1 ENS Live Breaking News

విజయసాయిరెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే చెంగల

పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు ఆదివారం  వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డిని కలిశారు. విశాఖ వచ్చిన సాయిరెడ్డిని చెంగల మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇటీవల కాలంగా మాజీ ఎమ్మెల్యే చెంగల నియోజకవర్గం నలుచెరగులా విస్తృ త పర్యటనలు చేస్తూ నియోజకవర్గంలోని  ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అక్కడికి వెళ్లి వారిని పరామర్శిస్తూ సహాయం అందిస్తున్ నారు. ఈ నేథ్యంలో సాయి రెడ్డిని చెంగల  కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.  అంతేకాకుండా  వైఎస్సార్సీపీలోని పలువురు పార్టీ పెద్ధల ఆశీస్సులతో చెంగల ఈసారి పార్టీ టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే వీరి కలయిన నియోజకవర్గంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

Visakhapatnam

2023-02-12 15:09:11

విశాఖ దక్షిణంలో పక్కాగా కందుల జనసేన మార్కు

ఆంధ్రప్రదేశ్ లోనే ప్రత్యేకజిల్లాగా గుర్తింపు పొందిన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కందుల నాగరాజు జనసేనమార్కు చూపించడంలో దూకుడు పెంచారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేన పార్టీలోకి మారిన నాటి నుంచే కార్యకర్తలు, అభిమానులు, సామాజిక వర్గ సమీకణల్లో పై చేయి సాధిస్తున్నారు. ఎన్నడూలేనివిధంగా రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపించే కార్యక్రమాలకు జనసేన నాయకుడిగా కందుల తనవ్యూహాలకు పదునుపెడుతున్నారు. యువతను ఆకర్షించడానికి తన ఇద్దరు కుమారులతో కదన రంగంలోకి దిగి పార్టీబలాన్ని పెంచేదిశగా అడుగులు వేస్తున్నారు. ఆత్మీయ కలయికలతో విశాఖ దక్షిణంలో అపుడే హాట్ టాపిక్ అయ్యారు.

Visakhapatnam

2023-02-04 10:57:58

కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ప్రకటనలా RRR

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండగా ఏవిధంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సీఎం వైఎస్.జగన్ ప్రకటించడం కోర్టులంటే గౌరవం లేకపోవడమేనని అమలాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, చాలా చిన్న దేశాలు, డ్రగ్స్ సప్లై చేసే దేశాల నుంచి పెట్టుబుడులు వస్తాయని..వీటినే జగన్ అగ్రరాజ్యాలుగా ఫీలవుతున్నారంటూ ఎద్దేవాచేశారు. పెట్టుబుడల సమ్మిట్ లోనే తాను విశాఖపట్నం మకాం మార్చేస్తున్నట్టుగా ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కోర్టులంటే గౌరవం ఉన్నావారు కోర్టు తీర్పుల వరకూ వేచి ఉంటేనే కోర్టులపై గౌరవం ఉన్నట్టన్నారు.

Hyderabad

2023-01-31 12:31:01

సిబిఐకి ఎంపీ అవినాష్ రెడ్డి ప్రత్యేక లేఖ

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి ప్రత్యేకంగా లేఖ రాశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. 'వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని, విచారణను పూర్తిగా రికార్డు చేసేందుకు అనుమతించాలని, నాతో న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి అని లేఖలో ఎంపీ పేర్కొన్నారు.' అయితే ఈ లేఖకు సీబీఐ ఇంకా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ పరంగా ప్రాధాన్యత సంతరించుకుని చర్చ జరుగుతోంది. వివేకా హత్యకేసు ఇంకా నానుతూనే ఉండటం విశేషం..!

Kadapa

2023-01-28 07:38:15

నిరుపేద ప్రజలను చంపిన వ్యక్తికి పరామర్శా

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పేద ప్రజల్ని పొట్టన బెట్టుకున్న వ్యక్తిని పరామర్శ పేరుతో పవన్ కళ్యాణ్ కలవడంపై వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ శివ శంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దర నాయకుల కలయికపై టీడీపీ జనసేన మిత్రబంధం పూర్తిగా అర్థమవుతుందదని విమర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలను పరమర్శించ కుండా చంపిన వారి ఇంటికి పోవడం ఏంటని అయోమయం వ్యక్తం చేశారు. పర్మిషన్ లేదని కుప్పంలో పోలీసులు అడ్డు పడితే నడిరోడ్డుపై చంద్రబాబు హడావిడి సృష్టించారని అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ వత్తాసు పలకడాన్ని ఆయన ఖండించారు.

