విశాఖజిల్లాలో అధిక వర్షాల నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా తెలియజేసేందకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాండవ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఆయన గురువారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరదల నేపథ్యంలో ఇన్ఫ్లో కొనసాగుతోందన్నారు. దీని గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం 379.1 అడుగులకు చేరిందన్నారు. దీనివల్ల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దీంతో పాటు నీటిని విడుదల చేసే సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అధికారులను ఆదేశించామన్నారు.
పాడేరు మండలంలోని గుత్తులపుట్టు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి కుముడుపల్లి రహదారిని పూర్తిగా తారురోడ్డుగా మారుస్తామని ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల ప్రకటించారు. "అధ్వాన్నంగా కోడాపల్లి ,కుముడుపల్లి, గోమంగి రహదారి " బుధవారం మీడియాలో ప్రచురితమైన వార్తపై స్పందించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ క్లిప్పింగ్లను పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులకు పంపించి తగిన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పన్నెండు గంటల వ్యవధిలోనే రూ.2లక్షలతో మరమ్మతులు చేసి రవాణాకు అనుకూలంగా తీర్చి దిద్ది రవాణాకు అనువుగా రోడ్డును అభివృద్ధి చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పిఓ చెప్పారు. పనుల పురోగతి, తాజా పరిస్థితి తెలియజేయాలని ఆదేశించడంతో మరమ్మత్తు పనులను ఈఈ కుసుమభాస్కర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఒడిసా ఉత్తర ప్రాంతం వద్ద కేంద్రీకృతమైందని వాతారవరణ శాఖ తెలియజేసింది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న వాతావరణశాఖ వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వీటి కారణంగా గురు, శుక్రవారాల్లోనూ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖ నుంచి ప్రకాశం జిల్లా వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రోంలో ఆటుపోట్లు అధికంగా వుంటాయని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడాదని కూడా హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రభుత్వం ముందస్తుగా అన్ని కలెక్టరేట్లు, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది...
విశాఖ మన్యంలో కరోనా సోమవారం కొత్తగా 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కె లీలాప్రసాద్ చెప్పారు. దీంతో మొత్తంగా కరోనా పాజిటివ్ ల సంఖ్య 528 కి చేరిందన్నారు. కాగా 258 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. గెన్నెల పిహెచ్సీ పరిదిలో 7, కిలగాడ పీహెచ్సీలో1, హుకుంపేటలో 2, మినుమూలు పీహెచ్సీలో 2, లోతుగెడ్డ పీహెచ్సీలో 5, ఆర్వీనగర్ పీహెచ్సీలో 6 కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసు ఉద్రుతి ఏజెన్సీ ప్రాంతలోనూ అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా బయటకు రాకూడదన్నారు. మాస్కులు విధిగా ధరించాలని, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే దగ్గర్లోని పీహెచ్సీలోని ఆరోగ్య సిబ్బందికి, లేదా గ్రామసచివాలయాల్లోని వాలంటీర్లకు తెలియజేసి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
జర్నలిస్టులు కరోనా సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన జాగ్రత్తలు పాటిస్తూ తమవిధులు నిర్వహించాలని గొలుగొండ తహశీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ డేవిడ్రాజు, ఎస్.నారాయణరావులు సూచించారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని గొలుగొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గొలుగొండ. క్రిష్ణదేవిపేట ప్రాంతాలకు చెందిన విలేకరులు ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ , ఎంపీడీవో, ఎస్ఐలు ఆవిర్భావ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సింగంపల్లి చిన్నయ్యనాయుడు మాట్లాడుతూ, జర్నలిస్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వారియర్స్ గా గుర్తించాలన్నారు. ఎవరైనా కరోనా వైరస్ తో మ్రుతి చెందితే తక్షణమే రూ.50 లక్షల భీమా వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు .పి సత్యనారాయణలు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు.ఎస్ నానాజీ, జిల్లా కార్యవర్గ సభ్యుడు జె.నరసింహమూర్తీ , ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు ఆర్ .బాబులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఏజన్సీలో గద వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కనీసం ఒక్క గంటపాటు కూడా విరామంలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. కరోనా వైరస్ ప్రభావంతో నిర్మానుష్యంగా మారిన బహిరంగప్రదేశాలు ఇప్పుడు ఎడతెరిపిలేని వర్షాలతో మరింత బోసిపోయి కనబడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో గతమూడు రోజులుగా వర్షాలు మరింత ఎక్కువయ్యాయి. రోజుకు సుమారు 11సెంమీ.. నుండి 12సెంమీల వరకూ వర్షం నమోదు అవుతుంది. ఈ వర్షాల ప్రభావతో వ్యాపారాలు లేక వ్యాపారులు విచారం వ్యక్తం చేస్తుండగా, వ్యవసాయ పనులు కూడా సక్రమంగా సాగడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని రేవడివీధి గ్రామానికి నిర్మించిన గ్రావెల్రోడ్డు పూర్తిగా దమ్ముపట్టిన పొలంగా మారిపోగా, మంప-కించవానిపాలెం మద్య నిర్మాణంలో ఉన్న వంతెన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆదివారమైతే కించవానిలెం కాలువ నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రజలు రేవళ్ల మీదుగా మండలకేంద్రానికి చేరుకంుటున్నారు. కాలువలు పొంగిప్రవహిస్తున్నాయి. యు.చీడిపాలెం పంచాయితీ పలకజీడి మార్యంలోని బండిగెడ్డవద్ద రోడ్డుపైనుండి కాలువ ప్రవహించడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడి వినియోగదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
