1 ENS Live Breaking News

వచ్చే సోమవారానికి రూ.17 కోట్లు ఖర్చు చేయాలి..

విశాఖ ఏజెన్సీలో నిర్దేశించిన వ్యయ లక్ష్యాలను సాధించలేని ఇంజనీరింగ్ అధికారులపై ఐటిడిఏ పిఓ డా. వెంకటేశ్వర్ సలిజామల ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువా రం ఐటిడిఏలో గిరిజన సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, పి ఐ యు ఇంజనీరింగ్ విభాగం, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్‌ల స్ధల సమస్యలపై సమీక్షించారు. భవన నిర్మాణాలకు తలెత్తిన భూమి సమస్యలు, అవసరమైన భూమి ఎక్కడ లేదు అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలకు అవసరమైన భూమి సమస్యలను పరిష్కరించి భూమిని కేటాయించాలని ఆర్ డి ఓ ను ఆదేశించారు. ఏ గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం , వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్ నిర్మించాలో దిశ నిర్ధేశం చేసారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం అనుసంధానంతో చేపట్టిన గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు నిర్మాణపు పనుల పరోగతి, ఎం. బుక్ రికార్డు, చెక్ మెజర్‌మెంట్‌లు సక్రమంగా చేసి వ్యయ లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు.కాంట్రాక్టర్‌లకు సకాలంలో చెల్లింపు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పనులు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని, ఇంక్రిమెంట్లు నిలుపుదల చేయడానికి వెనుకాడనని హెచ్చరికలు జారీ చేసారు.వారానికి డి. ఇ పరిధిలో ఎంత ఖర్చు చేయాలో లక్ష్యాలను నిర్ధేశించారు. వచ్చే సోమవారానికి రూ.17 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రతీ మండలానికి ఐదుగురు ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ నియమించారని,పనులు జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి, పంచాయతీ రాజ్ ఎస్. ఇ. జి.సుధాకర రెడ్డి , గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ కెవి ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇ ఆర్ . కుసుమ భాస్కర్, పి ఐ యు ఇ ఇ , శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ డి. ఇ లు డి వి ఆర్ ఎం రాజు, అనుదీప్,పంచాయతీరాజ్ డి ఇ కొండయ్యపడాల్, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2020-09-17 19:22:06

శంఖవరంలో 16 కరోనా పాజిటివ్ కేసులు..

శంఖవరం పీహెచ్సీలో బుధవారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 16 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈరోజు మొత్తం 88 మందికి పరీక్షలు చేయగా 16 పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ తీసుకొని మందులు వాడటం ద్వారా వైరస్ నియంత్రణ జరుగుతుందన్నారు. ప్రజలంతా ప్రభుత్వం నిర్ధేశించిన 4.0 అన్ లాక్ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.  అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. 

Sankhavaram

2020-09-16 19:03:27

ఆ ఎస్ఐ కిరికిరి...బొలిశెట్టిపై కేసులు పక్కదారి..!

