1 ENS Live Breaking News

సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ ను డిక్లేర్ చేస్తూ..జీఓనెంబరు-5ను సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ విడుదల చేశారు. ఈ జీవోతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు లక్షా 24వేలకు పైగా ఉద్యోగులకు రెగ్యులర్ పేస్కేలు అమలవుతుంది. అయితే ప్రభుత్వం వీరికి పీఆర్సీ కూడా అమలు చేసినట్టు ప్రకటించింది. సచివాలయ ఉద్యోగులు 33 నెలలు ప్రొబేషన్ తరువాత మాత్రమే ఈ జీఓను జారీ చేసింది. వాస్తవానికి అక్టోబరు1 2021నే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తయింది. కానీ 19శాఖలకు చెందిన సచివాలయ ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం ఈజీఓ వర్తింపచేసింది. ఈ జీఓ ప్రకారం ఉద్యోగులు ఆగస్టు 1 నుంచి కొత్తగా పెరిగిన పేస్కేలు అందుకుంటారు. ప్రభుత్వ జీఓ ప్రకారం పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలకు రూ.23,120 నుంచి రూ.74,770 అదేవిధంగా మిగిలిన 18శాఖల ఉద్యోగులకు రూ.22,460 నుంచి రూ.72,810 మేరకు పేస్కేలు వర్తిస్తుంది. దీనికి హెచ్ఆర్ఏ, డీఏ పూర్తిస్థాయి జీతాలు ఉద్యోగులు అందుకుంటారు. కాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓను గ్రామసచివాలయశాఖలో పనిచేస్తున్న అన్నిశాఖలకు, డీఎస్సీ చైర్మన్, కలెక్టర్లు జారీచేసింది. ఇన్నేళ్లకు తమ సర్వీసు ప్రొబేషన్ క్లియర్ చేస్తూ.. పేస్కేలు వర్తింపచేయడం పట్ల గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tadepalli

2022-06-25 12:40:06

కేబినెట్లో సచివాలయ ఉద్యోగుల ఊసేది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మంత్రిమండలిని విస్తరించిన తరువాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో సుమారు 42 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన విషయం మాత్రం చర్చకు రాలేదు. ఇప్పటి వరకూ సచివాలయ ఉద్యోగులు 33నెలల పాటు సర్వీసు ప్రొబేషన్ ను చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ సర్కారు సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు ప్రొబేషన్ పూర్తిచేసుకోగానే వారి సర్వీసులు రెగ్యులర్ చేసి వారికి పేస్కేలు అమలు చేస్తామని చెప్పింది. ఆ తరువాత కరోనా రావడంతో రెండేళ్ల ప్రొబేషన్ ను కాస్తా 33 నెలలకు పెంచి ఆగస్టు1 నుంచి కొత్తజీతాలు ఇస్తామని..దానికి సంబంధించిన ఫైలుపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంతకాలు కూడా చేశారు. సీఎం ఫైలుపై సంతకాలు చేసి పదిరోజులు గడుస్తున్నా సదరు ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్స్ కి సంబంధించిన అంశంలో మాత్రం క్లారిటీ రాలేదు. సుమారు లక్షా 24వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసు ప్రొబేషన్ వ్యవహారం ఏడాదికి ఏడాది కాలం పొడిగిస్తూనే వస్తుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఒక ఫైలుపై సంతకాలు చేసిన 24 గంటల్లో ఆర్ధిక శాఖ జీఓ జారీచేస్తుంది. 

ఆపై వరుసగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శాఖలు కూడా జీఓలు జారీచేస్తాయి. ఈ విధంగానే జరుగుతుందని సచివాలయ ఉద్యోగులంతా ఊహించుకున్నారు. ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తిచేసుకుని.. టెస్టులు పాసైన వారందరికీ వర్తింపచేస్తామని చెప్పిన మాటలు మాత్రం మాటలు గానే ఉండిపోయాయి. ముఖ్యమంత్రిస్థాయిలో నిర్ణయం తీసుకున్నతరువాత అదే విషయాన్ని కేబినెట్ లో చర్చించి సదరు ఫైలుకి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఊసేలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల గొంతులో వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. ప్రభుత్వం కేబినెట్ లో తమ అంశం కూడా చర్చించి సర్వీసు ప్రొభేషన్ విషయాన్ని ముగించి తమకు పేస్కేలు అమలు చేయడానికి లైన్ క్లియర్ చేస్తారని అంతాఆశించినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఇప్పటికే ఆగస్టు 1నాటికి ప్రొభేషన్ డిక్లరేషన్ అయిన తరువాత కొత్త జీతాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం..ముచ్చటగా మూడేళ్లు పూర్తిచేసినా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని..తొలుత జూన్ నాటికి రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వం దానిని ఆగస్టు1నాటికి మార్చిందని..ఇపుడు కేబినెట్ లో తమ ఉద్యోగాల సర్వీస్ ప్రొభేషన్ డిక్లరైజేషన్ కోసం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగస్టు నుంచి మళ్లీ అక్టోబరు 1 అంటే మూడేళ్లు పూర్తిచేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటుందా అనే అనుమానాలను కూడా ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అదనంగా 9నెలల పాటు పేస్కేలు కోల్పోయిన ఉద్యోగులు.. పొగిడించిన రెండు నెలలతో మరింతగా పేస్కేలు కోల్పోతారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి మానస పుత్రిక గా పేరుగాంచిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ జరగలేదు. ఇపుడు సర్వీసు రెగ్యులైజేషన్, ప్రొభేషన్ డిక్లరేషన్ విషయంలోనూ అదే కాలయాపన చేస్తుందని మరోవైపు టీడీపీ ఆరోపణలు గుప్పిస్తున్నది. 

ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగానే పాలక ప్రభుత్వం కూడా తాత్సారం చేయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా వుంది. అయితే కొంత మందిఉద్యోగులు ప్రభుత్వం పెట్టిన పరీక్షలు పాస్ కాలేదని, వారందరికీ మరోసారి పరీక్షపెట్టి వారికి అందరికీ ఒకేసారి సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేస్తామని అంటున్నట్టుగా ప్రభుత్వ అధికారుల వద్దకు సమాచారం అందినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వంలోనూ లేనివిధంగా 33నెలలకు పైగా ప్రొభేషన్ చేయించడం, అదీ రెండవ శనివారాలు, ఆదివారాలు, మిగిలిన సెలవు రోజుల్లో ప్రత్యేక విధుల పేరుతో ఉద్యోగాలు చేసినా..ప్రభుత్వం గుర్తించకపోవడం, సకాలంలో సర్వీసులు రెగ్యులర్ కాకపోవడం తదితర పరిణాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది..!

తాడేపల్లి

2022-06-25 05:46:31

స్పందనలోనే ఇక సచివాలయ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల అధికారులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఏర్పాటు చేసే సమావేశాలకు, ఆ పేరుతో చేసే కాలయాపనకు అడ్డుకట్టవేసింది. సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఉండాలని, ఆ సమయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో సహా అన్నిశాఖల సిబ్బంది పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశించింది. ఆ సమయంలో మండలకేంద్రాల్లో ఎలాంటి సమావేశాలు, క్షేత్రస్థాయి పనులు సిబ్బందికి ఆపాదించవద్దని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఏదైనా మండల కేంద్రంలో సమావేశం పెడితే ఒక పూటంతా రూరల్ జిల్లాలో గ్రామసచివాలయ సిబ్బందికి, నగర ప్రాంతంలో వార్డు సచివాలయ సిబ్బంది సమయం వ్రుధా అయ్యేది. అంతేకాకుండా మండల కేంద్రం నుంచి సచివాలయానికి వచ్చే సమయంలో ప్రయాణానికే చాలా ఎక్కువగా వ్రుధా అవుతోంది. దీనిని ద్రుష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రతీరోజూ సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఆటంకం లేకుండా అన్నిశాఖల సిబ్బంది సచివాలయాల్లోనే ఉండాలని.. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయశాఖ సంచాలకులు GVWW & VSWS GWSUICOOR /158/2021/GW5/14885/ dt.19.08.2021 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ ఉత్తర్వులు అనుసరించి ముఖ్యమైన సమావేశాలుంటే మధ్యాహ్నం లోపుగానే నిర్వహించాల్సి వుంటుంది. ఈ ఆదేశాలను అటు వార్డు సచివాలయాలు, ఇటు గ్రామసచివాలయాలకే కాకుండా సచివాలయంలో పనిచేసే సిబ్బందికి చెందిన అన్ని శాఖల సిబ్బందికీ, మండల అధికారులకు ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇప్పటి వరకూ కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శిలు బయోమెట్రిక్ వేసి మండల అధికారులు ఆదేశించే కార్యక్రమాలకు వెళ్లిపోతూ ఉండేవారు. ఇకపై ఆ ఆటలు చెల్లకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖచ్చితంగా మధ్యాహ్నం3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించాల్సి వుంటుంది. 33 నెలలు సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకొని..సర్వీస్ రెగ్యులైజేషన్ కి దగ్గరవుతున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించిందనే సంకేతాలు ప్రస్తుతం జారీ చేసిన ఆదేశాలతో అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామసచివాలయంలో అన్ని శాఖల సిబ్బంది ప్రజలుకు అందుబాటులోకి రావడంతోపాటు, ఆయ సమస్యల పరిష్కారానికి కూడా మార్గం సుగమం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూడాలి ఈ ప్రత్యేక ఉత్తర్వులు ఏ స్థాయిలో ఫలితాలనిస్తాయనేది.

Tadepalli

2022-06-24 08:08:25

న్యూస్ ఏజెన్సీ వార్తకి మీడియా సంస్థలు డేట్ లైన్ ఎందుకివ్వాలి..

