1 ENS Live Breaking News

ప్రమాద బాధితునికి ‘మేమున్నాం’టీమ్ ఆర్థిక చేయూత

 ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకునేందుకు ‘మేమున్నాం టీం’ వ్యవస్థాపకుడు అనిశెట్టి చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులు ఎల్లప్పుడూ ముం దుంటారు. కోవిడ్ సమయంలో బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పడిన మేమున్నాము టీం ప్రతినిధులు నాటి నుండి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎవరు ఆపదలో ఉన్నారని తెలుసుకున్న టీమ్ అధ్యక్షుడు చిరంజీవి తనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొయ్యూరు మండలం డౌనూరు గ్రామానికి చెందిన యాళ్ల శ్రీను గత నెల 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులు తక్షణసాయంగా రూ. 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వైద్య సేవలకు తోడ్పాటు అందించారు.

అనంతరం అతని పరిస్థితిని టీం సభ్యులు, స్నేహితులు శ్రేయోభిలాషులకు తెలియజేసి సేకరించిన 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిసిసి మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ ద్వారా బాధిత కుటుంబీకులకు అందజేసి మేమున్నాము అనే భరోసా కల్పించారు. అలాగే క్షతగాత్రుడు శ్రీను భార్య బాలింత కావడంతో అనిశెట్టి బ్రదర్స్ 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు కూరగాయలను అందజేశారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆదుకున్న చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులతో పాటు మేమున్నాము టీం సభ్యులు తమకు సహాయ సహకా రాలు అందించిన అందరికీ బాధిత కుటుంబీకుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థన మన్నించి బాధిత కుటుంబీకులకు సహాయ సహకారాలు అందించిన దాతలు శ్రేయోభిలాషులకు చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు, మాజీ ఎంపీటీసీ బి శివరామరాజు, టిడిపి నేతలు రొంగల గోవిందు చంద్రరావు కిముడు శ్రీరాములు కృష్ణ తదితర పలువురు పాల్గొన్నారు.

koyyuru

2024-12-20 13:30:27

సినిమా కార్మికులు ఆధార్ అప్డేషన్, ఈ-శ్రమ్ నమోదు చేయించుకోవాలి.. డా.కంచర్ల అచ్యుతరావు

ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమలోని కళాకారులు, ఉద్యోగులు, కార్మికులు ఆధార్ అప్డేడేషన్ తప్పని సరిగా చేయించుకోవాలని ఏపీ ఫిల్మ్ ఎంప్లా యిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, ప్రముఖ సంఘసేవకులు, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు కోరారు.  ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుడూ, భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో 6 నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులు వారి ఆథార్ ను అప్డేట్ చేసుకోవడంతోపాటు, ఈ-శ్రమ్ కార్డులు కూడా పొందాలన్నారు. తద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కల్పించే ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం వుంటుందన్నారు. తెలంగాణలో ఉండిపోయిన ఆంధ్రా కళాకారులు, కార్మికులు, ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ లో వివరాలు నవీకరణ చేసుకోవాలన్నారు. 

తద్వారా ఆంధ్రప్రదేశ్ అడ్రస్, వివరాలు నమోదుకి అధికారికంగా అవకాశం కలుగుతుందన్నారు. ఇపుడు పాఠశాలలో అడ్మిషన్ మొదలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం వరకూ ప్రతి అంశంలోనూ ఆధార్ కార్డు తప్పనిసర అయిందని... ఒకసారి ఆధార్ నమోదు చేసుకున్న వారు ప్రతి పదేండ్లకోసారి అప్‌డేట్ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచించిందని పేర్కొన్నారు.  అందుకు అనుగుణంగా ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు  ముగిసిపోగా.. అన్ని వర్గాల నుంచి వస్తున్న అభ్యర్ధనల ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో ఆరు నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదని తెలియజేశారు.పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి అంశాల్లో మార్పులు చేసుకోవచ్చునన్నారు. వెంటనే ఆధార్ వివరాలను పెద్ద ఎత్తున సినీ కార్మికులు నవీకరణ చేయించుకోవాలన్నారు. 

ఇప్పటికే అన్నిజిల్లాలకు ఈ సమాచారాన్ని పంపించామని చెప్పారు.  ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే ముందు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని... అటుపై మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ కాగానే, అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయన్నారు. అందులో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. చెక్ చేసుకొని... వాటిని సవరించాల్సి వస్తే సవరించాలిని పేర్కొన్నారు. వాటిని ధృవీకరించుకుని నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలని... తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లు ఎంచుకోవాలన్నారు. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ పత్రాలు అప్ లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే... 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ రావడంతో అప్ డేట్ స్టేటస్ ఎక్కడి వరకూ వచ్చిందో చెక్ చేసుకోవచ్చునని డా.కంచర్ల అచ్యుతరావు వివరించారు.  స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు, బాధ్యతగల మీడియా  ఉచిత ఆధార్ అప్డేట్ పై సమాచారాన్ని సామాజిక మాద్యమాల్లో షేర్ చేస్తూ అన్ని వర్గాలప్రజలను చైతన్య పరచాలని కోరారు. ఈ అవకాశాన్ని సినిమా కార్మికులంతా తప్పసరిగా సద్వినియోగం చేసుకోవాలని డా.కంచర్ల సూచించారు.

visakhapatnam

2024-12-17 12:50:34

రాష్ట్రవ్యాప్తంగా చాత్తాద శ్రీ వైష్ణువుల బలం, బలగం ఏంటో తెలియజేస్తాం..!

ఆంధ్రప్రదేశ్ లోని చాత్తాద శ్రీ వైష్ణవుల సామాజిక వర్గం బలం, బలగం తెలియజేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీల ద్వారా కుల గణన(వివరాల నమోదు) చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చాత్తాద శ్రీ వైష్ణువుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,  ప్రముఖ సినీ నిర్మాత, టిడిపీ నేత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డా..కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అన్ని రాజకీయపార్టీలకు తమ సామాజిక బలం అధికారికంగా, లిఖిత పూర్వకంగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ కమిటీలను ఒక తాటిపైకి తీసుకు వస్తున్నామన్నారు. 

అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోని తమ సామాజిక వర్గం వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసి.. వివరాలు, ఓట్లు, యువత, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల సమాచారం క్రోడీకరించడం ద్వారా తమ సామాజిక బలం సంఖ్య తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సామాజిక వర్గం తర తరాల నుంచి వెనుకబడి పోతుందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం ఇంకా పెరగాల్సి వుందన్నారు. దానికోసం సామాజిక వర్గంలోని  వివరాలు సేకరించి నమోదు చేయడం ద్వారా ఎవరి పరిస్థితి ఏంటో కూడా ప్రభుత్వాలకి తెలియజేయడానికి  అవకాశం వుంటుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేరుకి కార్పోరేషన్ ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయాలేదన్నారు. 

దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో వున్న చాత్తాద శ్రీ వైష్ణవుల సంఖ్య అధికారికంగా తెలియాలంటే కుల గణన జరగాలన్నారు. వాటిని ప్రభుత్వం చేపట్టడకపోవడంతో రాష్ట్ర సంఘం చొరవ తీసుకొని తమ సామాజిక వర్గం వివరాలు నమోదు చేసే కార్యాచరణకు ఉపక్రమించామని స్పష్టం చేశారు. పూర్వం రోజుల నుంచి వెనుకబడి ఉన్న తమ సామాజిక వర్గం బలం రాజకీయపార్టీలకు తెలియజేయడం ద్వారా తామేంటో తెలియజేస్తామన్నారు. దానికోసం సంక్రాంతి పండుగ తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల జనాభా వున్నతమపై కేవలం 34 వేల మంది మాత్రమే ఉన్నారనే ముద్ర వేయడం సరికాదని.. అలాంటి అసత్యప్రచారాలను పూర్తి వివరాలతోనే త్వరలో ఘాటుగా తిప్పికొడతామన్నారు. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కమిటీలను సమాయత్తం చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ రికార్డుల్లో వున్న యాచక వృత్తి అన్న పదాన్ని తొలగించడం కోసం సమస్త సమాచారంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల దృష్టికి సామాజిక వర్గం వివరాలు తీసుకెళ్ల నున్నట్టు డా..కంచర్ల అచ్యుత రావు మీడియాకి వివరించారు.

visakhapatnam

2024-12-16 14:07:39

చోడవరం పాలిటెక్నిక్ కళాశాలలో లైంగిక వేధింపుల పర్వం

తప్పుచేసిన వారిని కాపాడడానికి ఒక్కోసారి జిల్లా అధికారులు చేసే చేష్టలు.. చర్యలు ప్రభుత్వ తీరుకే మచ్చతెస్తాయి. గతం కొత్త కాలంగా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కెమెస్ట్రీ లెక్చిరర్ విద్యార్ధినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై పోలీసు కూడా నమోదైంది. అయితే దానిని కప్పిపుచ్చేందుకే అన్నట్టుగా జిల్లా అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తున్నది. ఒక ప్రక్క ప్రభుత్వం మహిళలను వేధిస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని హెచ్చరిస్తున్నా.. చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లైంగిక వేధింపులు తారా స్థాయికి చేరుకోవడం.. దానిని అధికారులు లైట్ తీసుకొని మీడియా దృష్టిలో పడకుండా జాగ్రత్త పడటం అనుమానాలకు తావిస్తుంది. తప్పు చేసినా.. విద్యార్ధినిలను బెదిరించి ఏమీ లేదన్నట్టుగా చేయాలని చూస్తున్నారా అనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాలలో ఆర్జేడీ విచారణ కూడా రహస్యంగా సాగడం చర్చనీయాంశం అవుతున్నది.

 చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన కెమిస్ట్రీ అధ్యాపకుడు సూరెడ్డి కనకారావు పై శాఖారమైన చర్యలు తీసుకోపోగా, గురువారం  ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో ఆర్జెడి రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జెడి రాకను గమనించిన స్థానిక విలేఖరులు, ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా, కళాశాల యాజమాన్యం  అనుమతించలేదు. ఈ మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినిలు పట్ల అసభ్యకరంగా, లైంగికంగా దాడి చేస్తున్న కెమిస్ట్రీ అధ్యాపకుడు సూరెడ్డి కనకారావు పై బాధితురాలు వారి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే విద్యార్థిని స్నేహితులు బంధువులు కళాశాలలో తనపై దాడి చేసి గాయపరిచారని  మరో అద్యాపకుడు కనకారావు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ఇరువురు నుండి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారణ చేపడతామని సీ.ఐ.అప్పలరాజు తెలియజేశారు. ఈ నేపధ్యంలో విద్యార్థినిలు పై లైంగిక దాడుల కు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

chodavaram

2024-12-12 16:10:39

కార్పోరేటర్ అనుచిత వ్యాఖ్యలపై..రోడ్డెక్కిన వార్డు సచివాలయ ఉద్యోగులు

విశాఖలో జివిఎంసీ కార్పోరేటర్ కాకి గోవింద రెడ్డి జివిఎం కౌన్సిల్ సమావేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగులు గురు వారం సాయంత్రం జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. సచివాలయ ఉద్యోగులకు ఏం పనిలేదని ఖాళీ ఉన్నారని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగులకు వెంటనే క్షమాపణ చెప్పాలన్న ఉద్యోగులు.. ఒక రోజంతా సచివాలయ ఉద్యోగులతో విధి నిర్వహణలో పాల్గొంటే ఉద్యోలు ఏం చేస్తున్నారో తెలుస్తుందని హితవు పలికారు. ఏ ప్రభుత్వశాఖలో లేనివిధంగా ఒక ఉద్యోగంతో అన్ని ప్రభుత్వశాఖల విధులు చేస్తున్నది సచివాలయ ఉద్యోగులు మాత్రమేనని హితవు పలికారు. 

చేస్తున్నది ఒక శాఖ ఉద్యోగమే అయినా.. అన్ని ప్రభుత్వ శాఖల విధులు చేస్తున్నది ఒక్క సచివాలయ ఉద్యోగులు మాత్రమేనన్నారు. ఇదే సచివాలయ ఉద్యోగులు కోవిడ్ లోప్రాణాలకు తెగించి పనిచేసినపుడు తాము ఏం చేశామో వీళ్లకి కనిపించలేదాని ప్రశ్నించారు. ఈరోజు ఇంటి పన్నులు, నీటి పన్నులు కార్పోరేషన్ కి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో  పెరుగుతున్నాయంటే అది ఒక్క సచివాలయ ఉద్యోగులు పనిచేస్తేనే జరుగు తుందన్నారు. ప్రభుత్వం తమకు అప్పగించే పనులు విధి నిర్వహణలో కాకుండా సాయంత్రం ఐదు దాటిన తరువాత అప్పగించినా ముఖ్య మంత్రి నారాచంద్రబాబునాయుడు పిలుపుతో సేవలు చేస్తున్నామన్నారు. వాలంటీర్లు చేసే క్లస్టర్ మేపింగ్ పనులు, డోర్ టూ డోర్ సర్వేలు కూడా చేస్తున్నామన్నారు. ఎంతో ఉన్నత విధ్యలు చదువుకొని కేవలం ప్రభుత్వ ఉద్యోగమనే కారణంతోనే చిన్న ఉద్యోగమైనా సేవలు చేస్తు న్నామన్నారు. 