  

ప్రజల ముందుకు రాగానే సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కు కుప్పంలో  పోలీసులపై చంద్రబాబు చేసిన కామెంట్స్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు పోలీసులను నానా మాటలు అంటుంటే ఓ కానిస్టేబుల్ కొడుకుగా మౌనంగా ఉన్న నువ్వు నేడు పోలీసులను నిందించడం ఏంటని విమర్శించారు. దీని బట్టి నీ ద్వంద వైఖరి అర్థమవుతుందని దుయ్యబట్టారు. చిరంజీవి లేకుంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేడని.. మీ అన్నకు ఉన్న స్టార్ డమ్ వల్లే నువ్వు జనాలకు తెలుసని పేర్కొన్నారు.

Tadepalli

2023-01-10 14:11:39

జనసేన-టిడిపీ పొత్తులపై క్లారిటీ ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు..?

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన-టిడిపి పొత్తులపై ఇద్దరు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబులు మీడియా ముఖంగా ఒక మోస్తరు క్లారిటీ ఇవ్వడంతో ప్రధాన ఓటు బ్యాంకుగా భావించే ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఒక క్లారిటీ వచ్చినట్టు అయ్యిందని విశ్లేషకులు తొలి అంచనాకు వచ్చారు. ఇప్పటి వరకూ వీరి పొత్తుపైనా, తిరుగుబాటు పైనా క్లారిటీ లేక ప్రభుత్వ ఉద్యోగులు,  ప్రైవేటు ఉద్యోగులు తీవ్రంగా సతమతం అయ్యారని, టిడిపి ఒంటరిగా పోటీచేస్తే వైఎస్సార్సీ పక్కగా గెలుస్తుందని అంచనాలు వేసిన వారంతా నిన్నటి ప్రకటనతో అందరూ ఎటువైపు నిలబడాలనే విషయమై ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారని చెబుతున్నారు. అన్నేళ్ల టిడిపి పాలనలో ఎలాంటి ఇబ్బందులు చవి చూడని ఉద్యోగులు, సిబ్బంది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రివర్స్ పీఆర్సీ, హెచ్ఆర్ఏ, డీఏల కుదింపు, ఉద్యోగులకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్, ఉపాధ్యాయులకు భోదనేతరపనులు, ఉద్యోగులపై ఫ్లైయింగ్ స్వాడ్ నిఘా తదితర అంశాలను చాలా సీరియస్ గానే ఉద్యోగులు తీసుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీచేస్తే రాష్ట్రంలో మార్పు తధ్యమనే సంకేతాలను సామాజిక మాద్యమాల ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చుకుంటున్నారనే వాదన నిన్నటి నుంచే రాష్ట్రంలో వైరల్ అవుతుంది. ఏ ప్రభుత్వంలోనూ ఉద్యోగులు అంతగా ఇబ్బంది పడలేదని.. ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సెలవులు కూడా తీసుకోకుండా పనిచేసినా వేధింపులు, బెదిరింపులు అధికం అవుతున్నాయని అటెండరు నుంచి ఐఏఎస్ వరకూ ఫీలవుతున్నారనే విషయాన్ని ఇపుడు ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం చేసే పనికి పూనుకుంటారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకతగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈసారి తమ ఉద్యోగ వర్గం ఓటు బ్యాంకు ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని కూడా చూస్తున్నారట. మొన్నటి వరకూ ఈ రెండు పార్టీల విషయంలో సందిగ్దత ఉండేదని, ఇపుడు అది క్లియర్ అయిపోవడంతో తాము చేపట్టాల్సిన కార్యాచరణ మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది. అలా చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక భయంకరమైన నరకప్రాయం అవుతుందనే సంకేతాన్ని నిన్నటి నుంచే సామాజిక మాద్యమాల ద్వారా 75 ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలియజేస్తున్నారట.వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులు, క్రిందిస్థాయి సిబ్బంది నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినా గ్రామ, వార్డు సచివాలయశాఖ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అటు ప్రభుత్వం కూడా భావిస్తున్నది. వారితోపాటు, గ్రామవాలంటీర్లు, పార్టీ కేడర్, అన్ని సామాజికి వర్గాల కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల దగ్గర నుంచి మద్దతుతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన నిరుపేద లబ్దిదారుల నుంచి పరిపూర్ణ మద్దతుతో సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా 
కూడా అధికారపార్టీలో ఉన్నదని విశ్లేషకులు బలంగానే చెబుతున్నారు.

