1 ENS Live Breaking News

సచివాలయ నిర్మాణాలు సత్వరం పూర్తికావాలి..

ఏజెన్సీలోని గ్రామసచివాలయ భవన నిర్మాణాలు సత్వరం పూర్తిచేయాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల అధికారులను ఆదేశించారు. హుకుం పేటలో పీఓ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా బాకూరు గ్రామంలో జరుగుతున్న భూ సర్వే,పనులు పరిశీలించారు. సర్వే వేగంగాపూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ బాలురు, బాలికల ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు తనిఖీ చేశారు. రూ.18 లక్షలతో ఎం పిపి పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులు తనిఖీ చేశారు. పటిష్టమైన నాణ్యతలు పాటించాలన్నారు. 82 కుటుంబాలను సర్వే చేశామని రెవిన్యూ  అధికారులు వివరించారు. గ్రామసభ తీర్మాణాలపై ఆరాతీశారు.సుండ్రుపుట్టు గ్రామం రైతు డూరు ఈశ్వరరావు పొలంలో ఐటీడీఏ సహాయంతో వేసిన జామ తోట,మొదమాంబ స్వయం సహాయక సంఘానికి ఇచ్చిన  సోలార్ పంపుసెట్ ను పరిశీలించారు. పంపుసెట్ పనితీరు గురించి, సరఫరా చేస్తున్న నీటి సామర్ధ్యం పై ఆడిగితెలుసుకున్నారు. దిగుడుపుట్టు గ్రామంలో పౌల్ట్రీ ని  రూ.2.80లక్షల వ్యయం తో నిర్మిస్తున్న సోలార్ తాగునీటి పధకం పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేసి వినియోగం లోకి తీసుకురావాలని వెలుగు అధికారులను ఆదేశించారు.  గెడ్డంగి నారాయనమ్మ నాటు కోళ్ల పెంపకాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామంలో 5గురికి కోళ్లు  పంపిణీ చేయాలని వెలుగు అధికారులను ఆదేశించారు. పౌల్ట్రీ పై  వస్తున్న ఆదాయ వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. రూ.42 లక్షలతో నిర్మిస్తున్న  సూకూరు  గ్రామ సచివాలయం నిర్మాణపు పనులు, గిరిజన సంక్షేమ బాలుర  ఆశ్రమ పాఠశాలలో రూ.42.69లక్షలతో చేపట్టిన మనబడి నాడు పనులు తనిఖీ చేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.  భీమవరం గ్రామంలో  గ్రామ సచివాలయం,రైతు భోరోసా కేంద్రం పనులు తనిఖీ చేశారు.గ్రామంలో తాగునీటి సదుపాయాలు, మొబైల్ టవర్ నిర్మించాలని గ్రామస్థులు కోరగా పి ఓ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ జి.మురళి, వెలుగు ఎపిడి ఎం.నాగేశ్వరరావు, తహసీల్దార్ వై.వి కోటేశ్వరరావు, ఎంపిడివో ఇమ్మనియేలు, ఏ ఈ దేముళ్లు, డిపి ఎం సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Hukumpeta

2020-09-22 19:03:50

మండలంలో 2 పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి..