తాము కేవలం నెలకి రూ.30వేలు మాత్రమే తీసుకుంటున్నామని అన్నారు. ఇతర ప్రభుత్వశాఖలకు ఉద్యోగుల మాదిరిగా రెండవ శనివారాలు, ఆదివారాల్లోనూ తాములు సెలవులు తీసుకోకుండా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నామన్నారు. అలాంటి తమపై జీవిఎంసీ కార్పోరేట్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండి పడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రాకముందు సేవలకి, తాము వచ్చిన తరువాత అందు తున్న సేవలు ఏంటో ఒక్కసారి తెలుసుకోవాలన్నారు. తాము చేస్తున్న పనులను ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు గుర్తించిన విషయాన్ని కార్పోరేటర్లు తెలుసుకోవాలన్నారు.

 వాస్తవానికి ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన పదోన్నతులు, సర్వీసు నిబంధనలు ఇవ్వకపోయినా.. ప్రభుత్వ సేవకులుగా ప్రజలకు అన్ని రకా లుగా ఉపయోగపడుతున్నామన్నారు.  ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనులు అప్పగించాలని, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, పీఆర్సీ ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు పాల్గొని తమ ఆందోళనను, ఆవేదనను తెలియజేశారు. శాంతియుతంగా మొబైల్ లైట్ నిరసన తెలియజేశారు.

visakhapatnam

2024-12-12 15:18:41

సత్య దేవుడిని సందర్శించుకున్న మంత్రి వాసంశెట్టి

అన్నవరం  శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివా రం ఆలయానికి చేసుకున్న మంత్రి కుటుంబానికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం చేయించారు. అక్కడ మంత్రి కుటుంబం స్వామివారికి పూజలు చేసింది. ఆలయ సిబ్బంది మంత్రికి  తీర్థ ప్రసాదాలు అందించగా..వేద పండితుల వేద ఆశీర్వాదం అందించారు. ఈ  కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

annavaram

2024-12-01 14:08:22

అయ్యప్పల సేవలో ఉపకార్ ట్రస్ట్.. 18రోజులపాటు స్వాములకి బిక్ష

అయ్యప్పస్వాములకు అన్నదాన సేవ చేసే భాగ్యం రావడం అంటే ఆ అయ్యప్పకు సేవచేసినట్టుగానే భావిస్తున్నామని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, సినీ నిర్మాత కళాభోజ, ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో 18రోజుల పాటు నిరంతరాయంగా చేపట్టే అన్నసమారాధన ఆయన ఆరిలోవ సూర్యతేజ నగర్, శ్రీ పోలమాంబ వేపచెట్టు వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వాములతో కలిసి మధ్యాహ్నాం పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 18 రోజుల పాటు తన స్వంత నిధులతో అన్నసమారాధన చేస్తున్నట్టు వివరించారు.అయ్యప్ప, భవానీ, మాలధారణ చేసిన 300కి పైగా స్వాములకు  అన్నదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉపకార్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అవి నిత్య సేవలుగా ముంద రోజుల్లో కూడా కొనసాగుతాయన్నారు. 

పోర్టు ఆసుపత్రి ఏరియాలోని అయ్యప్ప పీఠం వద్ద కూడా స్వాముల అన్నసమారాధనకు ఇటీవలే రూ.3 లక్షలు ఎరిమేలి అయ్యప్ప అన్న సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి  మిలీనియం సినీ హీరో కంచర్ల ఉపేంద్ర బాబు మూడు లక్షలు విరాళం అందజేసినట్టు తెలిపారు.  ఇప్పటికే అనేక పీఠాలకు, ఆలయాలకు అంబలం పూజలకు, అన్నదానానికి భారీగా విరాళాలు ఇచ్చినట్టు చెప్పారు.   జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, కంచర్ల అచ్యుతరావు ఉపకార ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనియాడారు .ఉపేంద్ర బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడులా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. స్వాములకు ఇంత పెద్ద స్థాయిలో అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదన్నారు. ఎంతో వ్యవప్రయాసలకోర్చైనా స్వాముల సేవలో కంచర్ల తరిస్తున్నారంటే ఆయనపై అయ్యప్ప దీవెనలు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ సుధీర్, ఎస్. ఎస్. ఎల్. ఎస్ క్రియేషన్స్ మేనేజర్ నాగు, ట్రస్ట్ ప్రతినిధులు అరుణ తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-11-28 13:53:46

ఏపీకి సినీ పరిశ్రమను తరలించడానికి అవిశ్రాంత కృషి-డా.కంచర్ల

ఆంధ్రప్రదేశ్ కు వీలైనంత త్వరగా సినిమా పరిశ్రమను తీసుకు వస్తామని.. తద్వారా మరింత మంది కళాకారులకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపి పిల్మ్ ఇండస్ర్టీ ఫెడరేషన్ ఛైర్మన్, ఉపకార్ ట్రస్టు ఛైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు అన్నారు. శనివారం విశాఖలోని పౌరగ్రంధాలయంలో పవన్ కళ్యాణ్ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సంగీత విభావరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ,  ఏపికి సినీ పరిశ్రమ తరలివచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించిన విషయాన్ని కంచర్ల గుర్తు చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా సినిమా రంగానికి సంబంధించి అపారమైన వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని సినీ నటులు, దర్శక నిర్మాతలు సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రాంతం పర్యాటక, సినిమా పరంగా మరింత అభివృద్ధి చెందేందుకు దోహద పడుతుందన్నారు.

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలోనే సినీ విభాగానికి చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ సినీ స్టూడియోలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నందున.. ఇక్కడే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా సినీ వర్గాలు తమ కార్యాకలాపాల కోసం అయినా విశాఖ వస్తారు. వచ్చినపుడే ఇక్కడి అందాలను ప్రదేశాలను చూసి.. ఇక్కడే సినిమాలు తీయడానికి ఆస్కారం వుంటుంది. 24 ఫ్రేమ్స్ విభాగాలకు చెందిన కార్యకాలపాలు విశాఖ కేంద్రంగా జరిగితే  ప్రత్యక్షంగా కళాకారులకి, పరోక్షంగా వ్యాపారస్తులకి, నిర్మాతలకు పనివుంటుంది.

