రభుత్వ ఉద్యోగమనే కారణంతోనే చిన్న ఉద్యోగమైనా సేవలు చేస్తు న్నామన్నారు. 

తాము కేవలం నెలకి రూ.30వేలు మాత్రమే తీసుకుంటున్నామని అన్నారు. ఇతర ప్రభుత్వశాఖలకు ఉద్యోగుల మాదిరిగా రెండవ శనివారాలు, ఆదివారాల్లోనూ తాములు సెలవులు తీసుకోకుండా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నామన్నారు. అలాంటి తమపై జీవిఎంసీ కార్పోరేట్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండి పడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రాకముందు సేవలకి, తాము వచ్చిన తరువాత అందు తున్న సేవలు ఏంటో ఒక్కసారి తెలుసుకోవాలన్నారు. తాము చేస్తున్న పనులను ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు గుర్తించిన విషయాన్ని కార్పోరేటర్లు తెలుసుకోవాలన్నారు.

 వాస్తవానికి ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన పదోన్నతులు, సర్వీసు నిబంధనలు ఇవ్వకపోయినా.. ప్రభుత్వ సేవకులుగా ప్రజలకు అన్ని రకా లుగా ఉపయోగపడుతున్నామన్నారు.  ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనులు అప్పగించాలని, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, పీఆర్సీ ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు పాల్గొని తమ ఆందోళనను, ఆవేదనను తెలియజేశారు. శాంతియుతంగా మొబైల్ లైట్ నిరసన తెలియజేశారు.

visakhapatnam

2024-12-12 15:18:41

సత్య దేవుడిని సందర్శించుకున్న మంత్రి వాసంశెట్టి

అన్నవరం  శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివా రం ఆలయానికి చేసుకున్న మంత్రి కుటుంబానికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం చేయించారు. అక్కడ మంత్రి కుటుంబం స్వామివారికి పూజలు చేసింది. ఆలయ సిబ్బంది మంత్రికి  తీర్థ ప్రసాదాలు అందించగా..వేద పండితుల వేద ఆశీర్వాదం అందించారు. ఈ  కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

annavaram

2024-12-01 14:08:22

అయ్యప్పల సేవలో ఉపకార్ ట్రస్ట్.. 18రోజులపాటు స్వాములకి బిక్ష

అయ్యప్పస్వాములకు అన్నదాన సేవ చేసే భాగ్యం రావడం అంటే ఆ అయ్యప్పకు సేవచేసినట్టుగానే భావిస్తున్నామని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, సినీ నిర్మాత కళాభోజ, ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో 18రోజుల పాటు నిరంతరాయంగా చేపట్టే అన్నసమారాధన ఆయన ఆరిలోవ సూర్యతేజ నగర్, శ్రీ పోలమాంబ వేపచెట్టు వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వాములతో కలిసి మధ్యాహ్నాం పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 18 రోజుల పాటు తన స్వంత నిధులతో అన్నసమారాధన చేస్తున్నట్టు వివరించారు.అయ్యప్ప, భవానీ, మాలధారణ చేసిన 300కి పైగా స్వాములకు  అన్నదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉపకార్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అవి నిత్య సేవలుగా ముంద రోజుల్లో కూడా కొనసాగుతాయన్నారు. 

పోర్టు ఆసుపత్రి ఏరియాలోని అయ్యప్ప పీఠం వద్ద కూడా స్వాముల అన్నసమారాధనకు ఇటీవలే రూ.3 లక్షలు ఎరిమేలి అయ్యప్ప అన్న సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి  మిలీనియం సినీ హీరో కంచర్ల ఉపేంద్ర బాబు మూడు లక్షలు విరాళం అందజేసినట్టు తెలిపారు.  ఇప్పటికే అనేక పీఠాలకు, ఆలయాలకు అంబలం పూజలకు, అన్నదానానికి భారీగా విరాళాలు ఇచ్చినట్టు చెప్పారు.   జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, కంచర్ల అచ్యుతరావు ఉపకార ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనియాడారు .ఉపేంద్ర బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడులా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. స్వాములకు ఇంత పెద్ద స్థాయిలో అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదన్నారు. ఎంతో వ్యవప్రయాసలకోర్చైనా స్వాముల సేవలో కంచర్ల తరిస్తున్నారంటే ఆయనపై అయ్యప్ప దీవెనలు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ సుధీర్, ఎస్. ఎస్. ఎల్. ఎస్ క్రియేషన్స్ మేనేజర్ నాగు, ట్రస్ట్ ప్రతినిధులు అరుణ తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-11-28 13:53:46