ఇక గ్రామ, వార్డు సచివాలయ శాఖలో చాలా మంది సిబ్బందికి ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందనే భావనతోనే ఉన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న తరువాత వెంటనే సర్వీసు రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వం తొమ్మిది నెలలు అదనంగా అదే రూ.15వేలకే పనిచేయించుకుందని.. పీఆర్సీ అమలు చేస్తున్నామని చెప్పి ఐఆర్ ఇవ్వలేదని, తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేసే సమయంలో హెచ్ఆర్ఏ, డీఏ పూర్తిగా కుదించేసిందనే భావన కూడా ఉద్యోగుల్లో ఉంది. నాటి నుంచి నేటి వరకూ తమ శాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు, ఇతర ప్రభుత్వశాఖల మాదిరి ప్రయోజనాలు పొందేందుకు వీలు లేకుండా సర్వీసు రూల్స్ కూడా పొందుపరచలేదనే వాదనను కూడా ఉద్యోగులు తెరపైకి తీసుకు వస్తున్నారు. 

ఈ కారణాలతో కూడా సచివాలయశాఖలోని ఉద్యోగులు చెప్పుకొస్తూ.. ప్రభుత్వ విధానం వలనే చాలా మంది ఉద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని, అధికారుల వేధింపులు కూడా అధికం అయ్యాయని చెబుతున్నారు. ఈ తరుణంలో సచివాలయశాఖ ఉద్యోగుల నుంచి కూడా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ వెరసీ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యోగు, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు టీడిపి-జనసేస పొత్తు తరువాత ఒక ప్రత్యేక క్లారిటీకి వచ్చే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు..చూడాలి ముందు ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనేది..!

Tadepalli

2023-01-09 04:25:37

YSRCP మహిళావిభాగం అధ్యక్షులుగా వరదుకళ్యాణి

వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసి డెంట్ గా ఎమ్మెల్సీని వరుదుకళ్యాణిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. పార్టీలో అన్ని విభాగాల్లోనూ పోస్టులను భర్తీచేస్తున్న తరుణంలో ఈమెను మహిళా విభాగానికి కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించారు. ఈమె నియామకం పట్ల పలువురు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జనవరి నెలాఖరు నాటికి పార్టీలోని అన్నివిభాగాల్లోని పోస్టులను కేంద్ర కార్యాలయం యుద్ధ ప్రాతిపదిక భర్తీచేస్తూ వస్తున్నది. మరికొంత మందికి కూడా పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Visakhapatnam

2023-01-05 15:04:48

బీఆర్ఎస్ పై జనసేన నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

ఓ పక్క ఓటమి భయనం, మరోప్రక్క ప్రతిపక్షాలు ప్రజలకు దగ్గరవుతున్నారనే ఆందోళనతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చీకటి జీవోలు తెచ్చారని..బి.ఆర్.ఎస్. పార్టీ జగన్ రెడ్డికి సహకారం అందించడానికే ఏపీకి అడుగు పెడుతుందని జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఓటు చీల్చడానికి బీఆర్ఎస్ ముసుగులో ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ కోసం మీరు నిలబడ్డారు.. బంగారు ఆంధ్రప్రదేశ్ కోసం కాదు అంటూ కేసీఆర్ కి చురకలు అంటించారు. రాజకీయాల్లో నిజాయతీతో కూడిన ఆలోచనా విధానం 
ఉండాలి. మీటింగులు పెట్టుకుని జాయినింగులు చేసుకుంటే అయిపోదు. కృష్ణా-గోదావరి జలాల విషయంలో మీ ప్రణాళిక ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి ఆలోచనతో వచ్చి సేవా కార్యక్రమాలు చేయగలరో ప్రజలకు వివరించిన తరువాత అపుడు ఏపీలోకి అడుగు పెట్టాలని సూచించారు.

