1 ENS Live Breaking News

ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన జనసేనాని..!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాడిన్నర సమయం ఉంది.. 2024లో జరిగే ఎన్నికల్లో జరిగే రాజకీయం అపుడే రాష్ట్రంలో మొదలైపోయింది. టిడిపి అధినేత ప్యాకేజీలతో రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు, విశాఖ గర్జన సందర్భంగా చోటుచేసుకున్న పరిణమాలు.. మంగళగిరి సభలో నేరుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై జనసేనాని చెప్పుచూపించి మరీ  రెచ్చిపోయిన వైనం.. ఇలా ఏ కోణంలో చూసినా  ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారిపోయిందనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీచేస్తామని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇపుడు టిడిపీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కావడం పట్ల తెరవెనుక రాజకీయం ఏం జరగబోతుందనే ప్రశ్నలకు ఊతమిచ్చింది. ఓ ప్రక్క అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ అధికారపార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్న తరుణంలోనే జనసేన, టీడీపీ కలిసి రాజకీయం మొదలు పెట్టడం వరుస భేటీలపై ఏ విధంగా స్పందించాలో కూడా తెలియని పరిస్థితి ఇటు విశ్లేషకులకు మదిలో సైతం నెలకొంది.

విశాఖ గర్జన రోజున పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ సక్సెస్ కావడం, ఆ కార్యక్రమానికి గంటల ముందు అధికారిపార్టీ, జేఏసి ఆధ్వర్యంలో చేపట్టిన గర్జన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవడంతొ ఎన్నికలవేడి వెంటనే రాజుకుంది. ఆ సమయంలోనే ఎవరికి ఎవరూ తగ్గకుండా పోటీ పోటీ ప్రకటనలు చేస్తూ ఎలక్షన్ హీట్ ను ఇప్పటి నుంచే రాష్ట్రంలో మొదలు పెట్టారనే సంకేతాలను పంపినట్టు అయ్యింది. పవన్ కళ్యాణ్ అండ్ కో టీమ్ ని అరెస్టు చేయడం ద్వారా ప్రజల్లో జనసేన కు మరింత బలం చేకూరిందని ఓ వర్గం చెబుతుంటే..అలా జరగడమే రాజకీయ వేడిలో నెయ్యిపోసినట్టు అవుతుందని మరో వర్గం ప్రచారం చేస్తున్నది. 2019 ఎన్నికల నుంచి కలిసి నడవకపోయినా పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ దెబ్బతో టిడిపీతో కలిసే పోటీచేస్తారనే సంకేతాలను ప్రజల్లోకి పంపారా అనికూడా చెబుతున్నారు.  మిక్సిడ్ పొలిటిక్ వార్ మొదలు పెట్టాలంటే ఇదే సమయంగా జనసేన కూడా భవిస్తున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.

టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ సుదీర్ఘ సమయం బేటీ అయి పలు రాజకీయ పరమైన అంశాలు, విశాఖలో అరెస్టులు, త్వరలో చేపట్టబోయే కార్యాచరణ మొత్తం చర్చించారని చెబుతున్నారు. ఒక రకంగా మంగళగిరి సభలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ పూర్వకంగానే చెప్పు చూపించి రాజకీయ వేడిరాజేశారని..దానికి చంద్రబాబే కారణమని కూడా ప్రచారం జరిగింది. అధికారపార్టీకి ఎంత సొంత మీడియా ఉన్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సోషల్ మీడియా అంతకు రెండింతలు ఉపయోపడుతున్న వేళ వీరిద్దరూ ఎలాంటి అడుగులు ముందుకు వేసినా అది ప్రజల్లో తీవ్ర సంచలనానికి కేంద్రబిందువు అవుతోంది. గతవారం రోజులు నుంచి జరుగుతున్న పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనే విషయంలో పరిశీలకులు సైతం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తాజా పరిస్థితిని గమనిస్తే..వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురూ కలిసి పోటీచేసి(మిక్సడ్ పాలిటిక్స్ ప్లేచేసి) అధికార వైఎస్సార్సీపీకి గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. చూడాలి ఈ పొలిటికల్ హీట్ ఎలాంటి ప్రభావం రానున్నరోజుల్లో ఏపీరాజకీయాల్లో చూపిస్తుందనేది..!

Vijayawada

2022-10-18 10:49:55

ఎన్ని అడ్డంకులు వచ్చినా విశాఖ రాజధానే

ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా విశాఖ రాజధానిని సాధించి తీరుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను తెలియజెప్పేందుకు మన విశాఖ.. మన రాజధాని పేరుతో జేఏసీ ఏర్పాటు చేశారని చెప్పారు. విశాఖను రాజధానిగా చేసుకునేందుకు ఆదివారం నిర్వహించనున్న విశాఖ గర్జనకు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75  సంవత్సరాలు పూర్తయినా ఉత్తరాంధ్ర ఇప్పటికీ పూర్తి వెనుకబాటుతనంతో ఉందని అన్నారు.  ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన భవిష్యత్ తరాలు బాగుపడవని ఆయన అన్నారు. రేపు మొదలవుతున్న పోరాటం కేవలం ఉత్తరాంధ్రకే కాదు, ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా అని అమర్నాథ్ అన్నారు.

 కేంద్రీకరణ వల్ల జరిగిన నష్టం పునరావృతం కాకూడదని దీనివలన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు.  దండయాత్ర చేస్తున్న రైతులకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని.. ఎందుకంటే, తాము పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇప్పటివరకు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వారిపై పోరాటం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలను ప్రేరేపించింది అమరావతి రైతులేనని ఆయన అన్నారు. విశాఖ గర్జనకు వేలాదిగా తరలి వస్తున్న జనం అహింసా మార్గంలో వారి ఆకాంక్షలను పాదయాత్ర చేస్తున్న రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా ప్రాంత అభివృద్ధి కోసం జరుగుతున్న ఉద్యమాన్ని పత్రికల్లోనూ, మీడియాలోనూ రాకపోయినా పర్వాలేదు కానీ, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను హేళన చేస్తూ చూపించవద్దని మంత్రి అమర్నాథ్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.

జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ మాట్లాడుతూ విశాఖ రాజధానిగా ఏర్పడడానికి ఎవరు అడ్డు పెట్టొద్దని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుండి బయటపడటానికి ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్న ఈ సమయంలో ఈ అవకాశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. 1956లో విశాఖపట్నాన్ని శాశ్వత రాజధానిగా చేయాలని నిర్ణయించినా, రాజకీయ పెద్దల మద్దతు లేకపోవడం వల్ల అది కలగానే మిగిలిపోయిందని  అన్నారు. మరోసారి విశాఖ రాజధాని కావడానికి అవకాశం వచ్చిందని దీన్ని మిగిలిన ప్రాంతాల వారు కూడా సహకరించాలని లజపతిరాయ్ విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజధాని కావడానికి విశాఖకు అన్ని  హంగులు ఉన్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి దేవుడు జగన్మోహన్రెడ్డి రూపంలో వచ్చి విశాఖ రాజధానికి అవకాశం కల్పించాడని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఉత్తరాంధ్రకు కూడా మంజూరు చేసింది అంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని కేంద్రం గుర్తించినట్లే అయిందని అన్నారు. భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మూడు ప్రాంతాలు భిన్నంగా ఉన్నందువలన ఈ మూడింటినీ అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని అవంతి శ్రీనివాస్ అన్నారు.

ప్రభుత్వ విప్ ధర్మశ్రీ మాట్లాడుతూ విశాఖ గర్జన ఉద్యమాన్ని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్న పార్టీలు రాజకీయ సమాధి అవుతాయని హెచ్చరించారు. వాతావరణం అనుకూలించినా, అనుకూలించకపోయినా విశాఖ గర్జన కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు. జేఏసీ నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ గర్జనను విజయవంతం చేసే బాధ్యత మీడియాపై ఉందని అన్నారు.  ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే, కొన్ని పత్రికలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి విషయంలో ఉత్తరాంధ్ర ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కనీసం విశాఖ విమానాశ్రయానికి విమానాలు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆయన అన్నారు. 

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే విశాఖకు విమానాల రాకపోకలు పెరిగాయని, నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్, బి హెచ్ పి వి, షిప్ యార్డ్ లను ఆదుకున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మోకాలడ్డం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజల గుండెచప్పుడు అని అడ్డుకుంటే తాట తీస్తా మని ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.శివశంకర్ మాట్లాడుతూ జేఏసీ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్త స్పందన లభిస్తోందని అన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే విశాఖనగరం ఒక్కటే అభివృద్ధి చెందదని, వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. విశాఖ గర్జన కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేరుగ నాగార్జున, జోగి రమేష్ ,మాజీ మంత్రి కొడాలి నాని హాజరవుతున్నారని ఆయన తెలియజేశారు. 

వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే మరొక ప్రాంతం వాళ్లు వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమానికి ఆ ప్రాంత మీడియా ఏ విధంగా మద్దతు పలికిoదో, విశాఖ రాజధానికి ఈ ప్రాంత మీడియా కూడా అంతే బలంగా మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ దేవుడు మాస్టారు, విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ, ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ట్రేడ్ యూనియన్ నాయకుడు మంత్రి రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు రొంగలి జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.

2022-10-14 11:21:43

విశాఖలో ఎంపీల మాటల యుద్ధం సైరా సై సై.. ఎంవీవీ తగ్గేదేలె..!

పరిపాలన వికేంద్రీకరణతోనే అభివ్రుద్ధి సాధ్యమని..మూడు రాజధానులు కావాలనే నినా దంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమంపై అంతా చాలా పెద్ద స్థాయిలో ఊహించుకునే సమయంలో  ఇదే పార్టీకి చెందిన ఎంపీ, మరో రాజ్య సభ్య సభ్యుడు భూ కబ్జాలు, గొడవులు ఆందోళనలపై ఒకరి పై ఒకరు సంచలవ్యాఖ్యలు చేస్తూ.. హాట్ టాపిక్ గా మారారు. ఒకప్పుడు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దగ్గర ముగిసిందనుకున్న పంచాయతీ సరిగా విశాఖ గర్జన కుమందు రాజుకోవడం ఇపుడు మరింత ముదిరి పాకాన పడింది. రాజ్యసభ సభ్యుడు సై సైరా అంటే..మరో ఎంపీ ఎంవీవీ తగ్గేదేలె అన్నట్టుగా మాల యుద్ధం చేసుకుంటున్నారు. విశాఖలో భూ ఆక్రమణలపై మీడియా కోడైకూస్తున్న సమయంలో వాటికి ఆజ్యం పోసేల విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, విశాఖ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డిలు ఒకరిపై ఒకరు చేస్తున్న వ్యాఖ్యలు మీడియా చేస్తున్న అక్షర సేద్యానికి మరింత ఊతాన్ని, కోత్త ఆలోచనలు, లోతైన సమాచారాన్ని ఇస్తున్నాయి. 

పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే విశాఖలో కావాల్సిన భూములు తీసుకునేందుకు విజయసాయిరెడ్డి బంధువులు భూ యజమానులపై దాడులు చేయడం.. వారి భూములను 22ఏలో పెట్టి ఆ తరువాత బెదిరించి వారికి అనుకూలంగా రాయించుకోవడం వంటివి చేస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ బహిరంగంగానే ఆరోపించారు. అంతేకాదు ఒకానొక దశలో సదరు వివరాలతో ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా సిద్దమయ్యారు. కానీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆ ప్రయత్నం నుంచి వెనక్కి తగ్గారు. తాను ప్రైవేటు భూముల్లో ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు చేసుకున్నాను తప్పితే ఎక్కడా ప్రభుత్వ భూమిని లాక్కోలేదన్నారు. పైగా ప్రభుత్వ భూములు కబ్జాకి గురవకుండా వ్యతిరేకంగా పోరాడమని పరోక్షంగా  దసపల్లా భూములను ఉద్దేసిస్తూ ఎంవీవీ మాట్లాడటం కూడా ఇపుతు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇదే విషయంలో విశాఖలోని మీడియా కూడా రోజుకో కొత్త కథనాన్ని వెలుగులోకి తీసుకు రావడం కూడా ఎంపీలిద్దరూ చేసుకుంటున్న పరస్పర ఆరోపణలకు ఊతం ఇచ్చినట్టు అయ్యింది.  

అయితే ఇక్కడ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ చేసే అన్ని ప్రాజెక్టుల్లోనూ భూ యజమానులకు ఒక్కశాతం వాటా ఇచ్చి 99శాతం వాటా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటాలు తానెక్కడా చూడలేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ తరహా వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై అటు ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ కూడా  ముందు అతనికున్న మురికి వదిలించుకోమనండి. ఇతరు కోసం ఎందుకు అంటూ ఘాటుగానే స్పందించారు. వాస్తవానికి విశాఖలో విజయజసాయిరెడ్డి ఒక పెద్ద తరహాలో ప్రభుత్వంలో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ తాను ఎక్కడా తగ్గేది లేదు అంటూ ఎంపీ ఎంవివి సత్యన్నారాయణ సైతం విజయసాయిరెడ్డిపైనే సై అంటే సై అన్నట్టుగా వ్యవహరించడం.. అదీ విశాఖ గర్జన కుమందు ఈ పంచాయతీ తారాస్థాయికి చేరుకోవడం అధిస్థానానికి తలనొప్పిలా మారింది. ఇంతకీ 15వ తేదీన చేపట్టే విశాఖ గర్జన విజయసాయిరెడ్డితోపాటు, ఎంవీవీ అతని అనుచరులు హాజరవుతారా లేదా అనేది కూడా ఇపుడు హాట్ టాపిక్ గా మారింది..!

విశాఖపట్నం

2022-10-13 17:38:10

గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించాలి

అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని ఉత్తరాంధ్ర ప్రజల బలమైన కోరిక విశాఖ గర్జన ద్వారా రాష్ట్రమంతా విడిపించాలని, ఈ గర్జన ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్కే బీచ్ లో విశాఖ గర్జనకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని మంత్రి అమర్నాథ్ గురువారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖను పరిపాలన రాజధానిగా చేసి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేయాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని అమలు చేయాలనుకుంటే ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు పడుతున్నాయని అన్నారు. 

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణకు మద్దతుగా 15వ తేదీన నిర్వహిస్తున్న విశాఖ గర్జనను విఫలం చేయాలని, ప్రతిపక్షాలతో పాటు, మరికొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నా, తాము తగ్గేదే లేదని.. విశాఖ రాజధానిని సాధించి తీరుతామని అమర్నాథ్ స్పష్టం చేశారు. గర్జనలో కార్మికులు, కర్షకులు, యువకులూ, వృద్ధులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.

2022-10-13 15:32:15

విశాఖ గర్జనను విజయవంతం చేయాలి

విశాఖ పాలనా రాజధానిగా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని, ఆ నిర్ణయం కార్యరూపం దాల్చి వలసిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్,  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. ఈనెల 15వ తేదీన విశాఖలో నిర్వహించనున్న విశాఖ గర్జన కార్యక్రమ సన్నాహక సమావేశం మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, దీనికి ప్రతిపక్షపార్టీ అడుగడుగునా అడ్డు పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో  వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

 రాష్ట్ర విభజన సమయంలో ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిషన్ రాష్ట్ర తర్వాత సర్వతోముఖాభివృద్ధికి అధికార వికేంద్రీకరణ అవసరమని పేర్కొన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం అమరావతినే రాజధానిగా నిర్ణయించిందని సుబ్బారెడ్డి అన్నారు. అమరావతి కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుందని, దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు అనువుగా మార్చుకున్నారని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అమరావతి వాసులు ఎందుకు అడ్డుకుంటున్నారని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడం లేదు కదా అని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర పౌరుడిగా ప్రతి ఒక్కరూ విశాఖ గర్జనకు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు హాజరుకావాలని, అక్కడి నుంచి పార్క్ హోటల్ వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర సాగుతుందని, మార్గమద్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయా ప్రాంత ఇన్చార్జ్ చర్యలు తీసుకుంటారని సుబ్బారెడ్డి తెలియజేశారు.

మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్రగా వస్తున్న అమరావతి వాసులు ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. విశాఖను ఎందుకు రాజధాని చేయాలనే విషయాన్ని పాదయాత్ర చేస్తున్న వారికి తెలిసేలా విశాఖ గర్జన ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎంపీ సత్యవతమ్మ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కన్నబాబురాజు, అదీప్ రాజ్, మేయర్ హరి వెంకట కుమారి, మాజీ మంత్రి బాలరాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, తిప్పల గురుమూర్తి రెడ్డి, ఎస్ఏ రెహమాన్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 15:30:22

ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్ధులకు కత్తిమీదసామే..!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార, ప్రతిపక్షపార్టీలతోపాటు అభ్యర్ధులందరికీ కత్తిమీద సాములా మారాయి. ఒకప్పుడు ఎన్నికలంటే ఓటరుకి ఏమీ తెలిసేది కాదు. ఎన్నికల సమయంలో ఓటుకి నోటు, బీరు, బిర్యానీ ఇస్తే ఓటు పడిపోయేది. కానీ 2019 ఎన్నికలు తరువాత ప్రజలకు ఎన్నికలంటే ఏంటో..పోటీదారులు ఎంత ఖర్చు చేస్తారో..ఆ తరువాత పదవిలోకి వచ్చిన తరువాత ఎంతెంత రాబడతారో మొత్తం ఓటరు అవగాహన చేసుకున్నాడు. ఈ తరుణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఇపుడు అన్ని వర్గాల ఎమ్మెల్సీ అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. గెలుపుపై ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది మొదలు అభ్యర్ధులు సమాలోచనలో పడ్డారు. ఓటర్లను విభజన చేస్తే తప్పా తమకు ఓట్లు పడవని భావించి ఆదిశగా అడుగులు వేస్తున్నారు. అయినప్పటికీ అభ్యర్ధులకు ఎక్కడో కొడుతూనే ఉన్నది. అలాగని అధికారపార్టీ అభ్యర్ధులుకూడా ఆందోళన పడుతున్నా వారికి ఒక వర్గం ఓట్లు పడతాయనే ధీమా మొదలైంది.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకంగానే..
ఈసారి జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి పూర్తిగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే వాదన బలంగా వినిపిస్తుంది. అలాగని ప్రతిపక్షపార్టీలకు ఓట్లు పడతాయా అంటే ఆ విషయంపై కూడా క్లారిటీ రాలేదు. ఇపుడు స్వతంత్ర్య అభ్యర్ధులు.. బాగా చదువుకొని ప్రజాసేవలో ముందున్న అభ్యర్ధులకే కాస్త వాతావరణం అనుకూలంగా కనిపిస్తున్నది. పీర్సీ ఇచ్చిన సమయంలో ప్రభుత్వంహెచ్ ఆర్ఏ, డీఏలో భారీగా కోతలు విధించడంతో ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు. కొంత మంది గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగులు ప్రభుత్వానికి విదేయులుగా ఉన్నా ఎంత శాతం మేర ఓట్లు పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రిఫరెండం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సారి ఓటర్లు బలంగా నిశ్చయించుకున్నారనే ప్రచారం రాష్ట్రంలో గట్టిగా జరుగుతోంది. అయితే దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి సమీకరణలు కూడా గట్టిగానే చేస్తున్నది. కాగా వ్యతిరేక ఓటు బ్యాంకును మాత్రం వామపక్షాల అభ్యర్ధులు కేష్ చేసుకునే అవకాశాలే అధికంగా ఉన్నాయి.

సామాజిక వర్గం, యువ సంఘాలే కీలకమా..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి సామాజిక, యువ సంఘాలు కీలక పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకలు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఏఏ సామాజిక వర్గం నుంచి ఎవరు బరిలో దిగుతున్నారో ముందుగానే చర్చించుకొని ఆయా సామాజిక వర్గం ఓట్లు వారి అభ్యర్ధికే వేయాలనే సంకల్పంతో కార్యాచరణ చాపకింద నీరుగా సాగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. దానికోసం ఓటరు నమోదు కార్యక్రమం కూడా కాస్త గట్టిగానే చేపడుతున్నారు. గత ఎన్నికల ఓటరు జాబితా మొత్తం రద్దు చేయడంతో, కొత్తగా ఓటర్లు నమోదు కావాల్సి ఉన్నందున పెద్ద ఎత్తున సామాజిక వర్గాలు, యువ సంఘాలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నాయి. మరికొందరు యువతను మచ్చిక చేసుకొని ఓట్లు ఆన్ లైన్లో కూడా నమోదు చేయిస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే..ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేదిశగా ఓటరు నమోదు కార్యక్రమాలు చేస్తున్నారు. అందులోనూ సామాజిక వర్గాల్లో ఆర్ధిక, అంగ బలాన్ని ఈ ఎన్నికల్లోనే ప్రదర్శించుకోవాలని అన్ని సామాజిక వర్గాలు పోటీ పడి మరీ పనిచేస్తున్ాయి.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఓట్లూ డౌటే..
అధికార పార్టీ అభ్యర్ధులకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఓట్లు కొద్దిమేర పడవనే సంతకేతాలను సాంకేతిక అంశాలు రుజువు చేస్తున్నాయి. కారణం ఈ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మందికి ఇంటర్, డిప్లమా చేసినవారే. ఇక్కడ మూడేళ్ల డిప్లమాకి  ఓటు ఉన్నప్పటికీ, రెండేళ్ల డిప్లమా(అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ) కి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో  ఓటు లేదు. అలాగని వీఆర్వోలాంటి ఉద్యోగులకు కూడా ఓట్లు లేవు. ఎందుకంటే ఆ పోస్టుకి చాలా మంది ఇంటర్మీడియట్ చదువుకున్నవారు దరఖాస్తు చేసుకున్నవారు అధికంగా ఉన్నారు. అంతేకాకుండా ఇటు గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా సర్వీసుప్రొభేషన్ డిక్లేర్ చేసిన సమయంలో వారికి పీఆర్సీతో పెంచిన జీతం ఇస్తున్నామని చెప్పిన ప్రభుత్వం వారికి రావాల్సిన ఎరియర్స్ మాత్రం ఇవ్వలేదు. పైగా ఉద్యోగులకు రెండేళ్ల తరువాత చేయాల్సిన సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ 9నెలలు అదనంగా పొడిగించడంతో వారంతా పేస్కేలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయంలో కూడా చాలామంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు. అలాగని వీరి విషయంలో ప్రతిపక్షపార్టీలు కూడా ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో సదరు పార్టీల కోసం కూడా ఉద్యోగులు ఆలోచించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తున్నది.