ఏపీకి సినీ పరిశ్రమను తరలించడానికి అవిశ్రాంత కృషి-డా.కంచర్ల

ఆంధ్రప్రదేశ్ కు వీలైనంత త్వరగా సినిమా పరిశ్రమను తీసుకు వస్తామని.. తద్వారా మరింత మంది కళాకారులకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపి పిల్మ్ ఇండస్ర్టీ ఫెడరేషన్ ఛైర్మన్, ఉపకార్ ట్రస్టు ఛైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు అన్నారు. శనివారం విశాఖలోని పౌరగ్రంధాలయంలో పవన్ కళ్యాణ్ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సంగీత విభావరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ,  ఏపికి సినీ పరిశ్రమ తరలివచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించిన విషయాన్ని కంచర్ల గుర్తు చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా సినిమా రంగానికి సంబంధించి అపారమైన వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని సినీ నటులు, దర్శక నిర్మాతలు సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రాంతం పర్యాటక, సినిమా పరంగా మరింత అభివృద్ధి చెందేందుకు దోహద పడుతుందన్నారు.

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలోనే సినీ విభాగానికి చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ సినీ స్టూడియోలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నందున.. ఇక్కడే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా సినీ వర్గాలు తమ కార్యాకలాపాల కోసం అయినా విశాఖ వస్తారు. వచ్చినపుడే ఇక్కడి అందాలను ప్రదేశాలను చూసి.. ఇక్కడే సినిమాలు తీయడానికి ఆస్కారం వుంటుంది. 24 ఫ్రేమ్స్ విభాగాలకు చెందిన కార్యకాలపాలు విశాఖ కేంద్రంగా జరిగితే  ప్రత్యక్షంగా కళాకారులకి, పరోక్షంగా వ్యాపారస్తులకి, నిర్మాతలకు పనివుంటుంది.

గౌరవ అతిధులుగా 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు, జనసేన డాక్టర్స్ సెల్ రాష్ర్ట అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు మాట్లాడుతూ నగరంలో నిత్యం అనేక కార్యక్రమాలు నిర్వహించే కళాకారులను ప్రభుత్వంతో పాటు ఆర్ధికంగా ఉన్న స్థితిమంతులు కూడా ఆదుకోవాల్సిన అసరం ఉందన్నారు. కళాకారులు నిరంతరం ప్రజలందరిని మెప్పిస్తున్నారని, అయితే వారికి కూడా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ కళాపీఠం గౌరవ అధ్యక్షులు గెంబలి జగదీష్ , అధ్యక్షులు మెరుపు వరప్రసాద్, కార్యదర్శి పీలా హరిప్రసాద్, కన్వీనర్ కె.ఇందిరా ప్రియదర్శినితో పాటు చెన్నా తిరుమల రావు, సన్ మూర్తి, ఇతర కళాకారులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా సంగీత విబావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

visakhapatnam

2024-11-23 09:46:43

ఏపీటీడీసీలో అడ్డగోలు నియామకాలు..?!