కేసీఆర్ ఓవర్ నైట్ పార్టీ పెట్టి దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాడుతాను అనడం.. మీ విధానాల్లో నిజాయతీ ఏది? ఆంధ్రప్రదేశ్ కి మీరు ఎలా ఉపయోగపడతారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోలిశెట్టి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-05 14:45:03

175 వస్తే మరో30 ఏళ్లు అధికారంలో మనమే ఉంటాం

ఈసారి 175 సీట్లు గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం అని సీఎం జగన్ అన్నారు. బుధవారం విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకో వాలన్నారు. ఎలాంటి విభేధాలున్నా పక్కన పెట్టాలని, ఏమైనా సమస్యలుంటే మనలో మనం సర్దుబాటు చేసు కుందాం అని పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినా ష్ పోటీ చేస్తారని సీఎం జగన్ ప్రకటించారు. పార్టీ గెలుపునకి సైనికుల్లా పనిచేయాలన్నారు.

Vijayawada

2023-01-04 16:08:29

కెసిఆర్ ఏపీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

ఆంధ్రా వాళ్ళను కుక్కలు తరిమి తరిమి కొట్టమన్నావు.. అక్కడి పాలకులకు పార్టీలు అవసరమా అన్నావు.. ఆంధ్రాకు నీరు ఆపావు.. కృష్ణ ట్రిబ్యునల్ అడ్డుకున్నావు..  ఇపుడు ఏం మొహం పెట్టుకుని ఆంధ్రాలో అడుగు పెడతావంటూ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పై రాజ్యసభ సభ్యులు జెవిఎల్ నరసింహారావు ఘాటు విమర్శలు చేశారు. మంగళవారం ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో దుర్మార్గపు పాలనచేసి నేడు బీఆర్ఎస్ అంటూ ఆంధ్రాలోకి అడుగుపెడితే నమ్మేవారు ఎవరూ లేరన్నారు. ముందు ఏపీ ప్రజలకు బహిరంగంగా క్షమాపన చెప్పి, మోడీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.

Visakhapatnam

2023-01-03 10:13:14

భవిష్యత్తులో ఇదే రాష్ట్ర కార్యాలయం కావాలి

విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి నూతన కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. స్థానిక ఎండాడలోని పనోరమా హిల్స్ సమీపంలో సుమారు రెండు ఎకరాల స్థలంలో నిర్మించనున్న కార్యాలయ భవనానికి వైసిపి ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి విడుదల రజని, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్మితమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవిష్యత్ లో రాష్ట్ర పార్టీ కార్యాలయం అవుతుందని  45 నుంచి 60 రోజుల్లో పార్టీ కార్యాలయం మొదటి దశ పనులు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

 పార్టీ కార్యాలయం నిరంతరం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీ కార్యాలయాల్లో 24X7 కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.  జనవరిలో భోగాపురం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. అదాని డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే విశాఖలో 40 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక  ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో ఆనందం పంచుతున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజానీకమంతా అండగా ఉండి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

 తెలుగుదేశం పార్టీ అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించుకుందని, పార్టీ అదే పని చేస్తే పని తప్పుడు ప్రచారం చేస్తూ తమ పార్టీపై బురద జల్లుతున్నారని అమర్నాథ్ విమర్శించారు. ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ ముందుకు సాగడం వల్ల ఇబ్బందులు తప్ప మరేమీ ఉండదని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణ బాధ్యతను కార్యకర్తలు, నాయకులు భుజాన వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగాది నాటికి ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అమర్నాథ్ లక్ష్యాన్ని నిర్దేశించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పార్టీ విజయపతాక ఎగరవేయాలని, దీనికి పునాది విశాఖ నుంచి ప్రారంభం కావాలని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో విశాఖ నగరంలో కోల్పోయిన సీట్లను, ఈసారి మన ఖాతాలో వేసుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు అమర్నాథ్ పిలుపునిచ్చారు. 

