1 ENS Live Breaking News

ఆ యూనిఫారం బ్యాండ్ మేళంలా ఉందట

గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే ప్రజలందరి కనీస అవసరాలు గ్రామస్థాయిలో తీరాలి..సమస్యలన్నీ గ్రామస్థాయిలో పరిష్కరింపబడాలి..ఆ లక్ష్యంతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రికగా సరికొత్త ప్రభుత్వ శాఖగా నిర్మితమైంది గ్రామ, వార్డు సచివాలయ శాఖ. ఇంత వరకూ బాగానే ఉన్నా..సచివాలయంలో సిబ్బంది అంటే 33నెలలు గడుస్తున్నా ప్రజల్లో నేటికీ కనీస అవగాహన లేదంటే లోపం ఎక్కడ ఉంది..?  కాదు కాదు అవగాహన రానీయకుండా చేస్తున్నారు..! ఈ వార్త చదివిన సచివాలయ సిబ్బందికి, ఈ శాఖ ముఖ్య అధికారులకి ప్రభుత్వానికి కాస్త నొచ్చుకున్నట్టుగా ఉన్నా ఇది అక్షర సత్యం.. సచివాలయ ఉద్యోగులను ప్రజలను సులువుగా గుర్తుపట్టడం కోసం సిబ్బందికి కేటాయించిన యూనిఫారం బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఉందని.. సిబ్బంది వాటిని వేసుకోవడమే మానేస్తున్నారు. కొన్నిచోట్ల అధికారుల పర్యటనలు, సమావేశాలు ఏర్పాటు చేసే సమయంలోనే వేసుకొని వస్తూ అధికారులను బురిడీలను చేస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారంలోని షర్ట్ ఒకటి, ఫ్యాంటు ఒకటి వేసుకొని వస్తున్నారు. ఇదేమంటే ఈ డ్రెస్సు వేసుకుంటే బేండ్ మేళం బ్యాచ్ అని వెటకారం చేస్తున్నారని సిబ్బందే ఎగతాలిగా మాట్లాడుతుండటం ఇపుడు దుమారాన్ని రేపుతోంది. కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు కఠినంగా వ్యవహరించడంతో సిబ్బంది ఖచ్చితంగా యూనిఫారం వేసుకొని వస్తున్నా..కొన్ని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సచివాలయ యూనిఫాం ను వేసుకోవడానికి సిబ్బంది చాలా నామోషీగా ఫీలైపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాం ఖచ్చితంగా వేసుకోవాలా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

కొరవడిన ఎంపీడీఓల పర్యవేక్షణ..
గ్రామ సచివాలయ సిబ్బంది రెగ్యులర్ గా యూనిఫాం వేసుకు రాకపోవడం వెనుక పూర్తిస్థాయిలో మండల స్థాయిలో ఎంపీడీఓల పర్యవేక్షణ కొరవడిందనే చెప్పాలి. దానికి కారణం కూడా లేకపోలేదు. జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడోగానీ సచివాలయాలను సందర్శించరు. కానీ ఎంపీడీఓ అనునిత్యం పంచాయతీలు, గ్రామసచివాలయాల సందర్శన చేస్తూనే ఉంటారు. కనీసం ఆ సమయంలోనైనా సిబ్బంది పూర్తిస్థాయిలో ప్రభుత్వం నిర్ధేశించిన యూనిఫాంను వేసుకుని వస్తున్నారా..లేదా అనే విషయాన్ని గమనించాల్సి వుంటుంది. కానీ ఎంపీడీఓలు ఆ పనిని చేయడం లేదు. ఎప్పుడు సచివాలయానికి వచ్చినా రికార్డులు తిరగేసి వెళ్లిపోవడం తప్పితే సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఏ స్థాయిలో చేరువ అయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అలా అంటే ఎంపీడీఓలకు కోపం వచ్చినా అది మాత్రం అక్షర సత్యం. కనీసం అప్పుడప్పుడైనా విజిటింగ్స్ కి వచ్చే డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులదీ అదీ తీరు. ఎవరూ సిబ్బంది విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదనే విషయం సిబ్బంది తమకు నచ్చిన సమయంలోనే యూనిఫాం వేసుకొరి రావడాన్ని స్పష్టం చేస్తున్నది. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యద్శిలు ఇద్దరు మాత్రమే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వస్తారు. మిగిలిన వారంతా వివిధ శాఖలకు చెందినవారే కావడంతో అధికారులు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. పట్టించుకోవడం లేదు. కొన్నిసమయాల్లో అధికారులు సచివాలయాలకు పర్యటనలకు వచ్చినపుడు వేసుకుని వచ్చే సమయంలో కూడా సిబ్బంది మొత్తం రెగ్యులర్ గా యూనిఫాం వేసుకొని వస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆరా తీయడం లేదు. మరీ ముఖ్యంగా మండల కేంద్రాల్లోని సచివాలయాల్లోనే ఈ విధంగా సిబ్బంది యూనిఫాం వేసుకొని రాకపోవడం విచిత్రంగా, మరి కాస్త వెటకారంగానూ కనిపిస్తోంది.

కొందరు సిబ్బంది అసత్య ప్రచారం..
గ్రామసచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు యూనిఫాం విషయంలో వారికి నచ్చినట్టుగా సొంత ప్రచారాలను ఎడా పెడా చేసుకుంటూ అటు ప్రజలకి, ఇటు అధికారులకు కళ్లుమూసి జెల్ల కొడుతున్నారు. పంచాయతీ కార్యదర్శిలకు ప్రభుత్వం యూనిఫారం వేసుకోవడంలో వెసులు బాటు ఇచ్చిందని..  తెగ చెప్పేసుకుంటున్నారు. ఆ కారణంగానే తాము రెగ్యులర్ గా యూనిఫాం వేసుకోవడం లేదని చాలా ధీమాగా అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా అయితే అధికారుల పర్యటనల సమయంలో ఎందుకు యూనిఫాంతో దర్శనమిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం చిలకనవ్వు నవ్వుతూ..ప్రతీది మీరు గుచ్చి గుచ్చి అడిగితే మేము ఏం చెప్పగలమండీ.. ఇప్పటికే యూనిఫాం వేసుకుంటే బ్యాండ్ మేళం బ్యాచ్ అంటున్నారని..దానికోసం కోసం కాస్త వెసులుబాటు తమకు తామే ఇచ్చుకొని అధికారులు వచ్చినపుడు మాత్రం నిత్యం వేసుకుంటున్నట్టుగా నటించాల్సి వస్తుందని కొందరు సచివాలయ కార్యదర్శిలు తప్పని తెలిసినా కుండ బద్దలు కొడుతున్నారు.  జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల్లోని వార్డు సచివాలయాల్లోని సిబ్బంది మాత్రం  యూనిఫాం తప్పక వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ మున్సిపల్ చైర్మన్, కమిషనర్, జోనల్ కమిషనర్ ఇలా ఎవరో ఒకరు రావడంతో నగరాలు, పట్టణాల్లో వార్డు సచివాలయ సిబ్బంది మాత్రం తప్పక వేసుకోవాల్సి వస్తున్నారు. ఒకటి అరా వేసుకొని రాకపోయినా పెద్దగా అక్కడ కూడా పట్టింపు ఉండటం లేదు.

అధికారులు మరీ అంతలా కనిపిస్తున్నారా..
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జిల్లా అధికారులు, మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరీ అంతలా కనిపిస్తున్నారా.. అంటే నిజంగానే అలా కనిపిస్తున్నారనే చెప్పాలి. జిల్లా కలెక్టర్ నుంచి మండస్థాయిలో ఎంపీడీపీఓ, ఈఓపీఆర్డీ, ఆఖరికి ప్రజా ప్రతినిధుల వరకూ ఇదే పరిస్థితి. ఏ అధికారి, ఏ నాయకుడు సచివాలయానికి వచ్చినా పథకాలు అమలు కోసం మాట్లాడటం తప్పితే.. ప్రజలకు  ప్రభుత్వం సిబ్బందికి కేటాయించిన యూనిఫాం ఎవరు వేసుకుని వస్తున్నారు.. ఏస్థాయిలో ప్రజలకు చేరువ అయ్యారు..ఎంత మంది ప్రజలు నేరుగా సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్నారనే ప్రశ్నలు వేయడం లేదు.. లేదో చెప్పండనే ప్రశ్న వేయరంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ విధంగా సచివాలయ సిబ్బంది, చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శిలు అలా అధికారులకు మేకప్ వేస్తున్నారు. కొంత మంది ఏకంగా బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఒకేలా కనిపిస్తున్నామని చెబితే మేము వచ్చినపుడు అలా వేసుకురండి..తరువాత మీ సౌలభ్యాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండని చెప్పే అధికారులు కూడా ఉన్నారనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. అంటే  ప్రజలకు సచివాలయ సిబ్బంది పలానా యూనిఫాంలో ఉంటారనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రభుత్వ అధికారులే గాలి తీసేస్తున్నారని అనుకోవాలా..? అలా కాకపోతే యూనిఫాం వేసుకోని సిబ్బందిని ఎందుకు ప్రశ్నించడం లేదు..నేటికీ సక్రమంగా వేసుకొని కార్యదర్శిలు ఇతర సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మాత్రం ఏ ఒక్క అధికారి వద్ద సమాధానం దొరకని పరిస్థితి. 