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంలోని పరిపాలనా పరమైన అంశాలు కొన్ని ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ కార్పోరేషన్ అధికారులకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి.. మనల్ని ఎవరు అడుగుతారని.. ఇష్టాను సారం చేసిన వ్యవహారాలు ఇపుడు కప్పిపుచ్చుకోవడానికి అన్ని అడ్డదా రులూ వెతుకుతున్నట్టు కనిపిస్తున్నది..విశాఖలో ఏపీటీడీసికి చెందిన హరిత యాత్రీ నివాస్ విషయంలో ఇప్పటికి సుమారు రూ.8కోట్లు కేవలం మరమ్మతులు, గదుల్లోని సామాగ్రి కొనడానికి ఖర్చు చేసేశారు. అయితే దేనికి ఎంత ఖర్చు అయ్యిందో లెక్కలు మాత్రం ఇటు జిల్లా కలెక్టర్ గానీ.. అటు రాష్ట్రప్రభుత్వానికి గానీ చెప్పలేదు. పైగా మరో రూ.5 కోట్లు కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ విషయా న్ని ఈరోజు-ఈఎన్ఎస్ వెలుగులోకి తీసుకు వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్ర ఏపీటీడీసీ అధికారులు మరింతగా అడ్డదారులు వెతుకు తున్నా రు. ఏకంగా ఎండీకే తెలియకుండా నేరుగా ఈడి విశాఖలో జిల్లా మేనేజర్ పోస్టుని ఆఘమేఘాలపై డిప్యూటేషన్ పై నియమిం చేశారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే.. ప్రస్తుతం విశాఖజిల్లా వ్యాప్తంగా ఏపీటీడీసి హోటల్ల మరమ్మతులకు సంబంధించి ఒకే కాంట్రాక్టర్ కి రూ.40 కోట్లు టెండర్లు ఇచ్చేశారు. అన్ని పనులూ ఒక్కరికే ఇవ్వడంతో ఆ కాంట్రాక్టర్ కాస్త నచ్చినట్టు చేసుకుంటూ.. అధికారు లకు కమిషన్లు ఇస్తూ లేని లెక్కలు ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. ఇపుడా లెక్కలు బయటకు తీసే పరిస్థితి వచ్చింది. దీనితో సొంత శాఖ అధికారులైతే వాస్తవాలు వెలుగు చూస్తాయని పొరుగుజిల్లా, ఇతర శాఖల నుంచి అధికారులను ఇక్కడికి డిప్యూటేషన్ పై నియమి స్తున్నారు..  ఏపీటీడీసీలో ఈ మొత్తం వ్యవహారాన్ని హరికథలు పార్ట్-5 ఈరోజు-ఈఎన్ఎస్ అందిస్తున్నది..!

కూటమి ప్రభుత్వంలో అక్రమాలకు తావుండదంటారు.. అదేంటో విశాఖలోని ఏపీటీడీసి హోటళ్ల మరమ్మతుల విషయంలో కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నా.. జిల్లాలో కలెక్టర్ తో సహా.. రాష్ట్ర అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదు. వాస్తవాలను మీడియా ప్రభుత్వం ముందుకి తీసుకెళ్లినా.. మరింతగా రెచ్చిపోతున్న ఏపీటీడీసి రాష్ట్ర అధికారులు వారి బినామీల ద్వారా చేపడుతున్న అడ్డగోలు వ్యవహారాన్ని అంతే తేడాగా కప్పిపుచ్చుకునేందు అన్ని దారులూ వెతుకుతున్నారు. కార్పోరేషన్ రాష్ట్ర అధికారుల చర్య వలన ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నా.. ఇక్కడ పనిచేసే అధికారులను గానీ, కాంట్రాక్టర్ ని గానీ పల్లెత్తు మాట అనడం లేదంటే అసలు ఏం జరుగుతుందో మీరే అర్ధం చేసుకోవాలి. ఎక్కడైనా కొత్తవి కట్టకుండా మరమ్మతులు చేసుకుంటే కొత్తగా కనిపిస్తాయని  మొత్తం ఖర్చులో కొంత భాగాన్ని ఖర్చుచేస్తారు. విచిత్రంగా ఏకంగా ఒక స్టార్ హోటల్ కట్టేంత సొమ్ముతో కేవలం మరమ్మతులు మాత్రమే చేసి.. వాటికి ఇంకా డబ్బులు చాల లేదని ప్రభుత్వానికి మరో రూ.5 కోట్లు టెండరు వేసేద్దామని అధికారులు ప్లాన్ చేసినా ప్రభుత్వం పల్లెత్తు మాట అనడం లేదు.

