1 ENS Live Breaking News

సీఎం జగన్ ఆలోచనలతో సంచలనాలు

సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్య ద్వారానే సమాజ అభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్మి  ప్రభుత్వ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. గడిచిన మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యపై రూ.52,677 కోట్లు వెచ్చించిందని గుర్తుచేసారు. జగనన్న అమ్మ ఒడి పథకం క్రింద 44,48,865 మంది లబ్ధిదారులకు రూ.19617.53 కోట్లు అందించారని అన్నారు. జగనన్న విద్యాదీవెన క్రింద 21,55,298 మందికి, జగనన్న వసతి దీవెన పథకంలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం  18,77,863 మందికి మొత్తం రూ 11007.17 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా రాష్ట్రంలో 47,40,421 మంది లబ్ధిదారులకు రూ 2368.33 కోట్లు అందించిందని,జగనన్న  గోరుముద్దలు క్రింద 43,26,782 మందికి రూ 3087..50 కోట్లు అందించిందని అన్నారు. పాఠశాలల్లో నాడు నేడు పథకం క్రింద 15715 స్కూల్లు ఆధునికీకరణకు మొదటిదశలో రూ.3669 కోట్లు వెచ్చించిందని అన్నారు.  వైఎస్సార్ సంపూర్ణ పోషణ క్రింద 3419875 మంది లబ్ధిదారులకు రూ.4895.45 కోట్లు అందించిందని అన్నారు. స్వేచ్ఛ  పథకం క్రింద 10,01,860 మంది లబ్ధిదారులకు రూ.32కోట్లు వెచ్చించి శానిటరీ న్యాప్  కిన్స్ అందించిందని అన్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా మీటింగ్ అయిపోయాక జనం కుర్చీలపై నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లిపోతారని కేవలం చంద్రబాబు మీటింగ్ లోనే కుర్చీలు ఎత్తుకెళ్తారని ఏద్దేవా చేసారు.వైఎస్ఆర్ సిపి ప్లీనరీ ప్రారంభానికి ముందు  సమావేశం అనంతరం ఖాళీగా ఉన్న కుర్చీలు చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్న పచ్చమీడియాపై ఆయన మండిపడ్డారు. ఇటువంటి చౌకబారు ప్రచారంతో ప్రజలలో విశ్వాసం పూర్తిగా కోల్పోయారని అన్నారు. రాష్ట్రపతి  రామనాథ్ కోవింద్ ని పట్టుకుని కోవిడ్ అని సంబోధించిన చంద్రబాబునాయుడికి ఇటివల పెట్టుకున్న చిప్ కూడా అరికాలును దాటి పాతాళానికి పడిపోయినట్టుందని ఎద్దేవా చేసారు.  సీఎం అయ్యాకే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని మంగమ్మ శపధం చేసిన చంద్రబాబు, రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు ఓటు వేయాలంటే అసెంబ్లీకి వెల్లాల్సివస్తుందని మర్చిపోయినట్లున్నాడని అన్నారు.

క్షుద్రపూజలు చేసి చంద్రబాబు, లోకేష్ లు వక్రబుద్ది వరంగా పొందారని ఫలితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి వీరికి వంకరగానే కనిపిస్తున్నాయని అన్నారు. అరాచకపాలక, అసురపాలన అంటే చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబు రాక్షసపాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఆ దుష్టపాలనకు చమరగీతం పాడి, రాజన్నరాజ్యం కోసం జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారని అన్నారు. అరాచకపాలనంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 

Tadepalli

2022-07-13 14:54:20

జిల్లా కార్యాలయానికి ఐదుగురే సిబ్బంది

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 13 జిల్లాలు ఏర్పాటైన తరువాత జిల్లాశాఖల కార్యాలయాల రూపం పూర్తిగా మారిపోయింది. జిల్లా కార్యాలయానికి వెళ్లిన ఏ ఒక్కరికైనా అసలు ఇది జిల్లా కార్యాలయమేనా అనేఅనుమానం కలుగుతున్నదంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు జిల్లా శాఖల కార్యాలయాలంటే కార్యాలయానికి కనీసం తక్కువలో తక్కువ 20 మంది సిబ్బంది ఉండేవారు. ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి కేవలం జిల్లా కార్యాలయానికి ఐ నుంచి ఏడుగురు సిబ్బంది మాత్రమే మిగిలారు. కాదు కాదు అలా తగ్గించేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే 26 జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యపెరుగుతుందని అంతా బావించారు. కానీ దానికి రివర్స్ లో ఉన్న సిబ్బంది కుదించుకుపోయి, కొత్తజిల్లాలకు సర్ధుబాటు చేసి ప్రభుత్వం. దీనితో 75 శాఖలకు చెందిన జిల్లాశాఖల్లో వేళ్లపై లెక్కపెట్టేంత సిబ్బంది మాత్రమే మిగిలివున్నారు. జిల్లా కలెక్టరేట్ లో ఉండే 8సెక్షన్లు కాస్త నాలుగు సెక్షన్లుగా కుదించేశారు. ఇక జిల్లా శాఖలకొస్తే.. ఒక జిల్లా అధికారి, అటెండరు,  డిజిటిల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కారు డ్రైవరు, కొన్నిశాఖల్లో మాత్రంల ఏఓలు కూడా ఉంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో జిల్లా స్థాయి ఉద్యోగులు లేకపోవడంతో ఏడీ స్థాయి ర్యాంకు ఉన్న అధికారులను కొత్త జిల్లాలకు జిల్లా అధికారులుగా నియమించేసింది ప్రభుత్వం. చాలా ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో మినిస్టీరియల్ స్టాఫ్ ను భారీగా కుదించేసింది ప్రభుత్వం. దీనితో చాలా కార్యకలాపాలు నిర్వహణ జిల్లా అధికారులకు గుదిబండగా మారింది. గతంలో పదుల సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు ఉంటేనే పనులు నెలలు నెలలు గడిచేవి. ఇపుడు ఆ పరిస్థితి మరింతగా పెరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు, కార్యకలాపాలు అన్నీ ఆన్లైన్ రికార్డుల్లో తప్పితే మరెక్కడా కనిపించడం లేదు. చాలా మంది జిల్లా అధికారులకు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడానికి డ్రైవర్లు కూడా లేని విధంగా మారిపోయింది. కొన్ని పాతజిల్లాల్లో మాత్రం జిల్లాశాఖల అధికారుల ఇబ్బందులను స్వయంగా పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్లు వారికి ఔట్ సోర్సింగ్ పద్దతిపై ఒక్కొక్క డిజిటల్ అసిస్టెంటన్ ను మంజూరు చేస్తున్నారు. 