స్వతంత్ర అభ్యర్ధులు, వామపక్షాలకే ఎక్కువ మద్దతు..
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షపార్టీలకంటే స్వతంత్ర అభ్యర్ధులు, వామపక్షాలకే మద్దతు ఎక్కువగా వచ్చేటట్టు..ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం నిరుద్యోగ పట్టభద్రుల విషయంలో అధికారంలో వున్న ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎలాంటి ప్రకటనలూ చేయకపోవడమే ప్రధానంగా కనిపిస్తున్నది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్ధులు తమ సత్తాను ప్రదర్శించి, అధికార ప్రతిపక్షపార్టీలకు ధీటుగా నిలబడేలా ఉన్నారు. దానికోసం వారి సామాజిక వర్గాలు, యువత, ప్రత్యర్ధి అభ్యర్ధులంటే మండి పడే ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులు, నిరుద్యోగుల నుంచి వారికి పూర్తిస్థాయిలో మద్దతు కనిపిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ వ్యతిరేక వర్గం ఓటు బ్యాంకు మొత్తం వామపక్ష అభ్యర్ధులపై వేపే చూస్తున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అయితే తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేశారనే ఒకే ఒక్క కారణంలో సచివాలయంలో పనిచేసే అగ్రభాగం పట్టభద్రులు మాత్రం అధికారపార్టీకే ఓట్లు వేసే అవకాశం వుంది. చూడాలి ఈసారి జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది. ఎవరిని చట్టసభలకు పంపించనన్నది అనేది..!

2022-10-13 03:52:35

నిరుపేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఉన్నది

నిరుపేదల సంక్షేమం కోసమై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ 25వ డివిజన్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. భానువారివీధి, పాలెపువారివీధి ప్రాంతాల్లో సిటీ ఎమ్మెల్యే  ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గడచిన మూడేళ్ళలో ప్రభుత్వం అందించిన లబ్ధిని ప్రజలకు వివరించారు.  ప్రజలు  ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే అవకాశం దక్కడం ఒక ప్రజాప్రతినిధిగా ఎంతో సంతోషంగా భావిస్తున్నానన్నారు. 

ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండడం ప్రజల అదృష్టంగా పేర్కొన్నారు. నవరత్న పథకాలు ద్వారా పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపారన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రాతిపదికగా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాల సొమ్మును నేరుగా ఖాతాల్లో జమ చేసే వి«ధానం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో కాకినాడ నగరంలోని అన్ని డివిజన్లలోను పర్యటిస్తామని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో  కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, కార్పొరేషన్‌ కార్యదర్శి ఎం.ఏసుబాబు, టీపీఆర్వో మానే కృష్ణమోహన్, సచివాలయ ఉద్యోగులు, మాజీ కార్పొరేటర్లు జగన్నాథన్‌విజయ్‌కుమార్, రాగిరెడ్డి బన్ని, కామాడి సీతదశరథ్, నల్లబెల్లి సుజాత, బొర్రా రమణ, సంగాని నందం, కొప్పనాతి సత్యనారాయణ, వెలమల మల్లేశ్వరరావు, పేర్ల జోగారావు,   పినపోతు సత్తిబాబు, చవ్వాకుల రాంబాబు, వాసిరెడ్డి రాంబాబు,  పలువురు అధికారులు పాల్గొన్నారు.

2022-10-12 13:33:22

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా రూటు ఎటు..?

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఓటింగ్ కీలకంగా మారుతుందా.. అధికారపార్టీ, ప్రతిపక్షంతోపాటు ఇతర పోటీ అభ్యర్ధులకు నోటా భయం అపుడే పట్టుకుందా.. అంటే అవుననే సంకేతాలు విన వస్తున్నాయి.. కల్లబొల్లి మాటలతో అప్పనంగా ఓట్లు వేయించుకొని తీరా గెలిచి శాసన మండలికి వెళ్లిన తరువాత తమకు నచ్చినట్టుగా వ్యవహరించి, ఆఖరులో పెన్షన్, ఇంటి స్థలాల కోసం రాజకీయం చేసే నేతల తేడా రాజాకీయాన్ని ఈ సారి నిరుద్యోగ పట్టభద్రులు, ఉపాధ్యాయులు గట్టిగానే ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నోటా ఓటింగ్ భారీగా పడటంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నోటాకి ఓటింగ్ గట్టిగానే పడుతుందని చెబుతున్నారు. 

ప్రస్తుతం అన్ని రకాల ఎన్నికలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన రావడం, దానికి తోడు ఎవరు ఎన్నికల్లో నిలబడి రాజకీయం చేసినా ఓట్లర్లకి ఏమీ ఒరగక పోవడంతో చైతన్యవంతులవుతున్న ఓటర్లు..ఓటు హక్కును వినియోగించుకుంటూనే దానిని ఎవరికీ పనిచేయకుండా నోటాకి వేసేందుకు సిద్ధమవుతున్నారు. శాసన మండలికి వెళ్లే పెద్దలకి ఓట్లు వేసి గెలిపించిన వారి కష్టాలు కనిపించడం లేదని, పార్టీ టిక్కెట్టుపై గెలిచినా.. ఇండిపెండెంట్ గా గెలిచినా.. చివరకు అధికారపార్టీలో విలీనం అయిపోవడం.. ఆపై ప్రశ్నించి న్యాయం చేయాలనుకున్న డిమాండ్లను పడుకోబెట్టడం కూడా ఓటర్లకు మింగుడు పడటం లేదు. దీనితో 2024 శాసన సభ ఎన్నికలకు ఏడాది ముందుగా జరిగే ఈ శాసన మండలి ఎన్నికలను జనరల్ ఎలక్షన్స్ కి రెఫరెండంగా చేయాలని కూడా చాలా మంది విద్యావంతులు కంకణం కట్టుకున్నట్టుగా సోషల్ మీడియలో ట్రోల్ అవుతున్న పోస్టులను బట్టి అర్ధమవుతున్నది. 

ముఖ్యంగా పార్టీలు నిలబెట్టే అభ్యర్ధులు ఆయా రాజకీయపార్టీలకు అనుగుణంగా పనిచేయడం, నిరుద్యోగ పట్టభద్రులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను పక్కనబెట్టి వారి పార్టీ అభవ్రుద్ధితో పాటుపడటం, వారి సొంత ఖజానాని నింపుకోవడం కూడా ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడంటే ఎలాంటి ఎన్నికలైనా రాజకీయనాయకుల గారడీ మాటలు, పార్టీ సెంటిమెంటు, అభ్యర్ధులపై ఉన్న అభిమానంతో జరిగేవి. కానీ ఈసారి జరిగే ప్రతీ ఎన్నికపై 18ఏళ్లు దాటిన ఓటరు దగ్గర నుంచి పట్టభద్రుడు, ఉపాధ్యాయుడు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సైతం ప్రభావితం చేయడంతో అన్ని వర్గాల ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని నచ్చినట్టుగా ఓటు వేస్తున్నారు.అందునా నోటా ఓటుకి ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతుండటంతో అందరిలో చైతన్యం మరింత ఎక్కువవుతోంది.

సాధారణ ఎమ్మెల్యే ఎన్నికలను తలపించే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అభ్యర్ధులు ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం ఇపుడు ప్రతీ ఒక్క ఓటరు ఎంతగానో ఆలోచింప చేస్తున్నది. ఇంత మొత్తం ఖర్చుచేసి ఎన్నికల్లో టిక్కెట్టు పొంది గెలిచినవాడు..ఖర్చు పెట్టిన సొమ్ము అధికారంలో ఉండగానే రాబట్టుకోవాలని చూస్తాడు తప్పితే, ఓట్లు వేసి గెలిపించిన వారికోసం ఏం ఆలోచిస్తాడనే విషయం గత పదేళ్ల నుంచి ప్రతీ ఓటరు గమనిస్తున్న అంశం. అయితే ఇక్కడ భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటువేసే హక్కును ప్రతీ ఒక్క పౌరుడూ జనరల్ ఎన్నికలతోపాటు, పెద్దలకు సభకు ఓటు హక్కు ఉండే పట్టభద్రులు, ఉపాధ్యాయులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చేసే విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సామాజిక బాధ్యతను తన బుజాలపై వేసుకుంది. ఎన్నికల సరళిని, జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఓటరు ముందుకి ప్రత్యేక కధనాలుగా తీసుకు వస్తూ వారిని చైతన్య పరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. 

ఈ నేపథ్యంలో ఈఎన్ఎన్ అందిస్తున్న వాస్తవాలు చాలా రాజకీయ పార్టీలు, డబ్బు ఖర్చుచేసి ఓట్లు వేసిన తరువాత వారికి ఏ విధంగానూ సహాయ పనడని అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇండిపెండెంట్ అభ్యరధులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులకు కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రజల పక్షాన, ఓటు ఆత్మగోషను అన్ని వర్గాల ప్రజలకు చేరవేయడంతోపాటు..అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేయడం కోసం ఏడ్చేవారి కోసం కాకుండా..ప్రజల కోసం..ఓటు వేసిన ఓటరు కోసం ఆలోచించే నిజమైన ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపించే విషయంలో తనవంతు బాధ్యతను కొనసాగిస్తున్నది. ens live app మరియు అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రోజుకో కొత్త కోణంలో ప్రజాల్లో జరుగుతున్న చర్చను ప్రత్యేక కధనాలుగా దారావాహికాన్ని అందిస్తున్నది.

 ఈ విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడి వచ్చినా, బెదిరింపులు వచ్చినా ధైర్యంగా తట్టుకొని నిలబడి ఓటరు పక్షాన నిలబడతామని, ప్రతీ ఒటరున్ని చైతన్య పరుస్తాం తప్పితే వెనుకడుగు వేసే ప్రశక్తే లేదని కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈఎన్ఎస్ అందించే ప్రత్యేక కథనాలు 100 మంది తేడా రాజకీయ నాయకులు నమ్మకపోయినా వచ్చిన నష్టమేమి లేదు. ఒక్క నిజమైన ఓటరు నమ్మితే అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతున్నట్టుగానే భావిస్తామని కూడా ధైర్యంగా ప్రకటిస్తున్నాం. అనాధిగా ఓటరుకి జరుగుతున్న అన్యాయాన్ని అదే ఓటరుకి తెలియజేయడంలో ఒక్క అడుగు ముందుకి వేస్తున్నాం. ఓ ఓటరుడా నువ్వు మేలుకోకపోతే మన బ్రతుకులు ఇలానే ఉండిపోతాయనే నగ్న సత్యాన్ని ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకొని చైతన్యవంతం అయ్యేదాక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈ తరహా చైతన్య పూరిత కథనాల పరంపర కొనసాతుందని బల్లగుద్ది మరీ తెలియజేస్తున్నాం. ఏ ఎన్నిక అయినా ఓటింగ్ శాతాన్ని పెంచడంతోపాటు..నేతల గారడీ మాటలకు మభ్యపడిపోతున్న ఓటరుడని తట్టిలేపి ఆలోచించేలా చేస్తున్నాం..చేస్తాం..చేస్తూనే ఉంటాం..!