ప్రపంచవ్యాప్తంగా మీడియా(ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్)కి ఎంత ప్రాధన్యత ఉన్నదో.. న్యూస్ ఏజెన్సీకి కూడా అంతకంటే రెండాకుల అధిక ప్రాధాన్యత ఉన్నది. ఒక్కో సందర్భంలో మీడియాకంటే న్యూస్ ఏజెన్సీ వార్త, ఆ వార్త సంస్థ డేట్ లైన్ తో వచ్చే ఫోటో, వీడియో, యానిమేషన్లకు మాత్రమే ప్రామాణికం వుంటుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పటి మీడియాకి న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయి..న్యూస్ ఏజెన్సీ అంటే ప్రింట్ మీడియానా..ఎలక్ట్రానిక్ మీడియానా..అసలు ఇలాంటిది అంటూ ఒకటి ఉందా, ఉంటుందా..వాళ్లేం చేస్తారు.. అని అడిగే ఈ తరం జర్నలిస్టు మహానుభావులు, అంతకు మించిన మీడియా సంస్థలు కూడా లేకపోలేదు. ప్రతీ మీడియా సంస్థకు ఒక న్యూస్ ఏజెన్సీ ఉండి తీరాలి అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ఆంక్ష. అయితే ఇటు మీడియాకి, అటు న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగా సిబ్బందిని వినియోగించాలనే ఆర్ధిక ఇబ్బందులతో మీడియా సంస్థలు సొంత న్యూస్ ఏజెన్సీల నిర్వహణ మానేసాయి. కొన్ని సంస్థలు వార్త సంస్థలకు చందాదారులుగా చేరి వారిచ్చిన వార్తలను మీడియాలో ప్రచురించుకుంటున్నాయి. ఆ విషయం పెద్ద పత్రికలు, ముఖ్యంగా ఇంగ్లీషు పత్రికలు, టీవీ ఛానళ్లకు మాత్రమే తెలుసు. కొన్ని చిన్న, మధ్య తరహా పత్రికలు, లోకల్ కేబుల్ టీవీలకు అసలు న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో కూడా తెలియదు. అలాగని న్యూస్ ఏజెన్సీ వార్తలు ఎందుకు వినియోగించాలో అసలే తెలియదు. కొందురు తెలిసినట్టు నటిస్తారు గానీ.. వారికీ అసలు విషయం తెలియదని వారికే తెలిసిన విషయం. ఇక తెలిసిన వారు వారి వారి మీడియా సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు న్యూస్ ఏజెన్సీ వార్త, ఫోటో, వీడియోలను, యానిమేషన్లను వినియోగిస్తూ(వారి మీడియా జర్నలిస్టులు కాకుండా గుర్తింపు పొందిన ప్రత్యేక వార్త సంస్థకు చెందిన జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, యానిమేటర్లు కవర్ చేసి ఇచ్చినవి) చందా దారులుగా వినియోగించుకుంటూ.. న్యూస్ ఏజెన్సీల డేట్ లైన్ వేస్తూ.. సదరు మీడియా సంస్థల గౌరవాన్ని నిలబెట్టుకుంటూ హుందాగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అయితే అక్కడి సమాచారశాఖ న్యూస్ ఆడిట్ చేస్తుంది(న్యూస్ ఆడిట్ అంటే ఒకే వార్త ఒకేసారి వివి పత్రికలు, టీవీ ఛానళ్లలో న్యూస్ ఏజెన్సీకి చెందిన స్క్రిప్ట్, విజువల్స్, లోగో, యానిమేషన్ తో వస్తే.. అది న్యూస్ ఏజెన్సీదనీ, లేదంటే అది సదరు పత్రిక సేకరించదని గుర్తిస్తారు. వాటిని ఆడిట్ చేసి ఆ రిపోర్టును మీడియా సంస్థలకు న్యూస్ ఏజెన్సీ స్క్రిప్టుతో సహా పంపుతారు) దౌర్భాగ్యం ఏంటంటే ఆ పరిస్థితి భారతదేశంలో లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అదేంటో కూడా తెలియదు. అందుకనే న్యూస్ ఏజెన్సీ యొక్క ప్రాముఖ్యతగానీ, అవసరం గానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాచారశాఖ నిబంధనలు కానీ మన దేశ మీడియా సంస్థలు పాటించవు. నిజంగా భారతదేశంలోనూ, రాష్ట్రాల్లోని సమాచారశాఖ న్యూస్ ఆడిట్ చేపడితే మాత్రం న్యూస్ ఏజెన్సీల యొక్క ప్రాధాన్యత పెరిగి మళ్లీ పూర్తిస్థాయిలో పెరుగుతుంది. న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో సోషల్ మీడియా పుణ్యమాని ప్రతీ సామాన్యుడికీ తెలుస్తుంది. కానీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలకు, రాజకీయపార్టీలకు చెందిన నేతలకే ప్రధాన మీడియా సంస్థలు ఉండటంతో ఆ న్యూస్ ఆడిట్ అనేది జరగక న్యూస్ ఏజెన్సీల ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. అసలు న్యూస్ ఏజెన్సీ యొక్క వార్త, ఫోటో, వీడియోను, యానిమేషన్లను మీడియా సంస్థలు ఎందుకు వాడాలనే మాటకొస్తే..సదరు మీడియా సంస్థలకు న్యూస్ వచ్చే ప్రదేశంలో సొంత జర్నలిస్టు లేని సమయంలో అక్కడ కవర్ చేసిన వార్తను ఏ న్యూస్ ఏజెన్సీ కవర్ చేసి మీడియా సంస్థలకు పంపితే.. ఆ ప్రామాణిక వార్తను మీడియా సంస్థలు ఆ యొక్క న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ తో ప్రచురించాలి..