1 ENS Live Breaking News

కలెక్టర్ సారూ ఇది మా ఊరు కొనపురం రోడ్డే..!

మా ఊరి రోడ్డు పరిస్థితి ఇలా ఉంది కలెక్టర్ సారూ..  మా ఊరి పేరు కొనపురం.. మండలం అనంతగిరి.. మన అల్లూరి సీతారాజు జిల్లాయే.. మా గ్రామంలోకి మీరు ఒక్కసారి వచ్చారంటే ఇక్కడి రోడ్డు పరిస్థితి ఏంటో మీకు అర్ధమైపోతుంది. మేము దరఖాస్తులు పెట్టినంత కాలం ఏదో మామూలు రోడ్డు సమస్య అనుకుంటున్నారు జిల్లా అధికారులంతా. అందుకనే మా గిరిజన తండా రోడ్డు కోసం మేము చెప్పేకంటే మీరొచ్చి ఒక్కసారి చూసినా.. కనీసం ఈ గూండా ప్రయాణం చేసినా మొత్తం సమస్య మీకు అర్ధమైపోతుంది. ఇంకో మాటసారూ.. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు బాగా మారు మూల గ్రామాలకు వాడేశామని చెబుతున్నారు అధికారులు.. వాళ్లకి.. సబ్ ప్లాన్ నిధుల ప్రచారానికి ఈ రోడ్డుని ఫోటోలు పెట్టి చూపిస్తే రోడ్లు ఎంతబాగా వేశారో మీకు, ప్రజలకి అటు ప్రభుత్వానికి కూడా చాల చక్కగా తెలుస్తుందండయ్యా.. ఇలా అన్నామనీ మాపై కోపం పెంచుకోకండి. మా గ్రామానికున్న ఒకే ఒక్క రహదారి పూర్తిగా పాడైపోయి రాళ్లు తేలితే మేము పడుతున్న బాధలు మీకు చెప్పాలని మాత్రమే ఈ పద ప్రయోగం తప్పా మరేమీ లేదండయ్యా..!

అనంతగిరి మండలం కొనపురం గ్రామానికి వెళ్లాలంటే ఈరోడ్డుపై ఒక్కసారి అధికారులుగానీ, ప్రజా ప్రతినిధులు గానీ ప్రయాణం చేస్తే ఇక్కడి ప్రజలు నిత్యం పడుతున్న బాధలేంటో తెలుస్తాయని వాపోతున్నారు గ్రామస్తులు. గత ప్రభుత్వంలో ఐటిడిఏకి కొనపురం గ్రామం రోడ్డు సమస్యను విన్నవిస్తే రోడ్డుు సాంక్షన్ అయ్యిందిగానీ.. నిధులు లేవని చేతులెత్తేశారట. ఇపుడేమో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఫిర్యాదు చేస్తే సాంక్షన్ అయిన పాత రోడ్డు పోయింది.. మళ్లీ కొత్తగా కంప్లైయింట్ పెట్టమంటున్నారని గ్రామస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభలో తీర్మానించి మరీ సమస్యను ఐటిడిఏ అధికారుల దృష్టికి తీసుకెళితే చూద్దాం.. చేద్దాంలే అని ఊరకుండిపోతున్నారని వాపోతున్నారు. అసలు రోడ్డు వేసే సమయంలోనే నాణ్యతగా వేస్తే మాకు ఈరోజు ఈ పాట్లు వచ్చేవి కాదు కదాని ప్రశ్నిస్తున్నారు కొనపురం గ్రామస్తులు. 

ఈ గ్రామం నుంచి పిల్లలకు పక్క గ్రామానికి బడికిపోవాలన్నా.. సంతలకు వెళ్లాన్నా.. ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే మండల కేంద్రానికి వెళ్లాలన్నా ఈ గుంతలు పడిన రాళ్లు తేలిపోయిన రోడ్డుపై నుంచే ప్రయాణం చేయాల్సి వస్తున్నది. గర్భిణీ స్త్రీలను ఈరోడ్డు మార్గంలో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో మార్గ మధ్యలోనే కాన్పులు అయిపోతున్నాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు.  ఈ రోడ్డు బొర్రా గుహలకు, లోతేరు జంక్షన్ కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నా.. ఆదాయం ఆర్జించే ప్రభుత్వం.. రోడ్డు మార్గాన్ని బాగుచేసే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. కనీసం గుంతలు కప్పినా రాకపోకలకు అంతరాయం లేకుండా ఉంటుందని.. కనీసం ఆ సమస్యనైనా తీర్చాలని కొనపురం గ్రాస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