కొన్ని జిల్లాల్లో ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొత్త జిల్లాకి ఎవరు జిల్లాశాఖ అధికారిగా వచ్చారో నేటికీ ప్రజలకు తెలియలేదు. దానిపై ఎలాంటి ప్రచారం కూడా ప్రభుత్వం చేపట్టలేదు. అంతేకాకుండా కొత్తజిల్లాల్లో జిల్లాశాఖల కార్యాలయాలు తెలియక చాలా ప్రజలు ఏ ఒక్క సమస్య వచ్చినా పాత జిల్లాలకే వెళ్లిపోతుండటం విశేషం. కొత్త జిల్లాల కార్యకలాపాలు మీడియాలో కనిపించినంతగా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు అవగాహన రాలేదు. ఆ విధంగా అవగాహన తెచ్చేవిధంగా కూడా జిల్లా శాఖల అధికారులు ఏ ఒక్క ప్రచారం కార్యక్రమం చేపట్టడం లేదు. చాలామంది అధికారులకు కొత్త జిల్లాలకు వెళ్లి పనులు చేయడమే చాలా కష్టంగా వుంది. దీనితో ఏదో మొక్కుబడిగా పనిచేస్తున్నాం అన్నట్టుగానే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది, అధికారులు, కుదించుకుపోవడంతో క్షేత్రస్థాయిలో చేపట్టే చాల పనులు పెండింగ్ లో పడిపోయాయి. అటు రాష్ట్రప్రభుత్వం మినిస్టీరియల్ సిబ్బందినైనా నియమిస్తుందనుకుంటే అదీకూడా భర్తీచేయకపోవడంతో రాష్ట్రప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత జిల్లాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే కొత్తజిల్లాల్లో సిబ్బంది లేమి, అధికారుల కొరత మరీ అధికంగా వుంది. ఆర్బాటంగా రాష్ట్రంలో 13 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసి..పరిపాలన సాగిస్తున్నట్టుగా చేస్తున్నా అసలు పనులు మాత్రం ఒక్క అడుగుకూడా ముందుకి కదలడం  లేదు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం జిల్లాశాఖల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తే ప్రజా పరిపాలన, జిల్లాశాఖ పెండింగ్ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం ఇదే విధంగా అరకొర సిబ్బందితో జిల్లాశాఖల కార్యాలయాలను నెట్టుకొస్తుందా..లేదంటే రానున్న రోజుల్లో భారీగా ఏర్పడిక ఖాళీలను భర్తీచేస్తుందా అనేది..!

Tadepalli

2022-07-13 05:54:30

ద్రౌపది ముర్మును కలిసిన రాష్ట్ర మంత్రి

ఎన్.డి.ఏ రాష్ట్రపతి  అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల  ప్రచారంలో భాగంగా  మంగళవారం అమరావతి విచ్చేశారు. ఈ  సందర్భంగా ఆమెను అధికార వైఎస్సార్సీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుసుకున్నారు. ఈ  సందర్భంగా నే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి,  మంత్రి గుడివాడ అమర్నాధ్‌ను ద్రౌపది ముర్మును పరిచయం చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా తనకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కలవడానికి ఆమె రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని ప్రకటించింది. ఆమె నామినేషన్ సమయంలో కూడా రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రధానిమంత్రితో కలిసి వెళ్లి తమ మద్దతును తెలియజేశారు.

Tadepalli

2022-07-12 15:42:58

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో  ఏవి. ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. సంవత్సరంలో నాలుగు ప‌ర్వ‌దినాలైన ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.   తిరుమంజ‌నం అనంత‌రం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. 

       ఇందులో భాగంగా  ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు  కాటసాని రాంభూపాల్ రెడ్డి,  మారుతి ప్రసాద్, సనత్ కుమార్,  మధుసూదన్ యాదవ్, ఎస్ ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ  వేణుగోపాల్, విజివో  బాలిరెడ్డి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Tirumala

2022-07-12 06:38:34

ఆగస్టు1కైనా పూర్తి పేస్కేలు వస్తుందా..?

మా ఇంటికి వస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. అని అడుగుతున్నట్టుగానే వుంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరు. రెండేళ్లు ప్రొబేషన్ ను 9 నెలలు పొడిగించి 33 నెలలు చేసింది ప్రభుత్వం.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీత భత్యాల ఉపయోగాల్లో మాత్రం భారీగా కోతపెట్టింది. పెంచిన పీఆర్సీ ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాదిరే రాష్ట్ర వ్యాప్తంగా వున్న 1.21లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. పెంచిన పీఆర్సీ పూర్తిస్థాయిలో ఇవ్వకపోగా, ఇపుడు 9నెలలు పేస్కేలు కోల్పోయేలా చేసింది. అంతేకాదు ఈ విధంగా 9నెలలు అధనంగా ప్రొబేషన్ లో ఉండిపోయిన ఉద్యోగులు తమ జీవిత కాలంలో ఒక ప్రమోషన్ కోల్పోయే ప్రమాదముంది. అక్టోబరు 2, 2021 నాటికి సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ అయివుంటే సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల్లానే వీరంతా కూడా పూర్తిస్థాయిలో జీతాలు తీసుకునేవారు. కానీ ఇపుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం అమలు చేసే ప్రసూతి సెలవులు, ఇతర మెడికల్ సెలవులు విషయంలో ఉద్యోగులు సర్వీసు ప్రొబేషన్ ను మాత్రం పెంచుతూ అమలు చేసినా..నోటిఫికేషన్, అదే జీఓల ప్రకారం ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ మాత్రం డిక్లేర్ చేయలేదు. దీని వలన 9నెలల పేస్కేలు, వాటితో వచ్చే ఇతర ఉపయోగాలు, పీర్సీ వలన పెరిగిన జీతం, ఆపై వచ్చే ఉపయోగాలు, అదనంగా పనిచేసిన 9నెలల కాలంలో ఆరు నెలలకు ఒకడీఏ కూడా ఉద్యోగులు కోల్పోయారు. ఇపుడు ప్రభుత్వం తాజాగా జీఓనెంబరు-5 ద్వారా ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా కూడా ఉద్యోగులకు పెంచిన పేస్కేలు పూర్తిగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 