ప్రజల కోసం ఏర్పాటు చేసిన  గ్రామ సచివాలయంలో ప్రజలు గుర్తుపట్టే విధంగా కాకుండా వారికి నచ్చినట్టుగా వారు యూనిఫాం కాకుండా రక రకాల దుస్తులు వేసుకొని వచ్చి మరీ విధులు నిర్వహిస్తుంటే వారిని జిల్లా అధికారులే ప్రోత్సహిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఉద్బవిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రికైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేసి ప్రజలకు సేవలు అందిస్తే అంతే స్థాయిలో దేశం మొత్తం గర్విస్తుందనే కోణంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా ఆలోచించాల్సి వుంది. అలా జరగాలంటే సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఎలా ఉంటారు..ఏ దుస్తుల్లో ఉంటారు..ఎలాంటి సేవలు అందుతాయనే విషయం ప్రజలకు చైతన్యం, గుర్తింపు కలిగించాల్సిన బాధ్యత మొట్టమొదటిగా జిల్లా అధికారులపైనే ఉంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై 33 నెలలు కావస్తున్నా..సిబ్బంది మొత్తం గ్రామాల్లోని సచివాలయాల్లోనే పనిచేస్తున్నా నేటికీ ఎవరు ఏంటో ఏ ఒక్క ప్రజానీకానికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఒక వ్యవస్థ ప్రజల్లోకి వెళ్లాలన్నా..గుర్తింపు రావాలన్నా..ప్రజలు మొచ్చాలన్నా జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోతే అది సాధ్యం కాదనేది వాస్తవం. ఇకపై జిల్లా అధికారులు సచివాలయ సిబ్బంది డ్రెస్ కోడ్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారిస్తారనేది దైవాదీనం .!

Guntur

2022-08-02 01:40:41

ఆట మొదలైంది.. ఏపీ ప్రభుత్వ న్యూస్ ఛానల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లోమీడియా అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు భారీ వ్యూహమే రచించింది. దాని వెనుక ఉన్న వాస్తవాలు తెలుసుకుంటే దుష్ట చతుష్టయం అనబడే ఎక్స్ పార్టీ మీడియాకు కౌంటర్ పడటమే కాదు.. ఏపీలో అసలైన ఆట మొదలైనట్టుగా భావించాల్సి వుంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా ప్రభుత్వం సొంత ఛానల్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. తద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు యువత పనికి వచ్చే అన్ని రకాల ప్రసారాలు ఇందులో చేయాలని చూస్తున్నది. ఏది నిజం..ఏది అవాస్థవం.. మరేది తప్పుడు, అసత్య ప్రచారం అనేది ప్రభుత్వ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల కళ్లముందు ఉంచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకి వేస్తోంది. దానికోసం ఏపీఎస్ఎఫ్ఎల్ ను వేదికగా చేసుకుంది రాష్ట్రప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏపీఫైబర్ నెట్ ను భారీ ఎత్తున విస్తరిస్తున్నారు. కేబుల్ టీవీతోపాటు, ఇంటర్నెట్ సౌకర్యం అతి తక్కు మొత్తానికే రావడంతో రాష్ట్రప్రజలందరూ దీనివైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇలా ఎక్కువ మంది ప్రజలకు చేవరుగా ఉండే ఏపీఎస్ఎఫ్ఎల్ వేదిక ద్వారా ప్రభుత్వ న్యూస్ ఛానల్ వుంటే ప్రతిపక్ష మీడియా ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు సంక్షేమ పథకాలు, వాటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా వుంటుందని ప్రభుత్వం ఆలోచన చేసి రంగంలోనికి దిగింది.

నిరుద్యోగ యువతకు ఉపాది..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా ప్రభుత్వం సొంత ఛానల్ ను ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు, రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని జర్నలిస్టులకు ఉపాది దొరుకుతుంది. జిల్లాకి ఒక రిపోర్టర్, ఒక కెమెరా మేన్ తోపాటు కేంద్ర కార్యాలయంలో సబ్ ఎడిటర్లు, కంటెంట్ రైటర్లు, వీడియో ఎడిటర్లు, బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీర్లు, ఎస్ఎన్జీ టెక్నీషియన్లు, డ్రైవర్లు,  పీసీఆర్, ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వారికి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఇంజనీర్లుగా, కార్యాలయ సిబ్బందిగా మరికొంత మందికి కూడా అవకాశాలు లభిస్తాయి. యువతకు ఉపాది చూపడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతీ ఇంటికి చేరవేసేందుకు వీలుగా వుండేలా ప్రసారాలు కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

కొత్త జిల్లాలకి వినూత్న ప్రచారం..
ఇప్పటి వరకూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియా వలన రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటైనా దాని సమాచారం గానీ, అధికారులు, ఇతర 75 ప్రభుత్వ శాఖలకు చెందిన ఆఫీసర్ల వివరాలును తెలియజేసేందుకు ఏ ఒక్క మీడియా కూడా ముందుకి రావడం లేదు. దీనితో ఇప్పటికీ చాలా మంది ప్రజలు పాత జిల్లాల కలెక్టరేట్లకే స్పందన కార్యక్రమాలకు వెళ్లి తమ సమస్యలపై అర్జీలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందులను తొలగించడంతోపాటు కొత్త జిల్లాల స్వరూపం, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల ఇంటర్వ్యూలు ఇలా అన్ని రకాల కార్యక్రమాలు ప్రభుత్వ అధికారిక న్యూస్ ఛానల్ లో ఏర్పాటు చేసి ప్రచారం కల్పించ నున్నారు. దాని ద్వారా ఏఏ కొత్త జిల్లాల్లో ఎన్ని మండలాలు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయనే విషయంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన రావడంతోపాటు ప్రజలు కూడా చైతన్యం కావడానికి ఆస్కారం వుంటుంది.

ప్రత్యక్ష ప్రసారాల లీజులకు చెల్లు చీటి..
ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా టీవీ ఛానళ్లకు ఫీడ్ ఇచ్చేందుకు వివిధ ప్రైవేటు సంస్థలకు వందలాది కోట్ల రూపాయాలు చెల్లిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వ అధికారిక టీవీ ఛానల్ లకే అప్పగించి ఆ మొత్తాన్ని ఇదే సంస్థకు వెచ్చించడం ద్వారాప్రత్యక్ష ప్రసారాలు చేసే యూనిట్లు, కెమెరాలు, ఇతర సాంతికే వ్యవస్థ కొనుగోలు చేసుకోవడానికి వీలుపడుతుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దానికితోడు ఒక్కసారి పెట్టుబడి పెడితే వాటితో చాలా సంవత్సరాల పాటు సేవలు అందించవచ్చునని..తద్వారా ప్రభుత్వంపై ప్రతీ ఏటా ప్రచారాల ఖర్చు భారం తగ్గుతుందని కూడా ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు.  అంతేకాకుండా ఈ ప్రభుత్వ టీవీ ఛానల్ ను సమాచారశాఖ కు అనుసంధానించడం ద్వారా  ప్రతీ జిల్లాలోనూ జరిగే కార్యక్రమాలను, సదరు న్యూస్ వీడియోలను డీపీఆర్వో కార్యాలయాల నుంచే పంపించుకునే ఏర్పాటు చేయాలని కూడా సమాచాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సమాచారశాఖలో ఖాళీగా వున్న సిబ్బందిని భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ న్యూస్ ఛానల్ కు సిబ్బంది కూడా అందుబాటులోకి తీసుకు రావొచ్చుననేది ప్రభుత్వ బావన. చూడాలి ప్రభుత్వం సొంతంగా న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తే ప్రతీపక్ష మీడియా ప్రచారాన్ని ఏవిధంగా తిప్పికొడుతుందో..ప్రజలకు ఏలాంటి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్) ద్వారా  అందిస్తుందనేది..!

గుంటూరు

2022-07-31 01:23:08

నేను రాను బిడ్డో ఆ కారుణ్య నియామకానికి..

ఆంధ్రప్రదేశ్ లో కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలు పొందిన వారంతా తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ఏదో ఒక శాఖలో తమకు నాల్గవ తరగతి కింది ఉద్యోగాలిచ్చినా బాగుండు..అది పోయి గ్రామ,వార్డు సచివాలయశాఖలో ఉద్యోగాలిచ్చారు..అక్కడ కేవలం రూ.15వేలకే రెండేళ్ల పాటు ప్రొబేషన్ చేయాలి.. ఆ ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు.. ఎటూచాలని జీతంతో కుటుంబాలను నెట్టుకొచ్చేది ఎలా అంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం సచివాలయ శాఖలో లక్షా 21వేల ఉద్యోగాలు రెండు నోటిఫికేషన్ల ద్వారా భర్తీచేసింది. ఆ తరువాత మిగులు ఉద్యోగాలను కారుణ్య నియామకాల క్రింద మళ్లీ సచివాలయ శాఖలోనే భర్తీచేస్తోంది. ఇప్పటికే సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ పూర్తికావడానికి రెండు సంత్సరాల 9నెలల సమయం పట్టింది. ఇపుడు మా పరిస్థితి కూడా అలానే వుంటుందనుకొని బెంగ పెట్టుకుంటున్నారు ఉద్యోగులు. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ..సర్వీసులో చనిపోతే నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగాలను పిల్లలకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అయితే ఉద్యోగం వచ్చినందుకు ఆనందించాలో.. ప్రొబేషన్ లేట్ అయిపోయే సచివాలయశాఖలో వచ్చినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఉద్యోగుల్లో. ప్రస్తుతం ఏ ప్రభుత్వశాఖలో విధులు నిర్వహిస్తూ మ్రుతిచెందినా ఉద్యోగుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే వారి విద్యార్హతలను బట్టీ నియమిస్తుంది. ఇక్కడైతే ఉద్యోగులు రెండేళ్ల వరకూ రూ.15వేలకే ఉద్యోగాలు చేయాల్సి వుంటుంది(పెరిగిన పీఆర్సీప్రకారం జీతం ఇస్తారో అనే విషయంలో క్లారిటీ లేదు) . అదే ఇతర ప్రభుత్వ శాఖల్లో అయితే ప్రభుత్వం నిర్ధేశించిన పేస్కేలు అమలు చేస్తారు. దీనితో ఇపుడు సచివాలయ శాఖలో ఉద్యోగం అంటే కారుణ్య నియామక ఉద్యోగార్ధులు హడలి పోతున్నారు.

ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్కడ చాలా ఉద్యోగాలను భర్తీచేస్తారని అందరూ అనుకున్నారు. అక్కడ భర్తీచేయాల్సిన సుమారు 850కి పైగా ఉద్యోగాలను కూడా గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే బర్తీచేయాలని రాష్ట్ర జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ శాఖలో భర్తీకాకుండా మిగిలిపోయిన ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం సచివాలయ శాఖలో అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హబ్జండరీ, మహిళా పోలీస్ శాఖల్లో అధికంగా ఖాళీలు ఉన్నాయి. ఇక పంచాయతీ కార్యదర్శిలు ఇతర శాఖలకు చెందిన పోస్టులు మాత్రం తక్కువగానే ఉన్నాయి. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల జాబితా వచ్చిన తరువాత కారుణ్య నియామకాలు చేపట్టాలనుకునే కుటుంబాల పిల్లల నుంచి విద్యార్హతలను సేకరించి వారిని సదరు ఉద్యోగాల్లో భర్తీచేయనుంది ప్రభుత్వం. అయితే ఇతర శాఖల్లో అటెండర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా అయినా వెళ్లడానికి ఇష్ట్ పడుతున్నారు తప్పితే ఏ కేటగిరీకి చెందిన ఉద్యోగమో నేటికీ తెలియని గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగాల్లో జాయిన్ కావడానికి ఎవరూ ముందుకి రావడం లేదు.  ప్రభుత్వం మాత్రం మిగులు ఉద్యోగాలన్నీ కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయడం ద్వారా సచివాలయ శాఖలో అన్ని మిగులు ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తుంది. తద్వారా సచివాలయ శాఖలో అన్ని ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ అవుతాయనే ఆలోచనలో వున్నది.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఆగస్టు 1 నుంచి పెరిగిన పేస్కేలు ప్రకారం పేస్కేలు ఇవ్వాలని జీఓ నెంబరు-5ని విడుదల చేసినా.. కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాల్లో చేరే వారికి పెరిగిన పేస్కేలు వర్తిస్తుందా లేదా అనే విషయంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవడమే కొత్తగా ఉద్యోగాల్లోకి చేరేవారు సచివాలయ శాఖకు రావడానికి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చినా..ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలతో కుటుంబాలను నెట్టుకు రావడం చాలా కష్టం అవుతుంది. అందులోనూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఖాళీలు ఉంటే ఆ జిల్లాల్లో వారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. స్థానిక జిల్లాలో ఖాళీలు లేకపోతేమాత్రం పక్కజిల్లాకు పంపే అవకాశాలూ కూడా లేకపోలేదు. అదే జరిగితే ఉద్యోగార్ధులపై ఆర్ధిక భారం మరింత ఎక్కువగా పడుతుంది. వీటన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకొని కారుణ్య నియామకాలన్నీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలో మిగులు ఉద్యోగాలన్నీ ప్రభుత్వం భర్తీచేయాలన్నా ఎవరూ ముందుకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాగని కొత్తగా జిల్లాలు ఏర్పాటైన తరువాత చాలా ప్రభుత్వ శాఖలకు జూనియర్ అసిస్టెంట్లు కూడా అవసం వుంది. అయితే దానికి ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వాటిని భర్తీచేస్తే..చచ్చినట్టు ఉద్యోగార్ధులంతా సచివాలయ శాఖలో ప్రభుత్వం చూపించిన విధంగా విధుల్లోకి చేరాల్సి వుంటుంది. చూడాలి ప్రభుత్వం కారుణ్య నియామకాల విషయంలో ఏ విధమైన విధి విధానాలను అవలంభించి మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తుందనేది..!

Tadepalli

2022-07-30 02:56:39

ఆ ఒక్క కారణంతోనే రెగ్యులైజేషన్ ఆపేశారు..!

అమ్మతనం ఏ మహిళకైనా తన జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది..కానీ ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ  మహిళా ఉద్యోగులకు మాత్రం తీరని వేదనను, కన్నీటిని మిగుల్చుతోంది. పురిటి సమయంలో పండంటి బిడ్డ పుట్టిందని ఆనంద పడాలో.. ఆ సమయంలో ప్రసూతి సెలవులు తీసుకున్నందుకు సర్వీస్ ప్రొబేషన్ మరో ఆరు నెలలు పొడిగింపు వర్తించినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ఎదురైంది. పోనీ ఆ ఆరునెలలు పూర్తయిన తరువాత నైనా అందరి ఉద్యోగులతోనైనా సర్వీసు రెగ్యులైజేషన్ చేస్తారా అంటే ఆ విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయింది. విధి నిర్వహణలో ఉండగా పెళ్లై, పురిటి సెలవులు తీసుకున్న గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులకు జూలై నెలలో కొన్ని కొన్ని తేదీలతో రెండేళ్లు ప్రొబేషన్ సమయం తీసుకున్న ఆరు నెలల సమయంతో కలిపి పూర్తయిపోయింది. కానీ మిగిలిన సహచర ఉద్యోగులతోపాటూ సర్వీస్ రెగ్యులైజేషన్ కి సంబంధించిన ఆఖరి దస్త్రాలు నేటికీ గ్రామ, వార్డు సచివాలయాలకు చేరలేదు. దీనితో తన సహచర ఉద్యోగులంతా ఆగస్టు1వ తేదీ నాటికి పెరిగిన పేస్కేలు సాలరీలు తీసుకుంటే.. ప్రసూతి సెలవులు తీసుకొని.. ఆగడవు పూర్తయినా.. క్రమ బద్దీకరణ దస్త్రాలు అందుకోని సచివాలయ మహిళా ఉద్యోగులు మాత్రం ఆగస్టు నెలలో కూడా ఆ పాత జీతం రూ.15 వేలు మాత్రమే తీసుకోబోతున్నారు. ఇప్పటికే సర్వీస్ ప్రొబేషన్ పూర్తయి సంబంధిత జిల్లా శాఖల నుంచి ఫైనలైజ్డ్ డాక్యుమెంట్ల జాబితాలు సచివాలయాలకు చేరకపోవడంతో వారందరికీ పాత పద్దతిలోనే జీతాలు పెట్టారు సచివాలయ డిడిఓలు.

 ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన తరువాత ప్రభుత్వ నిబంధన ప్రకారం తొలుత రెండేళ్లు సర్వీస్ ప్రొబేషన్ పూర్తిచేయాల్సి వుంటుంది. తరువాత అదే ప్రభుత్వ నిబంధనతో సదరు ఉద్యోగులను ప్రభుత్వం నోటిఫికేషన్ లో ప్రకటించిన విధంగా సర్వీస్ రెగ్యులర్ చేసి, పూర్తిస్థాయిలో పేస్కేలును అమలుచేయాలి. కానీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వెసులుబాటు కోసం ఏకంగా 9నెలలకు పొడిగించి, అదే రూ.15వేలతోనే అదనంగా ఉద్యోగులతో పనిచేయించింది.  ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు 6నెలలు సర్వీసు ప్రొబేషన్ పొడిగించింది. ఇలా చేయడం వలన నేటికీ చాలా మంది ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తి కాలేదు. కానీ ప్రభుత్వం జీఓనెంబరు 5లో పేర్కొన్నవిధంగా చూస్తే రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకే సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని పక్కాగా పొందు పరిచింది. అదే ఉద్యోగ నియామకం సమయంలో ఇచ్చిన జీఓ, ఉద్యోగులు విధుల్లోకి చేరినపుడు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రెండేళ్ల తరువాత సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేసి పూర్తి పేస్కేలు ఎందుకు అమలు చేయాలేదని ప్రశ్నిస్తే.. అ ఒక్కటీ మీరు అడక్కూడదంటూ ఆ విషయాన్ని దాట వేసింది ప్రభుత్వం.  ఈ విధంగా చేయడం వలన సచివాలయ ఉద్యోగులు 9నెలలు అదనంగా రూ.15వేలకే పనిచేయడంతోపాటు, 9 నెలల పేస్కేలు కోల్పోయారు. వాటితోపాటు, 27% ఐఆర్, ఒక డీఏ, పీఆర్సీ పెంపుతో రావాల్సిన ఎరియర్స్  ఉపయోగాలన్నీ కూడా ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది.