ananthagiri

2024-09-07 09:10:41

రక్త దాతలే నిజమైన ఆపద్భాంధవులు-జనసైనికులు

రక్త దాత ఒకసారి రక్తం దానం చేస్సతే ఐదుగురు వ్యక్తులకు అత్యవసర సమయంలో అది ఉపయోపడుతుందని జనసేన నాయకులు, క్రిష్ణదే విపేట ఉపసర్పంచ్ దుంపలపూడి సహదేవుడు పేర్కొన్నారు. జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్వ చ్చంద రక్తదానం చేసిన రక్తదాతలకు ఆయన  మంగళవారం సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్చం దంగా సహాయం చేసే అలవాటుని యువత అలవాటు చేసుకోవాలని అన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు వీలుగా రక్తాన్ని దానం చేసిన దాతలందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో  టీం జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు ఊడి చక్రవర్తి,  సహాయ కార్యదర్శి సురేష్, ప్రధాన కార్యదర్శి హరినాథ్ ,  పాత జనసేన కార్యకర్తలు ఈర్ని చిన్ని, పాతాళ శివ గుడివాడ శివ,  దుంపలపూడి శివ,  స్కూల్ చైర్మన్ అని శెట్టి గోపి,  జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

krishnadevipeta

2024-09-03 12:50:28

కళా, రాజకీయ రంగాల నిశ్వార్ధ సేవకుడు పవన్ కళ్యాణ్-డా. కంచర్ల

కళారంగానికి.. రాజకీయాల్లోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ అందించిన సేవలను వెలకట్టలేనివని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉపకార్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత  సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. సోమవారం పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా  పవన్ కళ్యాణ్ కళాపీఠంను లోగోను ఆయన పౌరగ్రంథాలయంలో జనసేన నాయకులు కందుల నాగరాజు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, సినీ రంగంలోనే ఆయన నటులకు, కళాకారులకు ఒక మాస్టర్ అని.. రాజకీయ రంగంలో నిశ్వార్ధ సేవకుడని కొనియాడారు. సేవే లక్ష్యంగా.. ప్రజా పరిపాలనే ధ్యేయంగా ఆయన ప్రభుత్వంలో తీసుకువస్తున్న సంస్కరణలు ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఆయన ఎన్నో ఏళ్లుగా  అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ప్రజా సమస్యల పరిష్కారంపై తక్షణమే  స్పందించి చర్యలు తీసుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరానని ప్రశంసించారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వంలో ఆయన అత్యంత  కీలకపాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమన్నారు. 

రాజకీయాల్లో ఛాలెంజ్ చేసి మరీ రాణించిన వ్యక్తి  ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు.  గౌరవ అతిధులుగా హాజరైన కందుల నాగరాజు, గంట్ల శ్రీనుబాబులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి కళాపరిషత్ ఏర్పాటు కావడం, ఆ సంస్థ పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళాపీఠం ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఈ సంస్థ భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నననలు పొందాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేకంగా చెరగని ముద్ర వేసుకున్నారని  కొనియాడారు. ఈ సంస్థ గౌరవ అధ్యక్షులు గెంబలి జగదీష్, అధ్యక్షులు మెరుపు వరప్రసాద్, కార్యదర్శి పీలా హరిప్రసాద్, గంటి మురళీధర్, సినీనటుడు రవితేజ, కొరియోగ్రాఫర్ ఆర్.నాగరాజుపట్నాయక్, కన్వీనర్ కె.ఇందిరా ప్రియదర్శిని తదితరులు పవన్ కళ్యాణ్ కళాపీఠం ఆవిర్భావంలో తమ వాణిని వినిపించారు. అనంతరం అతిధులను గెంబలి జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అంతకు ముందు నిర్వహించిన మెగా సంగీత విభావరి అలరించింది. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాన్ అభిమానులు, జనసేన నాయకులు, ఉపకార్ ట్రస్టు సభ్యులు, ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-09-02 16:15:28

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు అతి త్వరలో పరిష్కారం-మంత్రి నారా లోకేష్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు  విశాఖ టిడిపి పార్టీ ఆఫీసులో ఆయన్ని కలిసి ఇప్పటివరకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటా యింపు ప్రక్రియ లో జరిగిన పరిణామాలు వివరించారు. సొసైటీ అధ్యక్షులు బి.రవి కాంత్ మాట్లాడుతూ విశాఖలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కల నెరవేరడం లేదని, దీనిపై త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని మంత్రికి వివరించారు. మంత్రి లోకేష్ సావధానంగా సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. వెంటనే పక్కనే ఉన్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో ఈ సమస్యపై చర్చించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ అతి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. జర్నలిస్టులకు అండదండలు అందిస్తామన్నారు. ప్రధానంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యపై అధికారులతో మాట్లాడి ఒక కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు. అర్హులందరికీ  న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  సొసైటీ గౌరవాధ్యక్షులు జనార్దన్,  కోశాధికారి శరత్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొప్పన రమేష్, ప్రత్యేక ఆహ్వాని తులు యర్రా నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాగా.. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వార్షికోత్సవం సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహించనున్నట్లు  అధ్యక్షులు బి రవికాంత్, కార్యదర్శి యర్రా శ్రీనివాస్ తెలిపారు. భవిష్యత్తు కార్యచరణ రూపొందించ డంతోపా టు ప్రజాప్రతినిథులు అందరినీ ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.