ప్రసూతి నిబంధన పొడిగింపు పక్కాగా అమలుచేశారు..
ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన తరువాత ప్రభుత్వ నిబంధన ప్రకారం తొలుత రెండేళ్లు సర్వీస్ ప్రొబేషన్ పూర్తిచేయాల్సి వుంటుంది. తరువాత అదే ప్రభుత్వ నిబంధనతో సదరు ఉద్యోగులను ప్రభుత్వం నోటిఫికేషన్ లో ప్రకటించిన విధంగా సర్వీస్ రెగ్యులర్ చేసి, పూర్తిస్థాయిలో పేస్కేలును అమలుచేయాలి. కానీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వెసులుబాటుని 9నెలలకు పొడిగించి, అదే రూ.15వేలతోనే అదనంగా ఉద్యోగులతో పనిచేయించింది. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు 6నెలలు సర్వీసు ప్రొబేషన్ పొడిగించింది. ఇలా చేయడం వలన నేటికీ చాలా మంది ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తి కాలేదు. కానీ ప్రభుత్వం జీఓనెంబరు 5లో పేర్కొన్నవిధంగా చూస్తే రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకే సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని పక్కాగా ప్రకటించి జీఓలో పొందు పరిచింది. అదే ఉద్యోగ నియామకం సమయంలో ఇచ్చిన జీఓ, ఉద్యోగులు విధుల్లోకి చేరినపుడు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రెండేళ్ల తరువాత సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేసి పూర్తి పేస్కేలు ఎందుకు అమలు చేయాలేదని ప్రశ్నిస్తే.. అ ఒక్కటీ మీరు అడక్కూడదంటూ ఆ విషయాన్ని దాట వేసింది. ప్రభుత్వం ఈ విధంగా చేయడం వలన సచివాలయ ఉద్యోగులు 9నెలలు అదనంగా రూ.15వేలకే పనిచేయడంతోపాటు, 9 నెలల పేస్కేలు కోల్పోయారు. వాటితోపాటు, 27% ఐఆర్, ఒక డీఏ, పీఆర్సీ పెంపుతో రావాల్సిన ఎరియర్స్  ఉపయోగాలన్నీ కూడా ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది.

ఆగస్టు1కి వచ్చే జీతం ఎన్నికోతలకు గురై వస్తుందో..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆగస్టు1 నుంచి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారందరికీ పూర్తిస్థాయి పేస్కేలు అమలు చేయాలని, వాటికోసం జూన్ నెలాఖరు నాటికే వారి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని జీఓనెంబరు-5 ద్వారా ఆదేశించింది. ఈ సమయంలోనే ఉద్యోగుల జీతాలకు చెందిన సాలరీ బిల్లులు ప్రతీ నెల 20 నుంచి 25 వతేదీలోగా అప్లోడ్ చేయాల్సి వుంటుంది. అయితే ప్రసూతి సెలవులు తీసుకున్నవారి సర్వీసు ప్రొబేషన్ సాలరీలు పెట్టే సమయం నాటికే పూర్తయినా వారు కొత్త పేస్కేలు పొందే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ విధంగానే ప్రభుత్వం జీఓలో పొందు పరిచింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బినిఫిట్స్ ను తప్పించుకునేందుకు.. ప్రభుత్వానికి అనుకూలంగా జీఓలను అమలు చేయనప్పటికీ, ప్రసూతి, సిక్ లీవ్ లను అమలు చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం తమ నిబంధనను ఖచ్చితంగా అమలు చేసింది. ఈ ఒక్క కారణంతోనే నేటికీ చాలా మందికి మహిళా ఉద్యోగలకు సర్వీసు ప్రొబేషన్ కి సంబంధించిన డిక్లరేషన్ ఫైనల్ డాక్యుమెంట్లు జిల్లాశాఖల కార్యాలయాల నుంచి సచివాలయాలకు చేరుకోలేదు. అంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా వ్యవహరించినప్పటికీ, ఉద్యోగుల సెలవుల విషయంలో ప్రభుత్వం తూచా తప్పకుండా జీఓలను అమలు చేయడం మాత్రం ఎక్కడా ఆపలేదు. ఈ ఒక్క కారణంతోనే ఆగస్టు 1నాటికి కూడా చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెరిగిన పేస్కేలు జీతం అందుకునే పరిస్థితి లేదు. అంతేకాదు అసలు ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసి పేస్కేలు ఇస్తామని చెప్పినట్టుగా.. ఎంత జీతం చేతిలో పెడుతుంది. ఏఏవి కోత పెట్టిందీ తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి.. సచివాలయ ఉద్యోగులకు జాయినింగ్ ఆర్డర్ లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వం, ఇపుడు పెరిగిన పేస్కేలుతో ఎంత మొత్తం వారికి జీతాలు అందించనుందో..ఏ మొత్తాన్ని కుదించి..అవి మీకు ఇవ్వడం లేదని చెప్పనుందో.. ఈ లెక్కన చూస్తే.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. అని నానుడిని పక్కాగా అమలు చేసినట్టు లేదూ..!

Tadepalli

2022-07-08 08:31:07

ప్రభుత్వం నిల్(కార్యాలయం)రాజకీయం ఫుల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసినంత త్వరగా కొత్త జిల్లాల్లో ప్రభుత్వ జిల్లాశాఖల  కార్యాలయాల ఏర్పాటు మాత్రం చేయడానికి చొరవ చూపించడం లేదు. ఒక్కో జిల్లాలో సుమారు 75శాఖలకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి వుంది. ముఖ్యమైన శాఖలైన రెవిన్యూ, పోలీస్, ఫారెస్టుతో మరో పది పదిహేను కార్యాలయాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. మిగిలిన కార్యాలయాలు మాత్రం కొత్త జిల్తాల్లో ఏర్పాటు కాలేదు. పేరుకి జిల్లా కార్యాలయాల బోర్డులు తగిలించినా కార్యకలాపాలు మాత్రం పాత జిల్లాల నుంచే నడిపిస్తుంది ప్రభుత్వం. ఇటీవలే ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం ఆ తరువాత కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు. కొత్త జిల్లాల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలు ప్రారంభం అయిపోయి కార్యకలాపాలు మొదలు కావడం విశేషం. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఫారెస్ట్ అధికారుల కార్యాలయాలకు సంబంధించినంత వరకూ  సివిల్ సర్వీస్ అధికారుల నియామకాలు మాత్రం నూతన జిల్లాల ఏర్పాటు నుంచే ప్రారంభం అయినా మిగిలిన శాఖల కార్యాలయాలు ఒక్కొక్కటీ ధీమాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇదే క్రమంలో ఇప్పటికీ చాలా మంది పాత జిల్లాల్లోనే స్పందన కార్యక్రమాలకు వెళ్లి తమ అర్జీలను ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడ అధికారులు మీ జిల్లా మారిపోయింది. ఇకపై మీరు  పలానా జిల్లా కలెక్టరేటు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నచోటుకి వెళ్లి మీ సమస్యను అక్కడ జిల్లా అధికారులకు తెలియజేయండి అని నచ్చజెప్పి పంపిస్తున్నారు.ఇక మీడియా కార్యాలయాలు కూడా విభజన జరగలేదు. పత్రికలైతే పాత జిల్లాలు ఎన్ని జిల్లాలుగా మారాయో.. అన్ని జిల్లాలు(మూడేసి జిల్లాలను కలిపి) పేర్లను ఒకే ఎడిషన్ పై వేసి ఆ జిల్లాలకు చెందిన సమాచారాన్ని, వార్తలను పాఠకులకు అందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం ఆయా కొత్త జిల్లాల పేర్లతోనే వార్తల బులిటిన్ లను విడుదల చేస్తున్నాయి.