గౌరవ అతిధులుగా 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు, జనసేన డాక్టర్స్ సెల్ రాష్ర్ట అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు మాట్లాడుతూ నగరంలో నిత్యం అనేక కార్యక్రమాలు నిర్వహించే కళాకారులను ప్రభుత్వంతో పాటు ఆర్ధికంగా ఉన్న స్థితిమంతులు కూడా ఆదుకోవాల్సిన అసరం ఉందన్నారు. కళాకారులు నిరంతరం ప్రజలందరిని మెప్పిస్తున్నారని, అయితే వారికి కూడా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ కళాపీఠం గౌరవ అధ్యక్షులు గెంబలి జగదీష్ , అధ్యక్షులు మెరుపు వరప్రసాద్, కార్యదర్శి పీలా హరిప్రసాద్, కన్వీనర్ కె.ఇందిరా ప్రియదర్శినితో పాటు చెన్నా తిరుమల రావు, సన్ మూర్తి, ఇతర కళాకారులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా సంగీత విబావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

visakhapatnam

2024-11-23 09:46:43

ఏపీటీడీసీలో అడ్డగోలు నియామకాలు..?!

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంలోని పరిపాలనా పరమైన అంశాలు కొన్ని ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ కార్పోరేషన్ అధికారులకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి.. మనల్ని ఎవరు అడుగుతారని.. ఇష్టాను సారం చేసిన వ్యవహారాలు ఇపుడు కప్పిపుచ్చుకోవడానికి అన్ని అడ్డదా రులూ వెతుకుతున్నట్టు కనిపిస్తున్నది..విశాఖలో ఏపీటీడీసికి చెందిన హరిత యాత్రీ నివాస్ విషయంలో ఇప్పటికి సుమారు రూ.8కోట్లు కేవలం మరమ్మతులు, గదుల్లోని సామాగ్రి కొనడానికి ఖర్చు చేసేశారు. అయితే దేనికి ఎంత ఖర్చు అయ్యిందో లెక్కలు మాత్రం ఇటు జిల్లా కలెక్టర్ గానీ.. అటు రాష్ట్రప్రభుత్వానికి గానీ చెప్పలేదు. పైగా మరో రూ.5 కోట్లు కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ విషయా న్ని ఈరోజు-ఈఎన్ఎస్ వెలుగులోకి తీసుకు వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్ర ఏపీటీడీసీ అధికారులు మరింతగా అడ్డదారులు వెతుకు తున్నా రు. ఏకంగా ఎండీకే తెలియకుండా నేరుగా ఈడి విశాఖలో జిల్లా మేనేజర్ పోస్టుని ఆఘమేఘాలపై డిప్యూటేషన్ పై నియమిం చేశారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే.. ప్రస్తుతం విశాఖజిల్లా వ్యాప్తంగా ఏపీటీడీసి హోటల్ల మరమ్మతులకు సంబంధించి ఒకే కాంట్రాక్టర్ కి రూ.40 కోట్లు టెండర్లు ఇచ్చేశారు. అన్ని పనులూ ఒక్కరికే ఇవ్వడంతో ఆ కాంట్రాక్టర్ కాస్త నచ్చినట్టు చేసుకుంటూ.. అధికారు లకు కమిషన్లు ఇస్తూ లేని లెక్కలు ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. ఇపుడా లెక్కలు బయటకు తీసే పరిస్థితి వచ్చింది. దీనితో సొంత శాఖ అధికారులైతే వాస్తవాలు వెలుగు చూస్తాయని పొరుగుజిల్లా, ఇతర శాఖల నుంచి అధికారులను ఇక్కడికి డిప్యూటేషన్ పై నియమి స్తున్నారు..  ఏపీటీడీసీలో ఈ మొత్తం వ్యవహారాన్ని హరికథలు పార్ట్-5 ఈరోజు-ఈఎన్ఎస్ అందిస్తున్నది..!

కూటమి ప్రభుత్వంలో అక్రమాలకు తావుండదంటారు.. అదేంటో విశాఖలోని ఏపీటీడీసి హోటళ్ల మరమ్మతుల విషయంలో కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నా.. జిల్లాలో కలెక్టర్ తో సహా.. రాష్ట్ర అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదు. వాస్తవాలను మీడియా ప్రభుత్వం ముందుకి తీసుకెళ్లినా.. మరింతగా రెచ్చిపోతున్న ఏపీటీడీసి రాష్ట్ర అధికారులు వారి బినామీల ద్వారా చేపడుతున్న అడ్డగోలు వ్యవహారాన్ని అంతే తేడాగా కప్పిపుచ్చుకునేందు అన్ని దారులూ వెతుకుతున్నారు. కార్పోరేషన్ రాష్ట్ర అధికారుల చర్య వలన ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నా.. ఇక్కడ పనిచేసే అధికారులను గానీ, కాంట్రాక్టర్ ని గానీ పల్లెత్తు మాట అనడం లేదంటే అసలు ఏం జరుగుతుందో మీరే అర్ధం చేసుకోవాలి. ఎక్కడైనా కొత్తవి కట్టకుండా మరమ్మతులు చేసుకుంటే కొత్తగా కనిపిస్తాయని  మొత్తం ఖర్చులో కొంత భాగాన్ని ఖర్చుచేస్తారు. విచిత్రంగా ఏకంగా ఒక స్టార్ హోటల్ కట్టేంత సొమ్ముతో కేవలం మరమ్మతులు మాత్రమే చేసి.. వాటికి ఇంకా డబ్బులు చాల లేదని ప్రభుత్వానికి మరో రూ.5 కోట్లు టెండరు వేసేద్దామని అధికారులు ప్లాన్ చేసినా ప్రభుత్వం పల్లెత్తు మాట అనడం లేదు.

విశాఖలోని ఏపీటీడీసికి చెందిన హరిత యాత్రీ నివాస్ లో అత్యధిక మొత్తం వెచ్చించి మరమ్మతులు చేస్తున్నారు. ఆ విషయంలో చాలా డబ్బు చేతులు మారుతోంది. డబ్బుకి తగ్గ మరమ్మతులు, వస్తువులు ఇక్కడ కనిపించడం లేదు. వాస్తవానికి ఇలా జరిగితే జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగాలి.. కానీ అలా జరగలేదు. పైగా ఇదేశాఖకు చెందిన అధికారులను ఇక్కడ నియమిస్తే.. ఎక్కడ వాస్తవాలు బయటకి వచ్చేస్తాయోనని లుక లుకలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులు ఒక అవినీతి అధికారి శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆర్డీగా నియమించారు. ఆయనే జిల్లా మేనేజర్ పోస్టుకూడా అప్పగించారు. దీనితో రెండేళ్లు ఈయన ఆడిందే ఆట.. పాడిందే పాట. ఆ విషయం కాస్త మీడియాలో గుప్పు మనడంతో.. ఆయనను తప్పించి.. అసలు టూరిజంశాఖకు సంబంధం లేని వ్యక్తిని ఇరిగేషన్ లో ఇఇ గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి మళ్లీ ఆర్డీ స్థానంలో కూర్చో బెట్టారు. 