visakhapatnam

2024-09-01 06:06:06

చోడవరంలో జోరు వానలోనూ ఆగని పింఛన్ల పంపిణీ

జోరువానలో స్వయంగా ఎంపీ సీఎం రమేష్ లబ్దిదారులకు పించన్లు పంపిణీ చేశారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రభుత్వం శనివారం చేపట్టింది. చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో  ఉదయం ఎన్టీఆర్ సామాజిక ఫించన్లు ఎంపీ పంపిణీ చేశారు.  గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సామాజిక ఫించన్లు పంపిణీ చేయడం విశేషం. ముందుగా ఎమ్మెల్యే కే ఎస్ ఎం ఎస్ రాజు, ఎం.పి. రమేష్ గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ  కార్యక్రమంలో వెంకన్నపాలెం లోని ఫించను లబ్ధిదారులతో ఎం.పి. ముచ్చటించి, వారి ఆరోగ్య పరిస్థితులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆదేశాలతో మండలాల్లోని అన్ని గ్రామాల్లో  తెల్లవారుజాము నుండే ఫించన్లు పంపిణీ ప్రారంభించారు. రాష్ట్రం మొత్తం మీద ఉదయం 10 గంటలకు మొత్తం 64,61,485 పింఛన్ లబ్దిదారులకు రూ.2,729.86 కోట్లు పంపిణీ చేసినట్లు ఎంపీ రమేష్ తెలిపారు. ఒకరోజు ముందుగానే పించన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

chodavaram

2024-08-31 13:58:21

31న ఏపీఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ గా డా.కంచర్ల భాద్యతల స్వీకారం

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉపకార్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత  సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యు తరావు ఈ నెల 31విశాఖలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలే ఫెడ్ రేషన్ ఈయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.  ఈ శనివా రం  సాయంత్రం 6 గంటలకు విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం లో పలువురు ముఖ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయను న్నా రు. ఈ మేరకు డా.కంచర్ల కార్యాలయం మీడియాకి ప్రకటన విడుదల చేసింది. ఆయన ప్రమాణ స్వీకారానికి నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తు న్నారు. కంచర్ల చాలా ఏళ్లు ఉపకార్ ట్రస్టు ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖను సినిమా పరిశ్రమకు ప్రధాన వేదికగా చేయాలని కంకణం కట్టుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఏపీఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

visakhapatnam

2024-08-29 07:23:35

ఉపకార్ ట్రస్టు ఆధ్వర్యంలో భారీగా వినాయక చవితి ఉత్సవాలు

ప్రధమ దేవుడు ఆ మహాగణపతి పండుగ, వినాయక చవితి ఉత్సవాలను ఉపకార్ ట్రస్టు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు ప్రకటించారు. బుధవారం విశాఖలోని 12వ వార్డు నెహ్రూనగర్ లో జనసేన యూత్, కంచర్ల యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పందిరి రాట పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ, వినాయకచవితి మహోత్సవాలను ట్రస్టు ఆధ్వర్యంలో ఎప్పుడూ చేపట్టినట్టుగా ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధమదేవుడు వినాయకుడి దీవెనలు విశాఖవాసులతోపాటు రాష్ట్రప్రజలపై కూడా పుష్కలంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకొని, వినాయక పందిళ్లు ఏర్పాటు చేయాలని కంచర్ల యూత్ ప్రెసిడెంట్ ను సుధీర్ ను ఆదేశించారు. స్వామివారి ఉత్సవాలను ఘనంగా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లును కూడా చేయాలన్నారు.

సాంస్క్రుతిక కార్యక్రమాలకు కావాల్సిన అనుమతులు, విద్యుత్ అలంకరణలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నారు. వినాయక పందిళ్లు కొనసాగినన్ని రోజులు, దూప దీప నైవేద్యాలతోపాటు తీర్ధ ప్రసాదాలు కూడా భక్తులకు వితరణ చేసేందుకు వీలుగా అన్ని దగ్గరుండి చూసుకోవాలని సుధీర్ ని కోరారు. ఉపకార్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రధమ దేవుని పండుగ ఉత్సవం పెద్ద సంబురంలా చేయడానికి యువకులు, ట్రస్టు సభ్యులు జనసేన యూత్ కూడా అధిక సంఖ్యలో రావాలని కోరారు. అంతకు ముందు పందిరి రాట కోసం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. సినిమాహీరో ఉపేంద్రను చూడటానికి ఆ ప్రాంతానికి అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అనంతరం హీరో ఉపేంద్రను యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కారక్రమంలో నెహ్రూ నగర్ అధ్యక్షులు పొట్టి అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ బాషా,  క్యాషియర్ ధన, క్యాషియర్ గడిపామురవి, జాయింట్ క్యాషియర్ నాగు, సభ్యులు రాజు, నాని, రాము, లౌలీ, వంశీ, శివ, మను, శ్రీకాంత్, నవీన్, వైజాగ్ శ్రీను, గొంప శ్రీను, పైరోడ్డు కుమార్, అమ్మ సౌండ్స్ చిన్న, దిలీప్, కళ్యాణ్, అధిక సంఖ్యలో వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