ఆగస్టు1కి కొందరికి పెరిగిన జీతం..మరికొందరికీ పాత జీతం..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆగస్టు1 నుంచి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారందరికీ పూర్తిస్థాయి పేస్కేలు అమలు చేయడంతో ఆ ప్రక్రియ పూర్తయిన వారందరూ కొత్త పేస్కేలు అందుకోనుండగా.. రెండేళ్లు పూర్తయినా ప్రసూతి సెలవులు గడువు పూర్తయినా క్రమబద్దీకరణ దస్త్రాలు రాని వారు మాత్రం ఎప్పటి మాదిరిగానే పాతజీతం రూ.15వేలతోనే సరిపెట్టుకోవాల్సి వుంది. ఇప్పటికే జీతాలు ఆన్ లైన్ లో ననమోదు కావడంతో ఆఖరి నిమిషంలో క్రమబద్దీకరణ దస్త్రాలు వచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది.  జూన్ నెలాఖరు నాటికే సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని జీఓనెంబరు-5 ద్వారా ప్రభుత్వం ఆదేశించింది.  అయితే ప్రసూతి సెలవులు తీసుకున్నవారి సర్వీసు ప్రొబేషన్ సాలరీలు పెట్టే సమయం నాటికే పూర్తయినా వారు కొత్త పేస్కేలు పొందే పరిస్థితి లేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బినిఫిట్స్ ను తప్పించుకునేందుకు.. ప్రభుత్వానికి అనుకూలంగా జీఓలను అమలు చేసినప్పటికీ, ప్రసూతి, సిక్ లీవ్ లను అమలు చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం తమ నిబంధనను ఖచ్చితంగా అమలు చేసింది ప్రభుత్వం. ఈ ఒక్క కారణంతోనే నేటికీ చాలా మందికి మహిళా ఉద్యోగలకు సర్వీసు ప్రొబేషన్ కి సంబంధించిన డిక్లరేషన్ ఫైనల్ డాక్యుమెంట్లు జిల్లాశాఖల కార్యాలయాల నుంచి సచివాలయాలకు చేరుకోలేదు. దానితో ఆగస్టు 1నాటికి కూడా చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెరిగిన పేస్కేలు జీతం తీసుకోలేరన్నమాట. అంతేకాదు ఇంకా ప్రసూతి సెలవులు తీసుకున్నవారు రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది మహిళా ఉద్యోగులు మిగిలిపోయారో వారందరికీ ఒకేసారి సర్వీస్ ప్రొబేషన్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అదే నిజమైతే మరో రెండు నెలల వరకూ కూడా కొత్త పేస్కేలు పొందలేరు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులు. అందరు సహచర ఉద్యోగులతోపాటు తాము కూడా ఆగస్టు 1నాకిటికి కొత్త పేస్కేలు జీతం తీసుకునే అవకాశం లేకుండా కేవలం ప్రసూతి వేదన మిగిల్చిన శాపమే అంటున్నారు మహిళా ఉద్యోగులు. చూడాలి ప్రసూతి సెలవుల గడువు పూర్తయిన వారికి సెప్టెంబరు నెలలో నైనా పాత తేదీలలో మిగిలిన జీతం కలిపి ఇస్తారా లేదా అన్నది..!

Tadepalli

2022-07-29 01:30:56

బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట

క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు మాడ వీధుల్లో నిర్వ‌హించ‌నుండ‌డంతో పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని, సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే ఉంటుంద‌ని, అన్నిర‌కాల ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశామ‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం జిల్లా క‌లెక్ట‌ర్  వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఎస్పీ  ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, ఇత‌ర టిటిడి అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయ‌ని, ఇందులో ప్ర‌ధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వ‌ర్ణ‌ర‌థం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం జ‌రుగుతాయ‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో తొలి రోజైన సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రివైఎస్‌.జ‌గన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌నసేవ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. పెర‌టాసి మాసం మూడో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో త‌మిళ‌నాడు భ‌క్తులు పెద్ద‌సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశ‌ముందని, ర‌ద్దీకి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాల‌నే విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు తెలిపారు.
            
           గ్యాల‌రీలు, క్యూలైన్లు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు స‌కాలంలో పూర్తి చేయాలని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. అలిపిరి వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలు, నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ప్ర‌త్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని, జ‌న‌రేట‌ర్లు కూడా సిద్ధంగా ఉంచుకుంటామ‌ని చెప్పారు. శ్రీ‌వారి ఆల‌యం, అన్ని ముఖ్య కూడ‌ళ్ల‌లో ఆక‌ట్టుకునేలా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు చేప‌డ‌తామ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులను ఆహ్వానిస్తామ‌ని తెలిపారు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, మీడియా సెంట‌ర్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు చేసుకుంటామ‌ని వెల్ల‌డించారు. వైద్య విభాగం ఆధ్వ‌ర్యంలో స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని, నిర్దేశిత ప్రాంతాల్లో ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. అంబులెన్సుల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపారు. .

          భ‌క్తుల‌కు ర‌వాణాప‌రంగా ఇబ్బందులు లేకుండా ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా త‌గిన‌న్ని బ‌స్సులు అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ముఖ్యంగా గ‌రుడ‌సేవ రోజున ఎక్కువ బ‌స్సులు న‌డుపుతామ‌ని చెప్పారు. ఘాట్ రోడ్ల‌లో ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా చూసేందుకు వీలుగా గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల-తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిషేధిస్తామ‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ద‌ర్శించే శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల ముందు హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో విభిన్న క‌ళారూపాల‌ను, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

          తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్  వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం త‌ర‌ఫున బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హణ‌కు పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌న్నారు. జిల్లాస్థాయిలో అన్ని విభాగాల‌ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించి పూర్తి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తామ‌ని, మ‌రోసారి ఈవోతో స‌మావేశం నిర్వ‌హించి దాన్ని తెలియ‌జేస్తామ‌ని చెప్పారు. ఈసారి గ‌రుడ‌సేవ‌కు విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో, ఏర్పాట్ల‌పై ప్ర‌త్యేకంగా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌న్నారు. తిరుప‌తి జిల్లా ఎస్పీ  ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నుండ‌డంతో పెద్ద ఎత్తున భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశముంద‌ని, ఇందుకు అనుగుణంగా భ‌ద్ర‌త‌ప‌రంగా ఎలాంటి రాజీకి తావులేకుండా బందోబ‌స్తు ఏర్పాట్లు చేప‌డ‌తామ‌న్నారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే ఉంటుంది కావున క్యూలైన్లు వెలుప‌లికి వచ్చే అవ‌కాశం ఉంద‌ని, క్యూలైన్ల వ‌ద్ద కూడా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా, ట్రాఫిక్‌, పార్కింగ్ ప‌రంగా ఇబ్బందులేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

             ఈ స‌మీక్ష‌లో టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌)  స‌దా భార్గ‌వి, జెఈవో వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో ష‌ణ్ముఖ కుమార్‌, శ్రీవారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు  వేణుగోపాల దీక్షితులు,  గోవింద‌రాజ దీక్షితులు,  కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, ముఖ్య అర్చ‌కులు  కిర‌ణ్ స్వామి, అద‌న‌పు ఎస్పీ  మునిరామ‌య్య‌, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇలు  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,  వేంక‌టేశ్వ‌ర్లు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, ట్రాన్స్‌పోర్టు జిఎం  శేషారెడ్డి, ఆర్టీసీ రీజ‌న‌ల్ మేనేజ‌ర్  చెంగ‌ళ్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-07-28 10:45:27

ఆంధ్రప్రదేశ్ లో అలిగిన కొత్తజిల్లాల కలెక్టర్లు

ఆంధ్రప్రదేశ్ లోని 13 కొత్త జిల్లా కలెక్టర్లు అలకబూనారు.. పేరుకే జిల్లా కలెక్టర్లమే అయినా తమకు ఎలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం ప్రభుత్వం ఇవ్వలేదంటూ లోలోన మధనపడుతూ, వారి సంఘంలో తీవ్రమైన చర్చకు తెరలేపారు. అసలు కొత్త జిల్లాల్లో కలెక్టర్లు ప్రభుత్వంపై అలగడం ఏంటి.. ఏం జరిగిందీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చింది. జిల్లాలను అయితే మార్చింది కానీ కొత్త జిల్లాల్లో కలెక్టర్లకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వలేదు. దానికి నిలువెత్తు సాక్ష్యం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలుపై కొత్త జిల్లాల్లో కలెక్టర్లకు సంతకాలు పెట్టి, ఇచ్చే అధికారాలు ఇవ్వకపోవడమే. ఈ అధికారాన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, డిఎస్సీ కమిటీలకు చైర్మన్లుగా ఉన్నవారికే ప్రభుత్వం అప్పగించింది. దీనితో తమను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లుగా నియమించినా..తమకు మాత్రం రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరణ చేసే అధికారం కొత్త జిల్లాల కలెక్టర్లుగా ఉన్న తమకు కాకుండా పాత జిల్లాల కలెక్టర్లకు ఇవ్వడమేనని చెబుతున్నారు. 

 దీనితో ఈ విషయాన్ని ఐఏఎస్ అధికారుల సంఘంలో చర్చకు దింపారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేయడానికి జీఓనెంబరు-5ని విడుదల చేయడంతో అన్ని జిల్లాశాఖల అధికారులు ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ ఫైళ్లను సిద్దం చేసి..జిల్లా కలెక్టర్ల సంతకాలకు పంపిన సమయంలో ప్రభుత్వం నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చాయి. ఈ ప్రక్రియ మొత్తం పాత జిల్లా కలెక్టర్లు మాత్రమే చేయాలని.. దీనితో తాము కూడా జిల్లాలకు కలెక్టర్లమే కదా..తమకు ఉద్యోగులను క్రమబద్దీకరించే అధికారం ఇవ్వకుండా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం సరికాదని ప్రభుత్వంపై గుస్సా అవుతున్నారు కొత్త జిల్లాల కలెక్టర్లు.. విషయాన్ని బయటకు అనకపోయినా..తీవ్రంగా మదన పడ్డారు. అందులోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా..వ్యవహరించినా ప్రాధాన్యత లేని ప్రభుత్వ శాఖలకు అధికారులుగా నియామకాలు జరిగిన తరుణంలో ఈ విషయాన్ని నేరుగా బయట ప్రస్తావించలేదనే విషయం మాత్రం బయటకు పొక్కింది.. ఈ విషయం కాస్త మీడియాకి తెలియడంతో గుప్పుమంది. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వేల సంఖ్యలో ఉద్యోగులను క్రమబద్దీకరించే అవకాశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తమకు రాలేదని కొత్త జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారనే విషయం నేడు తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది.