’కరోనా మహమ్మారి..మా గ్రామం నుంచి విడిచిపోమరి’ అని వేడుకొంటూ ఆదివారం మండలంలోని శరభన్నపాలెం గ్రామస్థులు గ్రామదేవతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామంలో ఇటీవల వరసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆందోళనకు గురైన గ్రామస్థులు, ఊరిపొలిమేరవద్ద ఉన్న గ్రామదేవతకు పసుపునీటిని వారధిగాపోసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా వైరస్ గిరిజన గ్రామాల్లో ప్రబలడం వలన, తెలిసీ తెలియని వారు ఈ రోగం భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ను గ్రామం నుంచి పారద్రోలి,మరలా రాకుండా నిరోధించాలని గ్రామదేవతను వేడుకొన్నారు. అంతేకాకుండా తమ గిరిజన గ్రామాలపై ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని శరభన్నపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. కార్యక్రమంలో పెద్దలు దారకొండ నారాయణమూర్తి, ఎన్.జానకిరావు, పండాసత్తిబాబు, సాతాసత్యనారాయణ, ఎస్.జోగిరాజు, ఎల్.శివప్రసాద్, ఎల్విఎస్గాంధీ, ఎన్.చంద్రశేఖర్, బి.శ్రీధర్ అలాగే అల్లూరియూత్సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఏజెన్సీలో గెడ్డ పాయలకు వంతెనలు లేకపోవడంతో భారీ వర్షాల సమయంలో అనే గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. పాడేరు ఐటిడిఏ పరిధిలోని పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామ పంచాయతీ గేదెగెడ్డ వద్ద ఇలాంటి పరిస్థితే నెలకొంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో గేదెగెడ్డ నీరు పూర్తిగా రోడ్డుపైకి వచ్చేస్తుంది. కారణంగా రాకపోకలు చేసేవారంతా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరద ఉద్రుతికి ఎక్కడ కొట్టుకుపోతామనే భయంతో గెడ్డకు ఇవతల ఒడ్డునే ఉండిపోతున్నారు. ఈ ప్రాంతంలో వంతెన దగ్గర వర్షపు నీరు అధికంగా వస్తే సుమారు 20 గ్రామాలకు పైనే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయ్. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని గిరిజనులు ముక్త కంఠంతో కోరుతున్నారు.
మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించాలని సామాజిక కార్యకర్త సోమిరెడ్డి రాజు ఆకాంక్షించారు. యస్.రాయవరం గ్రామంలో పంచాయితీ పక్కన ఉన్న మీసేవ(నెట్ సెంటర్) ని గురజాడ సెంటర్, రాము టిఫిన్ షాప్ ఎదురుగా మార్చారు. నూతన నెట్ సెంటర్ ని రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని కార్యకలాపాలు నెట్ లేనిదే జరగడం లేదన్నారు. అలాంటి సమయంలో ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా వారికి సహాయం చేసినట్టు వుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కందుల నాగేశ్వరావు, అధికంశెట్టి జగన్నాధరావు, బత్తుల వాసు, దండు గణపతిరాజు, దుబాసి రమేష్, గాలి దివానం , మురుకుర్తి గణేష్, సిలపరశెట్టి క్రిష్ణ, తాడేల సంతోష్, తదితరులు పాల్టొన్నారు.
గ్రామాల సర్వతోఖాభివ్రుద్ధి సాధించాలంటే ప్రతీ ఒక్కరూ తనువంతుగా సహకారం అందంచాలని ఎంపిడిఓ ఎం.అరుణశ్రీ అన్నారు. శనివారం మండలం కేంద్రం మాకవరపాలెం సచివాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవవేడులు ఘనగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు రుత్తల శ్రీనివాసు, రుత్తల సర్వం అధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సచివాలయ ప్రత్యేకాధికారి ఎంపిడిఓ అరుణశ్రీ తహశీల్ధార్ రాణిఅమ్మాజీ ముఖ్యఅతిధిలుగా పాల్గోన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసి జాతీయ జెండాను ఎంపిడిఎ అరుణశ్రీ అవిష్కరించారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ, ఎందరో మహాను భావుల త్యాగఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. రెవిన్యూ కార్యాలయంలో తహశీల్థార్ రాణి అమ్మాజీ మండల పరిషత్లో ఎంపిడిఓ అరుణశ్రీ పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అయా అధికారులు త్రివర్ణపతకాలు ఎగురవేసారు. మాకవరపాలెం కార్యక్రమంలో డి.టి.చైనులు గ్రామరెవిన్యూ అధికారి కన్నయ్య పంచాయితీ కార్యదర్శి ఎల్.శివరామ్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం వేడుకగా జరిగాయి. సబ్కలెక్టర్ కార్యాలయంలో సబ్కలెక్టర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన నారపురెడ్డి మౌర్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ మౌర్య మాట్లాడుతూ, ఈ వేడుకులకు హాజరైన అదంరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటిసారిగా నర్సీపట్నంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం చాలా ఆనందంగా వుందన్నారు. మనమందరం స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో నర్సీపట్నం డివిజన్ను మరింతగా అభివృద్ధి చేయడానికి కరిషి చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నాడు దేశం కోసం పోరాడిన త్యాగధనుల సేవలను కొనియాడారు. స్వాతంత్య్ర ఫలాలను భావితరాలకు అందించిన వారిని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది.