visakhapatnam

2024-08-28 10:37:23

సమిష్టి కృషితో ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి-డా.కంచర్ల

తెలుగు సినీపరిశ్రమలోని అందరి కృషితో  ఫెడరేషన్ ను అభివృద్ధి చేయడంతోపాటు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆంధ్రప్ర దేశ్ ఫిల్మ్ ఫెడరేషన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెంలో జరిగిన ఫెడరేషన్ సభ్యుల అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సినీ నిర్మాతగా, ప్రభుత్వంలోని మనిషిగా తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఫెడరేషన్ అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా ప్రతీ ఒక సభ్యుడు ఖచ్చితంగా సభ్యత్వాలను కట్టి, పాతవారు రెవిన్యుల్ చేయించుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతీ సభ్యుడు ఈ-శ్రమ్ కార్డులు పొందాలన్నారు. తద్వారా కార్మికులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి అందే ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమను ప్రమోట్ చేయడానికి అన్ని అవకాశాలను వినియోగిస్తూ.. ప్రభుత్వం దృష్టికి రాష్ట్రంలోని ఫెడరేషన్ సభ్యుల సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. 

మాజీ మున్సిపల్ చైర్మన్,  నర్సాపురం పార్లమెంనియోజకవర్గం ఇన్చార్జ్ అబ్బయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కంచర్ల ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు సినిమాలకు అనువుగా వున్నాయని.. వాటిదగ్గర షూటింగులు జరిగితే ఫెడర్ రేషన్ సభ్యులందరికీ ఏడాది పొడవునా పనిదొరుకుతుందన్నారు. తాడేపల్లి గూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత సినీ పరిశ్రమకు ఒక వేదిక లేకుండా పోయిందని.. ఇపుడు ఆ బాధలు, ఆందోళన నుంచి ప్రతీ కార్మికుడు బయటపడే అవకాశం వచ్చిందన్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఫెడరేషన్ చైర్మన్ కావడం వలన ఇండస్ట్రీలోని ప్రతీ కార్మికుడికి మంచిరోజులు వచ్చినట్టేనని ఆశాభావం వ్యక్తం చేశారు. 




వైస్ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఒక్కో జిల్లాకు ఒక్కో గుర్తింపు ఉందని సినీ నిర్మాతలు, దర్శకులు మంచి దృష్టితో ఆలోచించి రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ప్రాంతాల్లోనూ సినిమాలు తీయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి దేశంలోని సినిమాలన్నీ షూటింగ్ ల కోసం తరలివచ్చే అవకాలున్నాయన్నారు. ఆ విధంగా చేయడానికి డా. కంచర్ల అచ్యుతరావు నెట్వర్క్ పరిశ్రమకు ఎంతగానో ఉపయోగపడు తుందని అన్నారు.  విద్యాసంస్థల చైర్మన్ బాలజీ మాట్లాడుతూ, అన్ని పరిశ్రమలలో మాదిరిగానే సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాల న్నా.. ఇందులోకి కార్మికులకు చేతినిండా పనుండాలన్నా కంచర్ల లాంటి నిర్మాతలు ఏడాదికి కనీసం రెండుమూడు సినిమాలు తీయడం ద్వారా.. చాలా మంది నిర్మాతలు, దర్శకులు ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు తీయడానికి ముందుకి వస్తారన్నారు. ప్రభుత్వంలో కూడా ఈయ నకు పలుకుబడి ఉన్నందున కార్మికుల సమ్యలు పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు. 

 ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరం రాజా మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులకు చాలా కాలం దిశ నిర్ధేశం లేదని.. ఇపుడు కంచర్ల రాకతో ఒక చక్కటి విధానంతో అభివృద్ధి ఉపాది దిశగా ముందుకు వెళతామనే నమ్మకం బలపడిందన్నారు. ప్రతీకార్మికుడికి గుర్తింపు అనేది చాలా ముఖ్యమన్నారు. గుర్తింపుకోసం ఫెడరేషన్ నియనిబంధనలు పాటించి సభ్యులందరూ లైవ్ లో ఉండాలన్నారు. వైస్ ప్రెసి డెంట్   కొండపల్లి అప్పారావు మాట్లాడుతూ, చైర్మన్ డా.కంచర్ల అచ్యుతారు సూచించినట్టుగా ప్రతీ సభ్యుడూ ఈ-శ్రమ్ కార్డుతోపాటు, ఫెడరే షన్ సభ్యత్వాలు సత్వరమే చెల్లించి ప్రభుత్వం, ఫెడరేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలు పొందాలన్నారు. అంతకు ముందు కార్యక్రమా నికి హాజరైన ముఖ్య అతిథులు డా.కంచర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో 26 జిల్లాల కళాకారులు, డాన్స్ అకాడమీ సభ్యులు, గాయకులు, ఆడిషన్ సభ్యులు, ఉపకార్ ట్రస్టు సభ్యులు రాజా, సుధీర్, నాగు తదితరులు పాల్గొన్నారు.