విశాఖలోని ఏపీటీడీసికి చెందిన హరిత యాత్రీ నివాస్ లో అత్యధిక మొత్తం వెచ్చించి మరమ్మతులు చేస్తున్నారు. ఆ విషయంలో చాలా డబ్బు చేతులు మారుతోంది. డబ్బుకి తగ్గ మరమ్మతులు, వస్తువులు ఇక్కడ కనిపించడం లేదు. వాస్తవానికి ఇలా జరిగితే జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగాలి.. కానీ అలా జరగలేదు. పైగా ఇదేశాఖకు చెందిన అధికారులను ఇక్కడ నియమిస్తే.. ఎక్కడ వాస్తవాలు బయటకి వచ్చేస్తాయోనని లుక లుకలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులు ఒక అవినీతి అధికారి శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆర్డీగా నియమించారు. ఆయనే జిల్లా మేనేజర్ పోస్టుకూడా అప్పగించారు. దీనితో రెండేళ్లు ఈయన ఆడిందే ఆట.. పాడిందే పాట. ఆ విషయం కాస్త మీడియాలో గుప్పు మనడంతో.. ఆయనను తప్పించి.. అసలు టూరిజంశాఖకు సంబంధం లేని వ్యక్తిని ఇరిగేషన్ లో ఇఇ గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి మళ్లీ ఆర్డీ స్థానంలో కూర్చో బెట్టారు. 

తరువాత కూడా మీడియా కథనాలు వరుసగా వస్తుండటంతో తనకు రెండు ఉద్యోగాలు భారంగా ఉన్నాయని చెప్పడంతో రాష్ట్ర అధికారులు మళ్లీ శ్రీకాకుళం జిల్లా నుంచి మరో అధికారి జిల్లా మేనేజరుగా నియమించారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే.. ఇదే శాఖలో ఉన్న అధికారులకి ఇన్చార్జిగా నియమిస్తే ఇక్కడ జరుగుతున్న తేడా పనులన్నీ ఆధారాలతో సహాయ బయటకు వచ్చేస్తాయ్ అలా రాకుండా ఉండేందుకు.. ఏకంగా టూరిజం కార్పోరేషన్ ఎండీ అనుమతి లేకుండా..సదరు రిఫరెన్స్ కూడా లేకుండా ఈడీ పద్మావతి నేరుగా ఇతర శాఖల్లోని అధికారులకు డిప్యూటేషన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఇపుడు ఆ ఆర్డర్ పైనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఏటీడీసీ ఎండీ ఆమ్రపాలి సెలవులో ఉన్నారు. దానిని రాచమార్గంగా తీసుకొని అక్కడి ఈడి నచ్చినవారికి విశాఖలో పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. 

అయితే వచ్చే అధికారులందరికీ ఒక లక్ష్మణ రేఖ గీసి మరీ ఏపీటీడీసీకి అధికారులుగా పంపిస్తున్నారట. అక్కడికి అధికారిగా వెళ్లినా.. మేము చెప్పినట్టే చేయాలి.. ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతుల పనులకు సంబంధించి ఏం మాట్లాడకూడదు.. లెక్కలు బయటకు తీయకూడదు.. నాణ్యతను పరిశీలించకూడదు.. బిల్లుల విషయంలో తలదూర్చకూడదు.. జిల్లా కలెక్టర్ కి దొంగచాటుగా నివేదికలు పంపకూడదు.. కాంట్రాక్టర్ పై ఒత్తిడి తేకూడదు.. కేవలం జిల్లా మేనేజర్  ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉండాలి అనే నిబంధనలతో పంపుతున్నారట. అలా అయినా విశాఖలో హరితర యాత్రీనివాస్ విషయంలో కాంట్రాక్టర్ అధికారులు కలిసి పెంచేసిన బిల్లు మొత్తాన్ని.. అక్కడ పనుల నాణ్యతను, ఇటీవలే ఆర్డీ పోస్టులోకి ఇన్చార్జిగా వచ్చిన ఇరిగేషన్ ఇఇ కలిసి జిల్లా కలెక్టర్ కి నివేదించాల్సి వుంటుంది. చూడాలి ఎండీ కి రిఫరెన్సు లేకుండా డైరెక్టుగా ఏపీటీడీసి జిల్లా మేనేజర్ అయినా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు పేపర్ పై పెడతారా..లేదంటా రాష్ట్ర అధికారులు గీసిన లక్ష్మణ రేక దాట కుండా.. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తారా అనేది...?!