విశాఖ  రాష్ట్ర భవిష్యత్తు కాబోతుందని ఆయన అన్నారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి విడదల రజిని మాట్లాడుతూ విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాష్ట్రానికి ఆదర్శం కానుందని పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు చేసి 11 ఏళ్ళు పూర్తి అయి 12వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో విశాఖపట్నంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఈ కార్యాలయం అందుబాటులో ఉంటూ పార్టీని మరింతగా బలోపేతం చేయడం వచ్చే ఎన్నికల్లో పార్టీ జయకేతనం ఎగురవేయడం, మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ విశాఖపట్నంలో పార్టీ కార్యాలయం నిర్మాణం వల్ల ఈ ప్రాంత ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరుతాయని తెలిపారు. 

కార్యకర్తల్లో నూతన ఉత్తేజంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింతగా పటిష్టం కానుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి శాసనమండలి సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్,సమన్వయకర్త కె. కె. రాజు,మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఎ.రహమాన్, చింతలపూడి వెంకటరామయ్య తిప్పల గురుమూర్తిరెడ్డి,బీసీ కమిషన్ సభ్యులు పక్కి దివాకర్, మాజీ మంత్రి బాలరాజు, దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్,బొల్లవరపు జాన్ వెస్లీ నడింపల్లి కృష్ణంరాజు, సతీష్ వర్మ, కాశీ విశ్వనాథ్, కొల్లి సింహాచలం,రవిరెడ్డి,మంత్రి రాజశేఖర్, భరణికాన రామారావు, బెహరా భాస్కరరావు,వి.వి.ఎన్ ఎం రాజా,పీఎస్ఎన్ రాజు,ద్రోణంరాజు శ్రీవత్సవ,మొల్లి అప్పారావు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-14 17:36:01

సిఎం నిజాయతీ, నిబద్ధతే 175 స్థానాల్లో గెలిపిస్తాయి

ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఉన్న నిజాయతీ, నిబద్ధతలే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని 175 స్థానాల్లో గెలిపిస్తాయని టిటిడి చైర్మన్, వైయస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో మంగళవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. పారదర్శకతతో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకే నేరుగా పథకాలను అందజేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. రాబోయే ఎన్నికల నాటికి పెన్షన్ ను రూ. 3,000 చేస్తామని చెప్పిన హామీలో భాగంగానే ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,500 పెన్షన్ ను రూ. 2,750 చేస్తూ కేబినెట్ లో ఆమోదించారని తెలిపారు. కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు అమలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని, ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా చేస్తున్న విమర్శలను సుబ్బారెడ్డి కొట్టిపడేశారు.  ఈ వ్యవస్థలో ఏమైనా చిన్నపాటి లోటుపాట్లు ఉంటే సరిచేసి మరింత బలోపేతం చేస్తామన్నారు. పథకాల అమలు విజయంలో వాలంటీర్ల పాత్రను ప్రశంసించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల  యువకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారని చెప్పారు. చేరికలు నిరంతర ప్రక్రియగా అభివర్ణిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Anakapalle

2022-12-13 13:18:33

ఏపీలో ఎలక్షన్ హీట్ సామాజిక వర్గాలవారీ జన గణన..!

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి రాజకీయపార్టీలకు తమ సామాజిక వర్గం బలమెంతో తెలియజేసే పనికి రాష్ట్రంలోని అన్ని సమాజిక వర్గాలూ పూనుకున్నాయి. వాస్తవంగా ప్రతీ పదేళ్లు ఒక సారి కేంద్ర ప్రభుత్వం జనాభా గణన చేపడుతుంది. కానీ 2019 ఎన్నికల తరువాత ఏపీలో సామాజిక వర్గాల బలాబలాలు ప్రదర్శించుకునేందుకు 
అందరూ ఆశక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో అన్ని సామాజికవర్గాల కంటే చేనేత సామాజిక వర్గం రెండవ అతిపెద్ద సామాజిక వర్గంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం అయ్యింది. దీనితో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఏఏ సామాజిక వర్గాల్లో ఎంత మంది జనాభా ఉన్నారు.. జిల్లాలు, మండలాలు, పంచాయతీలు వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎప్పటికి కొత్త ఓట్లు పెరుగుతాయి.. అనే వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్స్ ఏర్పాటు చేసుకొని అధికారికంగా  జనగణన చేపడుతున్నారు. దీనిలో ఈసారి ప్రభుత్వం నిర్వహించబోయే జనగణనకు ముందే ఏఏ సామాజిక వర్గాల్లో ఎంతమంది ఉన్నారనే విషయం తేలిపోనుంది. అందులోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ సామాజిక జనగణనకు ప్రాధాన్యత ఏర్పడింది.