Amaravati

2022-09-27 01:10:37

ఎమ్మెల్సీ ఎన్నికలకు యువత సన్నద్ధం..

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి యువత ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. పట్టభద్రులు ఉమ్మడి ఉత్తరాంధ్రాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో మాత్రం పట్టభద్ర నిరుద్యోగులు, ఉద్యోగులు, గ్రుహిణిలు, యువత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలు చెప్పినట్టుగా ఓటు వేసే విధానంతో కాకుండా స్వచ్ఛందంగా అభ్యర్ధులను ఎంపిక చేసుకొని..వారు యువతకు ఏ విధంగా భవిష్యత్తులో ఉపయోగపడనున్నారో తెలుసుకున్న తరువాత మాత్రమే ఓటు పరిస్థితులు ఇపుడు నెలకొన్నాయి. దానికి అనుగుణంగానే నిరుద్యోగ పట్టభద్రులంతా ప్రాంతాల వారీ తమ బలం నిరూపించుకునేందుకు అపుడే ఓటర్ల జాబితాలను ఎవరికి వారు తాజాగా సిద్ధం చేసుకుంటున్నారు.

యువత తమ దగ్గరకు వచ్చే ఎమ్మెల్సీ అభ్యర్ధులకు తమకు ఏమి కావాలో..వచ్చిన అభ్యర్ధి ఏం చేస్తారో చెప్పిన తరువాతే వారి ఓటును వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికలకు, త్వరలో జరగబోయే ఎన్నికలకు ఓట్ల సంఖ్యలో భారీగా వ్యత్యాసం వచ్చి ఓటర్లు పెరడగంతో అటు అభ్యర్ధులకు కూడా గట్టు పరిస్థితులే కనిపిస్తున్నాయి. దానితో ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షాలతోపాటు, ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా గట్టిగానే నెట్వర్క్ చేసుకోవాల్సి వస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకోవడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఎవరి స్థాయిలో వారు తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే పనిలో పడ్డారు. ఈసారి ఎన్ని రాజకీయాలు చేసినా, ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా, పెద్ద మొత్తంలో తాయిలాలు సమర్పించినా ఓటు బ్యాంకును పెంచుకోవడం మాత్రం కష్టమనే చెబుతున్నారు విశ్లేషకులు. 

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి గెలిచి.. ఆతరువాత నిరుద్యోగ పట్టభద్రుల విషయంలో ఎలాంటి అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టని విషయంలోనూ ఇపుడు పట్టభద్రులు సమాచాలోచనలు చేస్తున్నారు. గతంలో ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలోనూ, కొన్ని గ్రూపు-2 కేడర్ ఉద్యోగాలను, గ్రూప్-1 కలపడం, కొన్నింటిని కేడర్ లేకపోయినా గ్రూపు-2లో చేర్చడం, డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంపై గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ సమస్యలను పరిష్కరిస్తామని గతసారి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీలు హామీలు ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. దీనితో ఓట్లు వేయించుకొని, రాజకీయంగా ఎదిగి..నిరుద్యోగ పట్టభద్రులను గాలికొదిలేసిన విషయాన్ని కూడా కాస్త సీరియస్ గానే తీసుకున్న ఎమ్మెల్సీ ఓటర్లు ఈసారి ఆ సమస్యలను పరిష్కించేవారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.

చాలా కాలం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, దానిపై ఎమ్మెల్సీలు ప్రభుత్వం వద్ద ప్రస్తావన తేవకపోవడం, భవిష్యత్తు కార్యాచరణ,  ఇలా అన్ని కోణాల్లోనూ యువత ఆలోచనలు చేస్తూ వారికి అనుకూలంగా ఉన్న అభ్యర్ధులకే ఓటు వేయాలని భావిస్తున్నట్టుగా సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఈసారి జరిగే ఎన్నికలపై భారీ ఎత్తున అంచనాలు పెరిగిపోతుండటం కూడా చర్చనీయాంశం అవుతుంది. చూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ చిత్రం ఏవిధంగా ఉండబోతుందనేది..!

Tadepalli

2022-09-22 07:44:13

MLC ఎన్నికలకు పట్టభద్రుల మాస్టర్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసారి నిరుద్యోగ పట్టభద్రులే మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా ఒ వింత ప్రచారం ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతోంది. అంతేకాదు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపచేసేలా సామాజిక మాద్యమాల ఆ ప్రచారం తెగ వైరల్ అవుతోంది. అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చెబితే అది చేయాలి.. అదే అధికారాన్ని మన ద్వారా కట్టబెట్టే సమయం వచ్చినపుడు మనం ఏం చెబితే చట్టసభలకు వెళ్లేవారు అది చేసేలా చూసుకోవాలి.. ఇదే పట్టభద్రులు, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారం. ఇంకా ఆ.. ప్రచారంలోనూ, ఓ నలుగురు పట్టభద్రులు కలిసినపుడు చర్చించుకునే మాటలేంటో ఒక్కసారి తెలుసుకుంటే.. ఏదైనా రాజకీయపార్టీ అధికారంలోకి రావడానికి అన్ని వర్గాల ప్రజలు కావాలి.. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం కొన్ని వర్గాలవారికే పనిచేయాలనే అధికార దాహం సూత్రాన్ని..ఈ  సారి మనం కూడా అమలు చేయాలి.. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలకు ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు కనిపించరు. కానీ ఏవైనా ఎన్నికలు వస్తే మాత్రం టక్కున వారంతా గుర్తుకొచ్చేసి వారికి తాయిలాలు ఏటిస్తే దారిలోకి వస్తారని ఆలోచిస్తారన్నట్టుగానే వ్యవహరిస్తున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఆ తాజా సమాచారాన్ని, విషయాన్నే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా మీముందు ఉంచుతున్నాం.

ఒక్క అవకాశం కూడా తేడాగాళ్లకు ఇవ్వకూడదు.
ఏపీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం కూడా తేడాగాళ్లకు ఇవ్వకూడదు. మన ఓట్లతో అధికారంలోకి వచ్చి ఓట్లు వేసిన మనల్నే అంటరానివారిలా చూస్తూ..కనీసం ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా ఏళ్లు గడిపేస్తున్న ప్రభుత్వానికి మనమేంటో, పట్టభద్ర నిరుద్యోగుల పవర్ ఏంటో చూపించాలనే మాట ఇపుడు ప్రతీ ఒక్కరి దగ్గర నుంచి బలంగా వినిపిస్తోంది. నేరుగా సామాజిక మాద్యమాల్లో ఇదే విషయమై ప్రత్యేకంగా చర్చలు కూడా పెడుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికారంలోకి రావడానికి మెజార్టీ రావడానికి యూత్ అవసరం కానీ..అదే యూత్ కి ఉపాది, ఉద్యోగాలు కల్పించాలంటే మాత్రం ఏళ్లకు ఏళ్లు సమయం కావాలా అని ప్రశ్నిస్తూ..ఇదే విషయంపై నిరుద్యోగులందరూ ఆలోచించే విధంగా వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు పట్టభద్ర నిరుద్యోగులు. దానిని పట్టభద్రుల తల్లిదండ్రులు కూడా సమర్ధిస్తూ వారు చేసే ప్రచారానికి తమవంతు సహాయం కూడా అందిస్తున్నారు. అంతేకాదు తాము చేసే అవగాహన ప్రచారంలో ఏమైనా తప్పుందా అంటూ కొందరు పెద్దల నుంచి సూచనలు సహాలు కూడా స్వీకరిస్తుండటం విశేషం.

భారీగా ఓటరు నమోదుకి ముందస్తు కార్యాచరణ..
త్వరలో జరగబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ సంఖ్యలో నిరుద్యోగ పట్టభద్రులు ఓటు నమోదు కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నట్టుగా తెలిసింది. దానికోసం డిగ్రీ పాసైన విద్యార్ధులు, నిరుద్యోగులు బ్యాచ్ లు వారీగా జిల్లాస్థాయి, నియోజకవర్గం, మండల, పంచాయతీ స్థాయిల్లో సామాజిక మాద్యమ గ్రూపులను ఏర్పాటు చేసి దాని ద్వారా సమాచారం సేకరించడంతోపాటు, ఓటు బ్యాంకుని భారీ మొత్తంలో సేకరించాలని చూస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. తద్వారా తమను మోసం చేసి పార్టీలకు, ప్రభుత్వాలకు ఈ సారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సత్తాచూపించాలనే లక్ష్యంతో ముందుకి వెళుతున్నట్టుగా చెబుతున్నారు. విశేషం ఏంటంటే ఈ సారి ఎక్కడెక్కడో ఉన్న పట్టభద్రులను కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సొంత జిల్లాలకు రప్పించి మరీ ఓటర్లుగా నమోదు చేయించాలని నిరుద్యోగులు కంకణం కట్టుకున్నారంటే యువతలో వ్యతిరేక నినాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొందరు నేతలు, నాయకులైతే యూనివర్శిటీల్లో పీజీ చదివే ఓటరు పట్టభద్రుల జాబితాలు సేకరించే పనిలో పడ్డారు.

పార్టీలకు అతీతం నిలబడేవారికే పట్టం
ఈ సారి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ  పార్టీలకు, ప్రభుత్వాలకు అతీతంగా అన్ని రంగాల సమస్యలపైనా నిరుద్యోగుల వాణి చట్టసభల్లో గట్టిగా వినిపించేవారికే ఓటు వేసి గెలిపించడం ద్వారా రాజకీయపార్టీలకు యువత బలం చాటి చెప్పడంతోపాటు, రానున్న ఎన్నికలు ఏ స్థాయిలో జరగబోతున్నాయో కూడా రుచి చూపించాలని యోచించే ఈ కార్యాచరణ మొత్తం చేస్తున్నట్టు తెలిసింది. పార్టీల పేరుతో నిలబడి గెలిచేవారంతా మళ్లీ పార్టీ చెప్పినట్టే వింటూ నిరుద్యోగ పట్టభద్రులను నట్టేట ముంచుతున్నారని విషయాన్ని బాగా గుర్తించిన వారంతా ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి గ్రౌండ్ లెవల్ లోనే పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారనే విషయం బహిరంగ రహస్యం అయిపోయింది. ఒకప్పుడు నాయకుల వెంట తిరుగుతూ వారంతా ఏం చెబితే అది చేసే యువత సామాజిక మాద్యమాల పుణ్యమాని అన్ని విషయాలను నేరుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. దీనితో యువత ఎవరి వలన ఏం కోల్పోతున్నారో, ఏం పొందుతున్నారో కూడా ఎవరికి వారే తెలుసుకొని చైతన్యం పొందుతున్నారు.