అధికారం చేతిలో ఉంటే బమ్మిని తిమ్మి..తిమ్మిని బమ్మీ చేయవచ్చు..అధికారపార్టీ నేతగా చేసే అక్రమాలకు పోలీసుల సహకారం ఉంటే పెట్టిన కేసులు కూడా కాగి తాలపై సాక్ష్యాలు లేకుండా మాయం చేసేయవచ్చు..అధికారం, ప్రతీపనికీ కాసులు కక్కుర్తి పడే అధికారులున్నంత సేపు అక్రమార్కుల ఆగడాలు నిరాటంకంగా కొనసాగుతాయనడానికి విశాఖ జిల్లా, ఎస్.రాయవరంలోని మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి చేసిన అవినీతి వ్యవహరాలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వాటన్నింటిపైనా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా, సదరు వ్యక్తిపై కనీసం ఒక్క కేసుకి సంబంధించిన ఆధారాలు కూడా స్టేషన్ లో లేవంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంపై దళిత సంఘాల సమాఖ్య కన్వీనర్ డా.బూసి వెంకట్రావు బుధవారం మీడియాకి లిఖిత పూర్వకంగా విడుదల చేసిన వివరాలు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయ్.ఇన్ని కేసులన్న వ్యక్తిని అధికారపార్టీలో ఎలా కొనసాగిస్తున్నారోననే ప్రశ్న తలెత్తక మానదు..బొలిశెట్టి అక్రమాలపై దళిత ఐఖ్యవేదిక నేత విడుదల చేసిన ఆ వివరాలు వరసుగా..  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై 9.9.2020న అనుచిత వ్యాఖ్యలు చేసినందున బొలిశెట్టిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేను దూషించినట్టే 7.9.2020 న పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త, యాదవ కులస్థుడైన మామిడి చంటిపై కూడా దౌర్జన్యం చేసి, అతన్ని కూడా కులం పేరుతో దూషించిన కేసు బొలిశెట్టిపై నమోదు చేయాలి ఎస్.రాయవరంలోని సోమిరెడ్డి ఆదినాగ మణికుమార్ ఇంటిపై దౌర్జన్యం చేసి ప్రహారీ గోడను బొలిశెట్టి పడగొట్టించగా అతనితో పాటు మరో ఐదుగరుపై 6.1.2018న అప్పటి ఎస్.ఐ. కుమార స్వామి కేసు (141/ 2018) నమోదైన కేసుపై విచారణచేయాలి  బొలిశెట్టికి వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ తర్వాత ఎస్ఐ. రాజాన ధనుంజయ్ తో ఆ కేసును మూసివేయించు  తర్వాత సోమిరెడ్డి ఆది నాగ మణికుమార్ యలమంచిలి కోర్టులో కేసును పునఃప్రారం భించాలని వేసిన కేసుపై దర్యాప్తు చేయాలి ఎస్.రాయవరం గురజాడ కళాక్షేత్రానికి అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత శిలాఫలకాన్ని వేయగా 27.4.2020న దానిని అక్రమంగా తొలగించగా దీనిపై అదే రోజు ఎస్.ఐ. రాజాన ధనుంజయ్ కి ఫిర్యాదు చేయగా, ఆ కేసులో తను, మరో ఇద్దరిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు కాకుండా తొక్కిపెట్టిన అంశాపై చర్యలు తీసుకోవాలి.  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేసిన శిలాఫలకం ధ్వంసం చేసినందున బొలిశెట్టి, అతని ఇద్దరు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.  ఎస్.రాయవరం సెంటర్లో 21.9.2019న అనకాపల్లి ఎం.పీ గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను అర్ధరాత్రి బొలిశెట్టి ధ్వంసం చేసిన ఘటనపై నమోదైన కేసులో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. ఇసుక మాఫియా లీడరైన బొలిశెట్టి గోవిందరావు తన కొబ్బరి కాయల షెడ్డులో 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచడంపై అప్పట్లో కేసును నమోదు చేశారు. దాని ఆధారాలు మీడియాకి ప్రజలకి తెలియజేయాలి.  బొలిశెట్టి గోవిందరావు ఇతని భార్య శారదా కుమారి అక్రమాస్తులపై రాష్ట్ర జస్టిస్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా 938/2019/LOK/B2/828/2019 సంఖ్యతో 30.10.2019న నమోదైన కేసు ప్రస్తుతం కొనసాగుతుంది.  నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో 20 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిని కొనడం, బొలిశెట్టి అక్రమ ఆస్తుల అంశంపై ఫిర్యాదులు చేయగా రాష్ట్ర ప్రభుత్వ సిట్ విభాగం 378, 379 నెంబర్లతో 7.11.2019 న బొలిశెట్టిపై కేసు నమోదైంది. ఇదే విషయాలపై ముఖ్యమంత్రి కార్యాలయంలో 158,159 నెంబర్లతో ఎస్.రాయవరం సమాచార హక్కు చట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు స్వయంగా ఆధారాలతో సహా 4.11.2019 న ఫిర్యాదు చేయగా అతనిపై కక్షతో బొలిశెట్టి గోవిందరావు, తన ఇసుక మాఫియా అనుచరులతో 30.5.2020న హత్యా యత్నం చేయించారని, ఈ దాడి మొత్తం సి.సి కెమెరాల్లో రికార్డు అయ్యిందని దానిపై కూడా విచారణ చేపట్టాలి. అక్రమాలకు పాల్పడిన ఎస్.రాయవరం మాజీ ఎంపీటిసి-2 బొలిశెట్టి గోవిందరావుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనపై రౌడీషీటర్ కేసు నమోదు చేయాలని, ఆయన వందలాది ఎకరాల అక్రమ భూములు, అక్రమాస్థులు, బినామీ ఆస్తులపై విచారణ చేయాలని, అక్రమ ఆస్తుల ఆర్జన రుజువైతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విశాఖ జిల్లా దళిత సంఘాల సమాఖ్య వేదిక కన్వీనర్ డా. బూసి వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