ఇక్కడ చెప్పుకోవాల్సినది ముఖ్యంగా రాజకీయ పార్టీలు. అన్ని రాజకీయ పార్టీలు తమ సొంత జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాల ఎంపిక పూర్తిచేసుకొని నిర్మాణాలకు సిద్ధం అవుతున్నా.. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడం పట్ల ప్రజలు గందర గోళానికి గురవుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలు కూడా ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఎక్కడో ఏర్పాటు చేయడం, వాటిపై ప్రజలకు అవగాహన వచ్చేలా నేటికీ పూర్తిస్థాయిలో మీడియా ద్వారా కూడా ప్రచారం చేయకపోవడం ప్రజలకు కొత్త ఇబ్బందులను తీసుకొస్తున్నది. అలాగని గ్రామ, వార్డుల్లోని సమస్యలపై సదరు సచివాలయాల్లో దరఖాస్తులు చేసినా వాటికి పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ఒక్క అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడా పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు మాత్రం కాలేదు. మరోవైపు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం కూడా అర్ధాంతరంగానే ఆగిపోయింది.

విచిత్రం ఏంటంటే..అధికాపార్టీ రాజకీయ కార్యక్రమాలు, కార్యకలాపాలు కూడా పాతజిల్లా కేంద్రంగానే నిర్వహిస్తోంది. అటు జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, టిడిపి, లోకసత్తా, బిఎస్పీ లాంటి రాజకీయపార్టీలు మాత్రం కొత్త జిల్లాల్లో కార్యలయాలు ప్రారంభించి తమ కార్యకలాపాలను కొత్త జిల్లాలల్లోని మండలాలకు కూడా విస్తరించాయి. అధికార పార్టీకి పాత జిల్లాల్లోనే కార్యాలయాలు ఉండటం, కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో జిల్లా కార్యాలయాలు లేకపోవడంతో చిన్నా, చితకా ప్రెస్ మీట్లు కూడా పాత జిల్లా కేంద్రంగానే ఏర్పాటు చేస్తున్నాయంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీకి జిల్లాల్లో కార్యాలయాలు లేకనే ప్రభుత్వ కార్యాయాలు కూడా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తుందని అన్ని వర్గాల ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాలు నిల్.. రాజకీయపార్టీల కార్యాలయాల ఫుల్ అన్నచందంగా తయారైంది కొత్త జిల్లాల్లోని పరిస్థితి. కొత్త జిల్లాల్లో కొన్ని డివిజనల్ కార్యాలయాలు సొంత కార్యాలయాల్లో నడుస్తున్నా..వాటిని జిల్లా కార్యాలయాలుగా మర్పు చేసి కొన్ని కార్యాలయాకే పరిమితం చేశారు. 75 ప్రభుత్వశాఖలకు సంబంధించిన అధికారులు ఎక్కడెక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు.. అసలు ఆ మొత్తం జిల్లా అధికారులందరూ కొత్త జిల్లాలకు వచ్చారా? వారిని ఏ విధంగా సంప్రదించాలి..? అన్నది కూడా ప్రశ్నార్ధకంగానే మిగిలి పోయింది. చూడాలి డిసెంబరు లోపుగా అన్ని ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయిలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఏ స్థాయిలో అమలు జరుగుతుందనేది.

Anakapalle

2022-07-08 05:40:09

జూలై 8న సెప్టెంబరు వ‌స‌తి కోటా విడుదల

తిరుమ‌లలో వ‌స‌తి కోటాను జూలై 8వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.  సెప్టెంబరు నెల‌కు సంబంధించిన ఈ కోటాను విడుదల చేయడానికి టిటిడి అధికారులు సర్వంసిద్దం చేశారు.  అదేవిధంగా, శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు జూలై 12, 15, 17తేదీల్లో వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు  ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.  భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి తిరుమలలో వసతి కోటాను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని టిటిడి వసతి విభాగం అధికారులు కోరుతున్నారు.

Tirumala

2022-07-07 09:06:22

జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది  పాల్గొంటారు.

Tirumala

2022-07-07 08:59:53

ధరణిలో తప్పుల కుప్పలు కొండంత

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ఇపుడు వివాదస్ప దంగా మారుతుందా? తెలంగాణాలోని అన్ని మునిసిపాలిటీలలోని భూమి రికార్డులను గురించి తెలిపే వెబ్ సైట్ ధరణి పోర్టల్ ఇపుడు పలు వివాదాలకు కారణమవుతుందా? మరోవైపు కొనుగోళ్లు, అమ్మాకాలు, యజమనుల వివరాలు, భూమి విస్తీర్ణం  తదితర అంశాలను తెలిపే వివారాల్లో, పలు లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించడంతో భూనిర్వాసితుల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ధరణి పోర్టల్లో తెలెత్తుతున్న తప్పుల తడకపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కి వెళ్లి, ఏకరువు పెట్టాలని నిర్ణయించింది. దాంతో స్పందించిన సీఎం కేసీఆర్, ధరణి సమస్యలపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్హహించారు. ఈ నెల 15 నుంచి రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్లి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్ అనేది ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ పోర్టల్ గా టీఎస్ ప్రభుత్వం రూపొందించింది.  ధరణి మా భూమి అనేది తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ గా మనకు తెలిసిందే.  రాష్ట్రంలోని నివాసితులకు అన్ని మునిసిపాలిటీలలోని భూమి రికార్డుల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ధరణి పోర్టల్‌ తన సేవలను అందిస్తుంది. దాంతో పాటు అదనంగా, రాష్ట్ర నివాసితులకు ఆదాయంతోపాటు, రిజిస్ట్రేషన్ సౌకర్యాలను అందించే ప్రక్రియలో భాగంగానే ఈ వెబ్ సైట్ రూపొందించబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యాప్ లో తప్పుల తడకగా కనిపిస్తున్న అనేక వివరాలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది.  ధరణి పోర్టల్ వెబ్ సైట్ రూపోందించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగిన విషయమే అయినా, ఈ వెబ్ సైట్ నిర్వహణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పప్పులో కాలేసిందనే చెప్పాలి. 

తెలంగాణ పౌరులకు భూమి రికార్డులను సులభంగా యాక్సెస్ చేయడం, రిజిస్ట్రేషన్ సేవలు ఆన్‌లైన్‌లో అందించడం, భూమి రికార్డులు, సర్వే, మ్యాప్, పాఠ్య రికార్డుల నమీకరణ, పరిష్కార కార్యకలాపాల నిర్వహణ, ఆస్తి నమోదు తర్వాత మ్యుటేషన్ స్యయం చాలకం తదితర అంశాలపైనా స్పష్టమైన వివరాల కోసం ఈ వెబ్ సైట్ రూపొందించడిన విషయం తెలిసిందే.