తాయిలాలు, హామీల పప్పులు ఇకపై ఉడకవా..?
గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇపుడు జరగబోయే ఎన్నికలకు చాలా వ్యత్యాసమే కనిపిస్తున్నది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులు నిరుద్యోగులకు తాయిలాలు, పార్టీలు, హామీలు ఇస్తే గతంలో నేతలు అనుకున్న పనులు జరిగేవి. 2019 ఎన్నికల తరువాత సాధారణ ప్రజల నుంచి పట్టభద్రుల వరకూ అందరూ ప్రభుత్వం చేసే పనులను లోతుగా అధ్యయనం చేయడం మొదలు పెట్టడంతో తమకేమి కావాలో..ఎవరేమి చేస్తారనే కోణం లో ఆలోచించడం మొదలు పెడుతున్నారు. దీనితో ఈ సారి తాయిలాలు, హామీల పప్పులు ఉడికే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పైగా చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనలు, ఉపాది అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకే పీఆర్సీ సమయంలో రివర్స్ పీఆర్సీ ఇవ్వడంతోపాటు, హెచ్ఆర్ఏ, డీఏలు కుదించేసి కొత్త పేస్కేలు ఇచ్చినట్టుగా రికార్డుల్లో చూపడాన్ని కూడా నిరుద్యోగులు ఉద్యోగుల ప్రచారం ద్వారా తెలుసుకోవడం విశేషం. 

 ప్రభుత్వం నిరుద్యోగులు, పట్టభద్రుల విషయంలో అసలు ఏమీ పట్టనట్టుగా వుంటుందనే నిర్ణయానికి వీరంతా వచ్చేశారు. ఈ తరుణంలో పార్టీలు నిలబెట్టే అభ్యర్ధులు కాకుండా..మంచి వ్యక్తులను నిజంగా నిరుద్యోగుల కోసం పనిచేసి, కష్టపడే వారిని చట్టసభల్లోకి పంపాలని నిరుద్యోగులు గట్టిగా పనిచేస్తున్నారనే సంకేతాన్ని కూడా సామాజిక మాద్యమాల ద్వారా పంపుతుండం అటు రాజకీయపార్టీలకు, ఇటు ప్రభుత్వంలోని సలహాదారులకి, పరిశీలకులకు సైతం అంతుచిక్కడం లేదు. నిరుద్యోగుల మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందనేది ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలే తేల్చనున్నాయని అంటున్నారు.

ముఖ్యగమనిక..
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రచారాల విషయాలను, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యవహారాలను మాత్రమే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రత్యేక కథనాలను అందిస్తున్నాం. ఈ విషయంలో సంస్థ యొక్క ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదు. కాకపోతే ఏ ఎన్నికలు వచ్చినా వాటిలో ఓటింగ్ శాతం పెంచేందుకు సామాజిక భాద్యతగా మాత్రం ప్రజలు, పాఠకుల్లో మాత్రం చైతన్యం తీసుకువస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న తేడా, నిజమైన ప్రచారాలకు మీ మా మీడియా సంస్థకు ఎలాంటి సంబంధం లేదు పాఠకులు గమనించాలి.

Tadepalli

2022-09-07 02:23:06

ఎమ్మెల్సీ బరిలో సీపీఎస్ ఉద్యమనేత పాలేల..

సీపిఎస్ ఉద్యమ పితామహుడు..ఉద్యమే ఊపిరిగా జాతీయ స్థాయిలో పాత పెన్షన్ కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తున్న యువనేత.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. పాలేల రామాంజనేయులు ఈ సారి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. సీపీఎస్ రద్దు అనే చిరకాల స్వప్నాన్ని ఇంటిపేరుగా మార్చుకొని ఉద్యమాన్ని పతాక స్థాయితో చేపడుతున్న ఈయనకు ఉపాధ్యాయ సంఘాల నుంచే కాకుండా ఇతర సీపీఎస్ ఉద్యోగ సంఘాల నుంచి కూడా అశేష మద్దతు విశేషంగా పోగవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా ఉద్యమం చేపడితే సీపీఎస్ రద్దు కాదని..చట్టసభల్లో ఉద్యోగుల తరపున వాణి బలంగా వినిపించడం ద్వారా మాత్రమే సీపీఎస్ రద్దును సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి ప్రత్యక్షంగా దిగాలని కూడా అన్ని వర్గాల ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి కూడా అధికం అవుతున్నది. వెరసీ పాలేల ఎమ్మెల్సీగా అయితే సీపీఎస్ రద్దు ఏపీలో అమలవుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు.

ఇదీ పాలేల సీపిఎస్ ఉద్యమ నేపథ్యం..
ఆంధ్రప్రదేశ్ లో సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేపడితే తప్పా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని భావించిన పాలేల రాష్ట్రంలో  ఆంధ్రప్రదేశ్ సీపీఎస్(APCPS) అసోసియేషన్ ను ఏర్పాటు చేయడమే కాకుండా.. జాతీయ స్థాయిలో నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(NMOPS)లో కూడా జాతీయ కార్యదర్శిగా కీలక బాధ్యతలు చేపట్టి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నడిపించారు. పైగా చత్తీస్ ఘడ్,  ఝార్ఖాండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సీపీఎస్ ను అక్కడి ప్రభుత్వాలు రద్దుచేయడంలో అత్యంత కీలకంగా కూడా వ్యవహరించారు. ఫలితంగా నేడు ఆ రాష్ట్రాల్లో సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్ లోకి మారేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అదే స్పూర్తితో సీపీఎస్ నే ఇంటిపేరుగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్ లో వందలాది ఉద్యమాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ సీపీఎస్ రద్దు చేయించే దిశగా అడుగులు ముందుకి వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకు రావడంలోనూ అత్యంత ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు
రాయలసీమ జిల్లాల్లో పాలేల రామాంజనేయుల అనే  పేరు తెలియని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉండరంటే అతిశయోక్తికాదు. ఒక్క రాయలజీమ జిల్లాల్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన జిల్లాల్లోనూ సీపీఎస్ రాష్ట్ర ఉద్యమనేతగా కూడా ఈయన అశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేసే ఉద్యమాల్లో అత్యంత చురుకుగా పాల్గొంటూ..సమస్యను ఇటు రాష్ట్ర ప్రభుత్వం,అటు కేంద్ర ప్రభుత్వం ద్రుష్టిలోకి తీసుకెళ్లడంలోనూ క్రియాశీలంగా వ్యవహరించిన ఈయనకి ఉద్యోగ సంఘాల మద్దతు విశేషంగా పెరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్యమనేత చట్టసభల్లో అడుగుపెట్టి అక్కడ తమ వాణిని బలంగా వినిపిస్తే..పరిష్కారం కాని ఎన్నో సమస్యలను నేరుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాడానికి వీలుపడుతుందని అంతా భావిస్తున్నారు. అంతేకాకుండా ఆ నినాదంతోనే పాలేలను ఎమ్మెల్సీ బరిలోకి దించి ఉద్యోగుల చిరకాల డిమాండ్ సీపీఎస్ రద్దును సాధించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది.

అధికార పార్టీ సభ్యులున్నా సీపీఎస్ రద్దే లక్ష్యం
వాస్తవానికి అధికార పార్టీ అభ్యర్ధులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. అయినప్పటికీ సీపీఎస్ రద్దుకై, ఉద్యోగుల ప్రధాన డిమాండ్ కై ఉద్యమాన్ని ఉప్పెనలా మార్చిన పాలేలను రంగంలోకి దింపడం ద్వారా ఉద్యోగుల ఐకమత్యాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేసేలా చేయాలనే నిర్ణయానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చినట్టు చెబుతున్నారు. అధికారపార్టీ అభ్యర్ధులు ఎంతమంది రంగంలోకి దిగినా స్వచ్ఛందంగా, సీపీఎస్ రద్దుకై స్వతంత్ర్య అభ్యర్ధిగా అయినా ఎమ్మెల్సీ పోటీలో ఉంచితే  ఉద్యోగులు, ఉపాధ్యాయుల చిరకాల స్వప్నం సాకారం అవుతుందనేది ఉద్యోగులు, ఉపాధ్యాయుల భావన. దానికి అనుగుణంగా ఉద్యోగులందరి మద్దతుతోనే పాలేల ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నారని ఆయన కంటే ముందుగా ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులే తూర్పు రాయలసీమలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. చూడాలి సీపీఎస్ రద్దే ఊపిరిగా ఉద్యమం చేస్తున్న పాలేల రామాంజనేయులు ఎమ్మెల్సీగా దిగే విషయంలో ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2022-09-04 01:32:40

ఎమ్మెల్సీ ఎన్నికలపై సీపీఎస్ ప్రభావం..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైపోయింది.. త్వరలో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ప్రభావంతో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో సీపీఎస్ ఉద్యోగులు ఉండటం.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామన్న ప్రభుత్వం దానిని రద్దు చేయకుండా జీపీఎస్ ను తెరమీదకు తీసుకు రావడం..దానిని వ్యతిరేకించిన ఉద్యోగ సంఘాలు సెప్టెంబరు 1 నిరసన దినంగా ప్రకటించి ఆందోళన చేపట్టడం ఈ కారణాలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాలున్నాయి. ఇప్పటికే ఇదే విషయమై ఉద్యోగ సంఘాలు, వారి వారి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో చర్చజరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. బయటకు తెలియజేస్తే ప్రభుత్వం కేసులు పెట్టి, వేధింపులకు గురిచేస్తుందని ముందుగానే గుర్తించిన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్ర నిరుద్యోగులు, ఇతర అధికారులు, ఉద్యోగులు కూడా 2024 కి ముందు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తమ ఓటు విలువను ఇప్పటి ఎన్నికల్లో తెలియజేసి దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందో ప్రభుత్వానికి తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సంకేతాలు అందుతున్నాయి. అయితే దానికి ధీటుగా ప్రభుత్వం కూడా తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,అభివ్రుద్ధిని చూపించి తాము సూంచిన అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నది.


ప్రత్యక్ష ఎన్నికల్లో ఉద్యోగులదే పైచేయి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు నేరుగా పాల్గొనే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే నిరుద్యోగ పట్టభద్రుల సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఉన్నారు, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. దాని ప్రకారమే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత, ఓట్లు నమోదు చేసుకుని తమ ఓటు ప్రభావాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి తెలియజేసి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ఐకమత్యాన్ని తెలియాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ప్రభుత్వశాఖల వారీగా ఉద్యోగులంతా ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైచేయి సాధించి తమ అభ్యర్ధిలను గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అదే జరిగితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాల ఓటు బ్యాంకు మొత్తం అధికార పార్టీకి వ్యతిరేకంగా పడే అవకాశాలే స్పష్టంగా కనిపించనున్నాయి. దానికి తోడు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రివర్స్ పీఆర్సీ అమలు చేయడం వంటి అంశాలు కూడా ఉద్యోగులను చాలా తీవ్రంగా ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పై చేయి సాధించడంతో ఉద్యోగుల వ్యతిరేకిస్తే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇటు ప్రజానికానీకి కూడా తెలియజేసే పనిలో పడ్డారు.

తీవ్ర నిరాశలో పట్టభద్ర నిరుద్యోగులు..
అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి జాబ్ కేలండర్ ప్రతీ ఏటా ప్రకటిస్తామని చెప్పి..ఆపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అరకొర కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ తప్పా రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీచేయకపోవడంతో నిరుద్యోగులంతా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో లక్షా 21వేల ఉద్యోగాలు భర్తీచేసినప్పటికీ ఇంకా పోలీస్, ఉపాధ్యాయ, వైద్యఆరోగ్యశాఖలతోపాటు ప్రభుత్వంలో 70 ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అంతేకాకుండా 2024నాటికి దానికి రెట్టింపు సంఖ్యలో ఉద్యోగుల రిటైర్ మెంట్లు కూడా ఉండటం..దానిని పట్టించుకోకుండా ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో పట్టభద్ర నిరుద్యోగులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నట్టు కనిపిస్తున్నది.ఇటీవలే సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన నిరసనకు వీరంతా మద్దతు ఇవ్వడమే దానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇటు పట్టభద్రుల్లో కూడా చాలా పార్టీల నుంచి అభ్యర్ధులు ఈసారి ఎన్నికల్లో నిలుచునే అవకాశం వుండటంతో తమ నిరసనను కూడా వ్యతిరేక ఓటు ద్వారానే చూపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగుల కోసం పనిచేసేవారిని, వారి గళాన్ని ప్రభుత్వం ముందు గట్టిగా వినిపించే అభ్యర్ధులనే ఎన్నుకొని తమ మద్దతు ఇస్తారని కూడా చెబుతున్నారు.