అసలు విషయం తెలుసుకోవాలని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్నీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net సంప్రదిస్తే వారు కూడా ఆశక్తకర విషయాలను ప్రస్తావించారు. పాత ఉమ్మడి జిల్లాల డిఎస్సీ చైర్మన్ల సమయంలోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేయడం వలనే..వారితోనే ఉద్యోగాలను కూడా పాత జిల్లాల కలెక్టర్లతోనే క్రమబద్దీకరించాల్సి వచ్చింది చెప్పుకొచ్చారు. ఏ ఐఏఎస్ ని అయినా జిల్లా కలెక్టర్ గా నియమించినపుడు సర్వోన్నత అధికారాలు వస్తాయి కదా అని ప్రశ్నించిన ఈఎన్ఎస్ కి మరో సమాధానం కూడా వచ్చింది. ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతోనేవ పాత కలెక్టర్లతోనే ఈ విధంగా చేయించారని..అయితే అదే సమయంలో కొత్త జిల్లాల కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారుల నుంచి తమకు అధికారాలు ఇవ్వలేదనే విషయం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో చాలా శాఖల అధికారులు జిల్లా అధికారి స్థాయి హోదా లేకపోవడం వలన ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పారు. చాలా వరకూ ఇన్చార్జిలు, కొన్ని జిల్లాల్లో హోదా లేకపోయినా ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంలో అధికారులను ప్రభుత్వం నియమించిందని.. ఆ కారణంగానే ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ ఫైళ్లపై కొత్త జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకు అవకాశం ఇవ్వలేదని కూడా సమాధానం ఇచ్చారు.

కొత్త జిల్లాల్లో జిల్లాశాఖల అధికారులకు జిల్లా అధికారి హోదా లేకపోయినా.. ఐఏఎస్ లకు మాత్రం ఆ స్థాయి ఉన్నా.. తమకు కూడా ప్రభుత్వం ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ చేసే అధికారాలు ఇవ్వలేదని కొత్త జిల్లాల కలెక్టర్లు మదనపడుతూ..వారిలో వారు చర్చించుకోవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని బట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు అయినా విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొత్త జిల్లాల కలెక్టర్లకు అధికారాలు లేవనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలో తేటతెల్లం అయిపోయింది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినదగ్గర నుంచి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్నీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net అన్ని విషయాలను అటు ప్రభుత్వం.. ఇటు ప్రజల ముందు ఉంచే విషయంలో కీలక భూమిక పోషిస్తూ వస్తోంది. ఆ క్రమంలోనే ఈ విషయాన్ని కూడా బయటకు తీసిందని చెబుతున్నాం. తప్పితే ఏ అధికారిపైనా..ఐఏఎస్ ను తక్కువ చేయడం గానీ..ప్రభుత్వం నిర్ణయాలను తప్పబట్టడం కానీ తమన ఉద్దేశ్యం కాదని కూడా తెలియజేస్తున్నాం..

 జిల్లాశాఖల అధికారులు అలగడాన్ని పెద్దగా పరిగణలోనికి తీసుకోకపోయినా..ఐఏఎస్ అధికారుల అలకను మాత్రం ప్రభుత్వం అర్ధం చేసుకుంటుందని ఆఫ్ ది రికార్డ్ అంటూ సీనియర్ ఐఏఎస్ లు  చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం 13 కొత్త జిల్లాలకు సివిల్ సర్వీస్ అధికారుల నియామకాలు చేపట్టినా.. పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వలేదు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ విషయంలోనే కాదు.. ఇదే పద్దది కొనసాగితే.. ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లాల్లో కలెక్టర్లుగా చేరడానికి ఐఏఎస్ లు ముందుకు వచ్చే పరిస్థితులు ఉండవనే వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ఇకపై పాత కొత్త జిల్లాల కలెక్టర్లకు విధాన పరమైన నిర్ణయాలు, అధికారాలు ఇచ్చే విషయంలో మార్పులు వస్తాయని.. కొత్త జిల్లాల్లో పరిపాలన గాడిలో పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రస్థాయి ఐఏఎస్ అధికారులు. చూడాలి ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల కలెక్టర్లకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇచ్చే విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో..!

Tadepalli

2022-07-28 04:30:27

కారుణ్య నియామకాలతోనే ఆ పోస్టులు భర్తీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో మిగులు ఉద్యోగాలను భర్తీచేసేం దుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ, సర్వీసులో మరణిస్తే..ఆ కుటుంబంలోని పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా ఇచ్చే ఉద్యోగాలను గ్రామ, వార్డు సచివాలయ శాఖలో భర్తీచేయాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టర్లకు వర్తమానం పంపింది. ఇప్పటికే చాలా ఉద్యోగాలను కారుణ్య నియామకాల కింద భర్తీచేసిన ప్రభుత్వం మిగులు ఉద్యోగాలను కూడా ఆ విధంగానే భర్తీచేసి, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఖాళీలన్నీ పూర్తిచేయనుంది. ఇటీవలే ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం వాటిని కూడా ఇక్కడే భర్తీచేయాలని చూస్తోంది. తొలి ప్రాధాన్యత సచివాలయాలకు ఇచ్చి, మలి ప్రాధాన్యత కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్లకు, ఇతర జిల్లాశాఖలకు ఇవ్వనుంది. ప్రస్తుతం  కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీలు ఉండిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వాటిని భర్తీచేయాలని చూస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 1.35 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం రెండుసార్లు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు మధ్యలో కొంతమందిని కారుణ్య నియామకాల కింద తీసుకున్నా.. 1.21.లక్షల మందిని మాత్రమే సచివాలయాల్లో భర్తీ చేసింది ప్రభుత్వం. ఇంకా సుమారుగా 14వేల పోస్టులు సచివాలయశాఖలో మిగిలిపోయాయి. సదురు ఉద్యోగాలకు కారుణ్య నియామకాల్లో భర్తీచేసే సమయంలో వారి వారి విద్యార్ధహతలను బట్టీ మిగులు పోస్టులు భర్తీచేస్తే మొత్తం శాఖలోని అన్ని ఉద్యోగాలు భర్తీచేసినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా మొదలు పెట్టింది.

సాధారణంగా కారుణ్య నియామకాల క్రింద నాల్గవ తరగతి ఉద్యోగాలను ప్రభుత్వం ఇన్ సర్వీసులో ఉండి మ్రుతిచెందిన వారికి కుటుంబ సభ్యులకు జిల్లాశాఖల కార్యాలయాల్లో మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారిపోవడంతో, ప్రభుత్వం కూడా జిల్లా శాఖల్లోని ఉద్యోగుల సంఖ్యను, విభాగాలను కూడా కుదించేసింది. అలా కుదించినప్పటికీ చాలా జిల్లాల్లో 75 ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో నాల్గవ తరగతి ఉద్యోగాలు ఖాళీలు ఉండిపోయాయి. అయితే ముందుగా వాటిని భర్తీచేయాలని భావించినప్పటికీ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక ప్రత్యేక ప్రభుత్వశాఖగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో అన్ని ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీచేస్తే ప్రజలకు గ్రామ, వార్డుల స్థాయిలోనే సేవలు అందుతాయని చూస్తుంది. దానికి తగ్గట్టుగానే మిగులు ఉద్యోగాలన్నింటినీ సాధ్యమైనంత వరకూ కారుణ్య నియామకాల్లో భర్తీచేస్తారు. ఇంకాఏమైనా ఉద్యోగాలు మిగిలిపోతే వాటికి ప్రతీ ఏటా తీసే జాబ్ కేలండర్ లోకి చేర్చి భర్తీచేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పశుసంవర్ధక, వ్యవసాయం, వాణిజ్యం, రెవిన్యూ, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు చాలా సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిని కారుణ్య నియామకాలు జరిపే సమయంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి క్వాలిఫికేషన్లుకు తగ్గట్టుగా ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా సచివాలయ శాఖలో అన్ని ఉద్యోగాలు నింపినట్టు అవుతుందని ప్రభుత్వం ఆలోచన.

ప్రస్తుతం రాష్ట్రంలోని 75 జిల్లా శాఖలకు సంబంధించి 26 జిల్లాల్లో ఎన్ని నాల్గవ తరగతి ఉద్యోగాలు ఖాళీలు అత్యధికంగా ఉన్నాయి..ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం జిల్లాశాఖల అధికారులను నివేదికలు కోరుతుంది. ప్రభుత్వానికి జిల్లా శాఖల అధికారులు నివేదికలు సమర్పించిన వెంటనే, ప్రాధాన్యతా క్రమంలో తొలుత గ్రామ, వార్డు సచివాలయశాఖలో నియామకాలు చేపట్టి.. తరువాత మిగిలిన శాఖల్లో ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీచేయనుందని రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబరు నెలాఖరునాటికి ఇటు ఆర్టీసీలో భర్తీలచేయాల్సిన కారుణ్య నియామకాలతో పాటు, ఇతర ప్రభుత్వశాఖలు, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో చాలా వరకూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే గ్రామ,వార్డు సచివాలయ శాఖలో చాలా పోస్టులకు సంబంధించి సర్వీస్ రూల్స్ నిబంధనలు సక్రమంగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం, కొన్ని శాఖలకైతే ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగాలకైతే అభ్యర్ధులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అలాంటి సమయంలో జిల్లాశాఖల్లోని నాల్గవ తరగతి ఉద్యోగాల్లోనే భర్తీచేయాలా..లేదంటే అన్నిశాఖల మాదిరిగానే గ్రామ,వార్డు సచివాలయ శాఖలోని 19శాఖల ఉద్యోగులకు వారి మాత్రుశాఖలకు సంబంధించిన సర్వీసు రూల్స్ నే అన్వయించాలా అనేవిషయంలో రాష్ట్రస్థాయిలో అధికారుల్లోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందనేది..!