విశాఖ ఏజెన్సీలో ఇంజనీర్లు వినూత్నంగా ఆలోచించి మనబడి నాడు నేడు లో మండలానికి రెండు పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. సోమవారం రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎం.పి.డి. ఓలు, ఉపాధిహామీ, వెలుగు అధికారులతో వారాంతపు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మనబడి నాడు నేడు పనులు నత్తనడకన జరుగుతున్నా యని పనులు వేగం పెంచాలని ఆదేశించారు. నాడు నేడు పనులకు రివైజ్డ్ అంచనాలు వేసి మండలానికి రెండు పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేసారు. సోమవారం నాటికి నాడు నేడులో రూ.74.55 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.55 కోట్లు ఖర్చు చేసారని అన్నారు. అటవీ హక్కులపై గ్రామ సభ తీర్మానాలు త్వరగా పూర్తి చేయాలిన చెప్పారు. ఈనెల 23 వతేదీన ఆర్ ఓ ఎఫ్ పట్టాలపై సబ్ డివిజినల్ స్దాయి సమావేశం నిర్వహించి 24, లేదా 25 తేదీలలో జిల్లా స్దాయి కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈలోగా జి పి ఎస్ సర్వే పూర్తి చేసి సరిహద్దురాళ్లు నాటించే పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం అనుసంధానంతో చేపట్టిన రైతు భరోసా, గ్రామ సచివాలయ నిర్మాణాల పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. సిమ్మెంటు, ఇసుక,నిర్మాణ సామగ్రి కొరతలేదని నిర్దిష్ట సమయానికి జరగవలసిన పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. 228 ప్రహరీ గోడలపనులకు 8 మాత్రమే పూర్తి చేసారని అన్నారు. మండలంలోని కమ్యూనిటీ సమన్వయ కర్తలు సామాజిక పెట్టు బడి నిధి నెలకు రూ.50 వేలు రికవరీ చేయాలని వెలుగు అధికారులకు సూచించారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని అన్నారు. ఉపాధిహామీ పధకంపై సమీక్షిస్తూ ముంచింగ్ పుట్టు, పెదబయలు, జి.కె. వీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాలో జరిగిన ఉపాధిహామీ పనులపై సామాజిక తనిఖీలు చేయించాలని చెప్పారు. ఉపాధికూలీల సంఖ్య తగ్గిందని పెంచాలని చెప్పారు. ఎపి ఓలు ఉపాధిహామీ పనులపై ప్రత్యేక శ్రద్ద వహించి పనులు చేయాలన్నారు. కాఫీ పిట్టింగ్, ప్లాంటేషన్‌పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి మాట్లాడుతూ రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వెంటనే రైస్ కార్డు లబ్దిదారులకు అందించాలని చెప్పారు. ప్రతీ డి ఆర్ డిపో వద్ద ఇద్దరు వాలంటీర్ల ను నియమించి నవశకంలో పెండింగ్‌లో ఉన్న రైస్ కార్డులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ రిపోర్టులలో ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ కె. వి. ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇలు ఆర్.కె. భాస్కర్, పి ఐ యు ఇ ఇ శ్రీనివాసరావు, వెలుగు ఎపిడి నాగేశ్వరరావు, ఎస్ ఎం ఐ డి ఇ రాజేశ్వరరావు, ఉపాధిహామీ ఎపిడి సి.హెచ్.లచ్చన్న ,కాఫీ ఎడి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2020-09-21 20:36:17

స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి...

స్పందనలో వచ్చిన వినతులను పరిశీలించి  సమస్యల సత్వరం పరిష్కారించేందుకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు.  సోమవా రం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు 32 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అధికంగా భూ సంబంధిత సమస్యలు,రేషన్ కార్డ్ లు, పింఛన్లు తదితరాలపై వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా  సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం కోవిడ్ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలను పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశించారు.సబ్ కలెక్టర్ కార్యాలయం లో వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక ఫిర్యాదుల బాక్స్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రజలకు ఏ సమస్య వున్న ఆ ఫిర్యాదు బాక్సులో దరఖాస్తులు వేయవచ్చునన్నారు.  వాటన్నిటినీ పరిశీలించి నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ మౌర్య తెలియజేశారు.

Narsipatnam

2020-09-21 15:59:24

నర్సీపట్నం డివిజన్ లో సచివాలయ పరీక్షలు ప్రశాంతం..

నర్సీపట్నం డివిజన్ పరిధిలో గ్రామ ,వార్డు సచివాలయ పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య  పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. పరీక్షాకేంద్రాలలో పరీక్షల నిర్వహణ తీరు, వసతుల ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్లు కోవిడ్ నిబంధనలను  అమలు చేస్తున్నది, లేనిది పరిశీలించారు.అభ్యర్థులకు తప్పని సరిగా ధర్మల్ స్క్రీనింగ్  చేయడం , మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టారా అని ఆరా తీశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసొలేషన్ గదులను పరిశీలించారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా  పరీక్షలను సజావుగా నిర్వహించాలని సంబంధిత సెంటర్ అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా మంచినీరు, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.