తరువాత కూడా మీడియా కథనాలు వరుసగా వస్తుండటంతో తనకు రెండు ఉద్యోగాలు భారంగా ఉన్నాయని చెప్పడంతో రాష్ట్ర అధికారులు మళ్లీ శ్రీకాకుళం జిల్లా నుంచి మరో అధికారి జిల్లా మేనేజరుగా నియమించారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే.. ఇదే శాఖలో ఉన్న అధికారులకి ఇన్చార్జిగా నియమిస్తే ఇక్కడ జరుగుతున్న తేడా పనులన్నీ ఆధారాలతో సహాయ బయటకు వచ్చేస్తాయ్ అలా రాకుండా ఉండేందుకు.. ఏకంగా టూరిజం కార్పోరేషన్ ఎండీ అనుమతి లేకుండా..సదరు రిఫరెన్స్ కూడా లేకుండా ఈడీ పద్మావతి నేరుగా ఇతర శాఖల్లోని అధికారులకు డిప్యూటేషన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఇపుడు ఆ ఆర్డర్ పైనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఏటీడీసీ ఎండీ ఆమ్రపాలి సెలవులో ఉన్నారు. దానిని రాచమార్గంగా తీసుకొని అక్కడి ఈడి నచ్చినవారికి విశాఖలో పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. 

అయితే వచ్చే అధికారులందరికీ ఒక లక్ష్మణ రేఖ గీసి మరీ ఏపీటీడీసీకి అధికారులుగా పంపిస్తున్నారట. అక్కడికి అధికారిగా వెళ్లినా.. మేము చెప్పినట్టే చేయాలి.. ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతుల పనులకు సంబంధించి ఏం మాట్లాడకూడదు.. లెక్కలు బయటకు తీయకూడదు.. నాణ్యతను పరిశీలించకూడదు.. బిల్లుల విషయంలో తలదూర్చకూడదు.. జిల్లా కలెక్టర్ కి దొంగచాటుగా నివేదికలు పంపకూడదు.. కాంట్రాక్టర్ పై ఒత్తిడి తేకూడదు.. కేవలం జిల్లా మేనేజర్  ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉండాలి అనే నిబంధనలతో పంపుతున్నారట. అలా అయినా విశాఖలో హరితర యాత్రీనివాస్ విషయంలో కాంట్రాక్టర్ అధికారులు కలిసి పెంచేసిన బిల్లు మొత్తాన్ని.. అక్కడ పనుల నాణ్యతను, ఇటీవలే ఆర్డీ పోస్టులోకి ఇన్చార్జిగా వచ్చిన ఇరిగేషన్ ఇఇ కలిసి జిల్లా కలెక్టర్ కి నివేదించాల్సి వుంటుంది. చూడాలి ఎండీ కి రిఫరెన్సు లేకుండా డైరెక్టుగా ఏపీటీడీసి జిల్లా మేనేజర్ అయినా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు పేపర్ పై పెడతారా..లేదంటా రాష్ట్ర అధికారులు గీసిన లక్ష్మణ రేక దాట కుండా.. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తారా అనేది...?!

visakhapatnam

2024-11-19 19:36:57

గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గం

కార్మికుల సమిష్టి కృషితో సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుడుగు వేయాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గం పిలుపు నిచ్చింది. యూనియన్ నూతన కార్యవర్గం స్థానిక విక్రమహాల్ లో జరిగింది.  ఈ సందర్భంగా నూతన ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ, మన ట్రేడ్ యూని ప్రస్తుతం రాష్ట్రంలో కార్మికుల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నదన్నారు. సభ్యుల సంక్షేమంతో పాటు, సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా యూనియన్ సభ్యులంతా ప్రతీ నెలా 4న పనులు ఖచ్చితంగా నిలిపివేయాలన్నారు. అదే సమయంలో అత్యవసర సమయంలో యూనియన్ అనుమతి ముందురోజు తీసుకోవాలన్నారు.  యూనియన నిబంధనలు పాటించాలని.. అలా పాటించని వారిపై పనుల వద్ద తిరిగే స్వ్కాడ్ చర్యలకు గురికావాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. 2025 నుంచి యూనియన్ కొత్తరేట్లు పాటించాలన్నారు. జనవరి నుంచి కొత్త రేట్లు నిర్మాణాల్లో అమలవుతాయని పేర్కొన్నారు. 

అలాగే ఉర్జవీర్ అనే పథకములో  సభ్యులందరూ నమోదు కావాలని కోరారు. ఈ పథకంలో ప్రతి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ పాల్గొని  బ్యాంక్ అకౌంటు, మీ ఆధార్ కార్డు ,పాన్ కార్డు, మీరు మీ సెల్ నుండి నమోదు చేసుకోవాలని తెలియజేశారు. గౌరవ అధ్యక్షులుగా ఎడ్ల సూర్య చంద్రరావు, ఎంవిజివి ప్రసాద్, గౌరవ సలహాదారు కాకి రవిబాబు,  బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి ఎన్నిక అనంతరం యూనియన్ చేపట్టే కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. వీరి సమక్షంలోనే ఏకగ్రీవంగా స్టీరింగ్ కమిటినీ కూడా ప్రకటించారు.  అంతకు ముందు కమిటీ మెయిన్ కోర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కమిటీలో గౌరవ సలహాదారులు గంట సతీష్, అధ్యక్షులుగా బొజ్జ రామకృష్ణ , ఉపాధ్యక్షులు వీరవల్లి గంగాచార్యులు, సెక్రెటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి, జాయింట్ సెక్రెటరీ సీమల వీరభద్రరావు, కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం, ఉప కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్, స్క్వాడ్ కమిటీ చైర్మన్  గోవాడ కొండబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముదాలపల్లి కామేశ్వరరావు, యూనియన్ కన్వీనర్ చల్ల వరప్రసాద్,  కమిటీ సభ్యులుగా ఊర్ల శ్రీరాములు, అల్లంకి వీరభద్ర స్వామి, గొల్ల రవి, గడ్డం ప్రసన్న కుమార్, ఉత్తరాల సోమేశ్వరావు, ఎడ్ల శేఖర్, నిమ్మలపూడి రవి వర్మ, జనిపే పూర్ణచంద్రరావు, గొల్లగాని విజయభాస్కర్, సొరసాని వెంకట గంగా చందు పాలపర్తి అప్పారావులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

rajamundry

2024-11-17 16:07:51

యువత మత్తుకు బానిస కావొద్దు..ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు..! - ఉపకార్ కప్ విజేత వాల్తేరు లెవెన్ కి ట్రోఫీ ప్రధానోత్సవంలో సీపీ శంఖబ్రత భాగ్చి