Tadepalli

2022-07-18 07:09:59

'ఆస్ట్రేలియా' పెట్టుబడులకు ఏపీ అనువైనది

భౌగోళికంగా, సాంకేతికంగా, వాణిజ్యపరంగా అత్యంత శక్తివంతమైన ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి  అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐ. టి  శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు చెన్నై,  బెంగుళూరు లలో  వివిధ రంగాల్లు పెట్టుబడులు. పెట్టడానికి పశ్చిమ  ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమర్  రోజర్ హగ్ కుక్  నాయకత్వంలో  వంద మంది సభ్యులతో కూడిన పచ్చిమ ఆస్ట్రేలియా బృందం శనివారం విశాఖ వచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్.  ఎకనమిక్. డెవలప్మెంట్ బోర్డు,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పశ్చిమ ఆస్ట్రేలియా  ప్రతినిధులతో శనివారం ఇక్కడ  జరిగిన సదస్సులో ఇరు దేశాల మధ్య  పలు ఒప్పందాల పై సంతకాలు జరిగాయి. పశ్చిమ ఆస్ట్రేలియా, భారత్  మధ్య వాణిజ్య సంబంధాలు ఈ  ఒప్పందాల వలన మరింత బలోపేతం. అవుతాయని  అన్నారు.

భారత్, ఆస్ట్రేలియా  దేశల మధ్య స్నేహ  సంబంధాలు అనాదిగా కొనసాగుతున్నాయని, ఇప్పుడు జరిగే వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాలకు  మరింత ప్రయోజన కారిగా ఉంటాయని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో 
నిలిచిందని ముఖ్యమంత్రి  జగన్మోహనరెడ్డి  చేపట్టిన సంస్కరణలే ఇందుకు కారణమని చెప్పారు. కోవిడ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున పెట్టబరాలను రాష్ట్రానికి రాబట్టగలిగామని చెప్పారు.  2019-22 మధ్య 43, 866 కోట్ల యుపాయల మేర పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నా మని చెప్పారు.  2.33 లక్షల మందికి వుద్యోగాలు లభించాయి  అని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు  పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అత్యంత త్వరగా అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పా అమర్ నాథ్ చెప్పారు. రాష్ట్రలో ఆరు పోర్టులు ఉన్నాయాని, మరో మూడు త్వరలోనే అందుబాటులో రానున్నాయని చెప్పాం. సముద్ర రవాణాలో

ఆంధ్రప్రదేశ్ పోర్టులు అత్యున్నత స్థానములో నిలిచాయి.   అని  అమర్ నాథ్ చెప్పారు. 2020-21లో రాష్ట్రం నుంచి 16.9 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిందని అదే 2020-21 లో 22.88 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశామని  తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ లో సుశిక్షుతులైన యువకులు ఉన్నారని, వివిధ రంగాల్లో  నిపుణులకు ఇక్కడ కొరత లేదని అమర్ నాథ్ చెప్పారు.  ఐటి రంగంలో  పెట్టుబడులకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు కావాల్సిన భూములు సిద్ధంగా ఉన్నాయిని అయిన వెల్లడించారు. విశాఖపటం పర్యాటకంగా

అభివృద్ధి చెండిందని,  సినిమాల చిత్రికరణకు అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని, ఆస్ట్రేలియా సినీ పరిశ్రమ ఇక్కడ సినిమా చిత్రీకరణ చేసుకోడానికి ముందుకు రావాలని మంత్రి అమరనాథ్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమర్ రోజర్ హగ్  కుక్ మాట్లాడుతూ భారత్, ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు చాలా మంది శ్రమించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో.  ఫిషింగ్, ఆక్వా  కల్చర్  రంగాలు ముందంజలో  వున్నాయని అన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఆ దేశాలు ఆర్ధికంగా మరింత బలోపేతం అవడానికి అవకాశం వుందని అన్నారు. విద్య, పర్యాటక రంగాలు
మరింత అభివృద్ధి చెయతాయన్నారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ గడచిన నాలుగు సంవత్సరాల  నుంచి ఆంధ్రప్రదేశ్ జి.డి.పి. రేటు వృద్ధి చెందుతూ వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఫుడ్. ప్రాససింగ్ , కెమికిల్, పెట్రో కెమికల్,  ఐటి  విద్య రంగాలు మెరుగైన ఫలితాలను సంధిస్తున్నాయిని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఏడూ లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు  కోర్సులు  పూర్తి చేసి బయటకు వస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ని అనేక దేశాల్లో తెలుగు విద్యార్థులతో మినీ ఆంధ్ర ప్రదేశ్ కనిపిస్తోంది అని అన్నారు. సురరిపాలన,  కచ్చితమైన నాయకత్వం చూసి   అనేక దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయిని అన్నారు. ఈ సమావేశంలో  పశ్చిమ ఆస్ట్రేలియా  విద్యా శాఖ మంత్రి టెoపుల్టన్,  పరిశ్రమల  శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-16 12:49:55

ఇక దొంగ ఓట్లుకు ఆథార్ లింక్ తో చెక్..

భారతదేశంలో దొంగ ఓట్లకు చెక్ పడనుంది..దేశ వ్యాప్తంగా నికార్శైన ఓటర్ల జాబితా సిద్దం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. దానికోసం ఆధార్ కి ఓటరు కార్డును అనుసంధానించనుంది. ఈ విధంగా చేయడం ద్వారా నకిలీ ఓట్లు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఏర్పడింది. దానికోసం ఆగస్టు 1వ తేది నుంచి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని ఓటర్ల కార్డులకు ఆధార్ ను అనుసంధానించే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే దానికోసం ప్రభుత్వం ప్రకటన కూడా జారీచేసింది. అన్ని రాష్ట్రాలకు ఈ వర్తమానాన్ని పంపింది. ఈ విధంగా చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ వ్యాప్తంగా వున్న నకిలీ ఓట్లకు చెక్ పడనుంది. ఖచ్చితంగా ఓటరు కార్డుకి ఆధార్, మొబైల్ నెంబరును అనుసంధానిస్తారు. అలా చేయడం ద్వారా అదే పేరుతో ఎన్ని ఓట్లు ఉన్నాయో కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్  డేటాబేస్ ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. ఈ అనుసంధానం తరువాత 2024 ఎన్నికల్లో ఆధార్ కార్డునే ఓటు వేసేందుకు కూడా అనుమతించాలనే ఆలోచనతోనే ఈ కార్యాచరణ పూర్తిచేయనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓటరు నవీకరణ జాబితాలు తయారు చేస్తారు. అలాంటి సమయంలో కొన్ని అధనంగా ఓట్లు పెరిగే అవకాశం వుంటుంది. ఇలా పెరిగే సమయంలో కరెక్టు ఓటర్లు మాత్రమే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆధార్ ను ప్రతీ ప్రభుత్వ పథకానికి అనుసంధానిస్తూ వస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడు ఓటరు కార్డుకి కూడా వీటిని లింక్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చుననేది  ఆలోచన.

ఓటరు కార్డుకి ఆధార్ కార్డును అనుసంధానించడం ద్వారా భారీ సంఖ్యలోనే నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు, ఒకే పేరు వివిధ ప్రాంతాల్తో నమోదైన ఓట్లును రద్దు చేసే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఓటరు ఏ ప్రాంతంలో ఐదేళ్లకు పైగా ఉంటారో  అక్కడే తన ఓటును శాస్వతంగా ఉంచే నిర్ణయంలో భాగంగానే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల్లో పారదర్శకత ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విధానం వలన దేశ వ్యాప్తంగా చాలా రాజకీయపార్టీలు చాలా నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఒకే వ్యక్తి పేరుతో వివిధ ప్రాంతాలు, నియోజకవర్గాల్లో ఓటు కలిగిన వారు దేశ వ్యాప్తంగా చా ఎక్కువ మంది ఉన్నారు. ఇకపై అలాంటి ఓట్లన్నీ ఆధార్ అనుసంధానంతో రద్దైపోతాయి. ఆధార్ అనుసంధాన కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించి దానిని పూర్తిస్థాయిలో చేపట్టడానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ కార్యక్రమం సత్వరమే జరగడానికి అవకావాలు ఏర్పడ్డాయి. సచివాలయాల్లో 19శాఖల సిబ్బంది, వాలంటీర్లు అందుబాటులో ఉండటంతో ఈ పని ఏపీలో సత్వరమే పూర్తవుతుందని చెబుతున్నారు. కానీ ఈ కార్యక్రమానికి గ్రామ వలంటీర్లను దూరంగా ఉంచాలనే డిమాండ్ అన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యక్తం అవుతుంది.