Narsipatnam

2020-09-20 17:10:01

గొల్ల అవమానంపై మాజీఎమ్మెల్యే అనిత మౌనం సబబుకాదు

విశాఖజిల్లా పాయకరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపి అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొలిశెట్టి గోవింద్ విషయంలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పందించకపోవడంపై దళిత సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఒక దళితుడిని అగ్ర వర్ణాలకు చెందిన ఎస్.రాయవరం మాజీ ఎంపీటీసి బొలిశెట్టి కార్యకర్తల సమావేశంలో తీవ్రంగా మాట్లాడటంపై జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు గొల్లు మన్నాయి. కానీ నియోజవకర్గంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం, అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనే కనీస ప్రోటో కాల్ పాటించకపోవడం పైనా నేటి వరకూ పెదవి విప్పక పోవడంపై ఎస్.రాయవరం టిడిపినేత తొడాల సంతోష్ కూడా తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు. డా.బీఆర్ అంబేత్కర్ వారసులుగా ఒక దళితుడుకి జరిగిన అవమానంపై సాటి దళితుడు, మాజీ ఎమ్మెల్యే ఖండించాలని, ఇన్నిరోజులు జరుగుతున్నా, నోరుమెదకపోవడం దళితుల్లోనే ఐకమత్యాన్ని దెబ్బతీయడమేనని  సంకేతాన్ని పంపినట్టేనన్నారు. ఎక్కడో మారు మూల గ్రామాల్లో సైతం దళితులకు అవమానం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా స్పందించే దళితులు, ఎమ్మెల్యే గొల్లబాబూరావుపై ఇష్టానుసారంగా మాట్లాడిన బొలిశెట్టి వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం వుందన్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల ఐఖ్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు, జిల్లా దళిత సమాఖ్య నాయకులు పుచ్చా విజయ్ కుమార్ లు ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను మీడియా ముఖంగా ఖండించారనే విషయాన్ని సంతోష్ స్థానిక మీడియాకి ఆదివారం వివరించారు. ఇదే పద్దతి కొనసాగితే రానున్న రోజుల్లో దళితులకి అన్యాయం జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే మాజీ ఎమ్మెల్యే అనిత ఎమ్మెల్యే గొల్లబాబూరావుకి జరిగిన అవమాన విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి వుందని డిమాండ్ చేశారు.

S Rayavaram

2020-09-20 11:11:15

సచివాలయ పరీక్షలు విజయవంతం చేయాలి..

గ్రామ , వార్డు సచివాలయ రాత పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకొని ప్రశాంతంగా , పారదర్శకంగా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రెండు పూట్ల నిర్వహించనున్న సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం డివిజన్ పరిధిలోగల సెంటర్ స్పెషల్ ఆఫీసర్లు , సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాత పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి మాస్క్ ధరించడం, శానిటైజర్ తప్పనిసరి అన్నారు.  కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు రాత పరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ప్రత్యేక ఐసోలేషన్ రూము ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి రెండు గంటలు ముందుగా చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించ రాదన్నారు. హాల్ టికెట్ తో పాటు , ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగుల కొరకు ప్రత్యేక ర్యాంపు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్నారు.  అనంతరం సబ్ కలెక్టర్ నర్సీపట్నం వేములపూడి ఏపీ మోడల్ స్కూల్, పాయకరావుపేట క్లస్టర్ , నక్కపల్లి లలో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.

Narsipatnam

2020-09-19 18:44:17

శ్రావ్య బయోటెక్ తో విషవాయువుల నరకం..