వెబ్ సైట్ నిర్వహణలో లోపాలు, స్పష్టమైన వివారాలు పొందుపరచక పోవడం  తోపాటు కోనుగోలు దారుడు, అమ్మకం దారుకి మధ్య ఉన్న వివరాలు ఇందులో పొందుపరచకపోవడం గమనార్హం. దాంతో భూ నిర్వాసితుల్లో గందరగోళ పరీస్థితుల ఏర్పడతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు భూమిపై హక్కు అనే విషయంలో కొనుగోలు దారుడి పేరు చేర్చకుండా, అమ్మకం దారుని పేరు మాత్రమే కొనసాగిస్తున్నట్లు అధికారుల పరిశీలనల్లో వెల్లడైంది. కొన్ని ప్రాంతాల్లో నమోదైన భూ విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణం చూపిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో సర్వేనెంబర్లు స్పష్టంగా ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన భూమి మాత్రం కనిపించడంలేదు. మరోవైపు భూమి ఉన్నా, ..  విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. భూ వివాదాలపై కోర్టుల్లో ఉండటం, కోర్టు తీర్పులో సర్వే నంబర్ ని భూమి మొత్తానికి వర్తించే సాంకేతిక పరమైన ఇబ్బందులను అధికారులు గుర్తించారు. మొత్తం మీద ధరణితో తలెత్తుతున్న సమస్యలతోపాటు, ఆయా ప్రాంతాల్లోని రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 బందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మూడు రోజులకో మండలం చోప్పున, జాయింట్ కలెక్టర్, డీఆర్ వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో, ధరణి పోర్టల్ ఏ మేరకు సేవలను అందిస్తుందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాగా మండలాల్లో నిర్వహించే ఈ సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే కూడా అధ్యక్షత వహిస్తారని తెలుస్తుంది.

Hyderabad

2022-07-06 08:59:38

ఏపీలో సచివలయ ఉద్యోగులకు మొండి చేయి

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయానికి చెందిన ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ తేగా వైఖరితో  9నెలల పేస్కేలుతోపాటు ఒక డిఏని, నూతన పీఆర్సీలోని ఉపయోగాలను సైతం కోల్పోవాల్సి వచ్చింది. అక్టోబరు 2021 అక్టోబరు 2నాటికి సచివాలయ ఉద్యోగులకు 2ఏళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తయ్యింది. అపుడు ఉద్యోగుల సర్వీసుని క్రమబద్దీకరించి ఉంటే ఉద్యోగులు పేస్కేలుతోపాటు.. ఆరునెలల సమయం దాటిన తరువాత డీఏ కూడా పొందేవారు. అలా కాకుండా ప్రొబేషన్ పీరియడ్ ని డిపార్ట్ మెంటల్ టెస్టుల పేరుతో 9 నెలలు పొడిగించడంతో ఉద్యోగులు పేస్కేలతోపాటు డీఏ కూడా కోల్పోయారు. తీరా ఇపుడు ఆగస్టు 2 నుంచి కొత్త పేస్కేలు జీతాలు అందుకుంటున్నప్పటికీ ఇతరశాఖల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సచివాలయ ఉద్యోగులకు పూర్తి పీఆర్సీతో కూడిన పేస్కేలును ప్రభుత్వం అమలు చేయలేదు. సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ లో ఇచ్చినట్టుగా అక్టోబర్ 2 నాటికి ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ అయి ఉంటే అందరు ఉద్యోగులు మాదిరిగానే సచివాలయ ఉద్యోగులు కూడా పూర్తిస్థాయి పీఆర్సీ, దాని ఉపయోగాలు పొందేవారు. కానీ ఇపుడు పెంచిన ఫిట్ మెంట్ తప్పా ఉద్యోగులకు మరేమీ కలవడం లేదు. దీనితో ఒక్కో ఉద్యోగి పెరిగిన పీఆర్సీలో సుమారు 7వేల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇపుడు వీరికి ఐఆర్(ఇంటీరియమ్ రిలీఫ్), పాత డీఏలు కూడా వర్తింపజేయడం లేదు.  తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనదునే ఇతర ప్రభుత్వశాఖ ఉద్యోగులకు వర్తింపజేసినట్టుగా పీఆర్సీని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేయడం లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి  పీఆర్సీతో కూడిన పేస్కేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం పాత పేస్కేలు ఎంత మొత్తం, ప్రస్తుత పేస్కేలుకి పీఆర్సీలోని ఏ మొత్తాన్ని కలిపితే పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలకు రూ.23120, ఇతర 18శాఖల ఉద్యోగులకు రూ.22460 వచ్చిందో సరిగ్గాలెక్కవేసి చెప్పలేదు. సాధారణంగా పీఆర్సీ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ముందుగా ఐఆర్(ఇంటీరియ్ రిలీఫ్) ప్రకటించిన తరువాత ప్రభుత్వ నిర్ణయంపై కొంతమొత్తం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తాయి. ఎప్పటి నుంచైతే అమలు చేస్తున్నాయో ఆ మొత్తాలకు చెందిన ఎరియర్స్ ను కూడా ఉద్యోగులకు అందిజేస్తుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రం వాటికి భిన్నంగా జరుగుతోంది. రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినట్టుగా(ఫిట్ మెంట్ పేస్కేలు+డీఏ+హెచ్ఆర్ఏ) వాటిపై వచ్చే ఎరియర్సును సచివాలయ ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సి వుంటుంది. కానీ ప్రభుత్వం ఒక్క ఫిట్ మెంట్, డీఏ, హెచ్ఆర్ఏ మాత్రమే పాత పేస్కేలుపై పెంచి ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్నట్టు చెబుతోందట. అంటే ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఐఆర్ తోపాటు, పీఆర్సీపై వచ్చే ఎరియర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డీఏలను కూడా కోల్పోయారన్నమాట. సర్వీసు ప్రొబేషన్ గడువు పెంచేయడంతో వీటికి ముందు 9 నెలలుగా రావాల్సిన పేస్కేలు కూడా కోల్పోయారు సచివాలయ ఉద్యోగులు. ప్రభుత్వం జారీ చేసిన జీఓనెంబరు-5 ద్వారా లెక్కలు వేసిన ఆర్ధిక వేత్తలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు.

సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి..దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానకపుత్రికగా ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. మీడియా ద్వారా కూడా అంతకంటే ఎక్కువగానే ప్రచారం కల్పించారు. ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి..ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ చూపిస్తూ..ఆదిలోనే వారికి రావాల్సిన ఉపయోగాలను హరించిన విధానాన్ని ఇపుడు ప్రతీ ఒక్కరూ తప్పు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన దగ్గర నుంచి రెండేళ్ల పాటు ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించారు. అలా సేవలు అందించడానికి రెండవ శనివారాలు, ఆదివారాలు.. ఆఖరికి పండుగ సెలవుల్లో కూడా సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించారు. ఇలా పనిచేసిన క్రమంలో వేలాది మంది సచివాలయ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. పదుల సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు కరోనా మహమ్మారికి బలయ్యారు కూడా. ఇంతగా పనిచేసిన సచివాలయ ఉద్యోగులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరిని ప్రత్యేక ఉద్యోగులుగా గుర్తిస్తూ..వారికి రావాల్సిన అన్ని ఉపయోగాల్లోనూ కోత పెట్టేసింది. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులు ఏ తరగతికి చెందినవారో నేటికీ ప్రకటించకపోవడం విశేష. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కీలకం. కరోనాలాంటి విపత్కర సమయంలో సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఎంతోప్రాణ నష్టం సంభవించి ఉండేది. కానీ అంతలా పనిచేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా దారుణంగా వ్యవహరించి ప్రొబేషన్ సమయంలో అదనంగా 9నెలలు అదే రూ.15వేలకే పనిచేయించింది. అప్పుడు అలా పనిచేయించినా.. కనీసం తరువాతనైనా పీఆర్సీ వర్తింపచేస్తే తాము లాసైన ఉపయోగాలు పొందవచ్చనుకుంటే..పీఆర్సీ అమలు చేసే విషయంలో అన్నీ కోతలు పెట్టింది ప్రభుత్వం. దీనితో ప్రభుత్వ తీరుతో అటు ప్రతిపక్షాలు, ఇటు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన అందుకునే పేస్కేలు చేతికి వస్తే తప్పా, ఒక్కో సచివాలయ ఉద్యోగికి పీఆర్సీ ఉపయోగాల్లో ఎంత మేరకు రంధ్రం పడిందీ తెలిసే పరిస్థితి లేదు. ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగం అనే ఒకే ఒక్క ఆశతో లక్షలు జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను విడిచి పెట్టి.. విధుల్లోకి చేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఈ విధంగా కోలుకోలేని జెల్లకాయ కొట్టడంపై ఇపుడు ఉద్యోగులంతా ఆలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతుంది. చూడాలి ముందు ముందు ఇంకెన్ని ప్రభుత్వ ఉపయోగాలు, సదుపాయాలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రంధ్రానికి గురవుతాయో..!

Hyderabad

2022-07-05 13:40:59

ప్రధాని నరేంధ్ర మోదీ ప్రకటనపై హర్షం

భరతమాత ముద్దు బిడ్డ, మన్యంలో మహోదయం స్రుష్టించిన విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు నడయాడి సంచరించిన ప్రదేశాలను అభివ్రుద్ధి చేస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడంపై అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా నాటి నుంచి నేటి వరకూ కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ఒక్క ప్రధాని అల్లూరి కోసం ఇంత పెద్ద స్థాయిలో ప్రకటన చేయలేదన్నారు. మొట్టమొదటి సారిగా ఏన్డీఏ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి అల్లూరి సంచరించన ప్రదేశాలను అభివ్రుద్ధి చేయాలని ప్రకటన చేయడం ఆ మహానుభావునికి నిజమైన గుర్తింపు నిచ్చినట్టు అయ్యిందన్నారు. భారత దేశ చరిత్రలో బ్రిటీషు సేనలపై అల్లూరి చేసిన వీరోచిత పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. అంతటి మహానుభావుడు నడయాడిన ప్రదేశాలకు ఆయన జన్మంచిన 125 సంవత్సరాలకు కేంద్రప్రభుత్వం గుర్తింపు తీసుకువస్తామని చెప్పడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయమన్నారు. లంబసింగి వద్ద అల్లూరి మ్యూజియంతోపాటు,చింతపల్లి పోలీస్ స్టేషన్ లను అభివ్రుద్ధి చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం కూడా ఒక చరిత్రగా నిలిచిపోతుందన్నారు. ప్రధాని చేసిన ప్రకటనను అమలు చేస్తూ తక్షణమే పనులు ప్రారంభించేలా చేయాలని కోరుతున్నట్టు ప్రకటించారు. అల్లూరి జన్మించిన ప్రదేశం, చదవుకున్న ప్రాంతం, కీలక పోరాలు, తిరుగుబాటు చేసిన క్రిష్ణదేవిపేట ప్రాంతాలను సెంట్రల్ టూరిజం ప్రాజెక్టుగా అభివ్రుద్ధి చేయడం ద్వారా భావితరాలకు అల్లూరి చరిత్ర, ఆ మహానుభావుడు సంచరించన ప్రదేశాలు గుర్తుండి పోయాయని అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Visakhapatnam

2022-07-05 10:45:25

తెలుగుజాతి గౌరవం భారతదేశ పౌరుషం..

తెలుగుజాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు భీమవరం మహాసభలో పాల్గొన్న సీఎం అల్లూరి కీర్తిని ఏకబిగిన కొనియాడారు. అడవిబిడ్డలకు ఆరాధ్యదైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈ రోజు గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే... ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా పాడేరుకి అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టామని గుర్తు చేశారు.  భీమవరంలో ఏ రకంగా విగ్రహావిష్కరణ జరుగుతుందో ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ  మహామనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మర్చిపోదన్నారు. దేశం కోసం అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్ధుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిల్చిపోతుంది. అమర్‌ రహే అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు జైహింద్‌ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ తన ప్రసంగంలో దేశభక్తిని చాటుకున్నారు. 

Bhimavaram

2022-07-04 15:09:47

ఎస్వీ సంస్కృత కళాశాలలో ప్రవేశాలు

తిరుమల తిరుపతి దేవస్థానానికి  చెందిన సికింద్రాబాద్ ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు రెండేళ్ల ప్రి డిగ్రీ కోర్సులో చేరేందుకు అర్హులు. సంస్కృతం ద్వితీయ భాషగా ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు బిఏ(ఓఎల్) డిగ్రీ కోర్సులో చేరేందుకు అర్హులు. విద్యార్థులకు ఉచితంగా బస, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలు రాసేందుకు అర్హులు. జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ లోపు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా: శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల, 170- ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డు, బోయిన్ పల్లి, సికింద్రాబాద్-500011. మరిన్ని వివరాల కోసం 040 - 27750032, 9248813578, 990897 0007, 9441645995 నంబర్లను సంప్రదించగలరు.