s.rayavaram

2020-09-16 18:31:03

సంపూర్ణ పోషణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి..

గర్భిణీ మహిళలకు ప్రభుత్వం అందజేసే సంపూర్ణ పోషణ పథకం యొక్క బలవర్థక ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని శంఖవరం గ్రామసచివాలయ మహిళా సంక్షరక్షణా కార్యదర్శి జిఎన్ఎస్ శిరీష అన్నారు. బుధవారం ఎస్సీ దుర్గాకాలనీలోని అంగన్ వాడీ కేంద్రంలోని గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందించిన టిహెచ్ ఆర్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరింత మెరుగు పరచడం కోసం ఈ కిట్లను అందజేస్తుందని, వీటిని తీసుకోవడంతోపాటు ఆకు కూరలు కూడా విరివిగా తీసుకోవాలన్నారు. తద్వారా రక్తం పెరిగి కాన్పు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని సూచిం చారు. ప్రతినిత్యం కోడిగ్రుడ్డు, పాలు, ఆహారంలో పప్పు ఆకు కూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలన్నారు. ఏ పనిచేసినా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే, తక్షణమే ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం అందించి, పీహెచ్సీలోనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, కుటుంబ సభ్యులు కూడా వైరస్ భారిన పడేప్రమాదముందని హెచ్చరించారు.  పోషణ్ అభియాన్, పోషణ సంబరాలు కార్యక్రమాలు ప్రతీ అంగన్ వాడీ కేంద్రాల్లోనూ ఈనెల 22వ తేదీవరకూ నిర్వహిస్తున్నట్టు శిరీష వివరించారు. కార్యక్రమంలో అంగన్ వాడీ కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2020-09-16 14:41:31

ఆర్ఓఎఫ్ఆర్ భూములు పరిశీలించిన పీఓ..

విశాఖ ఏజెన్సీలోని అటవి హక్కు పత్రాలు పంపిణీకి అవసరమైన భూమి సర్వేను పక్కాగా నిర్వహించాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల పరిశీలిం చారు. బుధవారం కించుమండ పంచాయతీ కోసమగుడ గ్రామపరిధిలోని కొండపై గిరిజనులు సాగుచేస్తున్న భూములను పరిశీలించారు. మండలంలో చేసిన సర్వే వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.గిరిజన రైతుల సాగులో ఉన్నభూములను సక్రమంగా నమోదు చేయాలని చెప్పారు. 216 కుటుంబాల  అర్హులను గుర్తించామని రెవెన్యూ అధికారులు వివరించారు. 127మంది అటవీ భూములు సాగుచేస్తున్నారని చెప్పారు.29 కుటుంబాలకు భూములు లేవన్నారు. ల్యాండ్ సర్వే వేగంగాపూర్తి చేయాలని పి.ఓ. ఆదేశించారు. అనంతరం కురిడి గ్రామంలో రూ 42లక్షలు వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రైతుభరోసా కేంద్రం నిర్మాణపు పనులు తనిఖీ చేశారు.  ఆతరువాత అరకులో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం పనులను తనిఖీ చేసి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరకులో వై ఎస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కెజయప్రకాశ్ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ జి.మురళి,ఏ ఈ ఈ యద కిషోర్,ఎం. పిడివో ఛాయ సుధ , డిటి.విఆర్వో తదితరులు  పాల్గొన్నారు. 

కించుమండ

2020-09-16 13:39:04

బొలిశెట్టిగోవిందరావుపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలి..

పాయకరావుపేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకుడు పిట్టా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఎస్.రాయవరం లో  మీడియాతో మాట్లాడుతూ, దళిత ఎమ్మెల్యే అయిన గొల్ల బాబూరావుపై ఒక మాజీ ఎంపీటీసీ ఇష్టానుసారం వచ్చినట్టు, నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మా ట్లాడటం దళితులను కావాలని కించపరడమేనన్నారు. ఆ వ్యాఖ్యలను ఎస్.రాయవరం0 మండల సంఘం  తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దళిత ఎమ్మెల్యేపై  అగ్రకు లాల పెత్తనాన్ని ప్రతీ దళితుడూ వ్యతిరేకించాలన్నారు. ఇలాంటి వైఎస్సార్సీపీ నాయకులపై అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. అధికాపార్టీ దళిత ఎమ్మెల్యేపై చేసిన ఈ వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అంభేత్కర్ వారసులంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. అదేవిధంగా పాయకరావుపేట ఎమ్మెల్యే విషయంలో టిడిపి ఎస్సీసెల్ నాయకులు వైఎస్సార్సీపీ పార్టీపై చేసి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకులను ప్రోత్సహించదన్నారు.  దళితులంతా ఒక్కటేనని విషయాన్ని చాటిచెబుతామని, మండలంలోనూ, జిల్లాలోని దళితులంతా ఎమ్మెల్యే బాబూరావు వెనుకే వుంటారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని దళిత సంఘాల సమాఖ్య సీరియస్ గా తీసుకుందని పిట్టా విజయ్ కుమార్ వివరించారు.

s.rayavaram

2020-09-16 08:25:46

ప్రతి గిరిజన కుటుంబానికి రెండెకరాల భూమి

విశాఖ ఏజెన్సీలో భూమిలేని గిరిజన కుటుంబాలను గుర్తించి కనీసం రెండెకరాల భూమికి హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని పాడేరు ఐటిడిఏపీఓ  డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల స్పష్టం చేశారు. మంగళవారం జి.కె.వీధి మండలం దామనాపల్లి పంచాయతీ దొడ్డికొండ ,కట్టుపల్లి  సంకాడ పంచాయతీ చిన్న జాడమూరు గ్రామాల గిరిజన రైతులు సాగుచేస్తున్న అటవీ భూములను పరిశీలించారు. కాపీ తోటల్లో పర్యటించి  ఆర్వో ఎఫ్ ఆర్ భూముల్లో వేసిన సరిహద్దు రాళ్లను తనిఖీ చేశారు. కట్టుపల్లి గ్రామంలో కూడ సన్యాసిరావు ,చిన్న జాడమూరు గ్రామంలో దేసగిరి యుగంధర్ కాఫీ తోటల్లో పర్యటించి భూముల్లో వేసిన సరిహద్దు రాళ్లను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడుతూ కాఫీ, మిరియాలసాగు పై వస్తున్న దిగుబడి,  ఆదాయాలను అడిగితెలుసుకున్నారు. కాఫీ రైతులకు కాఫీ పల్పర్ యంత్రాలను సరఫరా చేస్తామని చెప్పారు. గ్రామంలో తాగునీటి సమస్యలు, అంగన్వాడీ సేవలపైనా, రైతుభరోసా రైతులకు వచ్చిందా ని ఆడిగితెలుసుకున్నారు. చిన జాడమూరు గ్రామంలో పర్యటించి దేశగిరి యుగంధర్ కాఫీ తోటలు పరిశీలించారు. కాపీరైతులకు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఐటీడీఏ నుంచి పసుపు విత్తనాలు పొంది సాగు చేస్తున్న పసుపురైతు  ఒలం బాబూరావు పసుపు తోటను సందర్శించారు. అనంతరం చాపరాతి పాలెం నుండి రాజేంద్రపాలెం వరకు రూ.785.40 లక్షలు వ్యయంతో పి.ఎం.జి.ఎస్ వై లో నిర్మిస్తున్న రోడ్ పనులను, పెడవలస గ్రామ పంచాయతీ, రైతు భరోసా కేంద్రం నిర్మాణపు  పనులు తనిఖీ చేశారు.  నిర్మాణాల్లో పటిష్టమైన నాణ్యతలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జి.కె.వీధి తహసీల్దార్, వి.రాజ్ కుమార్ ,పి.ఆర్ ఏ ఈ కె.జ్యోతిబాబు వి.ఆర్వో పద్మ తదితరులు పాల్గొన్నారు.