గ్రామం మధ్యలోనే రసాయనాల కర్మాగారం...ప్రతినిత్యం వ్యర్ధ రసాయానాలతో భూములు, చెరువులు కలుషితం...చుట్టుప్రక్కల ప్రజలకు వాటి నుంచి వచ్చే విషవా యులతో అనారోగ్యం...ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు ఆ రసాయన కర్మాగరం విషయంలో నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరం మండలం, యస్.రాయవరం గ్రామంలో పాత సినిమాహాలు వెనుక సర్వే నెంబర్ 105బై1బి, గవరవీధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా శ్రావ్య బయోటెక్ అనే రసానాయన కర్మాగారం నిర్వహిస్తున్నారని సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు మీడియాకి వివరించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,  ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఎటువంటి అనుమతులు లేకుండా శ్రావ్య బయోటెక్ అనే రసాయనాల మందులు తయారు చేసే కర్మాగారాన్ని గ్రామ మధ్యలో ఏర్పాటు చేశారని చెప్పారు. దీనివలన గ్రామప్రజలకు శ్వాసకోశ వ్యాధులతోపాటు, చర్మరోగాలు వస్తున్నాయని వివరించారు. ఈ కర్మాగారం ద్వారా బయటకు వచ్చే రసాయన వ్యర్ధాలతో చెరువులు, కాలువలు, కలుషితం అవుతున్నాయని, బొర్లులలో మంచినీరు రషాయనాల వాసన వచ్చి త్రాగడానికి వీలులేకుండా వుందని చెప్పారు. ఈ విషయమై అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ బయోటెక్ రసాయనాలు, వాయువులతో ప్రాణాలతో చాలగాట మారుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఇలాంటి అనధికార విషపూరిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ కంపెనీ యస్.రాయవరం మండలం వైస్సార్ పార్టీ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు తమ్ముడు, భీమరశెట్టి యుగంధర్ భార్య బీమరశెట్టి రజని ప్రొప్రైటర్ గా ఉన్నారనే వివరాలను రాజు మీడియాకి వెల్లడించారు. కాలుష్య నియంత్రణ అధికారులు వచ్చి తనిఖీలు చేస్తే, ఈ కర్మాగారం ద్వారా ఏ తరహా విషవాయువులు వస్తున్నాయో తెలుస్తుందన్నారు. ఈ రసాయన కర్మాగారంపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

s.rayavaram

2020-09-19 13:22:49

ఆ పాఠశాల నాడు-నేడు పనుల సిమ్మెంట్ అమ్మేస్తున్నారు..

నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపుమాట ఎలావున్నా...అక్రమార్కులకు మాత్రం మంచి కాసుల వర్షం కురుస్తుంది. యధేచ్చగా నిర్మాణాలకు ప్రభు త్వ సొమ్ముతో కొనుగోలు చేసిన సామాగ్రిని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణాలు చేపట్టేవారు దైర్యంగా తమకి ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకుంటున్నారు. అలాంటి వ్యవహారం జరిగే పాఠశాల వివరాలు తెలుసుకుంటే... విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరం మండలంలోని పెద్దఉప్పలం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠ శాలకు ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పథకం పనులకు ప్రభుత్వం మంజూరు చేసిన సిమ్మెంటు బస్తాలను స్థానిక సిమ్మెంట్ దుఖాణం యజమా ని కోశెట్టి రాము ద్వారా, ఇంజనీరింగ్ అధికారులు బయట వ్యక్తులకు అమ్మాకలు చేస్తున్నారని సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాము చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రాంకో 43 గ్రేడ్ సిమెంట్ బస్తాలను బయట వ్యక్తులుకు అమ్ముతుండగా ఆ వ్యక్తి ద్వారా తెలుసుకున్న వివరాలను వీడియో రికార్డింగ్ కూడా చేసినట్టు ఆయన తెలిపారు. పాఠశాల పనులు పర్యవేక్షణ చేస్తున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులే ఇలాంటి వ్యవహారాలు చేపట్టడంపై రాజు అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుంగా సంబంధిత అధికారులపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంతో మంచి లక్ష్యంతో చేపట్టే కార్యక్రమాలకు వచ్చిన సిమ్మెంటు, ఇసుక, చిప్స్ ఇలా తమ అవసరాలు అమ్మేసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ఆయనచెప్పారు. పైగా ఈ విషయం పై మండల విద్యాశాఖ అధికారి ఎ.ఎన్.ఎస్.ఎ.ఎన్. మూర్తి వివరణ కోరగా, స్కూల్ ప్రహరీగోడ నిర్మాణం పంచాయతీ అధికారులు ఎం.ఎన్. ఆర్.ఇ.జి.ఎస్. పథకంలో చేపడుతున్నారని చెప్పారు. అయితే నాడు-నేడు పథకం పనుల్లో సిమెంట్ కాదని వివరణ ఇచ్చారు. కానీ ఈవిషయంపైనా, సిమ్మెంటు బస్తాలు కొనుగోలు చేసిన వ్యక్తి చెప్పిన వీడియో రికార్డింగులపై మరింతలోతా దర్యాప్తుచేస్తే ఇంటిదొంగలు బటయపడే అవకాశం లేకపోలేదు. అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