ఓటు బ్యాంకు సమీకరణలో రాజకీయపార్టీలు
ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున ఇటు పట్టభద్రులు, అటు ఉపాధ్యాయుల రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఉన్నారు..ఇప్పటి వరకూ ఎంత మంది ఓటును నమోదు చేసుకున్నారు..ఇంకా ఎంత మంది ఆయా నియోజకవర్గాల పరిధిలో ఓటు నమోదు చేసుకోవాల్సి వుంది..ఆయా కుటుంబాల్లో సీపీఎస్ ఉద్యోగులుగానీ, పెన్షనర్లు గానీ ఉన్నారా.. ఉంటే వారి ద్వారా కొత్తగా ఓట్లు నమోదు చేసి ప్రభుత్వ వ్యతిరేక అభ్యర్ధులకు ఓటు వేసి తమ బలాన్ని నిరూపించుకోవాలని కూడా ప్రత్యేకంగా సమీకరణలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. దానికోసం నిరుద్యోగ సంఘాలు, పట్టభద్రుల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ సంఘాలు ఇలా అన్ని వర్గాల వారిని ఇప్పటికే రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్సీ ఆశావాహులు ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని వివరించి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే చాలా రాజకీయపార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసిన నేపథ్యంలో సీటు గ్యారంటీ అనుకుంటున్నవారంతా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలల వారీగా జాబితాలు సేకరించే పనిలో పడ్డారు.

కీలక భూమిక వహించనున్న సచివాలయాలు..
ఏపీలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కీలక భూమిక వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా 1.20లక్షల మందిని ప్రభుత్వం నియామకం చేసింది. అందునా ఇటీవలే వారి సర్వీసులను రెగ్యులర్ చేసింది. దీనితో సచివాలయాల్లో పనిచేసే పట్టభద్ర ఉద్యోగులంతా ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేస్తారని ప్రభుత్వం కూడా భావిస్తున్నది. అయితే వీరు కూడా సీపీఎస్ పరిధిలోకే రావడం, పీఆర్సీలో వీరికి కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయకపోవడం, పీఆర్సీ ఎరియర్స్ ను ఇవ్వకపోవడం, వీరికి పీఆర్సీ ఇచ్చే సమయంలోనే హెచ్ఆర్ఏ, డీఏ స్లాబుల్లో కోత వేయడం, రెండేళ్లకు ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని చెప్పి రెండు సంవత్సరాల 9నెలల వరకూ చేయకపోవడం, ఈ 9నెలల సమయంలో సుమారు రెండు డీఏలో సచివాలయ ఉద్యోగులు కోల్పోవడం తదితర కారణాలతో చాలా వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుంటారనే ప్రచారం మరోవైపు సాగుతోంది. 

ఇవే అంశాలతో అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీఓ సంఘాలు కూడా సచివాలయ ఉద్యోగులను చైతన్యం చేయడంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, తొమ్మిది నెలలు ఆలస్యమైనా ఉద్యోగాలను రెగ్యులర్ చేశారనే ఒక్క కారణంతోనైనా సచివాలయ ఉద్యోగుల్లో అగ్రభాగం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని కూడా పరిశీలకు భావిస్తున్నారు. చూడాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎటువైపు తమ ఓటు వేస్తారో.. ఓటు ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజానికానికీ, వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏవిధంగా ఉండాలనే విషయమై ఏ తరహా సందేశాన్ని ఇస్తారనేది..!

Tadepalli

2022-09-03 03:02:41

వీజెఎఫ్ ఎన్నికల బరిలోకి ఈసారి ఆ..ఐదుగురు

వీజేఎఫ్(వైజాగ్ జర్నలిస్టుల ఫోరం) ఈ పేరు చెబితినే నాటి నుంచి నేటి వరకూ ఎన్నికలే లేకుండా.. కేవలం ఒకే ఒక్క అనధికారిక కోరంతో నిర్వహణ చేపట్టే  భారతదేశంలోనే అతిపెద్ద జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ అనే మాట గుర్తుకు వస్తుంది. అవునండి.. ఎప్పుడు పడితే అప్పుడు, ఏదో రూపంలో విజెఎఫ్ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఈ జర్నలిస్టుల వెల్పేర్ అసోసియేషన్ లో పనిచేయాలనే తపన చాలా మందికే ఉన్నా.. అనూహ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులు మాత్రమే ఇక్కడ రాజ్యమేలుతుంటారు. కాదు కాదు అలా చేసుకుంటారు. వాస్తవానికి జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ గానీ, యూనియన్ గానీ, మరేదైనా ట్రస్టులో గానీ పనిచేయాలంటే.. అందులో సదరు జర్నలిస్టులు ఏదైనా మీడియా సంస్థ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నవారై ఉండాలి. సక్రంగా ఎన్నికల్లో గెలవాలి.. విచిత్రంగా విజెఎఫ్ కమిటీలో వున్న ఒకరిద్దరు జర్నలస్టులు తప్పా మిగిలిన కోరం సభ్యులంతా ఏ మీడియాకి చెందిన వారో..అసలు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న మీడియా సంస్థలు పనిచేస్తున్నాయో లేదో వారికి తప్పా మిగిలిన జర్నలిస్టులెవరికీ తెలియని పరిస్థితి. జర్నలిస్టుగా వున్న వ్యక్తికే జర్నలిస్టుల సమస్యలు తెలుస్తాయి.. జర్నలిస్టు కార్డు పెట్టుకొని పనిచేసేవారికి, ఇలా వీజెఎఫ్ లో సంవత్సరాల తరబడి ఎలాంటి ఎన్నికలు లేకుండా బైలా చెప్పిన విధంగా కాకుండా వారికి నచ్చినట్టుగా ఉండేవారికి ఏం తెలుస్తాయంటే మాత్రం.. అబ్బే ఆ ఒక్కటీ అడక్కు అంటుంది ఇక్కడి ప్రస్తుత విజెఎఫ్ కార్యవర్గం. పదేళ్లుగా కేవలం కోర్టు పేరు చెప్పి అసలు ఎన్నికలే జరపకుండా కాలయాపన చేసేశారంటే కార్యవర్గం ఏ స్థాయిలో పనిచేసుకోవడానికి మార్గం సుగమం చేసుకుందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి కూడా కోర్టు కేసులు ఒక్కొక్కటికీ వాదించుకుంటూ వస్తున్నారులేండి..అయినా.. కోర్టు కేసు ముసుగు చిన్నదైనా..వారి స్థానాలను పదిలం చేసుకోవడానికే పెద్ద పేటీ వేసుకుంటూ.. ఒకానొక సమయంలో కోర్టు దిక్కారం చేసుకుంటూ కూడా కాలయాపన చేసుకుంటూ వచ్చేస్తున్నారు..? ఎవరైనా ప్రశ్నించాలా..? మరెవరైనా అడగాలా..? ఎవరైనా ఏమైనా అంటే బుజం మీద చేయి వేసి..నీకూ పనిగట్టుకొని చెప్పాలా అంటూ మొదలెడతారు దండకం...అలా సాగిపోతూ వచ్చేసింది ఇప్పటి వరకూ..

పనిచేసే జర్నలిస్టుల దగ్గర నుంచి కార్డు జర్నలిస్టుల దాకా..
విజెఎఫ్ అంటే విశాఖ కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద అంబరిల్లా జర్నలిస్టుల వెల్పేర్ అసోసియేషన్. వివిధ రకాల జర్నలిస్టుల యూనియన్ లకు అతీతంగా.. ఇక్కడ జర్నలిస్టులు ఎన్నుకున్న జర్నలిస్టు నేతలు వారి కోసం వారి సమస్యలు, సంక్షేమం కోసం .. వారి పని జర్నలిస్టులుగా వారు చేసుకుంటూ జర్నలిస్టుల కోసం పనిచేస్తారు. విచిత్రంగా నేటి కార్యవర్గంలోని సభ్యులు మాత్రం కేవలం జర్నలిస్టుల అనే కార్డు వారి వారి కార్యకలాపాలను చక్కబెట్టుకోవడానికి, వారి వ్యాపారాలను పెంచుకోవడానికి మాత్రంగానే పనిచేస్తున్నారంటే అతిశకయోక్తి కాదేమో. ప్రస్తుత కార్యవర్గంలో వున్న జర్నలిస్టుల్లో సగానికిపైగా ఏ మీడియా సంస్థలో పెన్ను పట్టుకొని జర్నలిస్టుగా పనిచేస్తున్నారో వారికే తెలయని పరిస్థితి. ఒకప్పుడు వీజెఎఫ్ కార్యవర్గమంటే వివిధ దినపత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేసే ప్రముఖ జర్నలిస్టులు ఉండేవారు. అదీ అందరూ అక్రిడేటెడ్ జర్నలిస్టులే ఉండేవారు. ఇపుడు ఆ పరిస్థితి పోయి.. కేవలం కార్యవర్గంలో పనిచేయాలంటే బలమైన సామాజిక వర్గం, ఉన్నా లేనట్టుగా ఉండే పత్రికలు, బయట ఎవరికీ తెలియని టీవీ ఛానళ్లు, అందరూ దుమ్మెత్తి పోస్తున్నారని పత్రిక బయటకు రాకపోయినా  అక్రిడిటేషన్ మాత్రం తెచ్చుకొని గుర్తింపు పొందిన జర్నలిస్టుగా ఉంటూ యూనియన్ లో ప్రాతినిధ్యం వహిస్తూ వారి వ్యాపార సంస్థలను అభివ్రుద్ధి చేసుకునే జర్నలిస్టులు అధికం అయిపోయారు. ఒకరికి ఈవెంట్ ఆర్గనైజేషన్ ఉంటే మరొకరికి డాన్స్ స్కూలు, ఇంకొకరు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసే పీఆర్వో, మరొకరు నాటకాలు వేసే ఆర్టిస్టు, ఇంకొకరు ఓ ప్రజాప్రతినిధి దగ్గర పీఏ, మరో ఇద్దరు ఏదో ఆర్ఎన్ఐ టైటిల్ కలిగి.. జనాల్లోకి రాని పత్రికలో కార్డు జర్నలిస్టులు, ఇక మిగిలిన ఆ ఇద్దరు ముగ్గురు ఏ మీడియా ఆర్గనైజేషన్ లో పనిచేస్తురో వారికి తప్పా.. కార్యవర్గానికి గానీ, విజెఎఫ్ లోని సభ్యులకు గానీ తెలియని పరిస్థితి.