టీవీల్లో అయితే వాటర్ మార్క్ తో వేయాలి, లేదంటే న్యూస్ ఏజెన్సీ లోగోతో వేయాలి, డిజిటల్ మీడియా అయినా వాటర్ మార్క్ తోనే న్యూస్ వేయాలి. కానీ ప్రస్తుత మీడియా సంస్థలు సోషల్ మీడియాను మాత్రమే వేదిక చేసుకొని.. న్యూస్ ఏజెన్సీల కవర్ చేసి పంపిన వార్తలనైనా వారి సొంతవార్తలా వారి వారి డేట్ లైన్ తోనే వేసుకుంటున్నాయి. ప్రచురించేస్తున్నాయి. వాస్తవానికి న్యూస్ ఆడిట్ జరిగిన సమయంలో న్యూస్ ఏజెన్సీ కవర్ చేసిన వార్తను అదే వార్తగా ఏదైనా మీడియా సంస్థ కవర్ చేసినా, సదరు న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ వేయకపోయినా ఆ విషయాన్ని గుర్తించి వారికి నోటీసులు పంపాలి. అంతేకాకుండా సదరు వార్త సంస్థలు కాపీరైట్ దావా వేస్తే వారికి నష్ట పరిహారం కూడా కట్టాలి. ఆ ఇబ్బందులు రాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సమాచారశాఖలు మీడియా సంస్థలకు వార్త కవర్ చేసే ప్రాంతంలో జర్నలిస్టులు లేకపోతే.. అక్కడి నుంచి కవర్ చేసిన ఏ వార్తకైనా న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ వేయాలని, లేదా సదరు జర్నలిస్టు రాయని వార్తకు జర్నలిస్టు డేట్ లైన్ వేయకుండా న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ మాత్రమే వేయాలనే నిబంధన అమలు చేసింది. దానిని ఆర్ఎన్ఐ నిబంధనల్లోనూ పొందు పరిచింది. కానీ అవేవీ భారతదేశంలోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు  జరగకపోవడంతో, అసలు న్యూస్ ఏజెన్సీ అంటే ఏమిటో కూడా మీడియా సంస్థలకు తెలీకుండా పోయింది సరికదా..సదరు మీడియా సంస్థలు న్యూస్ ఏజెన్సీల వార్తలను, ఫోటోలను, వీడియోలను వార్త సంస్థ డేట్ లేన్ గానీ, లోగోగానీ, వాటర్ మార్క్ గానీ లేకుండానే వినియోగించేస్తున్నాయి. ఈ విషయం సమాచారశాఖ అధికారులకు తెలిసినా అది శూన్యమే అవుతుంది. దానికితోడు సోషల్ మీడియాపేరుతో మీడియా సంస్థలు కూడా తాము కవర్ చేసిన వార్త న్యూస్ ఏజెన్సీది కాదని, సోషల్ మీడియాదేనని చెప్పుకుంటూ న్యూస్ ఏజెన్సీల వార్తలను అప్పనంగా వాడేస్తున్నాయి. తమ వార్తగానే ప్రచురించేస్తున్నాయి. ఈరోజుకీ కొన్ని ప్రధాన ఇంగ్లీషు పత్రికలు, ఒకటి రెండు పెద్ద తెలుగు పత్రికలు, రెండు మూడు టీవీ ఛానళ్లు తప్పితే మిగిలిన ఏ మీడియా సంస్థలు  కూడా తమది కాని వార్తకు తమ మీడియా సంస్థ డేట్ లైన్ వినియోగించడం లేదు. ఖచ్చితంగా న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ మాత్రమే వేస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు మాత్రం న్యూస్ ఏజెన్సీ డేట్ లైన్ ని పెట్టడం లేదు. సదరు వార్తను సేకరించినది న్యూస్ ఏజెన్సీయే అయినప్పటికీ ఆ వార్తను వారి యొక్క న్యూస్ స్టేటస్ కోసం వారి జర్నలిస్టులు కవర్ చేసినట్టుగానే అప్పనంగా వాడేసుకుంటున్నాయి.. ఆర్ఎన్ఐ నిబంధనలను మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. న్యూస్ ఆడిట్ అసలు జరగడంలేదు.. అంతెందుకు జర్నలిస్టులు లేని ప్రదేశాల నుంచి కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు ప్రచురితం అయినా ఆ విషయాన్ని సమాచారశాఖ మీడియా సంస్థలను ప్రశ్నించడంలేదు. కనీసం సంస్థలో పనిచేసే పనిచేసే జర్నలిస్టుల సమాచారం కూడా తీసుకోవడం లేదు. అలా తీసుకున్న రోజు.. ఒకే వార్త అన్ని పత్రికల్లో న్యూస్ ఏజెన్సీకి చెందిన న్యూస్ వెబ్ సైట్, న్యూస్ యాప్, న్యూస్ వైర్ లను పోలి ఒకే విధంగా వచ్చిన రోజు.. అది న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన వార్తమాత్రమేనని తెలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సమాచారశాఖలు మీడియా సంస్థలు వార్తల విషయంలోనూ, న్యూస్ ఏజెన్సీల వార్తలను, వాటికి చెందిన డేట్ లైన్ ను వినియోగించే విషయంలో నిర్ధిష్ట ఆదేశాలను అమలు చేసిన రోజు ఏది మీడియా సేకరించిన వార్తో..ఏది న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన వార్తో..ఏది సోషల్ మీడియా నుంచి తస్కరించి వార్తో ప్రభుత్వాలకు తెలుస్తుంది. అసలు న్యూస్ ఏజెన్సీ అంటే ఏంటో అటు మీడియాకి, ప్రభుత్వాలకు, పాఠకులకు తెలుస్తుంది..!