thadekpalligudem

2024-08-26 16:47:25

విశాఖ అందాలు ఏ స్తాయి సినిమాలకైనా అద్భుత వరం

విశాఖ జిల్లాలో లొకేషన్లు, సీ షోర్ ఏ స్థాయి సినిమాలకైనా అద్భుత వరమని సినీ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్లు, ఏపిఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ డా.కంచర్లఅచ్యుతరావు పేర్కొన్నారు. సినీపరిశ్రమ అభివృద్ధి చెందాలన్నా నిర్మాతలు స్థానిక కళాకారులు, కార్మికులకు పని కల్పించాలన్నారు. శనివారం విశాఖలో నటరత్న కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. కంచర్ల అచ్యుతరావు ఏపిఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. విశాఖలోని బీచ్ లు గోవా బీచ్ అందాలకు వందరెట్లు అందంగా ఉంటాయన్నారు. తమ సినిమాల్లో ఎక్కువగా విశాఖ అందాలను,సీ షోర్ ను చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పటి వరకూ వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీగా ఉందని..ఇకపై సినీ పరిశ్రమ అభివృద్ధి కూడా విశాఖ కేంద్ర బిందువు కావాలని, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కీలకం కావాలని ఆకాంక్షించారు. సినిమాలు తీసే దర్శకులు, నిర్మాతలు స్థానిక కళాకారులు, టెక్నీషియన్లు, 24 క్రాఫ్ట్స్ సిబ్బందికి పని కల్పించడానికి ముందుకి రావాలన్నారు. 

తద్వారా ప్రొడక్షన్ ఖర్చు తగ్గడంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుందన్నారు. సినీ కార్మికుల అభ్యున్నతి కోసం సరికొత్త ప్లానింగ్ తో ముందుకి వెళతామన్నారు. త్వరలోనే ఫెడరేషన్ లోని కార్మికులందరికీ ఈ-శ్రమ్ కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు త్వరలోనే ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు కంచర్ల ప్రకటించారు. ప్రక్క రాష్ట్రాలు, దేశాల్లో సినిమాలు తీయడం ఆదాయం మొత్తం సదరు ప్రాంతాలకు తరలి పోతుందనే విషయాన్ని నిర్మాతలు గమనంచాలన్నారు. విశాఖతోపాటు అరకు, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో ఎన్నో సుందరమైన ప్రదేశాలు తెలుగు సినిమాలకు అనువైన ప్రాంతాలుగా ఉన్నాయని.. సినిమాల్లో అధిక భాగం స్థానికంగా తీయడం ద్వారా స్థానిక కళాకారులు, కార్మికులకు ఉపాది కలగడంతోపాటు సినిమా పరిశ్రమ వలన ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందన్నారు.

 అదేసమయంలో ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కూడా ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులకు పని కల్పించడంతోపాటు, ఇతర విభాగాల యూనిట్లు స్థానికంగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ద్వారా రావాల్సిన అనుమతులను తాను దగ్గరుండి తీసుకురావడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతానని పేర్కొన్నారు. అనంతరం స్థానిక కళాకారులు, కార్మికులు డా.కంచర్ల అచ్యుతరావు ఫెడరేషన్ చైర్మన్ కావడంతోనే సినిమా పరిశ్రమ అభివృద్ధి ప్రారంభమైందని అభివర్ణించారు. అంతకు ముందు డా.కంచర్లను కళాకారులు, గాయకులు, ఫెడరేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్తు ప్రతినిధులు సుధీర్, నాగు, తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-08-24 16:30:48

ఐక్యంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం-గంట్ల

ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ , ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ లు సంయుక్తంగా రాష్ర్టంలో జర్నలిస్టుల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం విశాఖలోని పౌర గ్రంథాల యంలో ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ యూనిట్ కార్యవర్గానికి నూతన సభ్యత్వ కార్డులను శ్రీనుబాబు  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు జర్నలిస్టులకు చేయాల్సిన సంక్షేమం చేస్తాయని , అయితే వాటిపైనే పూర్తి స్థాయిలో ఆధారపడకుండా స్థానిక అసోసియేషన్ లు కూడా సభ్యుల సంక్షేమానికి సేవలందించాలని పిలుపునిచ్చారు. అలాగే సాటి జర్నలి స్టు కష్టనష్టాల్లో కూడా పాలు పంచుకోవాలని సూచించారు. అంతకు మించి ఆరోగ్య భీమా, ప్రమాధ బీమాతో పాటు ప్రభుత్వపరంగా వచ్చే సంక్షేమ పథకాలను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రిడేషన్, అటాక్స్  కమిటీతో పాటు సంక్షేమ కమిటీల్లోనూ యూనియన్లకు ప్రాతినిధ్యం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయణ, కార్యదర్శి జి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ, సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఎప్పటిలాగే వినాయకచవితి, విజయదశమి, పర్వదినాల వేడుకలను ఈ ఏడాది కూడా తమ యూనియన్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రాడ్ కాస్ట్ విశాఖ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్ ల ఆధ్వర్యంలో సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా నూతన సభ్యత్వం స్వీకరించనున్నట్లు వీరు తెలిపారు.  ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మళ్ల దేవ త్రినాధ్, రాజశేఖర్, నాయుడు, అంబటి శేషు, శివ దిలీప్, సురేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.