పెద ఉప్పలం

2020-09-18 20:48:17

లాభదాయక ఉద్యాన పంటలకు ప్రతిపాదనలు..

విశాఖ ఏజెన్సీలో గిరిజనరైతులకు లాభదాయకమైన వ్యవసాయ, ఉద్యానవన పంటలు సాగుచేయడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల స్పష్టమెనౖ ఆదేశాలు జారీ చేసారు. అధిక దిగుబడులు వచ్చి , మార్కెట్‌లో మంచి గిరాకి ఉన్న అవకాడో, లిచ్చిస్ , పైనా పిల్ మొక్కలు సరఫరా చేస్తామన్నారు. అదే విధంగా వ్యవసాయ ఆయిల్ ఇంజన్లు, పిచికారీ యంత్రాలు, తార్పాలిన్లు వంటి వ్యవసాయ ఉపకరణాలు రైతులకు ట్రైకార్ పధకంలో మంజూరు చేస్తామని చెప్పారు. శుక్రవారం ఐటిడి ఏ కార్యాలయపు సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ , ఉద్యాన వనశాఖ, పశుసంవర్దక శాఖల అధికారులతో ట్రైకార్ పధకాల అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి కొంత మంది రైతులను ఎంపిక చేసి ఏజెన్సీ వాతావరణానికి అనుకూలమై ఉద్యాన మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు. రైతులకు ఎటువంటి పండ్లమొక్కలు సరఫరా చేస్తే ఉపయోగకంగా ఉంటాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఐటిడి ఏ సహాయ ప్రాజెక్టు అధికారి వి ఎస్ ప్రభాకరరావు, ప్రాజెక్టు ఉద్యాన వన అధికారి జి. ప్రభాకరరావు, కాఫీ సహాయ సంచాలకులు వి.రాధాకృష్ణ , వ్యవసాయశాఖ సహాయ సంచాలకలు రత్నకుమారి , ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు శైలజ, ఎపి ఎం ఐ పి ఎపిడి రహీమ్ ,పశుసంవర్దకశాఖ సహాయ సంచాలకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2020-09-18 18:46:53

రూ. 5 కోట్లతో వారపు సంతల అభివృధ్ది..