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు  పెద్ద కుమారుడు స్వర్గీయ యశ్వంత్ బాబు 27వ జయంతిని  ఆదివారం ఉదయం ఆరిలోవ పినాకిల్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుత రావు, హీరో ఉపేంద్ర బాబు, కుటుంబ సభ్యులు సుబ్బ లక్ష్మి, సునీత, కిరీటి, పార్ధు యశ్వంత్ బాబు చిత్ర పటానికి పూల మాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  ఉపకార్ కప్ సీజన్ 2 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ క్రాంతి లెవెన్, వాల్తేరు లెవన్ జట్లు మద్య నిర్వహించి ఆపై బహుమతి ప్రధానోత్సం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత భాగ్చి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సిపి మాట్లాడుతూ, డా.కంచర్ల అచ్యుత రావు సేవల కోసం విన్నాను.. ఇపుడు స్వయంగా చూస్తున్నానని అన్నారు. 

 ఒక పోలీసు కుటుంబానికి కూడా ఆయన అండగా నిలిచారని.. కొవిడ్ సమయంలో కూడా  ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. యువత దేశానికి భవిత అన్నారు. క్రీడాకారులు దేశానికి మంచి పేరు తేవాలన్నారు. నేటి యువత గంజాయి, మద్య పానం కి బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఏ సమస్యా వచ్చినా తనకు 7995095799 నంబర్ లో సంప్రదించాలని కోరారు. మార్పు కార్యక్రమం కింద డి ఎడిక్షన్ ద్వారా మత్తు నుంచి విముక్తి కల్పిస్తున్నామన్నారు. యువకులు గంజాయి సేవనం ద్వారా మెదడు దెబ్బ తిని విచక్షణ కోల్పోయి మానసిక రోగులుగా తయారవుతారన్నారు. తద్వారా  తల్లి దండ్రులకి మానసిక క్షోభమిగులుతుందన్నారు. యువతలో ప్రేమ సహజమే కానీ, ప్రేమ విఫలమయ్యి ఆత్మహత్యే శరణ్యం అనుకోవడం సరికాదు అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఆత్మ విశ్వాసం పెంచుకోవాలని సూచించారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని చైతన్య పరిచారు.

 తనకు కూడా అడ్వంచర్ స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టమని.. పర్వతారోహణ హాబి అని గుర్తు చేశారు. క్రీడలతో ఆరోగ్యం పెరుగుతుందన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన కంచర్ల అచ్యుత రావు ను సీపీ ప్రత్యేకంగా అభినందించడంతోపాటు.. రానున్న కార్యక్రమాలకు పోలీసు శాఖ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. జాతీయ క్రికెట్ జట్టుకు విశాఖ నుంచి, ఆరిలోవ నుంచి క్రీడాకారులు ఎంపిక అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.  సినీనిర్మాత డా.కంచర్ల అచ్యుత రావు మాట్లాడుతూ, నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చి వచ్చిన తర్వాత నగరంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని కొనియాడారు. యువత అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విధానం నమ్మిన ఏకైన పోలీసు అధికారి విశాఖ సీపీ మాత్రమేనన్నారు.  ఐపిఎల్ తరహాలో ఫ్రాంచైజీ ద్వారా క్రికెట్ జట్లను కొనుగోలు చేసి క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించామన్నారు. గత ఏడాది 12, ఈ ఏడాది 24 జట్లు పాల్గొన్నాయని గుర్తు చేశారు. ఈ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారం చేశామన్నారు. దీంతో ఇతర క్రీడాకారులకు ప్రోత్సాహం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.

క్రీడల వలన యువతకు మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు.  బాక్సింగ్, వాలీబాల్, ఫుట్ బాల్ టోర్నమెంట్లు,  త్వరలో రెండో సారి టార్గెట్ బాల్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  యశ్వంత్ బాబు 27 వ జయంతి వేడుకలలో భాగంగా బహుమతి ప్రదానోత్సవం నిర్వహించామని గుర్తుచేశారు. ప్రముఖ సినీ హీరో కంచర్ల ఉపేంద్ర బాబు మాట్లాడుతూ, క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరగడం అన్నయ్య కూడా పైలోకం నుంచి శంతోషపడతారన్నారు. తన తండ్రి, సీపీ భావాలు కలవడం వల్లనే ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించామన్నారు. క్రీడాకారులకి ఇటువంటి టోర్నమెంట్లు ప్రోత్సాహం ఇస్తాయన్నారు. ఇరు జట్ల క్రీడాకారులను ఈస్ట్ ఏసిపి లక్ష్మణ మూర్తి పరిచయం చేసు కున్నారు. 

 కాగా క్రాంతి లెవెన్ జట్టు మొదట్ బ్యాటింగ్ చేసి 62 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన వాల్తేరు లెవెన్ జట్టు వికెట్లు ఏమి నష్టపోకుండా 63 పరుగులు చేసి విజేతగా నిలిచింది. విజేతలకు నగదు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంతో పాటు కిరణ్మయి నృత్య అకాడమీ విద్యార్థులచే వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంచర్ల అచ్యుతరావు సమక్షంలో  ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీపీ విజేతలకు, టీం సభ్యులకు బహుమతులు అందజేశారు. విజేత జట్టు వాల్తేరు జట్టుకు రూ.1.20 లక్షలు ప్రైజ్ మనీ, ట్రోఫీ అందజేశారు. రన్నర్ జట్టు క్రాంతి లెవెన్ జట్టుకు రు.60 వేలు, తృతీయ బహుమతి గెలుచుకున్న కాశిం లెవెన్ జట్టుకు రూ. 30 వేలు అందజేశారు. డ్రీమ్ జట్టు ఆటగాడు నాగ రాజు, పవన్ బెస్ట్ బ్యాట్స్మన్,  బెస్ట్ బౌలర్ రమేష్,  బెస్ట్  ఫీల్దర్ గోపి , ఇంకా సాయి అవార్డులు అందుకున్నారు. విశాఖ సౌండ్స్ అండ్ లైట్స్ టీమ్ కి ద్వితీయ బహుమతి కింద రూ.10వేలు, డూ ఆర్ డై జట్టు కి ప్రథమ బహుమతి కింద రూ.20 వేలు అందజేశారు. 