visakhapatnam

2024-08-23 05:31:25

మెగాస్టార్ జీవిత చరిత్రపై సినిమా నిర్మిస్తా-డా.కంచర్ల

ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సినీ నిర్మాత, ఎస్ఎస్ఎల్ఎస్ అధినేత, టిడిపి సీనియర్ నాయకులు డా.కంచర్ల అచ్యుతరావు గుడ్ న్యూస్ చెప్పారు.  మెగాస్టార్ చిరంజీవి జీవితను బయోపిక్ గా నిర్మిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఉపకార్ ట్రస్టు ఆధ్వర్యంలో విశాఖలో 5రోజుల పాటు చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో డా.చిరంజీవి కళాపరిషత్ ఆధ్వర్యంలో పద్మవిభూషన్ డా.మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం డా.కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, సినీరంగంలో చిన్న చిన్న పాత్రలు పోషించి ఈరోజు భారతదేశం గర్వించే స్థాయి నటుడు అయిన ఘనత ఒక్క చిరంజీవికే దక్కుతుందన్నారు. ఆయన జన్మదిన వేడుకలను విశాఖలోనే పెద్ద ఎత్తున నిర్వహించనున్నామన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అయన ఎన్నో వేల మందికి ప్రాణదానం చేశారన్నారు. ఆయన స్పూర్తితో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు తరపున మరింతగా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. భారతదేశ సినీ ప్రపంచంలో నటులకు, సేవలకు ఆయన మార్గదర్శిగా అభివర్ణించారు. 

మెగా స్టార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. ఆయన ప్రతీ పుట్టిన రోజును ఘనంగా చేసే అవకాశం నాకు రావాలని కోరుకు న్నారు. ఈరోజు జరిగిన ఈ మెగా ఈవెంట్ అభిమానులు చూపించిన ప్రేమ, అభిమానాలు తానెప్పుడూ మరిచిపోనన్నారు. చిరు స్పూర్తితో కళాకారులకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఈ కంచర్ల అచ్యుతరావు ఉంటారనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పిన ఆయన గెంబిలి జగదీష్ అండ్ టీమ్ చేపట్టిన ఈవెంట్ మెగా స్టాండ ర్డ్స్ తోనే ఉందన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ కళాపీఠం బ్రోచర్ ను కంచర్ల ఆవిష్కరించారు.  కార్పోరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీకి చిరంజీవి మెగాస్టార్ అయితే విశాఖకు మాత్రం డా. కంచర్ల అచ్యుతరావు మాత్రమే మెగాస్టార్ అని కొనియాడారు. మంచి మనసుతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ అందరివాడిగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. అనంతరం కళాకారులు, చిరంజీవి అభిమానులు పండుగ వాతావరణంలో డా. కంచర్ల అచ్యుతరావుని ఘనంగా సత్యరించి.. మహరాజా టోపిని అలంకరించి, దుస్సాలు వాను కప్పారు.  సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నిర్విరామంగా చేపట్టిన సాంస్క్రుతి కార్యక్రమాలు ఆహుతలను విశే షం గా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులతోపాటు పెద్ద ఎత్తున చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొ న్నారు.

visakhapatanm

2024-08-17 19:25:40

రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అగ్రిగోల్డ్ భాదితుల సమస్య

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, సకల కళాకారుల సంఘం అధ్యక్షులు, టిడిపి సీనియర్ నాయకులు డా.కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చాలా మంది అగ్రిగోల్డు బాధితులు ఉన్నారని.. వారు కాయ కష్టం చేసుకొని దాచు కున్న డబ్బంతా సంస్థ బోర్డు తిప్పేయడం వలన నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు చాలా చిన్న మోసంగా కనిపించినా వేల కోట్ల రూపాయల అవినీతి ఈ సంస్థ ద్వారా జరిగిందన్నారు. చిన్న చిన్న వ్యక్తుల ద్వారా కట్టించుకున్న రూ.పదివేల ఖాతాలు, రూ.15వేల ఖాతాలు, రూ.50వేల ఖాతాలు లక్షల్లో ఉన్నాయని అన్నారు. అవి కాకుండా డైలీ పద్దుల రూపంలో కట్టించుకున్న ఖాతాల సంఖ్య అసలు లెక్కలోనే లేదన్నారు. ఇలాంటి చిన్న చిన్న ఖాతాల ద్వారా సంస్థలోని బడా బడా పారిశ్రామిక వేత్తలు కోట్లలో లాభ పడ్డారన్నారు. బయటకు చిన్నఖాతాలే కనిపించినా.. వాటన్నింటినీ లెక్కేస్తే వేల కోట్లు మొత్తం తేలుతుందన్నారు.