విశాఖ మన్యంలో ప్రధానమైన సంతల అభివృద్దికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. మండలానికి ఒకటి చొప్పున ఎంపిక చేసి వారపు సంతలను రూ.5కోట్లతో అభివృధ్ది చేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో వెలుగు, గిరిజన సహాకార సంస్ధ, ఎపి ఎస్ ఎస్ డి సి, డివిజినల్ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వారపు సంతలకు అవసరమైన మౌలిక సదుపాయల కల్పనకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని డివిజినల్ పంచాయతీ అధికారిని ఆదేశించారు. వందన్ వికాస కేంద్రాలులో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు అటవీ ఉత్పత్తుల తయారీ, విలువలు జోడించడం వంటి అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసారు. 11 మండలాల్లో 70 వందన్ వికాస కేంద్రాలు ఉన్నాయని 54 కేంద్రాలకు నిధులు విడుదల చేసామని చెప్పారు. మిగిలిన 16 కేంద్రాలకు త్వరలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు చింతపండు, కొండచీపుర్లు, అడ్డాకులకు అదనపు విలువలను జోడిస్తే మార్కెట్‌లో మంచి ధరలకు విక్రయించ వచ్చాని చెప్పారు. విడివికె లో ఉన్న సంఘాల సభ్యులకు తగిన శిక్షణ అందిస్తే 15 వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.శిక్షణకు అవసరమైన షెడ్యూలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వెలుగు ఎపిడి ఎం.నాగేశ్వరరావు, జిసిసి డివిజినల్ మేనేజర్ కె.పార్వతమ్మ , ప్రోగ్రాం అసోసియేట్ విజయకుమార్ , ఎపి ఎస్ ఎస్ డిసి మేనేజర్ రోహిణి తదితరులు పాల్గొన్నారు.

పాడేరు

2020-09-18 18:45:24

వచ్చే సోమవారానికి రూ.17 కోట్లు ఖర్చు చేయాలి..

విశాఖ ఏజెన్సీలో నిర్దేశించిన వ్యయ లక్ష్యాలను సాధించలేని ఇంజనీరింగ్ అధికారులపై ఐటిడిఏ పిఓ డా. వెంకటేశ్వర్ సలిజామల ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువా రం ఐటిడిఏలో గిరిజన సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, పి ఐ యు ఇంజనీరింగ్ విభాగం, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్‌ల స్ధల సమస్యలపై సమీక్షించారు. భవన నిర్మాణాలకు తలెత్తిన భూమి సమస్యలు, అవసరమైన భూమి ఎక్కడ లేదు అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలకు అవసరమైన భూమి సమస్యలను పరిష్కరించి భూమిని కేటాయించాలని ఆర్ డి ఓ ను ఆదేశించారు. ఏ గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం , వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్ నిర్మించాలో దిశ నిర్ధేశం చేసారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం అనుసంధానంతో చేపట్టిన గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు నిర్మాణపు పనుల పరోగతి, ఎం. బుక్ రికార్డు, చెక్ మెజర్‌మెంట్‌లు సక్రమంగా చేసి వ్యయ లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు.కాంట్రాక్టర్‌లకు సకాలంలో చెల్లింపు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పనులు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని, ఇంక్రిమెంట్లు నిలుపుదల చేయడానికి వెనుకాడనని హెచ్చరికలు జారీ చేసారు.వారానికి డి. ఇ పరిధిలో ఎంత ఖర్చు చేయాలో లక్ష్యాలను నిర్ధేశించారు. వచ్చే సోమవారానికి రూ.17 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రతీ మండలానికి ఐదుగురు ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ నియమించారని,పనులు జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి, పంచాయతీ రాజ్ ఎస్. ఇ. జి.సుధాకర రెడ్డి , గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ కెవి ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇ ఆర్ . కుసుమ భాస్కర్, పి ఐ యు ఇ ఇ , శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ డి. ఇ లు డి వి ఆర్ ఎం రాజు, అనుదీప్,పంచాయతీరాజ్ డి ఇ కొండయ్యపడాల్, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2020-09-17 19:22:06

శంఖవరంలో 16 కరోనా పాజిటివ్ కేసులు..

శంఖవరం పీహెచ్సీలో బుధవారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 16 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈరోజు మొత్తం 88 మందికి పరీక్షలు చేయగా 16 పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ తీసుకొని మందులు వాడటం ద్వారా వైరస్ నియంత్రణ జరుగుతుందన్నారు. ప్రజలంతా ప్రభుత్వం నిర్ధేశించిన 4.0 అన్ లాక్ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.  అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. 