Visakhapatnam

2022-06-23 13:40:55

సిఎంసీఐకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపు.. డా.మహర్షి

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు డా.కె.మ‌హ‌ర్షి( జాన్ క్రిష్ట‌ఫ‌ర్ కొమ్మ‌ల‌పూడి) స్థాపించిన‌ క్రిష్టియ‌న్ మ్యూజిక్ కాలేజీ కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ల‌భించింది.  2020 ఏప్రిల్ 14 నుంచి 800 రోజుల పాటు నిర్విరామంగా విద్యార్ధుల నుంచి పెద్ద‌వారి వ‌ర‌కూ ఉచితంగా జూమ్ ద్వారా ఆన్ లైన్ లో క్రైస్థ‌వ శాస్త్రీయ సంగీత త‌ర‌గ‌తులు నిర్వ‌హించినందుకు గాను ఈ ఖ్యాతి గ‌డించింది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం విశాఖ‌లో డా.కె.మ‌హ‌ర్షి  మీడియాతో మాట్లాడారు. విశాఖ కేంద్రంగా ఇచ్చిన ఆన్ లైన్ శిక్ష‌ణ‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. క‌రోనా లాక్ డౌన్ నుంచి రోజుకు రెండు బ్యాచ్ ల చొప్పున ఈ ఉచిత ఆన్ లైన్ త‌ర‌గ‌తుల ద్వారా అమెరికా, యుకె, దుబాయ్‌, కెన‌డా, ఆస్ట్రేలియా దేశాల‌కు చెందిన ఎంద‌రో తెలుగువారు ఈ శిక్ష‌ణ పొందార‌ని చెప్పారు. ఆంధ్ర క్రైస్త‌వ కీర్త‌న‌లు, గ్రంధంలోని కీర్త‌న‌లు, స్వ‌రాల‌ను తాను శిక్ష‌ణ ఇచ్చాన‌ని వివ‌రించారు. అంతేకాకుండా తాను స్వ‌యంగా ర‌చించిన‌ క్రైస్త‌వ శాస్త్రీయ సంగీత విద్యాద‌ర్ప‌ణం పుస్త‌కంలోని అంశాల‌ను కూడా విద్యార్ధుల‌కు వివ‌రించిన‌ట్టు చెప్పారు. తాను అందించిన ఆన్ లైన్ శిక్ష‌ణ‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఇవ్వ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. ఇదే స్పూర్తితో గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ల‌ర్డ్ రికార్డ్స్ లో గుర్తింపు వ‌చ్చేలా త‌మ ఆన్ లైన్ శిక్ష‌ణ కొన‌సాగించ‌డంతోపాటు శాస్త్రీయ సంగీతానికి పూర్వ‌వైభ‌వం తీసుకురావ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా క్రుషిచేస్తున్న‌ట్టు డా.కె.మ‌హ‌ర్షి( జాన్ క్రిష్ట‌ఫ‌ర్ కొమ్మ‌ల‌పూడి) మీడియాకి వివ‌రించారు.

Visakhapatnam

2022-06-20 09:43:35

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం మ‌ధ్యాహ్నం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మ‌హ‌ద్వారం వద్ద ఆలయ అర్చకులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి ఆల‌యంలోకి ఆహ్వానించారు.  స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలను గ‌వ‌ర్న‌ర్‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు  ర‌మేష్ బాబు,  హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2022-06-08 10:34:51

రూటు మార్చిన బెంగాల్ టైగర్..

ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత 19 రోజులుగా చిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతున్న రాయల్ బెంగాల్ టైగర్ ఇపుడు ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టు దిశగా రూటుమార్చినట్టుగా పులి నడిచిన ముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు ద్రువీకరిస్తున్నారు. పెద్దిపాలెం గ్రామ పరిసరాల్లో పొట్టి మెట్ట మీద పులి సంచరిస్తున్న ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా మంగళవారం సాయంత్రానికి పులిసంచరించిన ప్రదేశాలను పులి అడుగులు వేసిన ముద్రల ఆధారంగా దాని జాడ ఏలేరు రిజర్వాయర్ ప్రాంతానికి దారితీసినట్టుగా చెబుతున్నారు. అయితే గత రెండు వారాలకు పైనే అడవిలో సంచరించిన పులి ఇపుడు దాహార్తిని తీర్చుకోవడానికే ఏలేరు రిజర్వాయర్ ప్రాంతానికి దారిమళ్లి వుంటుంద అటవీ అధికారులు భావిస్తున్నారు.  పొదురపాక, పాండవుల పాలెం మధ్య ఉన్న పొట్టి మెట్ట ప్రాంతాలతోపాటు, గతంలో పులి సంచిచన ప్రదేశాలను కూడా అటవీశాఖకు చెందిన 120 మంది సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పులి అడుగులు అక్కడి రెండు మూడు ప్రాంతాల్లో కూడా కనిపించడంతో పులి తన రూటు ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాంతాల వరకూ దారితీసినట్టుగా భావిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో పులి జాడను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు అటవీశాఖ అధికారులు. లింగంపర్తి ఏరియాను దాటి శివారు ప్రాంతాల్లో సంచరించే అవకాశాలు ఆ దారిగుండా కనిపిస్తున్నాయని మాత్రం చెప్పుకొస్తున్నారు. బెంగాల్ టైర్ రోజుకో రూటులో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రాంతంలో దర్శనమిస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్తిపాడు నియోజవకర్గ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు.
 

ఏలేశ్వరం

2022-06-07 16:41:52

జూన్ 12నుంచి14 వరకు జ్యేష్టాభిషేకం

తిరుమల‌లో జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు అభిద్యేయక జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘అభిద్యేయక అభిషేకం’అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-06-07 12:45:58

14400తో ఇక అవినీతి పరుల ఆటకట్టు

ఏసీబి14400 యాప్ తో ఇక అవినీతి పరుల ఆటకట్టించవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్సులో ఏసీబీ అనే యాప్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అన్నిచోట్లా అవినీతిని రూపుమాపేందుకే ఈ యాప్ ను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకొని అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-06-01 15:39:33

ఆ పరీక్షలో మహిళా పోలీసులంతా పాస్

రాష్ట్రవ్యాప్తంగా 14849 మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో 366 మంది అభ్యర్ధినిలు మినహా 14483 మంది పాస్ అయినట్టు రాష్ట్ర డీజీపీ కార్యాలయం తెలియజేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మహిళా పోలీసులు ఈ పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులను 33నెలల తరువాత సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్న తరుణంలో కోర్టుకేసుల కారణంగా ఈ ప్రక్రియ ఒక్క మహిళా పోలీసుల విషయంలోనే నిలిచిపోయింది. ఈ తరుణంలోనే హోంశాఖ మహిళా పోలీసులు అప్పుడెప్పుడో రాసిన పరీక్షల ఫలితాలను ఇపుడు విడుదల చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Tadepalli

2022-06-01 14:42:31

ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాపోటీలు

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా, ఆయుష్ విభాగము రాష్ట్ర వ్యాప్తంగా యోగాసనాల పోటీలను నిర్వహిస్తుందని కమిషనర్ వి.రాములు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 21 జూన్ న జరిగే ఈ పోటీలకు  8 సంవత్సరాల పై బడి ఏ వయస్సు వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చుని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 1) పూర్ణ నటరాజాసన 2) దండియమన జాను సిరాసన 3) వటయానాసన 4) త్రివిక్రమాసన 5) విభక్త పశ్చిమోత్తానాసన 6) గర్భాసన 7) పద్మబకాసన 8) ఏకపాద విపరీత దండాసన 9) తీతిభాసన 10) వృశ్చికాసన 11) మయూరాసన 12) హనుమానాసన 13) పూర్ణ ఉష్ట్రాసన 14) పూర్ణ ఉష్టాసన పాదాంగుష్ట ధనురాసన 15) పూర్ణచక్రాసన 16) గండబేరుండాసనాలు వేయాలన్నారు.  పేర్కొన్న  16 ఆసనాలలో ఏవైన 8 ఆసనాలను వేయగలిగినవారు ఆయా ఆసనాలను వేసి ఆసన స్థితిలో వున్న ఫోటోల ను advyoga2022@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపాల్సి వుంటుందన్ని పేర్కొన్నారు.  ఫోటోతో పాటు తమ పేరు, వయస్సు, ఆధార్ నెంబర్, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ లను పంపవలసి వుంటుందని, ఫోటోలు పంపుటకు చివరి తేది. 06గా నిర్ణయించినట్టు తెలియజేశారు. ఆరోజు సాయంత్రం 05గంటలలోపుగా వాటిని పంపాలని తెలియజేశారు. ఈ ఫోటోలను ప్రాధమికంగా పరిశీలించిన అనంతరం ఎంపిక ఐన వారు 10 జూన్ 2022 న న్యాయ నిర్ణేతల సమక్షంలో ఇవే ఆసనాలను ఆన్ లైన్ లో ప్రదర్శించవలసి వుంటుందని, ఇందులో ఎంపిక కాబడిన వారికి 21 జూన్ 2022న విజయవాడలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వటంతో, పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిధుల ద్వారా బహుమతులు అందజేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు 9441014521లో  సంప్రదించాలన్నారు.