 అలా నిరుపేద ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేసిన అగ్రీగోల్డ్ సంస్థ బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని చెప్పారు. సంస్థ పేరుతో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. వాటిని తనఖా పెట్టినా.. లేదా అమ్మేసినా భాధితుల అప్పులు తీర్చవచ్చునన్నారు. బాధి తులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొందరికే న్యాయం చేశారన్నారు. ఇంకా చిన్న చిన్న ఖాతాల్లో ఉండిపోయిన మొత్తం చెల్లింపులు జరగ లేదన్నారు. విడతలవారీగా బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఎక్కువశాతం సంస్థ మోసం వలన నష్టపోయిన వారికి ఎక్కడా న్యాయం చేయలేదన్నారు. తక్షణమే అగ్రిగోల్డులో పెట్టుబడి పెట్టినవారు, చిట్టీలు కట్టినవారు, ఖాతాల్లో డబ్బు దాచుకు న్నవా రందరికీ కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఎన్నికల్లో బాధితులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంలు హామీ ఇచ్చారని. వాటిని అమలు చేస్తే ఎందరో నిరుపేదలకు న్యాయం చేసిన వారు అవుతారన్నారు. బాధితులకు అండగా తాను ఉద్యమించి. నష్టపోయిన వారి వివరాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళతానని అన్నారు. 

ఖాతాల్లో డబ్బులు దాచుకున్నవారు, అవి తిరిగి రాకుండా ఉండిపోయిన వారి వివరాలను చాలా వరకూ పోయినట్టు గత ప్రభుత్వం చెప్పడం వెనుక ఏదో మోసం దాగిఉందని కంచర్ల పేర్కొన్నారు. కాగా అగ్రీగోల్డుపై పోలీసులు కేసులు నమోదు అయినా.. ప్రభుత్వం చర్యలు తీసుకుం టామని హెచ్చరించా.. సంస్థలు కట్టించుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడాన్ని ఆసరాగా తీసుకొని.. మరికొన్ని సంస్థలు బోర్డులు తిప్పేయ డానికి కూడా సిద్దంగా ఉన్నాయని.. ఇప్పటికే కట్టినడబ్బులు ఇవ్వమని అడిగితే కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి బాధితులందరికీ న్యాయం జరిగే వరకూ తాను గట్టిగా నిలబడి పోరాటం చేస్తానని డా.కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు.

visakhapatnam

2024-08-16 18:59:39

మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం..డా.కంచర్ల

త్యాగధనుల బలిదానంతో భారతదేశానికి స్వాతంత్ర్య సిద్ధించిందని.. ఆ మహనీయుల ఆశయాలను కొనసాగించాలని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత, సకల కళాకారులు సంఘం అధ్యక్షులు, ప్రముఖ సంఘ సంస్కర్త, టిడిపి నాయకులు డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. గురువారం ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆరిలోవ ప్రాంతంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో మువ్వన్నెల జెండాను ఎగుర వేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చేపట్టారు. విష్ణు స్కూల్స్(మధువాడ), చినగదిలి శ్రీక్రిష్ణ యాదవ యువజన సేవా సంఘం, శివాజీనగర్ సేవా సంఘం, నర్సరీ గార్డెన్స్ 40ఫీట్ బ్లాక్స్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగుర వేశారు. పెద్ద ఎత్తున సేవాల కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన స్వాతంత్ర్య ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. 

ఆ త్యాగధనుల పోరాటాలను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎదుటివారికి సహాయం చేయడం, తమవంతు బాధ్యతగా బావించాలన్నారు. దేశనాయకుల స్పూర్తినే తమ పిల్లల పేరున ఉపకార్ ఛారిటబుల్ ట్రస్తు ఏర్పాటు చేసి ప్రజలకు సేవచేస్తున్నామని అన్నారు.  ప్రపంచ దేశాల్లో మన దేశం ప్రగతిపదాన సాగడం అభినందనీయమన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం పండుగ సంతోషంతో పాటు బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. విద్యార్థుల మంచి చదువుకునే దశనుంచే సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మంచి చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ ప్రాంతంలోని ప్రధాన సమస్యలను తన పరిధిలో పరిష్కరిస్తూ , పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని, వాటిని రానున్న రోజుల్లో మరింతగా పెంచుతామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు.  అనంతరం 300 అడుగుల జెండా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దేశనాయకులు వేషదారణలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

వికలాంగులకు, పిల్లలకు మిఠాయిలు పంపిణి చేశారు.స్కిల్ డెవలెప్ మెంట్ కార్యాలయం వద్ద 300 అడుగుల జాతీయజెండా పదర్శన, భారీ ర్యాలీగా అక్కడి నుంచి పినాకిల్ ఆసుపత్రి గ్రౌండ్ కి చేరుకున్నారు. ఇక్కడే జనసేన మెగా క్రికెట్ టోర్నమెంటులో గెలిచిన వారికి రూ.లక్ష స్పాన్సర్ షిప్ అమౌంట్ బహూకరించారు. విశాఖ తూర్పులో నియోజకవర్గంలో కూచిపూడి కళాకారులకు సన్మానం, స్పాన్సర్ షిప్.. కూచిపూడి కాంపిటిషన్స్ లో పాల్గొన్నవారికి బహుమతు ప్రధానం చేశారు. ఆరిలోవ లో రాఖీ బాక్సింగ్ క్లబ్ నిర్వాహకులకు కిట్ బ్యాగులు, గ్లౌజ్ సెట్ల బహుకరించారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎల్లాజీలతో కలిసి డా.కంచర్ల అచ్యుతరావు  పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు సుధీర్, నాగు, పెద్ద ఎత్తున స్థానికులు, చిరంజీవి అభిమానులు, ఆరిలోవ ప్రాంతవాసులు, ట్రస్టు ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