Sankhavaram

2020-09-16 19:03:27

ఆ ఎస్ఐ కిరికిరి...బొలిశెట్టిపై కేసులు పక్కదారి..!

అధికారం చేతిలో ఉంటే బమ్మిని తిమ్మి..తిమ్మిని బమ్మీ చేయవచ్చు..అధికారపార్టీ నేతగా చేసే అక్రమాలకు పోలీసుల సహకారం ఉంటే పెట్టిన కేసులు కూడా కాగి తాలపై సాక్ష్యాలు లేకుండా మాయం చేసేయవచ్చు..అధికారం, ప్రతీపనికీ కాసులు కక్కుర్తి పడే అధికారులున్నంత సేపు అక్రమార్కుల ఆగడాలు నిరాటంకంగా కొనసాగుతాయనడానికి విశాఖ జిల్లా, ఎస్.రాయవరంలోని మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి చేసిన అవినీతి వ్యవహరాలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వాటన్నింటిపైనా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా, సదరు వ్యక్తిపై కనీసం ఒక్క కేసుకి సంబంధించిన ఆధారాలు కూడా స్టేషన్ లో లేవంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంపై దళిత సంఘాల సమాఖ్య కన్వీనర్ డా.బూసి వెంకట్రావు బుధవారం మీడియాకి లిఖిత పూర్వకంగా విడుదల చేసిన వివరాలు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయ్.ఇన్ని కేసులన్న వ్యక్తిని అధికారపార్టీలో ఎలా కొనసాగిస్తున్నారోననే ప్రశ్న తలెత్తక మానదు..బొలిశెట్టి అక్రమాలపై దళిత ఐఖ్యవేదిక నేత విడుదల చేసిన ఆ వివరాలు వరసుగా..  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై 9.9.2020న అనుచిత వ్యాఖ్యలు చేసినందున బొలిశెట్టిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేను దూషించినట్టే 7.9.2020 న పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త, యాదవ కులస్థుడైన మామిడి చంటిపై కూడా దౌర్జన్యం చేసి, అతన్ని కూడా కులం పేరుతో దూషించిన కేసు బొలిశెట్టిపై నమోదు చేయాలి ఎస్.రాయవరంలోని సోమిరెడ్డి ఆదినాగ మణికుమార్ ఇంటిపై దౌర్జన్యం చేసి ప్రహారీ గోడను బొలిశెట్టి పడగొట్టించగా అతనితో పాటు మరో ఐదుగరుపై 6.1.2018న అప్పటి ఎస్.ఐ. కుమార స్వామి కేసు (141/ 2018) నమోదైన కేసుపై విచారణచేయాలి  బొలిశెట్టికి వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ తర్వాత ఎస్ఐ. రాజాన ధనుంజయ్ తో ఆ కేసును మూసివేయించు  తర్వాత సోమిరెడ్డి ఆది నాగ మణికుమార్ యలమంచిలి కోర్టులో కేసును పునఃప్రారం భించాలని వేసిన కేసుపై దర్యాప్తు చేయాలి ఎస్.రాయవరం గురజాడ కళాక్షేత్రానికి అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత శిలాఫలకాన్ని వేయగా 27.4.2020న దానిని అక్రమంగా తొలగించగా దీనిపై అదే రోజు ఎస్.ఐ. రాజాన ధనుంజయ్ కి ఫిర్యాదు చేయగా, ఆ కేసులో తను, మరో ఇద్దరిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు కాకుండా తొక్కిపెట్టిన అంశాపై చర్యలు తీసుకోవాలి.  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేసిన శిలాఫలకం ధ్వంసం చేసినందున బొలిశెట్టి, అతని ఇద్దరు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.  ఎస్.రాయవరం సెంటర్లో 21.9.2019న అనకాపల్లి ఎం.పీ గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను అర్ధరాత్రి బొలిశెట్టి ధ్వంసం చేసిన ఘటనపై నమోదైన కేసులో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. ఇసుక మాఫియా లీడరైన బొలిశెట్టి గోవిందరావు తన కొబ్బరి కాయల షెడ్డులో 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచడంపై అప్పట్లో కేసును నమోదు చేశారు. దాని ఆధారాలు మీడియాకి ప్రజలకి తెలియజేయాలి.  బొలిశెట్టి గోవిందరావు ఇతని భార్య శారదా కుమారి అక్రమాస్తులపై రాష్ట్ర జస్టిస్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా 938/2019/LOK/B2/828/2019 సంఖ్యతో 30.10.2019న నమోదైన కేసు ప్రస్తుతం కొనసాగుతుంది.  నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో 20 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిని కొనడం, బొలిశెట్టి అక్రమ ఆస్తుల అంశంపై ఫిర్యాదులు చేయగా రాష్ట్ర ప్రభుత్వ సిట్ విభాగం 378, 379 నెంబర్లతో 7.11.2019 న బొలిశెట్టిపై కేసు నమోదైంది. ఇదే విషయాలపై ముఖ్యమంత్రి కార్యాలయంలో 158,159 నెంబర్లతో ఎస్.రాయవరం సమాచార హక్కు చట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు స్వయంగా ఆధారాలతో సహా 4.11.2019 న ఫిర్యాదు చేయగా అతనిపై కక్షతో బొలిశెట్టి గోవిందరావు, తన ఇసుక మాఫియా అనుచరులతో 30.5.2020న హత్యా యత్నం చేయించారని, ఈ దాడి మొత్తం సి.సి కెమెరాల్లో రికార్డు అయ్యిందని దానిపై కూడా విచారణ చేపట్టాలి. అక్రమాలకు పాల్పడిన ఎస్.రాయవరం మాజీ ఎంపీటిసి-2 బొలిశెట్టి గోవిందరావుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనపై రౌడీషీటర్ కేసు నమోదు చేయాలని, ఆయన వందలాది ఎకరాల అక్రమ భూములు, అక్రమాస్థులు, బినామీ ఆస్తులపై విచారణ చేయాలని, అక్రమ ఆస్తుల ఆర్జన రుజువైతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విశాఖ జిల్లా దళిత సంఘాల సమాఖ్య వేదిక కన్వీనర్ డా. బూసి వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