జనాభా, ఓట్లను బట్టీ ఇకపై సీటు డిమాండ్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయపార్టీలను రాష్ట్రంలోని సామాజిక వర్గాలకు చెందిన వారు తమ సామాజిక వర్గం ఓట్లను బేరీజు చేసుకొని, వారి రాష్ట్ర, జిల్లా సంఘాల డిమాండ్ ల మేరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లను డిమాండ్ చేయాలని ఆలోచనకు వచ్చాయి. ఇప్పటి వరకూ డబ్బున్నవాడికే 
రాజకీయపార్టీలు సీట్లు ఇచ్చేవి. సామాజిక జనగణన పూర్తిస్థాయిలో జరిగితే కులాల వారీగా తప్పనిసరి పరిస్థితుల్లో సీట్లు ఇవ్వాల్సి వుంటుంది. అదే సమయంలో రాజకీయపార్టీలు సీట్లు నిరాకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లు నిరాకరించేవిధంగా కూడా ఇప్పటి నుంచే సామాజిక వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 
సాధారణంగా ఎన్నికల నాటికి రాజకీయపార్టీలు ఇచ్చేవారివే సీట్లు, పొందిన వారే అభ్యర్ధులు అన్నట్టుగా ఉండేది. కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికల ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది. 

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ద్వారా ఉద్యోగులు గుర్తింపు 
సామాజిక సంఘాలే కాకుండా ఇపుడు సామాజిక ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వశాఖలో ఉద్యోగం చేసినా..సాఫ్ట్ వేర్,  లేదా ప్రైవేటు డాక్టర్ ఉద్యోగాలు చేస్తున్నా వారిని ఆయా సామాజిక ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో సభ్యులుగా చేర్చి తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు నాయకులుగా వున్నవారు తమ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎక్కువ అంటే మాటలు చెల్లుబాటు అయ్యేవి. కానీ ఇపుడు రికార్డెడ్ ప్రూఫ్ మొత్తం సామాజిక గణనతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కూడా ఆధార్ కార్డు నెంబర్లుతో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో ఇపుడు ఏ సామాజిక వర్గంలో సాధారణ ఓట్లు, వాటితోపాటు ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ప్రైవేటు ఉద్యోగులు ఇలా ఎక్కడ ఉద్యోగం చేసినా వారి సంఖ్య, వివరాలతో ప్రత్యేక డేటాబేస్ ను తయారు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

ఆ రెండు సామాజిక వర్గాలుకే ఎప్పుడూ అధికారం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ వరకూ కేవలం రెండు సామాజిక వర్గాలు మాత్రమే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. ఈ తరుణంలో బీసిలు, ఎస్సీలు, ఎస్టీలకు కూడా రాజ్యాధికారం, ప్రభుత్వంలోని పదవులు, ఇతర నామినేటెడ్ పదవులు కూడా దక్కించుకోవాలనే లక్ష్యంతో చాలా సంవత్సరాల తరువాత అన్ని సామాజిక వర్గాల్లోనూ కదలిక వచ్చింది. దీనితో ఏఏ సామాజిక వర్గాల్లోని ఓటు బ్యాంకు ఎంతుందో మొత్తం లెక్కలు చూపించి.. రాజకీయపార్టీల దగ్గర బల ప్రదర్శన చేయడానికి సామాజిక వర్గాలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఓట్లు చీలిక రాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సామాజిక కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటిలో పదవులు ఇచ్చినా ఫలితం లేకుండా పోతుంది. ఇతర రాజకీయపార్టీలు ఈ సారికి సామాజిక బలం ఆధారంగా సీట్లు, ప్రభుత్వం ఏర్పాటయ్యాక  మంత్రులు, ఇతర ప్రత్యేక పదవులు ఇస్తామని ప్రకటిండచం కూడా ప్రస్తుతం సామాజిక వర్గ జనగణన, ప్రభుత్వ ఉద్యోగుల గణనకు ప్రత్యేక కారణం అవుతోంది. చూడాలి ఎన్నికలు సమీపించేనాటికి ఏ సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎంతుంటుందో మొబైల్ యాప్ లు, వెబ్ సైట్లు, ఇతర నెట్వర్కుల ద్వారా తేలిపోనుంది. అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు, ఓట్లు పోలింగ్ కూడా వచ్చే ఎన్నికల్లో సామాజిక వర్గాల జనగణన మీదే ఆధారపడి ఉండేలా కనిపిస్తుంది..! 