visakhapatnam

2024-08-16 13:05:36

మనమనంతా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొందాం

 ప్రతి ఇంటిపై ప్రతి పౌరుడు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని , భారత స్వాతంత్ర్య సంబరాలకు స్ఫూర్తిని కలిగించాలని జీవీఎంసీ కమిష నర్ పి.సంపత్ కుమార్ విశాఖ నగర ప్రజలకు పిలుపునిచ్చారు.  ఆదివారం  తన క్యాంపు కార్యాలయంలో ఆయన భారత త్రివర్ణ పతా కాన్ని చే తబట్టి విశాఖ నగర ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,  2024 ఆగస్టు 15   భారత స్వాతంత్ర్య దినోత్సవం సం దర్భంగా భారతదేశమంతా ఆగస్టు 9 వ తేదీ నుండి 15  వరకు హర్ ఘర్ తిరంగా   కార్యక్రమం నిర్వహిస్తుందని, విశాఖ నగర ప్రజలం దరూ, జీవీఎంసీ యంత్రాంగం అంతా ప్రతి  ఇంటిపైన భారత త్రివర్ణ పతాకం ఎగురవేస్తూ సెల్ఫీ ఫోటో తీసుకొని హర్ ఘర్ తిరంగా  కార్యక్ర మం లో పాల్గొని  https://harghartiranga.com/ వెబ్సైట్లో నమోదు చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. భారత స్వాతంత్ర్య సంబరాలకు స్వా గతం పలుకుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రతి పౌరుడు పాల్గొంటూ స్ఫూర్తిని కలిగించాలని కోరారు.  ఆదివారం కమిషనర్ తన క్యాంపు కార్యాలయంలో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబట్టివిశాఖ నగర ప్రజలందరికీ పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.

visakhapatnam

2024-08-11 16:35:54

పర్యాటకశాఖ ద్వారా చేనేత అద్దకం కళలకు ప్రాచుర్యం

చేనేత వస్త్రాలపై అద్దకం( హేండ్ మేడ్ ప్రింటింగ్) చేసే వస్త్రాలను ప్రోత్సహించేందుకు పర్యాటకశాఖ ద్వారా చర్యలు తీసుకుంటామని  జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జ్ఞానవేణి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విశాఖలోని శంభువానిపాలెంలోని హేండూలమ్ హేండ్ మేకింగ్ ప్రింటింగ్ కుటీర పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అద్దకం కళాకారులతో ముచ్చటించారు. ఇక్కడ చేనేత వస్త్రాలు, ఇతర మోడల్స్ డ్రెస్సులపై ఎంతో చక్కగా ప్రింటింగ్(అద్దకం) వేస్తున్నారని ఆమె కితాబు నిచ్చారు. ఇక్కడ కళాకారులు పనితనాన్ని పర్యాటకశాఖ వెబ్ సైట్ ద్వారా ప్రాచుర్యం కల్పించడంతో పాటు వారికి పనికల్పించే విధంగా తమవంతు కృషి చేస్తామని.. అదేవిధంగా ఇక్కడి కళాకారులన వృత్తి నైపుణ్యాన్ని కూడా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు చెప్పారు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలతో పర్యాటశాఖలో వివిధ కార్యక్రమాలు, టూర్ ప్యాకేజీలు రూపకల్పన చేస్తున్నామని.. ఈ నేపథ్యంలోనే ఇక్కడి కళాకారుల నైపుణ్యం.. వస్త్రాలపై వేస్తున్న వివిధ రకాల ఆకృతుల ప్రింటింగ్ పైనా ప్రచారం కల్పించి ఇక్కడ కార్మికులను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

అంతేకాకుండా విశాఖ మహానగరంలోని బట్టల దుఖాణాలు, మగ్గం వర్క్స్ చేసే టైలరింగ్ షాపులు, ఇతర షాపింగ్ మాల్స్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ పనిచేస్తున్న చేనేత ముద్రిక కళాకారులకు చేయూత అందించి పని కల్పించాలని జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జ్ఞానవేణి కోరారు. సుమారు పది కుటుంబాలకు చెందిన కళాకారులకు డిఎఫ్ఓ విశాఖలోని బయోడైవర్శిటీ పార్కులో  ప్రత్యేకించి వన సంపద కేంద్రాన్ని కూడా వీరికి కేటాయించి చేయూత అందిస్తున్నారని చెప్పారు. అన్నివర్గాల ప్రజలు అద్దకం కళాకారులకు చేయూత నివ్వడం ద్వారా ఈ కళను మరింతగా ప్రోత్సహించడానికి  అవకాశం వుంటుందని తద్వారా కళాకారులు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా పర్యాటకశాఖ అధికారిణితోపాటుగా ప్రమోటర్ గందం సునీత తదితరులు పాల్గొన్నారు.

visakhapatnam

2024-08-07 15:43:57