s.rayavaram

2020-09-16 18:31:03

సంపూర్ణ పోషణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి..

గర్భిణీ మహిళలకు ప్రభుత్వం అందజేసే సంపూర్ణ పోషణ పథకం యొక్క బలవర్థక ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని శంఖవరం గ్రామసచివాలయ మహిళా సంక్షరక్షణా కార్యదర్శి జిఎన్ఎస్ శిరీష అన్నారు. బుధవారం ఎస్సీ దుర్గాకాలనీలోని అంగన్ వాడీ కేంద్రంలోని గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందించిన టిహెచ్ ఆర్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరింత మెరుగు పరచడం కోసం ఈ కిట్లను అందజేస్తుందని, వీటిని తీసుకోవడంతోపాటు ఆకు కూరలు కూడా విరివిగా తీసుకోవాలన్నారు. తద్వారా రక్తం పెరిగి కాన్పు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని సూచిం చారు. ప్రతినిత్యం కోడిగ్రుడ్డు, పాలు, ఆహారంలో పప్పు ఆకు కూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలన్నారు. ఏ పనిచేసినా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే, తక్షణమే ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం అందించి, పీహెచ్సీలోనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, కుటుంబ సభ్యులు కూడా వైరస్ భారిన పడేప్రమాదముందని హెచ్చరించారు.  పోషణ్ అభియాన్, పోషణ సంబరాలు కార్యక్రమాలు ప్రతీ అంగన్ వాడీ కేంద్రాల్లోనూ ఈనెల 22వ తేదీవరకూ నిర్వహిస్తున్నట్టు శిరీష వివరించారు. కార్యక్రమంలో అంగన్ వాడీ కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2020-09-16 14:41:31