 ఈ నెల 25 వ తేదీన జరగనున్న వైజాగ్ స్టీట్ ప్రీమియర్ లీగ్ లోగో ను సీపీ ఆవిష్కరించారు. ప్రైజ్ మనీ కింద రూ.5లక్షలు వుంటుందని, పోటీలు అక్కయ్యపాలెం పోర్టు స్టేడియం లో జరుగుతుంది అని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే, ఏపీ వాలి బాల్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది అన్నారు. అతిథులు, టోర్నమెంట్ కి సహకరించిన వారిని శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ కుమార్, సభ్యులు అరుణ, అనిత, పద్మ, ఎస్ ఎస్ ఎల్ వి క్రియేషన్స్ మేనేజర్ నాగ,  తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-11-03 12:55:34

కలెక్టర్ ఆదేశాలు వైరల్.. యలమంచిలిలో మీడియా వెర్సస్ సోషల్ మీడియా

అనకాపల్లి జిల్లాలో మీడియాకి సోషల్ మీడియాకి యుద్దం మొదలైంది.. ప్రభుత్వ కార్యక్రమాల్లో మీడియాకంటే సోషల్ మీడియా తెగ హడావిడీ చేస్తూ.. మీడియా రంగానికి చెందినవారు కాకుండా బయట వ్యక్తుల హల్ చేస్తున్నారంటూ యలమంచిలి జర్నలిస్టులు తమ గోడుని జిల్లా కలెక్టర్ కి విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్.. అధికారిక కార్యక్రమాల్లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ తహశీల్దార్ ను ఆదేశించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతుంది..! 

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో హడావిడి చేస్తున్న సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లను నియంత్రించాలంటూ యలమంచిలిలోని అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టులు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయక్రిష్ణణ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దానితో స్పందించిన కలెక్టర్  తహశీల్దార్ కి జిల్లా సమాచారశాఖ పౌర సంబంధాలశాఖ అధికారి ద్వారా వర్తమానం పంపారు. ప్రస్తుతం ఈ లేఖ రాష్ట్రంలో బాగా వైరల్ అవుతుంది. యలమంచిలిలో యూట్యూబ్ ఛానల్స్ అధికం అవడం, ప్రతీ ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలకి మీడియా కంటే ఐదు రెట్ల మంది యూట్యూబ్ ఛానల్స్ రావడంతో చేసేది లేక అక్రిడేటెడ్ జర్నలిస్టులు సోషల్ మీడియా వారిని దూరం పెట్టాలని జర్నలిస్టులు నిర్క్షయించి కలెక్టర్ ను కలిసి ఫిర్యాదులు చేశారు. అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ ద్వారా మీడియాకి ప్రాధాన్యత కల్పించాలని యలమంచిలి తహశీల్దార్ కి లేఖరాశారు. 

జిల్లాలో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అధికం కావడంతో జర్నలిస్టులకంటే అత్యధికంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్లే ప్రభుత్వ కార్యక్రమాల్లో హడావిడీ చేస్తున్నారని, టివి రంగానికి గానీ, పత్రికా రంగానికి గానీ సంబంధం లేని వారే అధికంగా వస్తున్నారని జర్నలిస్టులు కలెక్టర్ కి చేసిన ఫిర్యాదులో  పేర్కొన్నారు. దీనితో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనకాపల్లి డిఐపీఓఆర్వో ఇంద్రావతి యలమంచిలి తహశీల్దార్ కి అధికారిక మీడియాకి మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలు, కవరేజిలో ప్రాధాన్యత ఇవ్వాలని లేఖ రాశారు. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ట్రోల్ అవుతున్న ఈ లేఖపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా  అనకాపల్లి జిల్లాలోని యలమంచిలిలో అక్రిడేటెడ్ జర్నలిస్టులు నేరుగా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో ఇపుడు అన్ని ప్రాంతాల్లోనూ వర్కింగ్ జర్నలిస్టులు సోషల్ మీడియాని దూరం పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. 

అనకాపల్లి జిల్లా కలెక్టర్ మాదిరిగా ఇతర జిల్లాల్లోనూ మీడియాకి కాకుండా సోషల్ మీడియాని అధికారులు, ప్రజాప్రతినిధులు నియంత్రించగలిగితే మళ్లీ మీడియాకి జవసత్వాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. అటు జర్నలిస్టులు ఈ రకంగా ఫిర్యాదులు చేయడంపై యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు మండి పడుతున్నారు. మేమూ జర్నలిస్టులమే నంటున్నారు. అయితే సోషల్ మీడియాకి మీడియాగా గుర్తింపు లేదు. దానితో అన్నిచోట్లా మీడియాకంటే సోషల్ మీడియాకి చెందిన యూట్యూబ్ ఛానల్స్ అత్యధకంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల యూట్యూబ్ సంఘాలు కూడా ప్రారంభం కావడం విశేషం. ఎక్కడా లేనివిధంగా అనకాపల్లి జిల్లాలో సోషల్ మీడియాపై మొదలైన తిరుగుబాటు ఇంకా ఎన్ని జిల్లాలకు పాకుతుందనే చర్చ మీడియాలోని వర్కింగ్ జర్నలిస్టులు మధ్య బలంగా సాగుతున్నది.

yalamanchili

2024-11-01 19:02:44

ఉర్రూతలూగించిన హీరో ఉపేంద్ర జన్మదిన వేడుకలు

యంగ్ టైగర్,  మిలీనియం హీరో కంచర్ల ఉపేంద్ర బాబు జన్మదిన వేడుకలు విశాఖలోని డాబాగార్డెన్స్ అల్లూరి సీతారామరాజు  విజ్ఞాన కేంద్రం లో అభిమానుల కేరింతలు.. హర్షధ్వానాల మధ్య ఉర్రూతలూగించాయి.  హీరో  కుటుంబ సభ్యులు, సమక్షంలో ఉపేంద్రబాబు భారీ కేక్ ను కట్ చేసి వారితో అనందాన్ని పంచుకున్నారు. అనంతరం హీరో ఉపేంద్రకు పలువురు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాం క్షలు తెలిపారు. తమ అభిమాన హీరోని గజమాలతో సత్కరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఉపేంద్ర బాబు నటించిన కంచర్ల, ఉపేంద్ర బి పార్మసి, ఐపీసీ 369, అనగనగా కధలో, ఉపేంద్ర గాడి అడ్డా, 1920 భీమినిపట్నం, వధ, (ఒక దీరుడు కధ), విక్రమ్ కె దాస్,  చిత్రాల టీజర్స్ ను ప్రముఖల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్బంగా  ఉపేంద్ర 9వ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు గంగిరెడ్డి తీస్తుండగా, 10వ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తీయడానికి ముందుకు వచ్చింది. 

అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, తన చిత్రాల్లో విశాఖ కళాకారులకు పెద్ద పీట వేసినట్టు చెప్పారు. అంతేకాకుండా విశాఖను, ఇక్కడి పర్యాటక ప్రదేశాలను పెద్ద ఎత్తున తన సినిమాల్లో ప్రమోట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతానికి మరింత మంది రావడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. యంగ్ హీరో ఉపేంద్రబాబు మాట్లాడుతూ ప్రేక్షకులు తన చిత్రాలను ఆదరించాలన్నారు. మంచి కథ కధనంతో ఎంతో శ్రమ, వ్యవయం చేసి సినిమాలు తీస్తున్నామన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను సమ్మోహ నపరిచాయి. ఈ కార్యక్రమంలో కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, యాద కుమార్, ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, నాగు, అరుణ, జె ఎం నెహ్రు, రాజేంద్ర ప్రసాద్, జనార్దన్, గెంబలి జగదీష్, కళాకారులు,  కళాసంస్థల అధినేతలు, కంచర్ల కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

visakhapatnam

2024-10-30 18:54:04

అండమాన్ లో ఉత్తరాంధ్ర మత్స్యకారులకు ఎంపీ కలిశెట్టి భరోసా

అండమాన్ లోని మత్స్యకారులకు  సదుపాయాలు, రక్షణ, శిక్షణ కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో చర్చలు జరుపుతానని విజ యనగరం ఎంపీ, ఐ.టి & కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు  కలిశెట్టి అప్పలనాయుడు భరోసా ఇచ్చారు.   సీఎం చంద్ర బాబు సూచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదుని అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ వారిని ఎంపి కలిసి ఉత్తరాంధ్ర మత్స్యకార కాలనీ, ఫిషింగ్ పోర్ట్ సందర్శించారు. అన్ని ప్రాంతాలను తిరిగి అక్కడి పరిస్థితిని అవగతం చేసుకున్నారు. వారి సమ స్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ నివసించే మత్స్యకారులకు ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. ఇక్కడి వారి జీవన విధానం, వేటకు వెళ్ళే నౌకలు, వేట కోసం ఉన్న పరిస్థితులు, వాటిలో ఉన్న ఇబ్బందులను సమగ్రంగా అర్థం చేసుకున్నారు. మత్స్యకారులంతా పేదరికంలో, స్వల్ప వనరులతో జీవనం సాగిస్తూ, సముద్రం మీద ఆధారపడిన జీవనానికి నిత్య కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారని ఎం.పి గుర్తించారు. జీవోపాదికై అండమాన్, నికోబార్ దీవులకు తరలివచ్చినప్పటికీ తమకోసం స్వయంగా వచ్చిన ఎంపీ కలిశెట్టిని అక్కడి వారు ఎంతో ఆప్యాయతగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఘనంగా సత్కరించారు. పెద్ద సంఖ్యలో ఉత్త రాంధ్రాకి చెందిన మత్స్యకార కుటుంబ సభ్యులు టిడిపి సభ్యత్వాన్ని స్వీకరించారు. 

visakhapatnam

2024-10-27 06:25:07

ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి అపార వనరులున్నాయ్- డా.కంచర్ల

 ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి అపార వనరులు, అవకాశాలు ఉన్నాయని ప్రముఖ సినిమా నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, కళా భోజ డా. కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. శనివారం ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా  డాబా గార్డెన్స్  అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం లో  కంచర్ల యువసేన ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ పర్యాటకంతోపాటు, రాష్ట్ర పర్యాటక ప్రదేశాలను రాష్ట్రంలో నిర్మించే సినిమాల్లో ప్రమోట్ చేయడం ద్వారా ఈ ప్రాంత కళాకారులుకు, పర్యాటక ప్రదేశాలకు సినిమా రంగం కూడా ఆదాయాన్ని సమకూర్చినట్టు అవుతుందన్నారు. అనంతరం దంపతులిద్దరూ కట్ చేశారు. వారి కుమారుడు, ప్రముఖ హీరో ఉపేంద్ర తల్లిదండ్రులకు కేక్ తినిపించి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 

 అభిమానులు, సన్నిహితులు మద్య వివాహ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ పతాకంపై తన కుమారుడు ఉపేంద్ర హీరోగా 8 సినిమాల్లో నటిస్తున్నాడని తెలియజేశారు. ఒక సినిమా ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు. మరో సినిమా నవంబర్ తొలి వారంలో విడుదల అవుతుందన్నారు.  ఈ సినిమా బడ్జెట్ ఐదు కోట్లు నుంచి 30 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. తెలుగు, హిందీ, తమిళం, మళయాలం, కన్నడం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లో డైరెక్టర్లు పెద్ద సినిమాలు తీయలేరు, నిర్మించలేరనే అపవాదు హైదరాబాద్ లో వుందని.. తాను ఏపి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత సినీ రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి తెలుగు చిత్ర పరిశ్రమ రావడానికి కృషి చేస్తున్న మంత్రి దుర్గేశ్ కి ధన్య వాదాలు తెలిపారు. 

ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్ళగా, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. విశాఖ పట్నం లో ఎందరో కళాకారులు వున్నారని.. విశాఖ షూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతోందన్నారు. అరకు వెలి సినిమా షూటింగ్ లకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.  నూతన సంస్థ కలాభోజ డాక్టర్ కంచర్ల కల్చరల్ అసోసియేషన్ ను లోగోను అభిమాను కరతాల ధ్వనుల మధ్య  ఆవిష్కరించారు. ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారికి తన సినిమాలు, ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు కల్పిస్తామన్ని చెప్పారు. ఈ సంస్థ ద్వారా ప్రతి నెల ఒక పెద్ద కార్య క్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బాలభాను అర్చక సంఘం నిర్వాహకులు కంచర్ల దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహా చలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ ధర్మ కర్త, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు, దర్శకుడు యాద్ కుమార్, మా అధ్యక్షుడు భయ్యా శ్రీనివాస్, లోకేష్, నెహ్రూ, జగదీష్, రాజేంద్ర ప్రసాద్, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, సభ్యులు అరుణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సాంస్క్రుతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

visakhapatnam

2024-10-26 17:14:44