Tadepalli

2022-06-01 02:20:05

సీఎం వైయస్.జగన్ కు ఘనస్వాగతం

దావోస్ విదేశీ పర్యటన ముగించుకొని  తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ కు సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్,  ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ అందరినీ ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి బయలు దేరి వెళ్లారు.

Gannavaram

2022-05-31 15:28:43

సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర సక్సెస్

రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ,బి.సి, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్దికి పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 26 నుండి ఐదు రోజుల పాటు  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర విజయవంతం అయ్యిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారని, తంతోపతండాలుగా ప్రజలు ఆ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు.   సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఈ నెల 26 న  శ్రీకాకుళంలో ప్రారంభం అయి 29 న అనంతపురంలో ముగిసిందన్నారు. వర్షం కారణంగా  26 న తేదీన విజయనగరంలో బహిరంగ సభ నిర్వహిణకు కొంత సమస్య ఏర్పడినప్పటికీ, 27 న రాజమండ్రిలో, 28 న నర్సరావుపేట మరియు 29 న అనంతపురంలో బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.  ఈ బస్సు యాత్రలో మరియు బహిరంగ సభల్లో 17 మంది ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ బస్సుయాత్రలో మరియు బహిరంగ సభల్లో పాల్గొనపోయినప్పటికీ ఆయన  బొమ్మ చూపి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారన్నారు.  రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగ్గ విధంగా ప్రజారంకమైన పాలన రాష్ట్రంలో జరుగుచున్నదని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలనతో ప్రజల్లో అచంచల విశ్వాసం ఏర్పడటం వల్లే తమ బస్సుయాత్ర సఫలీకృతం అయిందన్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సరళి ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు బంగారు బాట వేసే విధంగాను మరియు సామాజిక విప్లకారుల ఆలోచలకు అద్దం పట్టేలా ఉందని ఆయన కొనియాడారు.

Tadepalli

2022-05-31 15:21:49

ఏపీకీ సీడీటీఎల్ సేవ‌లు అందాలి

హైద‌రాబాదులోని సీడీటీఎల్ (సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ లేబొరేట‌రీ) సేవ‌ల‌ను ఏపీకి కూడా అందించాల‌ని ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని డిప్యూటీ డ్ర‌గ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియా డాక్ట‌ర్ ఎ.రామ‌కృష్ణ‌న్ ను కోరారు. మంగ‌ళగిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లో ఉన్న త‌న చాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఏపీ, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన డ్ర‌గ్ కంట్రోల్ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని డ్ర‌గ్ విభాగ సిబ్బందికి కేంద్ర డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు పూర్తిస్థాయిలో స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కోరారు. స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు సాధించవ‌చ్చ‌ని చెప్పారు. హైద‌రాబాదులోని సీడీటీఎల్ సేవ‌ల‌ను ఏపీకి పూర్తి స్థాయిలో అందించాల‌ని కోరారు. బ్ల‌డ్ బ్యాంకుల్లో సుర‌క్షిత ర‌క్తం అందేలా చొర‌వ‌చూపాల‌ని, హెచ్ఐవీ రోగుల‌కు చెందిన ర‌క్తం ఊసే ఎక్క‌డా లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. క్లినిక‌ల్ ట్రైల్స్ స‌మ‌యంలో డీసీజీఐ అధికారులు స్థానికంగా ఉండే రాష్ట్ర స్థాయి అధికారుల‌కు కూడా స‌మాచారం అందించాల‌ని చెప్పారు. 

దీనివ‌ల్ల క్లినికల్ ట్ర‌యిల్స్ విష‌యంలో లోపాలు లేకుండా నివారించ‌వ‌చ్చ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా క్లినిక‌ల్ ట్ర‌యిల్స్ జ‌రిగేలా చూడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందని చెప్పారు. ప్ర‌పంచ‌స్థాయి నైపుణ్యం పొందేలా రాష్ట్రాల్లోని డ్ర‌గ్ విభాగం అధికారుల‌కు సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గ‌నైజేష‌న్ (సీడీఎస్‌సీవో) తో శిక్ష‌ణ ఇప్పించాల‌ని కోరారు. మంత్రి విజ్ఞ‌ప్తుల‌పై డిప్యూటీ డ్ర‌గ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియా డాక్ట‌ర్ ఎ.రామ‌కృష్ణ‌న్ సానుకూలంగా స్పందించారు. హైద‌రాబాదులోని సీడీటీఎల్ ఇక‌పై ఏపీకి కూడా సేవ‌లు అందిస్తుంద‌ని చెప్పారు. రాష్ట్రంలోని అధికారుల‌తో పూర్తి స్థాయిలో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌నిచేస్తామ‌ని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో పాటు, రాష్ట్ర డ్ర‌గ్ విభాగం డైరెక్ట‌ర్ ప్రసాద్‌, ప‌లు ఫార్మా కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-31 15:14:00