visakhapatnam

2024-11-19 19:36:57

గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గం

కార్మికుల సమిష్టి కృషితో సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుడుగు వేయాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గం పిలుపు నిచ్చింది. యూనియన్ నూతన కార్యవర్గం స్థానిక విక్రమహాల్ లో జరిగింది.  ఈ సందర్భంగా నూతన ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ, మన ట్రేడ్ యూని ప్రస్తుతం రాష్ట్రంలో కార్మికుల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నదన్నారు. సభ్యుల సంక్షేమంతో పాటు, సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా యూనియన్ సభ్యులంతా ప్రతీ నెలా 4న పనులు ఖచ్చితంగా నిలిపివేయాలన్నారు. అదే సమయంలో అత్యవసర సమయంలో యూనియన్ అనుమతి ముందురోజు తీసుకోవాలన్నారు.  యూనియన నిబంధనలు పాటించాలని.. అలా పాటించని వారిపై పనుల వద్ద తిరిగే స్వ్కాడ్ చర్యలకు గురికావాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. 2025 నుంచి యూనియన్ కొత్తరేట్లు పాటించాలన్నారు. జనవరి నుంచి కొత్త రేట్లు నిర్మాణాల్లో అమలవుతాయని పేర్కొన్నారు. 

అలాగే ఉర్జవీర్ అనే పథకములో  సభ్యులందరూ నమోదు కావాలని కోరారు. ఈ పథకంలో ప్రతి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ పాల్గొని  బ్యాంక్ అకౌంటు, మీ ఆధార్ కార్డు ,పాన్ కార్డు, మీరు మీ సెల్ నుండి నమోదు చేసుకోవాలని తెలియజేశారు. గౌరవ అధ్యక్షులుగా ఎడ్ల సూర్య చంద్రరావు, ఎంవిజివి ప్రసాద్, గౌరవ సలహాదారు కాకి రవిబాబు,  బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి ఎన్నిక అనంతరం యూనియన్ చేపట్టే కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. వీరి సమక్షంలోనే ఏకగ్రీవంగా స్టీరింగ్ కమిటినీ కూడా ప్రకటించారు.  అంతకు ముందు కమిటీ మెయిన్ కోర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కమిటీలో గౌరవ సలహాదారులు గంట సతీష్, అధ్యక్షులుగా బొజ్జ రామకృష్ణ , ఉపాధ్యక్షులు వీరవల్లి గంగాచార్యులు, సెక్రెటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి, జాయింట్ సెక్రెటరీ సీమల వీరభద్రరావు, కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం, ఉప కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్, స్క్వాడ్ కమిటీ చైర్మన్  గోవాడ కొండబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముదాలపల్లి కామేశ్వరరావు, యూనియన్ కన్వీనర్ చల్ల వరప్రసాద్,  కమిటీ సభ్యులుగా ఊర్ల శ్రీరాములు, అల్లంకి వీరభద్ర స్వామి, గొల్ల రవి, గడ్డం ప్రసన్న కుమార్, ఉత్తరాల సోమేశ్వరావు, ఎడ్ల శేఖర్, నిమ్మలపూడి రవి వర్మ, జనిపే పూర్ణచంద్రరావు, గొల్లగాని విజయభాస్కర్, సొరసాని వెంకట గంగా చందు పాలపర్తి అప్పారావులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

rajamundry

2024-11-17 16:07:51