ఆధార్ తో ఓటరు కార్డులు అనుసంధానం చేపడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే లెక్కకు మించిన ఒకే పేరుతో వివిధ ప్రాంతాల్లో వున్న ఓట్లు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో నూతన ఓటర్ల నమోదు కూడా చేసే అవకాశం కూడా లేకపోలేదు. అదనంగా ఉన్న ఓట్లు పోయినా.. కొత్తగా నమోదు అయ్యే ఓట్లతో 2024లో ఎన్నికలు జరపాలని కేంద్రం ఎన్నికల కమిషన్ యోచించే సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ఈ ఓటరుకార్డుకి ఆధార్ నెంబరు అనుసంధాన కార్యక్రమం చేపట్టిందని చెబుతున్నారు. ఒక రకంగా చూసుకుంటే ఈ విధానం అన్ని రాజకీయ పార్టీలకు సంకటంగానే పరిణమించే పరిస్థితి ఉన్నా.. దొంగ ఓట్లు, ఒకే వ్యక్తికి వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంతో చాలా రాజకీయపార్టీలు తమకు పడాల్సిన ఓట్లు లాసు అయిపోతున్నామనే భావనతో ఈ విషయాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లిన తరువాత..మెజార్జీ రాజకీయ పార్టీల అభ్యర్ధన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆధార్ అనుసంధానంతో లక్షల ఓట్లు రద్దుఅవుతాయా.. వేల సంఖ్యలో ఓట్లు రద్దు అవుతాయి..ఏం జరుగుతుందనేది ఆగస్టు 1 దాటిన తరువాత తేల నుంది. ఆధార్ అనుసంధాన కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, బీఎల్వోలకు అప్పగించి చేయించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. చూడాలి..ఈ అనుసంధాన ప్రక్రియతో ఏం జరగబోతుందనేది..!

Guntur

2022-07-16 06:07:57

వైజాగ్ లో ఆటో నడిపిన సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి అంటే పెద్ద స్టేజీలపై ఆర్బాటాల ప్రసంగాలే ఇప్పటి వరకూ చూశాం.. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకు వేశారు. వాహనమిత్ర పథకాన్ని లబ్దిదారులకు పంచడానికి విశాఖ వచ్చిన ఆయన నేరుగా లబ్దిదారుని ఆటో ఎక్కి ఆటో నడిపారు. ఆటో నడిపేటపుడు ఖచ్చితంగా ఖాకీ చొక్కా ఉండాలనే నిబంధనను ఎక్కడా మరిచిపోకుండా ఖాకీ చొక్కా వేసుకొని మరీ ఆటో ఎక్కారు సీఎం జగన్. ఈ సంఘటతో సదరు లబ్దిదారిణి ఆనందానికి అవదులు లేవు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఒక సాధారణ ఆటో ఎక్కి ఈ విధంగా డ్రైవర్లును ప్రోత్సహించడం అక్కడున్న పార్టీ నాయకులను, అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వయంగా ఆటోని మహిళా డ్రైవర్ ని నడపమని చెప్పి అందులో సీం ప్రయాణించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్.జగన్ మాట్లాడుతూ, వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం చెప్పారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.

Visakhapatnam

2022-07-15 06:56:10

భారీగా ఆదాయం కోల్పోతున్న సచివాలయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం భారీస్థాయిలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. సచివాలయాల ద్వారా 725 సర్వీసులను అందించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అరకొరగా కొన్ని సర్వీలు మాత్రమే సచివాలయం నుంచి అందిస్తున్నది. దానికి కారణం కూడా లేకపోలేదు గ్రామ, వార్డు సచివాయాల్లో కలిపి 19శాఖలకు చెందిన సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక్కో సచివాలయానికి రెండు కంప్యూటర్లు మాత్రమే మంజూరు చేసింది. అందులో ఒకటి రెగ్యులర్ గా డిజిటల్ అసిస్టెంట్ పనిచేస్తుండగా, మరో కంప్యూటర్ ద్వారానే సచివాలయంలో అందరు సిబ్బంది పనిచేయాలని. ఈ క్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులు పని భారం మొత్తం డిజిటల్ అసిస్టెంట్లపైనే పడుతోంది. అల కాకుండా ఒక్కోశాఖ సిబ్బందికి ఒక్కో కంప్యూర్ లేదా. సచివాలయానికి ప్రస్తుతం ఉన్న రెండు కంప్యూటర్లకు తోడు మరో మూడు కంప్యూటర్లు ప్రభుత్వం మంజూరు చేయగలిగితే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా నిర్వహించే 725 రకాల సర్వీసులు సచివాలయంలో పనిచేసే అందరు సిబ్బంది ద్వారా ప్రజలకు అందించడానికి వీలుంటుంది. అంతేకాకుండా అటు ప్రభుత్వానికి కూడా రాష్ట్రవ్యాప్తంగా వున్న 14వేల 5 సచివాలయాల నుంచి పూర్తిస్థాయిలో ఆదాయం కూడా అనునిత్యం వస్తుంది. కానీ ప్రభుత్వం సిబ్బందిని అయితే నియమించింది తప్పితే వారితో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

యూపీఐ, క్యూఆర్ స్కాన్ కార్డులు ఏర్పాటు చేస్తే..
గ్రామ,వార్డు సచివాలయాల్లో అందించే సేవలకు ప్రభుత్వం క్యూఆర్ స్కాన్ కార్డులు, యూపీఐ ఐడీలు ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాకే సేవలు పొందిన వారి ద్వారా సర్వీసు మొత్తం చేరే అవకాశం వుంటుంది. లేదంటే రోజంతా పనిచేసిన మొత్తాన్ని డిజిటల్ అసిస్టెంట్లు ప్రత్యేకంగా బ్యాంకులకు వెళ్లడం ద్వారా కొంత సమయం వ్రుధా అవుతున్నది. ప్రస్తుతం 725 సర్వీసులకు గాను ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కేలం 25 నుంచి 50 సర్వీసులను మాత్రమే అందిస్తున్నది. అదీ కూడా ఒక్క సచివాలయంలో ఒక్క డిజిటల్ అసిస్టెంటు ద్వారానే పనులు జరుగుతున్నాయి. అలా కాకుండా అన్ని శాఖల సిబ్బందిని కామన్ సర్వీస్ సెంటర్ కు అనుసంధానించి, శాఖాపరమైన పనులు లేని సమయంలో అందరు సిబ్బంది ద్వారా ఈ సర్వీసులు మొత్తం ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తే గ్రామ,వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సచివాలయాల్లో ఒక లక్షా 21వేల మంది సిబ్బంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఇంతమంది పనిచేస్తున్నా..నేటికీ మండలాలు, గ్రామాల్లోని మీసేవా కేంద్రాలకే వెళ్లి సర్వీసులు పొందడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం సచివాలయాల్లోపూర్తిస్థాయిలో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా సేవలు అందకపోవడమే.

సిబ్బంది సేవలను వినియోగిస్తే కాసుల వర్షం..
ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల్లో ఏ శాఖకు లేనంద మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖకు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను పూర్తిస్థాయిలో ప్రజల సేవకు వినియోగించడం మొదలు పెడితే..గ్రామంలోనే ప్రజలకు డిజిటల్ సేవలతో పాటు మిగిలిన అన్ని రకాల సర్వీసులు అందే అవకావం వుంది. సచివాలయశాఖలో మేన్ పవర్ అధికంగా ఉన్నా.. ఇక్కడ టెక్నాలజీ, సాంతికేతిక, కంప్యూటర్ల విషయంలో ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేయడంతో ఇంత మంది సిబ్బంది వున్న ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రస్తుత రోజుల్లో అన్ని అనుమతులు ఆన్ లైన్ లో ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సి రావడంతో వాటన్నింటినీ ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా సచివాలయాల ద్వారానే అందించే ఏర్పాటు చేస్తున్నది. ఏర్పాటైతే చేసిందిగానీ, దానికి సరిపడ కంప్యూటర్లను మాత్రం మంజూరు చేయలేదు. ఒక్కో సచివాలయాలనికి కేవలం రెండు కంప్యూటర్లు మాత్రమే ఇవ్వడంతో ఒక శాఖ ఉద్యోగి పని పూర్తిగా అయ్యేంత వరకూ మరోశాఖ ఉద్యోగికి చెందిన పనులు చేసుకోవడానికి గానీ, ప్రజలకు సర్వీసులు అందించడానికి గానీ వీలులేకుండా పోతుంది. సిబ్బందికి అనుగుణంగా కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అన్నీప్రభుత్వం ఏర్పాటుచేస్తే ప్రభుత్వంలోని అన్నిశాఖల కంటే గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారానే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి..!

Tadepalli

2022-07-15 04:32:31

రేపు ఏపీ సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో వరదలు అధికంగా కురుస్తున్నందున వరదలకి ప్రభావితమైన ప్రాంతాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహనరెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శుక్రవారం ఉదయం హెలికాప్టర్‌ నుంచి వరద ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఆయన ఏరియల్‌ సర్వే కొనసాగనుంది. సీఎం ఏరియల్‌ సర్వే కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎగువ గోదావరి నుంచి అత్యధికంగా వరద ప్రవాహం రావడంతో ఉబయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. ఎవరూ అదైర్య పడవద్దని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండేలా చూడాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ముఖ్యంగా కాటన్ బ్యారేజీ వద్ద 24 గంటలూ పర్యవేక్షణ చేపట్టాలని, వరద ఉద్రుతిని బట్టి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో సహాయక చర్యలు కూడా చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Visakhapatnam