Visakhapatnam

2022-12-12 05:00:16

మేం దృష్టిపెడితే హెరిటేజ్ నడిచేదా..ఈనాడు పనిచేసేదా

రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను కానీ, రాష్ట్రానికి రానున్న పరిశ్రమలను కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడటం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి విఘాతం కలిగించే విధంగా రెండు దినపత్రికలు శనివారం ప్రచురించిన తప్పుడు కథనాలపై అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. శనివారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని.. ఇందులో భాగంగానే అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందన్న ఒకే కథనం రెండు దినపత్రికల్లో ప్రచురితం కావడాని బట్టి చూస్తే, ఇది చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అని అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు అవాస్తవాలను ప్రచురిస్తున్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

 చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ కంపెనీ కార్పొరేట్ కార్యాలయం హైదరాబాదులో ఉన్నా, హెరిటేజ్ సామ్రాజ్యమంతా ఆంధ్రప్రదేశ్లోని విస్తరించి ఉంది కదా? దాని జోలికి ఎప్పుడైనా మా ప్రభుత్వం వెళ్లిందా? అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలను తాము రాజకీయ కోణంలోనే చూస్తే చంద్రబాబు ఏపీలో హెరిటేజ్ కంపెనీని నడిపించగలరా?  అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ, రామోజీరావు ఏపీలో ప్రింటింగ్ ప్రెస్ లను నడపటం లేదా? అలాగే రామోజీరావు మార్గదర్శి కార్యకలాపాలను కొనసాగించడం లేదా? ప్రభుత్వం వీటిపై కక్ష కట్టి ఉంటే ఇప్పటికీ ఇవి సజావుగా ఎలా నడుస్తున్నాయని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. 
రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను తీసుకువచ్చి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని, తద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తుంటే, దీనిపై తప్పుడు కథనాలు వండి వడ్డించి ప్రజలను తప్పుతో పట్టిస్తున్న ఆ పత్రికలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.  
గడిచిన ఆరేడు నెలల్లో రాష్ట్రంలో పలు పరిశ్రమలను ప్రారంభించామని, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశామని, సుదీర్ఘమైన సముద్రతీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని అమర్నాథ్ వెల్లడించారు. కాకినాడలో సుమారు వంద కోట్ల రూపాయలతో యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. 

దేశవ్యాప్తంగా సాగుతున్న ఆక్వా ఎగుమతులలో 45 శాతం ఏపీ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక ప్రణాళిక వాస్తవాలకు దగ్గరగా ఉందని అమర్నాథ్ చెప్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో మూడుసార్లు నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్లలో 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకున్నారు. వాస్తవానికి 34 వేల రూపాయల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని అమర్నాథ్ స్పష్టం చేశారు. అప్పట్లో వాస్తవాలు వెల్లడించలేని ఈ రెండు పత్రికలు, ఇప్పుడు రాష్ట్రం నుంచి లక్ష డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వెనక్కి వెళ్లిపోయాయన్న తప్పుడు కథనాలు సిరాతో రాస్తున్నాయా? సారా తాగి రాస్తున్నాయని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు ఆయన తోక పత్రికలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి అమర్నాథ్ తీవ్రంగా హెచ్చరించారు.