Secunderabad

2022-07-04 14:48:25

12ర‌కాల గోఆధారిత వ్యవసాయ ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ‌

తిరుమ‌ల శ్రీ‌వారికి నైవేద్యం, ఇత‌ర ప్ర‌సాదాలు త‌యారుచేసేందుకు వీలుగా  గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో మ‌లి విడ‌త‌లో 12 ర‌కాల ఉత్ప‌త్తులు సేక‌రించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ‌, మార్క్‌ఫెడ్‌ల‌తో ఒప్పందం చేసుకున్నామ‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో శ‌నివారం రాష్ట్ర రైతు సాధికార సంస్థ‌, మార్క్‌ఫెడ్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ 2021, అక్టోబ‌రు 11న రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి స‌మ‌క్షంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ‌తో ఎంఓయు చేసుకున్న‌ట్టు తెలిపారు. ఈ మేర‌కు తొలివిడ‌త‌లో 500 మెట్రిక్ ట‌న్నుల శ‌న‌గ‌లు కొనుగోలు చేశామ‌న్నారు. మ‌లి విడ‌త‌లో ప్ర‌స్తుతం బియ్యం, శ‌న‌గ‌లు, బెల్లం, కందిప‌ప్పు, పెస‌లు, ప‌సుపు, వేరుశ‌న‌గ‌, మిరియాలు, ధ‌నియాలు, ఆవాలు, చింత‌పండు, ఉద్దిప‌ప్పు సేక‌రించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. వీటిని ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల నుండి రాష్ట్ర రైతు సాధికార సంస్థ కొనుగోలు చేస్తుంద‌ని, ఈ సంస్థ నుండి మార్క్‌ఫెడ్ కొనుగోలుచేసి త‌గిన విధంగా మార్పుచేసి టిటిడికి అందిస్తుంద‌న్నారు. ఈ వ్య‌వ‌స్థ‌లో మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం ఉండ‌ద‌ని చెప్పారు.

             టిటిడి ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టింద‌ని,  ప్ర‌జ‌లు కూడా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను ఆద‌రించాల‌ని కోరారు. ర‌సాయ‌న ఎరువులు, పురుగుమందులు లేని పంట ఉత్ప‌త్తుల‌ను స్వీక‌రించ‌డం ద్వారా ఆరోగ్య‌క‌రంగా ఉంటామ‌ని, ఈ మేర‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు పెట్టే ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని చెప్పారు. టిటిడి కోసం రైతు సాధికార‌ సంస్థ ఎంపిక చేసిన రైతులు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పంట‌లు పండించాల‌ని, ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ ర‌సాయ‌న ఎరువులు వినియోగించ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. టిటిడి స్ఫూర్తితో రాష్ట్రంలోని ఇత‌ర ఆల‌యాలు కూడా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో అన్న‌ప్ర‌సాదాలు త‌యారుచేసేందుకు ముందుకొస్తున్నాయ‌ని తెలిపారు. క్ర‌మక్ర‌మంగా హోట‌ళ్లు, ఇత‌ర సంస్థ‌లు ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను వినియోగించాల‌ని, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి పూర్వ వైభ‌వం తీసుకురావాల‌ని కోరారు.

             రాష్ట్ర రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మ‌న్  విజ‌య‌కుమార్ మాట్లాడుతూ రైతు సాధికార సంస్థ‌, మార్క్‌ఫెడ్ క‌లిసి గో ఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా పండించిన శ‌న‌గ‌పప్పును టిటిడికి స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు తెలిపారు. మొద‌టి ద‌శ‌లో 1300 మెట్రిక్ ట‌న్నుల శ‌న‌గ‌ల‌ను రైతుల నుండి సేక‌రించి ర‌సాయ‌న అవ‌శేషాల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగిందన్నారు. మ‌లి ద‌శ‌లో 12 ర‌కాల వంట‌స‌రుకుల‌ను సేక‌రించేందుకు ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌ ఎంపిక జ‌రుగుతోంద‌ని, ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ర‌సాయ‌నాలు వాడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుని పంట‌లు పండిస్తార‌ని తెలిపారు. గ‌తేడాది టిటిడి గోశాల నుండి 1800 ఆవులు, ఎద్దుల‌ను ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు అందించిన‌ట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న గోశాల‌ల వ‌ద్ద మిగులుగా ఉన్న ఆవుల‌ను, ఎద్దుల‌ను రైతుల‌కు అందించేందుకు టిటిడి చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు.

              రాష్ట్ర వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ మ‌ధుసూద‌న‌రెడ్డి మాట్లాడుతూ శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు ర‌సాయ‌న ర‌హిత వంట స‌రుకుల‌తో త‌యారుచేసిన ప్ర‌సాదాలు అందించాల‌ని టిటిడి నిర్ణ‌యించ‌డం ముదావ‌హ‌మ‌న్నారు. ఇందులో భాగంగా మొద‌ట‌గా ల‌డ్డూ త‌యారీకి వినియోగించే శ‌న‌గ‌ల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా సేకరించిందన్నారు. ఈసారి రాష్ట్ర రైతు సాధికార సంస్థ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు పండించిన 12 ర‌కాల వంట స‌రుకుల‌ను మార్క్‌ఫెడ్ ద్వారా సేక‌రించి టిటిడికి అంద‌జేస్తామ‌న్నారు.

              మార్క్‌ఫెడ్ ఎండి శ్రీ ప్ర‌ద్యుమ్న మాట్లాడుతూ ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన 1276 మెట్రిక్ ట‌న్నుల శ‌న‌గ‌లు ఇవ్వాల‌ని టిటిడి కోర‌గా 500 మెట్రిక్ ట‌న్నులు సేక‌రించి అందించామ‌న్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కంటే 10 శాతం ఎక్కువగా చెల్లించ‌డం ద్వారా అటు రైతుల‌కు లాభ‌దాయ‌కంగా ఉంటుంద‌ని, ఇటు టిటిడికి నాణ్య‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన‌ వంట స‌రుకులు అందుతాయ‌ని తెలిపారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులకు 7 నుండి 10 రోజుల్లోపు మార్క్‌ఫెడ్ సొమ్ము చెల్లిస్తుంద‌ని, ఆ త‌రువాత టిటిడి నుండి మార్క్‌ఫెడ్ రీయింబ‌ర్స్‌మెంట్ తీసుకుంటోంద‌ని చెప్పారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తామ‌న్నారు.    ఈ స‌మావేశంలో టిటిడి జెఈవో వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, మార్కెటింగ్ జిఎం సుబ్ర‌హ్మ‌ణ్యం, ఎస్వీ వెట‌ర్న‌రీ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌ వెంక‌ట‌నాయుడు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-07-02 11:09:20