ఎవరినీ రానీయకుండా చుట్టూ కుల కోటరీ..
విజెఎఫ్ ఏర్పాటైన కొత్తలో సీనియర్ జర్నలిస్టులు ఇక్కడ కార్యవర్గంగా పనిచేసి విజెఎఫ్ గౌరవాన్ని ఎంతగానో పెంచారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే.. విజెఎఫ్ అంటే నేడు రాష్ట్రపతి భవన్ లో కూడా గుర్తించేంతగా ఎదిగింది. అంతటి గౌరవం వున్న విజెఎఫ్ లో కార్యవర్గ సభ్యులుగా, పనిచేయాలని ఎవరు మాత్రం ఆశపడరు చెప్పండి. దానికోసమే ఒక తరం విజెఎఫ్ కార్యవర్గంగా పనిచేసి దిగిపోయిన దగ్గర నుంచి నేటి వరకూ ఇక్కడ కులాల ప్రాతినిధ్యం బాగా పెరిగిపోయింది. మూడు సామాజిక వర్గాలకు చెందిన జర్నలిస్టులు తప్పా మరెవరూ వీజెఎఫ్ లోకి అడుగుపెట్టడానికి ఒప్పుకోరనే విధంగా తయారైపోయింది. ఆ విధంగానే చుట్టూ కోటరీ కూడా అత్యంత బలంగా కట్టుకున్నారు కూడా. దానికోసం ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ముందుగా అనుకున్న వాళ్లే విజెఎఫ్ కార్యవర్గంలో అధ్యక్షులు, కార్యదర్శిలతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులుగా సీట్లు పదిలం చేసుకుంటారు. ఎన్నికల బరిలో దిగేవారు యాక్టివ్ మీడియాలో పనిచేయకపోయినా.. వారు చేసే కుల సామాజిక రాజకీయాలను వినియోగించుకొని ఎంచెక్కగా కార్యగవర్గంలో స్థానం సంపాదించుకుంటారు. దానికోసం కొత్తగా ఓటర్లను చేర్చుకోవడం దగ్గర నుంచి ప్రో మెంబర్లుగా ఇచ్చే వరకూ చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ విధంగా వారి ఓటు బ్యాంకు కుల కోటరీ నుంచే రప్పించుకుంటారు. అప్పటి వరకూ విజెఎఫ్ కోసం పొడిచేస్తాం..నరికేస్తాం..దున్నేస్తాం.. అని బీరాలు పోయిన జర్నలిస్టులు సైతం మన కులపోడే అక్కడు ఉండాలి.. అలా అయితేనే మన కుల సామాజిక వర్గానికి గుర్తింపు వస్తుందంటూ అక్కడివారు ఎలా చెబితే అలా ఆడే జర్నలిస్టులే తయారైపోతున్నారు. ఇక మిగిలిన కొద్ది మందీ పోరాటం చేసినా..ఫలితం మాత్రం ఆ సామాజిక వర్గానికే బలంగా వస్తుందనేది జగమెరిగిన సత్యం.


విశాఖలో ఆర్ధికంగా ఎదగడానికి విజెఎఫ్ ఒక అడ్డా..
ఒకప్పుడు విజెఎఫ్ కి..నేటి విజెఎఫ్ కి చాలా వ్యత్సాసం ఏర్పడింది. నాడు విజెఎఫ్ జర్నలిస్టుల అందరికోసం, వారి సంక్షేమం కోసం, సమస్యల కోసం పనిచేస్తే..నేటి విజెఎఫ్ కార్యవర్గం అభివ్రుద్ధి, వారి వ్యాపారాలు వ్యవహారాలు పెంచుకునే ఆర్ధిక వేదికగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విజెఎఫ్ కార్యవర్గంగా కాకకుండా బయటకు వెళితే ఏ ఒక్కరూ గుర్తించే పరిస్థితి లేదనే విషయాన్ని తెలుసుకున్న వారంతా విజెఎఫ్ లోనే ఆస్తాన విధ్వాంసుల్లా వారి సీట్లను పదిలం చేసుకొని ఎలాంటి మీడియా సంస్థల్లోనూ యాక్టివ్ గా పనిచేయకపోయినా ఆర్ధికంగా మాత్రం ఎదుగుతున్నారనే విషయం నేడు విశాఖలోని ప్రతీ జర్నలిస్టుకూ తెలిసిన అంశం. బంగారు గుడ్లు పెట్టే బాతును ఎవరూ చంపరు..పైగా ఆ బాతును పెంచి పోషించి ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటారు. దానికోసం కుల సామాజిక వర్గాన్ని కూడా ఎంతో చక్కగా వినియోగించుకుంటారు. విజెఎఫ్ లో కూడా అదే జరగుతుంది. నిజంగా జర్నలిస్టులుగా పనిచేసేవారు ఒకరిద్దరుంటే..వారి నీడలో మిగిలినవారి కార్యకలాపాలు చాలా చక్కగా చక్కబెట్టుకుంటూ ఆర్దికంగా ఎదుగుతూ వారి వ్యాపారాలను మాత్రం అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. దానికోసం వారి వారి కుల సామాజిక వర్గాన్ని వినియోగించుకుంటూ.. ఎంచెక్కా పబ్బం గడిపేస్తున్నారు.


విజెఎఫ్ ఎన్నికలు ఈ సారి మామూలుగా ఉండవు..
విజెఎఫ్ కి ఎన్నికలు వస్తే ఈ సారి అసాధారణంగా నిర్వహించాలని..మళ్లీ విజెఎఫ్ కి పూర్వవైభవం తీసుకు రావాలని సీనియర్ జర్నలిస్టులు కంకణం కట్టుకున్నారు. ఏళ్ల తరబడి ఒకే కార్యవర్గం రాజ్యమేలుతుంటే దానిని చూసి తట్టుకోలేని నిజమైన, సీనియర్ జర్నలిస్టులు ఈ సారి రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుత కార్యవర్గం ఆర్ధిక, కుల సామాజిక ఎత్తులు వేసినా.. వాటిని పెకిలించుకొని ఎన్నికల బరిలో నిలవడానికి ఒక ఐదుగురు సీనియర్ జర్నలిస్టులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆ ఐదుగురు ఒక్కసారి విజెఎఫ్ కార్యవర్గంలోకి కాలుపెడితే మరోసారి ఏ మీడియా సంస్థలోనూ పనిచేయకుండా కేవలం కార్డు జర్నలిస్టులుగా వుంటూ విజెఎఫ్ పేరుతో పబ్బం గడిపే చాలా మంది కార్యవర్గ సభ్యుల ఆగడాలకు తెరపడటం ఖాయంగానే కనిపిస్తుంది. విజెఎఫ్ అంటే జర్నలిస్టుల సంక్షేమం కనిపించాలి గానీ.. కార్యవర్గ సంక్షేమం, కార్డు జర్నలిస్టుల పాలన, వారి వారి ప్రైవేటు సంస్థల అభివ్రుద్ధి మాత్రం కనిపించకూడదని బలంగా నమ్మే ఆ ఐదుగురూ రంగంలోకి దిగితే వార్ కూడా వన్ సైడ్ అయిపోతుందనే టాక్ మొదలైంది. త్వరలో జరగబోయే విజెఎఫ్ ఎన్నికల్లో ఎవరు నిలబడినా..తమ స్థానాలను తమ కుల సామాజిక జర్నలిస్టులే పదిలంగా ఉంచుతారని భావిస్తున్న కార్డు జర్నలిస్టులుకూడా వారి ఎత్తులు వారు వేసుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..అసలు ఎన్నికలే లేకుండా ఇన్నేళ్లు కోర్టు మూసలో నెట్టుకొచ్చేసిన వైనాన్ని ప్రతీ సభ్యుడికీ తెలియజేస్తూ.. అసలు జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వర్కింగ్ జర్నలిస్టులు మాత్రమే ఉండాలనే నిబంధన అమలు చేసి తీరుతామని ఎన్నికల బరిలోకి దిగే ఆ ఐదుగురు జర్నలిస్టులూ బాహాటంగానే చెబుతున్నారు. ఆ ఐదుగురు నిజంగా రంగంలోకి దిగితే మాత్రం  ఈ దఫా కార్డు జర్నలిస్టులు పలాయనం చిత్తగించడం ఖాయంగానే కనిపిస్తుంది. చూడాలి.. ఈసారి జరిగే విజెఎఫ్ ఎన్నికలు జర్నలిస్టుల మధ్య జరుగుతాయో.. కుల, కార్డు జర్నలిస్టుల మధ్య జరుగుతాయనేది..?!

Visakhapatnam

2022-08-16 03:56:29

జనసేన పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది..ప్రధాన వ్యతిరేక పార్టీగా టిడిపి ఉన్నప్పటికీ..ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం జనసేన పార్టీలో మొదలైంది. వైఎస్సార్సీపీలో దగాపడ్డ నేతలంతా ఇపుడు ఒక్కొక్కరుగా జనసేన గూటికి చేరుకుంటున్నారు. సినీనటుడు, ఎస్సీబీసీలో కీలక పదవి పోషించిన ప్రుధ్విరాజ్ ఇపుడు జనసేనలోకి వచ్చారు. నేడో రేపో..మరో పది మంది జనసేన పార్టీ ముందుకి రావొచ్చునని సినీ వర్గాల బోగట్టా. మొన్నటి వరకూ రాజకీయం మొదలు పెట్టని జనసేనాని తాజాగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగటడ్డంతోపాటు, ఆ పని చేసే సమయంలో కలిసివచ్చే వారికోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టి ఒక్కొక్కరినీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. స్వతహాగా సినీ గ్లామరున్న జనసేనానికి ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకత్వం, వాక్ చాతుర్యం ఉన్న నాయకులు కావాలి. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి బాటలు వేస్తూనే జనంలోని సమస్యలను అదే జనానికి ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వదిలేస్తుందనే విషయాన్ని తెలియజేయడం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని పెంచాలనేది జనసేన లక్ష్యంగా కనిపిస్తుంది.

సామాజిక రాజకీయ చక్రం తిరగనుందా
జనసేన ఆపరేషన్ ఆకర్ష్ లో కాపులను అగ్రభాగంలో నిలబెట్టేందుకు కార్యాచరణ జరుగుతుందని..అదే 2024 ఎన్నికల్లో కీలక భూమిక వహిస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగానే రెడ్డి సామాజిక వర్గం మొత్తం వైఎస్సార్సీపీలో ఉంటే..చౌదరి సామాజిక వర్గం టీడీపీలో ఉందని..ఎప్పుడూ ఆ రెండు సామాజిక వర్గాలే రాజ్యాధికారంలో ఉండాలా..కాపు సామాజిక వర్గానికి ఆ సత్తా లేదా అనే కోణాన్ని కూడా జన సైనికులు, ఇతర నాయకత్వం అధిష్టాంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులోభాగంగానే కాపుసామాజిక వర్గాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడగట్టడంతోపాటు.. కీలక పదవులు..అధికారంలోకి వస్తే కీలక మంత్రిత్వ శాఖలు కూడా అప్పగించాలని ఆలోచన చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర సంఘంలో ఇదే అంశాన్ని చర్చించి పలు రాజకీయ పార్టీల ముందు ఉంచితే..అందులో అగ్రభాగం జనసేన నుంచే అత్యధిక మద్దతు లభించినట్టుగా కూడా చెబుతున్నారు. ఆ రెండు సామాజిక వర్గాలు రాజకీయంగా అధికారాన్ని అనుభిస్తే ఇక పెద్ద సామాజిక వర్గంగా వున్న మనం ఆ అవకాశాన్ని ఎందుకు దక్కించుకోకూడదు అనే సంకేతాన్ని యువత దగ్గర నుంచి నాయకత్వం వరకూ తీసుకెళుతున్నట్గుగానే కనిపిస్తోంది.