గూడెంకొత్తవీధి

2020-09-15 15:44:39

హోమ్ ఐసోలేషన్ ద్వారానే కరోనా నుంచి రక్షణ..

శంఖవరం పీహెచ్సీలో సోమవారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 10 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలి యజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈరోజు మొత్తం 98 మందికి పరీక్షలు చేయగా 10 పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖ వరం మండల కేంద్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలాఅప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ తీసుకొని మందులు వాడటం ద్వారా వైరస్ నియంత్రణ జరుగుతుందన్నారు. ప్రజలంతా ప్రభుత్వం నిర్ధేశించిన 4.0 అన్ లాక్ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.  అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. 

Sankhavaram

2020-09-14 19:48:29

సర్వే నివేధికలు సమర్పించండి.. కాంతిలాల్ దండే

విశాఖ ఏజెన్సీలోని భూమి లేని గిరిజన కుటుంబాలను గుర్తించడానికి చేపట్టిన సర్వే ప్రగతి నివేధకలు సమర్పించాలని గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే సూచించారు. ఈనెల 28 వతేదీలోగా కనీసం రెండు ఎకరాల భూమిలేని గిరిజన కుటుంబాలను గుర్తించి వచ్చేనెల 2వతేదీన పట్టాలు పంపిణీకి సిద్దం కావాలని స్పష్టం చేసారు. సోమవారం విజయవాడ గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు కార్యాలయం నుంచి ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారులతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి లేని కుటుంబాలు ఎన్ని, రెండు ఎకరాల కంటే తక్కువ ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సర్వే పూర్తి చేసి రెండు ఎకరాల భూమి పంపిణీ చేయడానికి భూములు గుర్తించి డి ఎల్ సి అనుమతులు పొందాలని స్పష్టం చేసారు. మన బడి నాడు నేడు పనుల ముఖ్యమంత్రి సలహాదారు మురళీ మాట్లాడుతూ నాడు నేడు పనులను ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. పాఠశాలల్లో నాడు నేడు లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. విద్యుత్తు, తాగునీరు,మరుగుదొడ్ల నిర్మాణాలు, ప్రహారీగోడలు నిర్మాణాలు వేగంగాపూర్తి చేయాలన్నారు. భవనాలు లేని పాఠశాలలకు ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామన్నారు. పాఠశాలల నిర్మాణపు పనులు పూర్తియిన వెంటనే రంగువేయడానికి సిద్దం చేసామన్నారు. విద్యుత్తు లేని పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఐటి డి ఏ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూ 1 లక్ష 7 వేల కుటుంబాలను సర్వే చేసామని చెప్పారు. 14 వేల రెండు వందల కుటుంబాలకు కనీసం భూమి లేదన్నారు. ఈనెల 24 వతేదీన జిల్లా స్దాయి కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులు తీసుకుంటామన్నారు. పాడేరు డివిజన్ పరిధిలో 367 పాఠశాలల్లో నాడు నేడు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వాటిలో 85 పాఠశాలలను తనిఖీ చేసామన్నారు. గ్రామ సచివాలయాలకు నెట్ వర్క్ సౌకర్యంలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,పాడేరుకు 19 మొబైల్ టవర్లు మంజూరు చేసారని ఇంకా మరికొన్ని టవర్లు మంజూరు చేయాలని కోరారు.

Paderu

2020-09-14 18:58:02

ఆ ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలి..

విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండలంలోని... ఎస్.రాయవరం గ్రామం నుంచి గుండ్రబిల్లి వెళ్లే మార్గమధ్యలో సర్వే నెంబరు 58, ఖాతా నెంబరు 20000102లోని 76 సెంట్ల ప్రభుత్వ భూమిని తక్షణమే అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సమాచారహక్కు చట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డికి మౌర్యకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములు సర్వే చేస్తుందని, కానీ అక్రమార్కుల చెరలో వున్న భూములను మాత్రం పట్టించుకోకుండా కొంతమంది అధికారులు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వ భూములు వెతుకుతున్న ప్రభుత్వం పక్కా ఆధారాలతో ఆక్రమణలో ఈ భూమిని స్వాధీనం చేసుకుంటే ఈ ప్రాంతంలో మరిన్ని అన్యాక్రాంతం అయిన భూములు వివరాలు వెలుగులోకి వస్తాయని ఆయన ఆ ఫిర్యాదు లో పేర్కొన్నారు. కేవలం రెవిన్యూ అధికారుల అండదండలతో అధికార పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వ భూములను ఖబ్జాచేసి ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి నుంచి భూములను స్వాధీనం చేసుకొని ఇళ్లు లేని నిరుపేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఖబ్జా చేసిన భూములను అక్రమార్కులు యధేచ్చగా సాగుచేస్తున్న విషయాన్ని స్థానిక తహశీల్దారు కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామని,అయితే సదరు అధికారులు ఆక్రమణదారులకు కొమ్ముకాయడంతో సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసినట్టు సోమిరెడ్డి మీడియాకి వివరిస్తూ, ఆక్రమణకు గురైన భూముల వివరాలు, సర్వే నెంబర్లు, ఫోటోలను విడుదల చేశారు.

ఎస్.రాయవరం

2020-09-14 14:25:59

2020-09-13 09:07:43

చిన్నారికి సీఎం రిలీఫ్ అండ్ అందజేసిన ఎమ్మెల్యే గణష్

గొలుగొండ మండలం జోగంపేటకు చెందిన ఓచిన్నారి తీవ్ర జ్వరంతో బాధపడిన సంఘటన పై గొలుగొండ వైఎస్సార్సీపీ నాయకులు తక్షణమే స్పందించారు. ఆ చిన్నారికి ప్లేట్ లెట్స్ పడిపోవడంతో మండల నాయకులు, గిరిబాబు, నాయుడు తదితరులు తమ సొంత నిధులతో వైజాగ్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఎమ్మెల్యే  పెట్ల ఉమ శంకర్ గణేష్ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడంతో అక్కడి నుంచి కూడా రూ.10వేలు ఆర్ధిక సహాయం మంజూరైంది. ఈ మొత్తాన్ని చిన్నారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే శనివారం తన కార్యాల యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి నిరుపేదను ఆదుకుటుందని చెప్పారు. అదే సమయంలో నాయకులు గిరిబాబు, నాయుడు ఒక చిన్నారి ప్రాణాలను కాపాడటంతో చూపిన చొరవను అభినందించారు. ప్రతీ నాయకుడూ వారి ప్రాంతాల్లోని సమస్యలను నేరుగా తన ద్రుష్టికి తీసుకురావచ్చొని ఎమ్మెల్యే భోరాసా ఇచ్చారు. కార్యక్రమంలో గొలుగొండ మండల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Narsipatnam

2020-09-12 12:46:07

శంఖవరం మండలంలో 4 కరోనా పాజిటివ్ కేసులు..

శంఖవరం పీహెచ్సీలో శుక్రవారం నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 4 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు  పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలి యజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  ఈరోజు మొత్తం 41 మందికి పరీక్షలు చేయగా అందులో 4(శంఖవరం-1, శ్రుంగవరం-1, గిడిజాం-1, రౌతుల పూడి-1) మాత్రమే పాజిటివ్ గా నమోదు అయ్యాయని అన్నారు. శంఖవరం మండల కేంద్రంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపట్ల ప్రజలు చాలా అప్రమ త్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన 4.0 అన్ లాక్ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.  అత్యవసర సమయాల్లో తప్పా మిగిలిన సమయంలో ఇంట్లోనే ఉండి మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముసలివారు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించారు. ప్రతీనిత్యం ఏపనిచేయడానికైనా ముందు, తరువాత ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు చేతులను మోచేతి వరకూ సబ్బుతో కడుక్కోవాలన్నారు. అధిక జ్వరం, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆరోగ్యసిబ్బందిని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. 

Sankhavaram

2020-09-11 16:05:04