కేంద్ర,రాష్టప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను గ్రామస్థాయిలో ఎండగట్టాలని సిపిఎంశాఖ కార్యదర్శులు, సభ్యులు ప్రతినబూనారు. సిపిఎం రాష్ట్రకమిటీ ఆదేశాలమేరకు శనివారం మండలంలోని డౌనూరు పంచాయితీ ముళ్లిమెట్ట, నిమ్మలపాలెం, మూలపేట పంచాయితీ జాజులబంద గ్రామాల్లో సిపిఎం శాఖ సమావేశాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వాలు సామాన్యుడిని ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ముళ్లిమెట్టలో పి.బాలరాజు, సీతారామయ్య, జయశంకర్, ఆర్బికరిష్ణ, బాలరాజు, చంద్రబాబు, నిమ్మలపాలెంలో జి.సాన, సోమయ్య, రాజు, సిద్ధు, జాజులబందలో కె.చిట్టిబాబు, రంగన్న, కరిష్ణ, మర్రివెంకటరావు, జి.సతీష్ పాల్గొన్నారు.
గొలుగొండ మండలం ఎఎల్పురంలో మరో కరోనా కేసు నమెదైయ్యింది. మధ్యప్రదేశ్ నుండి ఎఎల్పురం బిసి కాలనీ వచ్చిన వ్వక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని డాక్టర్ ప్రణతి తెలిపారు. ఇప్పటికే గ్రామంలో 2 కేసులు నమెదుకాగ దీంతో 3 కేసులుకు చేరాయి. పాజిటివ్ వ్యక్తిని తక్షణమే నర్సీపట్నం ఏరియీ అసుపత్రికి అంబులెన్సులో తరలించారు. ఈయన ప్రైమరరీ, సెకండరీ కాంటాక్ట్ లకు పరీక్షలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పనులకు తప్పా ఎవరూ బయటకు రాకూడదన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు దరించి తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలన్నారు.
పాడేరు పీహెచ్సీ పరిధిలోని కరోనా లక్షణాలతో ఉన్న రోగులకు ప్రతి సోమవారం, గురువారం , శనివారం సంజీవిని వాహినం ద్వార జి.యం.ఆర్ పాలిటెక్నిక్ పాడేరు గ్రౌండ్ వద్ద కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కే లీలప్రసాద్ తెలియజేశారు. ఈ పరీక్షలను నోడల్ అధికారి డా. ప్రవీణ్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. పాడేరు డివిజన్ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున ముందస్తుగా కరోనా నిర్ధారణకాబడిన రోగుల ప్రధమ కాంటాక్ట్స్, సెకండరి కాంటాక్ట్స్, కరోనా సింటోమేటిక్ కాంటాక్ట్స్ గలవారికి కరోనా నిర్ధారణ కిట్ల లభ్యతను అనుసరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. ఈ కార్యాక్రమంలో కోవిడ్ కేర్ సెంటర్ వై.టి.సి పాడేరు నోడల్ అధికారి డా. ప్రవీణ్ వర్మ తదితరులు పాల్గున్నారు.
గాజువాక జివిఎంసి 76 వ వార్డ్ పెదగంట్యాడ చిన్ననడుపూరు గ్రామంలో ఈ రోజు శ్రీ కృష్ణ జనమ్మాస్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవంశీ కృష్ణ యూత్, కార్పోరేటర్ అభ్యర్ధి దొడ్డి రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వై ఎస్ ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, సకలచరాచర జీవరాసులకు రక్షకుడు శ్రీ క్రిష్ణ భగవానుడేనన్నారు. దొడ్డి రమణ మాట్లాడుతూ, వార్డు ప్రజలంతా కరోనా నుంచి రక్షింపబడాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మార్డ్ పూడి పరదేశి, నక్క వెంకట రమణ,తాటికొండ అచ్చుత్, ప్రసాద్,డి.వెంకి,శేఖర్,మధు,రమేష్,బి ఎస్ఎఫ్ సాద్,శ్రవణ్,వంశి,శివరాం,శివ,అండిబోయిన సన్నీ,ప్రసాద్,గురుమూర్తి,బాబురావు,వార చైతన్య తదితరులు పాల్గొన్నారు.