9నెలల పేస్కేలు, 1డీఏ, పీఆర్సీకీ రంధ్రం

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయానికి చెందిన ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ తేగా వైఖరితో  9నెలల పేస్కేలుతోపాటు ఒక డిఏని, నూతన పీఆర్సీలోని ఉపయోగాలను సైతం కోల్పోవాల్సి వచ్చింది. అక్టోబరు 2021 అక్టోబరు 2నాటికి సచివాలయ ఉద్యోగులకు 2ఏళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తయ్యింది. అపుడు ఉద్యోగుల సర్వీసుని క్రమబద్దీకరించి ఉంటే ఉద్యోగులు పేస్కేలుతోపాటు.. ఆరునెలల సమయం దాటిన తరువాత డీఏ కూడా పొందేవారు. అలా కాకుండా ప్రొబేషన్ పీరియడ్ ని డిపార్ట్ మెంటల్ టెస్టుల పేరుతో 9 నెలలు పొడిగించడంతో ఉద్యోగులు పేస్కేలతోపాటు డీఏ కూడా కోల్పోయారు. తీరా ఇపుడు ఆగస్టు 2 నుంచి కొత్త పేస్కేలు జీతాలు అందుకుంటున్నప్పటికీ ఇతరశాఖల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సచివాలయ ఉద్యోగులకు పూర్తి పీఆర్సీతో కూడిన పేస్కేలును ప్రభుత్వం అమలు చేయలేదు. సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ లో ఇచ్చినట్టుగా అక్టోబర్ 2 నాటికి ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ అయి ఉంటే అందరు ఉద్యోగులు మాదిరిగానే సచివాలయ ఉద్యోగులు కూడా పూర్తిస్థాయి పీఆర్సీ, దాని ఉపయోగాలు పొందేవారు. కానీ ఇపుడు పెంచిన ఫిట్ మెంట్ తప్పా ఉద్యోగులకు మరేమీ కలవడం లేదు. దీనితో ఒక్కో ఉద్యోగి పెరిగిన పీఆర్సీలో సుమారు 7వేల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇపుడు వీరికి ఐఆర్(ఇంటీరియమ్ రిలీఫ్), పాత డీఏలు కూడా వర్తింపజేయడం లేదు.  తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనదునే ఇతర ప్రభుత్వశాఖ ఉద్యోగులకు వర్తింపజేసినట్టుగా పీఆర్సీని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేయడం లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి  పీఆర్సీతో కూడిన పేస్కేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం పాత పేస్కేలు ఎంత మొత్తం, ప్రస్తుత పేస్కేలుకి పీఆర్సీలోని ఏ మొత్తాన్ని కలిపితే పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలకు రూ.23120, ఇతర 18శాఖల ఉద్యోగులకు రూ.22460 వచ్చిందో సరిగ్గాలెక్కవేసి చెప్పలేదు. సాధారణంగా పీఆర్సీ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ముందుగా ఐఆర్(ఇంటీరియ్ రిలీఫ్) ప్రకటించిన తరువాత ప్రభుత్వ నిర్ణయంపై కొంతమొత్తం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తాయి. ఎప్పటి నుంచైతే అమలు చేస్తున్నాయో ఆ మొత్తాలకు చెందిన ఎరియర్స్ ను కూడా ఉద్యోగులకు అందిజేస్తుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రం వాటికి భిన్నంగా జరుగుతోంది. రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినట్టుగా(ఫిట్ మెంట్ పేస్కేలు+డీఏ+హెచ్ఆర్ఏ) వాటిపై వచ్చే ఎరియర్సును సచివాలయ ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సి వుంటుంది. కానీ ప్రభుత్వం ఒక్క ఫిట్ మెంట్, డీఏ, హెచ్ఆర్ఏ మాత్రమే పాత పేస్కేలుపై పెంచి ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్నట్టు చెబుతోందట. అంటే ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఐఆర్ తోపాటు, పీఆర్సీపై వచ్చే ఎరియర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డీఏలను కూడా కోల్పోయారన్నమాట. సర్వీసు ప్రొబేషన్ గడువు పెంచేయడంతో వీటికి ముందు 9 నెలలుగా రావాల్సిన పేస్కేలు కూడా కోల్పోయారు సచివాలయ ఉద్యోగులు. ప్రభుత్వం జారీ చేసిన జీఓనెంబరు-5 ద్వారా లెక్కలు వేసిన ఆర్ధిక వేత్తలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు.

సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి..దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానకపుత్రికగా ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. మీడియా ద్వారా కూడా అంతకంటే ఎక్కువగానే ప్రచారం కల్పించారు. ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి..ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ చూపిస్తూ..ఆదిలోనే వారికి రావాల్సిన ఉపయోగాలను హరించిన విధానాన్ని ఇపుడు ప్రతీ ఒక్కరూ తప్పు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన దగ్గర నుంచి రెండేళ్ల పాటు ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించారు. అలా సేవలు అందించడానికి రెండవ శనివారాలు, ఆదివారాలు.. ఆఖరికి పండుగ సెలవుల్లో కూడా సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించారు. ఇలా పనిచేసిన క్రమంలో వేలాది మంది సచివాలయ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. పదుల సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు కరోనా మహమ్మారికి బలయ్యారు కూడా. ఇంతగా పనిచేసిన సచివాలయ ఉద్యోగులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరిని ప్రత్యేక ఉద్యోగులుగా గుర్తిస్తూ..వారికి రావాల్సిన అన్ని ఉపయోగాల్లోనూ కోత పెట్టేసింది. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులు ఏ తరగతికి చెందినవారో నేటికీ ప్రకటించకపోవడం విశేష. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కీలకం. కరోనాలాంటి విపత్కర సమయంలో సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఎంతోప్రాణ నష్టం సంభవించి ఉండేది. కానీ అంతలా పనిచేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా దారుణంగా వ్యవహరించి ప్రొబేషన్ సమయంలో అదనంగా 9నెలలు అదే రూ.15వేలకే పనిచేయించింది. అప్పుడు అలా పనిచేయించినా.. కనీసం తరువాతనైనా పీఆర్సీ వర్తింపచేస్తే తాము లాసైన ఉపయోగాలు పొందవచ్చనుకుంటే..పీఆర్సీ అమలు చేసే విషయంలో అన్నీ కోతలు పెట్టింది ప్రభుత్వం. దీనితో ప్రభుత్వ తీరుతో అటు ప్రతిపక్షాలు, ఇటు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన అందుకునే పేస్కేలు చేతికి వస్తే తప్పా, ఒక్కో సచివాలయ ఉద్యోగికి పీఆర్సీ ఉపయోగాల్లో ఎంత మేరకు రంధ్రం పడిందీ తెలిసే పరిస్థితి లేదు. ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగం అనే ఒకే ఒక్క ఆశతో లక్షలు జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను విడిచి పెట్టి.. విధుల్లోకి చేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఈ విధంగా కోలుకోలేని జెల్లకాయ కొట్టడంపై ఇపుడు ఉద్యోగులంతా ఆలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతుంది. చూడాలి ముందు ముందు ఇంకెన్ని ప్రభుత్వ ఉపయోగాలు, సదుపాయాలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రంధ్రానికి గురవుతాయో..!



Tadepalli

2022-07-02 10:01:27