కోర్టుకేసులు తొలగితేనే వారి సర్వీసు రెగ్యులర్

అనుకున్నట్టే జరిగింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల సర్వీసు ప్రొబేషన్ విషయంలో మరో బాంబు పేల్చింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కోర్టు కేసులు క్లియర్ అయిన శాఖల సిబ్బందికి మాత్రమే సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని, మిగిలిన శాఖల సిబ్బంది విషయంలో కోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి ఉండాలని ఆదేశాలు జారీచేసింది. దీనితో నియామకాల విషయంలో కోర్టు కేసులున్న సచివాలయ మహిళా పోలీసులు అంతా ఆందోళన చెందుతున్నారు. 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి సుమారు మూడు కేసులు వరకూ మహిళా పోలీసుల నియామకాలు చట్టవిరుద్దంగానూ, రాజ్యాంగ ఉల్లంగణ ద్వారా జరిగాయని కోర్టుల్లో పిల్స్ దాఖలు అయ్యాయి. దానికితోడు దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ ను ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 33నెలలు చేయిస్తోంది. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగుల్లోకి చేరిన రెగ్యులర్ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారిని రెగ్యులర్ చేసి వారికి పే స్కేలు వర్తింప చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా జరగకపోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 14350పైగా మహిళా పోలీసులు డైలమాలో పడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ ను 33 నెలలకు పెంచేసిన ప్రభుత్వం, ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వ నిబంధన అమలు చేసింది. దానితో చాలామంది మహిళా ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ మరో 6నెలలు పొడిగింపు వర్తింపచేశారు. ఇప్పటికే 9నెలలు అదనంగా పొడిగించిన సర్వీస్ ప్రొభేషన్ చేస్తున్న సచివాలయ ఉద్యోగులకు, ఇపుడు కోర్టుకేసులు శాపంగా పరిణమించాయి. ఎన్నో ఆశలతో విధుల్లోకి చేరిన ఉద్యోగులకు, ప్రభుత్వం ప్రొభేషన్ ను 9నెలలు పెంచేయడం వలన సుమారు లక్ష రూపాయల వరకూ పేస్కేలు మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి ఆరునెలలు అదనంగా పనిచేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇపుడు కోర్టు కేసుల విషయం తెరపైకి రావడంతో అది ఇంకా ఎన్నినెలలకి ఫైనల్ హియరింగ్ కి వస్తుందో తెలియని పరిస్థితి.

ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు కేసులు తేలేవరకూ సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం పేస్కేలు కూడా వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. రాజ్యాంగ విరుద్ధంగా సచివాలయ మహిళా పోలీసు నియామకాలు జరిగాయని దాఖలైన వాజ్యంలో అవతలి వ్యక్తి ఆధారాలు కోర్టుకి సమర్పించినా, వాటిని కోర్టు ఏకీబవించినా.. సచివాలయ మహిళా పోలీసు పోస్టులన్నీ రద్దు అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఒకవేళ కోర్టులో కేసులు తేలకపోయినా వీరి సర్వీసును రెగ్యులర్ చేయరు సరికదా.. ఎంతకాలమైనా ప్రభుత్వం నిర్ధేశించిన రూ.15వేలకే వారంతా ఉద్యోగాలు చేయాల్సి వుంటుంది. సాధారణంగా ఈ తరహా కోర్టుకేసులంటే రెండు మూడేళ్లు సమయం పడుతుంది. ఈ తరుణంలో తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి అదనంగా పనులు అప్పగించడం దగ్గర నుంచి 2వ శనివారం, ఆదివారాలు ఆఖరికి ప్రభుత్వ సాధారణ సెలవుల్లో సైతం దిశయాప్ లు, ప్రత్యేక కార్యక్రమాలు, సిటిజన్ ఔట్ రీచ్ అంటూ అదనపు విధులు చేయించిన ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్, ఇతర కోర్టు కేసుల విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చింది. తీరా ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేసే సమయానికి కోర్టుకేసులను తెరపైకి తీసుకువచ్చి.. కోర్టు కేసులు తేలేవరకూ వారి సర్వీసులు రెగ్యులైజేషన్ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో మహిళా పోలీసులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఈ తరుణంలోనే కోర్టు కేసులు బలపడితే వీరందరినీ..జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖల్లో ఖాళీగా పోస్టుల్లో భర్తీచేస్తారనే కొత్త ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. కోర్టుకేసులు, సర్వీసు ప్రొబేషన్ గడువు జూన్ నెలాఖరుతో ముగుస్తున్న వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..!

Tadepalli

2022-05-31 03:50:04