2024 ఎన్నికల్లో యువతకు పెద్దపీట..
రాష్ట్రవ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకూ జనం మధ్యలోనే ఉన్న యువతకు ఈ సారి వచ్చే ఎన్నికల్లో పెద్దపీట వేసే దిశగా కూగా జనసేన పావులు కదుపుతోంది. గతంలో చేసిన తప్పులను సరిచేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండే నేతలను ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా ప్రజలకు వెన్నుదన్నుగా వుండే పార్టీ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. ప్రస్తుతానికి బీజేపీతో మాత్రమే పొత్తు వుంటుందని ప్రకటించిన జనసేన రాబోయే రోజుల్లో మరెవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా..అనే దానిపై నేటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దానితోపాటు.. గతంలో సీట్లు ఆశింసి బంగపడి వారందరిలో యువతను గుర్తించి వారిని జనం ముందుకి తీసుకు వచ్చి వారి ద్వారానే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కూడా చూస్తోంది.

ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు వస్తారంటూ ప్రచారం
వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు కూడా జనసేన పార్టీలోకి అతి త్వరలోనే వస్తారంటూ పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి బలం చేకూరే విధంగా ఇటీల ప్రధాన నరేంద్రమోడీ భీమవరం పర్యటనకి ఎంపీనీ రానీయకుండా చేసిన ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తూ..మీడియా ముందు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నాటి నుంచి జనసేన పార్టీలోకి రఘురామ క్రిష్ణం రాజు కూడా వచ్చి చేరుతారని... ఇదే పార్టీ నుంచి పోటీచేస్తారని చెబుతున్నారు. కానీ ఎంపీ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో రెబల్ ఎంపీగా వున్న ఆయన త్వరలోనే జనసేన తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భీమవరం ఘటన దగ్గర నుంచి ఇటు జనసైనికులు సైతం రఘురామక్రిష్ణంరాజును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు.

Guntur

2022-08-06 10:01:00

MLCఎన్నికల్లో ఈసారి అసలైన రాజకీయం

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ప్రత్యక్షంగా జరిగే ఎమ్మెల్సీ(శాసన మండలి) ఎన్నికల్లో అసలైన రాజకీయం చోటు చేసుకోబోతుంది. ఎన్నికల సిత్రాలను రక రకాలుగా చూపిస్తుందనే వేడిని రగిలిస్తోంది. అవును మీరు చదువుతున్నది నిజమే. 2019లో 175 స్థానాలు కైవసం చేసుకోవడంతో శాసన మండలికి ఎన్నిక లేకుండా  వైఎస్సార్సీపీ పార్టీ సభ్యులను నేరుగా పంపే అవకాశం ప్రభుత్వానికి దక్కింది. కానీ టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యక్షంగా జరగాల్సి వుంటుంది. దీనితో అసలైన రాజకీయం మొత్తం అంతా ఇక్కడే జరగనుంది. దానికోసం అధికారపార్టీ వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ, బీజేపీ ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఈ సారిగట్టి పోటీ ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఓటు బ్యాంకుతో నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్టుగా కొందరు ఎమ్మెల్సీలను శాసన మండలికి పంపిన ప్రభుత్వం.. ప్రత్యక్ష ఎన్నికలో మాత్రం గట్టి పోటీని ఎదర్కొనే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయినా అధికార పార్టీ దమ్ము ప్రదర్శించడానికి సిద్ధపడుతోంది. తమ అభ్యర్ధులను గెలిపించినా ఆశ్చర్యపోవాల్సి పనిలేదు. దానికి కారణం, అవకాశం కూడా ప్రభుత్వం దగ్గర పెద్ద అస్త్రం సిద్దంగా ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే అధికార పార్టీ అధికారంలోకి రాకముందు చేసిన హామీలు(ముఖ్యంగా సీపీఎస్, పీఆర్సీలు) ఆతరువాత యూ టర్న్ తీసుకోవడం, తేడాగా అమలు చేయడం, చాలావాటిని కుదించడం, కోత విధించడం.. కొన్ని హామీలకు రివర్స్ లో అమలు చేయడం వంటి అంశాలు కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.

అధికార పార్టీకే అత్యధిక ఓటు బ్యాంకు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార పార్టీ ఎక్కడా ఓట్ల కోసం వెతుక్కునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం 2019 లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నేటి వరకూ 1.21లక్షల మంది ఉద్యోగాలు పొంది సర్వీసు రెగ్యులైజేషన్ కూడా పొందారు. అందులో 60శాతానికి పైగా ఉద్యోగులు డిగ్రీ, పీజీ చదువుకున్నవారే ఉన్నారు. ఈ తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల నుంచి, పార్టీలోని కేడర్ నుంచి, వారి కింద పనిచేసే కార్యకర్తల నుంచి గ్రాడ్యుయేట్ ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నది అధికార ప్రభుత్వం. ఇదే సమయంలో కొన్ని ప్రభుత్వ శాఖల్లోని గ్రాడ్యుయేట్లు, పార్టీ కేడర్ లోని వారు మాత్రమే సొంతపార్టీ అభ్యర్ధులకు ఓట్లు వేస్తారు తప్పితే మిగిలిన వారంతా అధికారపార్టీకి ఓటువేసే పరిస్థితి ఉండదని ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. దానికి తగ్గట్టుగానే వివిధ రాజకీయ పార్టీల నుంచి తమ తమ అభ్యర్ధులను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నాయి. మరో వైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ప్రభుత్వం తరపు నుంచి అభ్యర్ధులను రెడీ చేయడానికి కార్యాచరణ పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ రెండు స్థానాల్లోనూ అధికార పార్టీ అభ్యర్ధులను నిలబెట్టడానికి సిద్దం చేసి ఉంచింది. అటు ఓటు బ్యాంకును కూడా అనుకూల మీడియా ద్వారా చైతన్యం చేసే కార్యక్రమం పరోక్షంగా చేపడుతున్నది.

ప్రతిపక్షాలకు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే కొలమానం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష రాజకీయా పార్టీల అభ్యర్ధుల చేసే నెట్వర్క్, ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఇటు గ్రాడ్యుయేట్లు, అటు టీచర్ల ద్రుష్టికి తీసుకెళితే ఫలితం ఉండవచ్చునని భావిస్తున్నాయి. దానికి అనుగుణంగానే కాస్త మాటకారులను, అధికారపార్టీ ప్రజా, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగట్టే వాయిస్ ఉన్న అభ్యర్ధులను తయారు చేస్తున్నది. ఇప్పటి వరకూ చాలా మంది ఆశావాహులు వివిధ పార్టీల నుంచి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో నిలబడాలని సిద్దపడుతూ వారి వారి పార్టీలకు తమ అభ్యర్ధిత్వాలను పరిశీలించాల్సిందిగా దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే అందరి కంటే ముందుగా అధికార పార్టీ అభ్యర్ధులను సిద్దం చేసి ఉంచడంతో..వారిని ఎదుర్కొనే మెరికల్లాంటి అభ్యర్ధులను వారికి పోటీగా దించాలని కూడా ప్రతిపక్ష పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వారు..ప్రజల సమస్యలపై గట్టిగా మాట్లాడేవారు, తెలివైన ప్రజా ప్రతినిధులను పెద్దల సభకు పంపడానికి వడపోత కార్యక్రమాలతో ఇతర పార్టీలు సిద్ధం చేసుకుంటన్నాయి. అంతేకాదు వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలనే కొలమానంగా చేసుకోవాలని కూడా నిర్ధరించుకున్నాయి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయపార్టీలన్నీ.

నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ ఆశల పల్లకి..
రాబోయే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు రాష్ట్రప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా గ్రాడ్యుయేట్ యువతను, ఉపాధ్యాయులను ఆశల పల్లకి ఎక్కించేందుకు సిద్దమైంది. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి సుమారు రెండువేల ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేసేందుకు నోటిఫికేషన్ వచ్చేలా రంగం సిద్ధం చేస్తుంది. ఇలా చేయడం ద్వారా నిరుద్యోగ గ్రాడ్యుయేట్ ఓట్లన్నీ అధికారపార్టీ అభ్యర్ధులకు పడటానికి నూటికి నూరు శాతం ఛాన్సు ఉంది. అందులోనూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వారికీ కొత్త పీఆర్సీ పేస్కేలు ఇచ్చిన ప్రభుత్వ తీరు కూడా నిరుద్యోగ  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అయితే ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి తప్పా..మళ్లీ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం ప్రభుత్వం కూడా కాస్త గట్టిగానే పోరాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రవ్యాప్తంగా వున్న నాలుగు లక్షల పైచిలుకు ఉపాధ్యాయుల్లో 70శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మిగిలిన 30శాతంలో కూడా పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అలాగని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను ప్రభావితం చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి అస్త్రం కూడా లేదు. అందులోనూ పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియకు ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉండటంతో వారి సత్తా ఏమిటో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపడానికి అందరూ సిద్దంగా ఉన్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాలు, వైఎస్సార్సీపీ కేడర్ కుటుంబాలు మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేసే పరిస్థితి ఉంది తప్పితే జాబ్ కేలండర్ తీసినా.. సుమారు 60శాతం మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యనే..
 టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ పార్టీల మధ్యనే ఉండబోతుంది. మిగిలిన రాజకీయ పార్టీలు ఉన్నా తమ అభ్యర్ధుల కోసం ఉమ్మడిగా పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్పితే సింగిల్ గా రంగంలోకి దిగే సాహసం చేయలేవనేది అన్ని వర్గాల నుంచి వస్తున్నమాట. దీనితో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ప్రత్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికలు 2024 శాసన సభ ఎన్నికలకు రిఫరెండంగా మారే జరుగుతాయని చెబుతున్నారు. అదే రాజకీయ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అధికారపార్టీ తమ అభ్యర్ధులంటూ కొంత మంది పేర్లను తెరపైకి తెచ్చినా.. ఇంకా అధికారికంగా ఇతర పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లు ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధులు, నిరుద్యోగులు, సంఘాలతో మంచి అనుబంధాలు ఉన్న యువతను ప్రోత్సహించి అధికారపార్టీని ఎదుర్కొనే గట్టి గ్రాడ్యుయేట్ల కోసం ఇతర పార్టీలు వలవేసి వెతుకుతున్నాయి. కొంత మంది ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు దరఖాస్తులు పెట్టుకున్నా..ఇంకా గట్టి అభ్యర్ధులు దొరుకుతారనే కోణంలోనే చూస్తున్నాయని సమాచారం. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం విద్యాధికులు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నందున అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. యువత ఉద్యోగాల కోసం ఒక్క ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కూడా తీయకుండా..కేవలంల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభావం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోప్రభావం చూపిస్తుందనే వాదన కూడా బలంగానే వినిపిస్తుంది. చూడాలి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఏ స్థాయిలో రాజకీయం చేస్తుందనేది..!

Guntur

2022-08-04 01:52:42