2022-07-14 15:52:40

ప్రభుత్వ ప్రచారానికి సమాచారశాఖ మోకాలడ్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ప్రముఖ శాఖగా ఉన్న సమాచార పౌర సంబంధాలశాఖ అధికారులు కావాలనే చేస్తున్న తప్పిదం ప్రజలకు సంకటంగా మారుతోంది. మీడియాకి ప్రతిబంధకంగా తయారవుతోంది. కాదు కాదు అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే కోవర్టు సమాచారశాఖ అధికారుల తీరు వలన ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం అన్ని వర్గాల మీడియా ద్వారా ప్రజలకు చేరడం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం రానీయకుండి కొందరు డీపీఆర్వోలు పనిగట్టుకొని మీడియాకి సమాచారం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు నెంబరు యాడ్ చేసుకొని వాట్సప్ ద్వారానో, ఈమెయిల్ యాడ్ చేసుకొని మెయిల్ ద్వారానో పంపమంటే వారి ఆస్తులన్నీ జర్నలిస్టులకు రాసి ఇచ్చేయమన్నట్టు తెగ ఫీలై పోతున్నారు. అంతేకాదు మీ మీడియాలో ఆ వార్త రాకపోతే ప్రభుత్వానికి ఒరిగిపోయేది ఏమీలేదులే అనే బహిరంగ డైలాగులు కూడా వాడేస్తున్నారు. ఈ విషయం రాష్ట్రంలోని 26జిల్లాలకు చెందిన కలెక్టర్లు, స్వయానా సమాచారశాఖ మంత్రికి తెలిసినా ఉపయోగం మాత్రం సున్నా. ఒక్క ప్రభుత్వశాఖ తమ పనిని తాము సక్రమంగా నిర్వహించకపోవడం వలన ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మళ్లీ మళ్లీ పాత జిల్లాల కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ జిల్లా శాఖల కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తున్నది. విషయం తెలియక చిన్న, మధ్యతరగతి మీడియా అవస్థలు పడాల్సి వస్తుంది. అవునండీ..రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలుగా వున్న వాటిని 26 జిల్లాలుగా మార్పు చేసింది. ఆ విషయం ప్రభుత్వం మీడియాద్వారానే ప్రజలకు తెలియజేసింది. అయితే కొత్త జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, 75శాఖలకు చెందిన జిల్లాశాఖల అధికారులు ఎవరు,వారి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి..ఏఏ జిల్లాలకు చెందిన ప్రజలు ఏ జిల్లా కలెక్టరేట్లు, ఏ జిల్లాశాఖ అధికారులను సంప్రదించాలనే విషయంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదే మీడియా ద్వారా  ప్రచారం చేయడంలో ఘోరంగా విఫలం అయ్యింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వున్న మీడియాకి ఇదే సమాచారశాఖ ప్రభుత్వ సమాచారం ఇవ్వడంలో తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తోంది. దీనితో ప్రభుత్వశాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లకు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో రాష్ట్రంలోని కొత్తజిల్లాల్లోని మీడియాకి రావడం లేదు..ఆపై ప్రజలకూ తెలియడం లేదు.

ప్రెస్ నోటు అడిగితే ఆస్తులు అడిగినంతగా ఫీలపోతున్నారు..
రాష్ట్రంలో సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన డీపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలు, ఏపీఆర్వోలు మీడియా ప్రభుత్వ కార్యాక్రమాలకు సంబంధించిన ప్రెస్ నోటు మెయిల్ ద్వారానో, అధికారిక వాట్సప్ గ్రూపులో మీడియా ప్రతినిధుల నెంబర్లు యాడ్ చేసి అందజేసే విషయంలో చాలా దారుణంగా ఫీలై పోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆస్తులను అడిగినట్టుగానే వ్యవహరిస్తున్నారు వీరంతా. కొన్ని జిల్లాల్లో అయితే డీపీఆర్వోలు చాలా బాధ్యతగా జిల్లాలో మీడియా ప్రతినిధులను నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు తీసుకొని కొత్త జిల్లాలో పరిపాలనకు సంబంధించిన వార్తలు, ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు చాలా చక్కగా పంపిస్తున్నారు. ముఖ్యమై ప్రభుత్వ కార్యక్రమాలకు ఫోన్లు చేసీ మరీ చెబుతున్నారు. కొన్నిజిల్లాల్లో మరీ దారుణంగా అన్ని మీడియాలకు చెందిన జర్నలిస్టులకు ప్రెస్ నోట్లు పంపవద్దని, వారి నెంబర్లు వాట్సప్ గ్రూపులో యాడ్ చేసుకోవద్దని కొత్తగా విధుల్లోకి చేరిన కలెక్టర్లు, సమాచారశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ సమాచారశాఖ అధికారులు చేసే తప్పుని వారిపై నెట్టేస్తున్నారు. దీనితో కొత్త జిల్లాల్లోని పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన సమాచారం సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా అన్ని వర్గాల మీడియాకు అందడం లేదు. సదురు మీడియా సంస్థల జర్నలిస్టులు సేకరించిన వార్తలనే మీడయా సంస్థలు ప్రచురించుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించి గానీ, జిల్లా శాఖల అధికారులకు సంబంధించిన వ్యతిరేక వార్తలు వస్తే మాత్రం అదే సమాచారశాఖలోని డీపీఆర్వో ప్రెస్ నోటు, ప్రెస్ ఇన్విటేషన్ కూడా పంపని మీడియా సంస్థలకు ఖండన ప్రకటనలు పంపిస్తుండటం విశేషం..

అధికార పార్టీ మీడియా భజన చేస్తున్న సమాచారశాఖ..
సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు తెల్లవారు లెగిస్తే అధికారపార్టీ మీడియా భజన చేయడానికే సమయం అంతా సరిపోతుంది. ఎంత దారుణం అంటే సదరు మీడియాకి చెందిన అందరు రిపోర్టర్లు నెంబర్లు జిల్లా అధికారిక మీడియా గ్రూపులో యాడ్ చేసే డీపీఆర్వోలు, న్యూస్ ఏజెన్సీలు, చిన్న, మధ్య తరహా పత్రికలకు చెందిన జర్నలిస్టుల వాట్సప్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను తమ గ్రూపుల్లో యాడ్ చేయడానికి ఎక్కడలేని నొప్పులన్నీ పడుతున్నారు. పైగా సాంకేతిక పరంగా తప్పించుకునేందు మీ పత్రిక, ఛానల్, న్యూస్ ఏజెన్సీల, లోకల్ కేబుల్ నెట్వర్క్ లకు ప్రభుత్వం అక్రిడిటేషన్ ఇచ్చిందా.. అలా ఇచ్చిన జర్నలిస్టుల నెంబర్లుకు, మీడియా సంస్థలకు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలకు చెందిన ప్రెస్ నోట్లు,  ప్రెస్ ఇన్విటేషన్లు పంపమని సమాచారశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని చెబుతూ చేతులెత్తేస్తున్నారు. విఐపీలు, వీవీఐపీలు వచ్చే కార్యక్రమాలకు సైతం చిన్న మద్య తరహా మీడియా సంస్థల రిపోర్టర్లను ఆహ్వానించడం లేదు సమాచారశాఖ. ఇందేంటని నేరుగా సమాచారశాఖ అధికారులను ప్రశ్నించినా పట్టించునే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని కొత్త జిల్లాల కలెక్టర్లు వద్ద ప్రస్తావించిన ప్రతీ సారీ..అక్కడ కలెక్టర్లు, జిల్లా అధికారులను సైతం సమాచారశాఖ అధికారులు, సిబ్బంది బురిడీలను చేసి.. మసిపూసి మరేడు కాయ చేస్తోంది. చిన్నా చితకా పత్రికలు మనకి అవసరం లేదు..వాటిలో వార్తలు వచ్చినా రాకపోయినా ఒకటే..పెద్ద పత్రికలు, పెద్ద టీవీ ఛానళ్లు ఉంటే చాలు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.

చోద్యం చూస్తున్న సమాచారశాఖ కమిషనర్..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ అధికారిక కార్యక్రమం అయినా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వున్న అన్ని రకాల మీడియాలోనూ ప్రచారం జరిగేలా చూడాల్సిన సమాచారశాఖ శాఖ కొన్ని మీడియా సంస్థలనే పట్టించుకుంటూ వారికే కొమ్ముకాస్తూ.. మిగితా వాటిని వదిలేస్తున్నా సమాచారశాఖ కమిషనర్ సైతం చోద్యం చూస్తున్నారు తప్పితే పట్టించుకోలేదు. అంతెందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు అధికారిక వెబ్ సైట్ లున్నా.. అందులో ఒక ప్రభుత్వశాఖగా వున్న  సమాచారశాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్ లో మాత్రంలో  ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు అన్ని జిల్లాలకు చెందినవి కనిపించవు. ఒకప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు సదరు సమాచారశాఖ వెబ్ సైట్ లో పొందు పరిచేవారు. వాటినే రాష్ట్రవ్యాప్తంగా వున్న మీడియా పబ్లికేషన్ కు వినియోగించుకునేది. ఇపుడు ఆ పనిచేస్తే ఎక్కడ ప్రభుత్వ సమాచారం మీడియా ద్వారా బయట ప్రజలకు తెలిసిపోతుందోనని భావించిన సమాచారశాఖ అరకొర సమాచారంతోనే వెబ్ సైట్ నిర్వహిస్తోంది. వాస్తవానికి కొత్తజిల్లాల్లో పరిపాలన ప్రజలకు పూర్తిస్థాయిలో తెలియాలన్నా, ప్రజలకు కొత్త జిల్లాలకు చెందిన అధికారుల సమాచారం తెలియాలన్నా అన్ని రకాల మీడియాల ద్వారా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు తెలిసేలా చేసే విషయంలో రాష్ట్రంలోని 26 జిల్లాల డీపీఆర్వోలకి కమిషనర్ ఆదేశాలివ్వాల్సి వుంది. కానీ ఆ విధంగా ఆదేశాలు ఇచ్చినట్టు ఎక్కడా కనిపిచడంలేదు. ఫలితంగానే కొత్త జిల్లాల్లోని అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన సమాచారం చిన్న, మధ్య తరహా మీడియా ద్వారా ప్రజలకు చేరడం లేదు. ఇప్పటికైనా సమాచారశాఖ కమిషనర్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ డీపీఆర్వోలకు నిర్ధిష్ట ఆదేశాలిస్తే తప్పా పరిస్థి గాడిన పరిస్థికి కనిపిండం లేదు..!

Tadepalli

2022-07-14 03:20:04