Visakhapatnam

2022-12-03 11:35:26

ప్రజాసేవతోనే ఉన్నత స్థాయి గుర్తింపు

ప్రజాసేవయే పరమావధిగా భావించి ముందుకు సాగిన  వ్యక్తులు ఎవరైనప్పటికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి తగిన గుర్తింపు లభించడం ఖాయమని ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎయూ రిజిస్ర్టార్ ఆచార్య వి.కృష్ణమోహన్ లు అన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా , సీనియర్ పాత్రికేయుడిగా విశేష సేవలందిస్తున్న వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును తాజాగా అంతర్జాతీయ విశాఖ విమానాశ్రయం సలహామండలి సభ్యుడిగా కేంద్రము నియమించిన నేపధ్యంలో శనివారం ఇక్కడ పెదవాల్తేరులో ఉత్తరాంధ్ర విద్యార్ధి సేన అత్యంత ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తొలుత రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి జర్నలిజం వృత్తిలో రెండు దశాబ్ధాలకు పైగా సేవలందిస్తూ అంచలంచెలుగా ఎదిగిన గంట్ల శ్రీనుబాబుకి ఈ పదవి దక్కడం అభినందనీయమని కొనియాడారు.  ఉన్నత విద్యాభ్యాసం సాగించి సైకాలజీలో గోల్డ్ మెడల్ పొందిన శ్రీనుబాబు నేటి విద్యార్ధులకు కూడా ఆదర్శప్రాయుడన్నారు.  మెట్రోపాలిటన్ సిటీలో  మరింత మెరుగ్గా విమానాశ్రయ సేవలు ప్రజలకు అందే విధంగా తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ పార్టీల రహితంగా ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న శ్రీనుబాబు భవిష్యత్తులో మరింతగా సేవలందించాలని కోరారు. జర్నలిజం వృత్తిలో ఉంటూ , అనేక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే శ్రీనుబాబుకి మరిన్ని ఉన్నత పదవులు వస్తాయని మాధవ్ ఆకాంక్షించారు. నిరంతరము పాత్రికేయులకు అండగా ఉంటూ వారి మన్ననలు పొందడం అభి నందనీయమన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ జర్నలిస్టులకు నాయకత్వం వహిస్తున్న గంట్ల శ్రీనుబాబుకి ఈ పదవి దక్కడం హర్షణీయమని ఇప్పటికే సింహాద్రినాధుడు భక్తులకు మెరుగైన సేవలందించే విధంగా ఆయన కృషి చేస్తున్నారన్నారు. రానున్న కాలంలో విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమం నిర్వాహకులు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన అధ్యక్షులు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నిరంతరం అందుబాటులో ఉండే శ్రీనుబాబుకు మరిన్ని ఉన్నత అవకాశాలు రావాలని తామంతా కోరుకుంటున్నామన్నారు.  ఉత్తరాంధ్రకు చెందిన ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శ్రీనుబాబు అందిస్తున్న సేవలు ఎంతో మంది యువ నాయకులకు ఆదర్శప్రాయమన్నారు. సామాన్య ప్రజానీకానికి కూడా అండదండ లుగా నిలుస్తున్న శ్రీనుబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని, అటువంటి వ్యక్తికి మరిన్ని మంచి అవకాశాలు ఇస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.ఉత్తరాంధ్ర యువతకు ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ,  సీనియర్ పాత్రికేయులు సుంకరి సూర్యం, విజయకుమార్, స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ అధ్యక్షులు ఆర్ బసవ కృష్ణమూర్తి, దళిత మేధావుల వేదిక అధ్యక్షులు సుందర్ సింగ్, ఏపీ స్టడీ సర్కిల్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కే ఆనంద్ కుమార్, పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రౌతు గోపి, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన క్యాంపస్ ఇంచార్జ్ సుబుద్ధి శ్రీరామ్, విద్యార్థి నాయకులు చైతన్య వేణుగోపాల్ సన్యాసినాయుడు ప్రసాద్ లతో పాటు ఏయూకు చెందిన పలువురు పరిశోధక విద్యార్ధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-26 08:10:22