1 ENS Live Breaking News

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బుధ‌వారం మ‌ధ్యాహ్నం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మ‌హ‌ద్వారం వద్ద ఆలయ అర్చకులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి ఆల‌యంలోకి ఆహ్వానించారు.  స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలను గ‌వ‌ర్న‌ర్‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు  ర‌మేష్ బాబు,  హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2022-06-08 10:34:51

రూటు మార్చిన బెంగాల్ టైగర్..

ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత 19 రోజులుగా చిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతున్న రాయల్ బెంగాల్ టైగర్ ఇపుడు ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టు దిశగా రూటుమార్చినట్టుగా పులి నడిచిన ముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు ద్రువీకరిస్తున్నారు. పెద్దిపాలెం గ్రామ పరిసరాల్లో పొట్టి మెట్ట మీద పులి సంచరిస్తున్న ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా మంగళవారం సాయంత్రానికి పులిసంచరించిన ప్రదేశాలను పులి అడుగులు వేసిన ముద్రల ఆధారంగా దాని జాడ ఏలేరు రిజర్వాయర్ ప్రాంతానికి దారితీసినట్టుగా చెబుతున్నారు. అయితే గత రెండు వారాలకు పైనే అడవిలో సంచరించిన పులి ఇపుడు దాహార్తిని తీర్చుకోవడానికే ఏలేరు రిజర్వాయర్ ప్రాంతానికి దారిమళ్లి వుంటుంద అటవీ అధికారులు భావిస్తున్నారు.  పొదురపాక, పాండవుల పాలెం మధ్య ఉన్న పొట్టి మెట్ట ప్రాంతాలతోపాటు, గతంలో పులి సంచిచన ప్రదేశాలను కూడా అటవీశాఖకు చెందిన 120 మంది సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పులి అడుగులు అక్కడి రెండు మూడు ప్రాంతాల్లో కూడా కనిపించడంతో పులి తన రూటు ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాంతాల వరకూ దారితీసినట్టుగా భావిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో పులి జాడను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు అటవీశాఖ అధికారులు. లింగంపర్తి ఏరియాను దాటి శివారు ప్రాంతాల్లో సంచరించే అవకాశాలు ఆ దారిగుండా కనిపిస్తున్నాయని మాత్రం చెప్పుకొస్తున్నారు. బెంగాల్ టైర్ రోజుకో రూటులో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రాంతంలో దర్శనమిస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్తిపాడు నియోజవకర్గ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు.
 

ఏలేశ్వరం

2022-06-07 16:41:52

జూన్ 12నుంచి14 వరకు జ్యేష్టాభిషేకం

తిరుమల‌లో జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు అభిద్యేయక జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘అభిద్యేయక అభిషేకం’అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-06-07 12:45:58

14400తో ఇక అవినీతి పరుల ఆటకట్టు

ఏసీబి14400 యాప్ తో ఇక అవినీతి పరుల ఆటకట్టించవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 26 జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్సులో ఏసీబీ అనే యాప్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అన్నిచోట్లా అవినీతిని రూపుమాపేందుకే ఈ యాప్ ను ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకొని అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-06-01 15:39:33

ఆ పరీక్షలో మహిళా పోలీసులంతా పాస్

రాష్ట్రవ్యాప్తంగా 14849 మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో 366 మంది అభ్యర్ధినిలు మినహా 14483 మంది పాస్ అయినట్టు రాష్ట్ర డీజీపీ కార్యాలయం తెలియజేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మహిళా పోలీసులు ఈ పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులను 33నెలల తరువాత సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్న తరుణంలో కోర్టుకేసుల కారణంగా ఈ ప్రక్రియ ఒక్క మహిళా పోలీసుల విషయంలోనే నిలిచిపోయింది. ఈ తరుణంలోనే హోంశాఖ మహిళా పోలీసులు అప్పుడెప్పుడో రాసిన పరీక్షల ఫలితాలను ఇపుడు విడుదల చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Tadepalli

2022-06-01 14:42:31

ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాపోటీలు

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా, ఆయుష్ విభాగము రాష్ట్ర వ్యాప్తంగా యోగాసనాల పోటీలను నిర్వహిస్తుందని కమిషనర్ వి.రాములు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 21 జూన్ న జరిగే ఈ పోటీలకు  8 సంవత్సరాల పై బడి ఏ వయస్సు వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చుని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 1) పూర్ణ నటరాజాసన 2) దండియమన జాను సిరాసన 3) వటయానాసన 4) త్రివిక్రమాసన 5) విభక్త పశ్చిమోత్తానాసన 6) గర్భాసన 7) పద్మబకాసన 8) ఏకపాద విపరీత దండాసన 9) తీతిభాసన 10) వృశ్చికాసన 11) మయూరాసన 12) హనుమానాసన 13) పూర్ణ ఉష్ట్రాసన 14) పూర్ణ ఉష్టాసన పాదాంగుష్ట ధనురాసన 15) పూర్ణచక్రాసన 16) గండబేరుండాసనాలు వేయాలన్నారు.  పేర్కొన్న  16 ఆసనాలలో ఏవైన 8 ఆసనాలను వేయగలిగినవారు ఆయా ఆసనాలను వేసి ఆసన స్థితిలో వున్న ఫోటోల ను advyoga2022@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపాల్సి వుంటుందన్ని పేర్కొన్నారు.  ఫోటోతో పాటు తమ పేరు, వయస్సు, ఆధార్ నెంబర్, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ లను పంపవలసి వుంటుందని, ఫోటోలు పంపుటకు చివరి తేది. 06గా నిర్ణయించినట్టు తెలియజేశారు. ఆరోజు సాయంత్రం 05గంటలలోపుగా వాటిని పంపాలని తెలియజేశారు. ఈ ఫోటోలను ప్రాధమికంగా పరిశీలించిన అనంతరం ఎంపిక ఐన వారు 10 జూన్ 2022 న న్యాయ నిర్ణేతల సమక్షంలో ఇవే ఆసనాలను ఆన్ లైన్ లో ప్రదర్శించవలసి వుంటుందని, ఇందులో ఎంపిక కాబడిన వారికి 21 జూన్ 2022న విజయవాడలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వటంతో, పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిధుల ద్వారా బహుమతులు అందజేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు 9441014521లో  సంప్రదించాలన్నారు.

Tadepalli

2022-06-01 02:20:05

సీఎం వైయస్.జగన్ కు ఘనస్వాగతం

దావోస్ విదేశీ పర్యటన ముగించుకొని  తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ కు సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్,  ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ అందరినీ ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి బయలు దేరి వెళ్లారు.

Gannavaram

2022-05-31 15:28:43

సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర సక్సెస్

రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ,బి.సి, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్దికి పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 26 నుండి ఐదు రోజుల పాటు  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర విజయవంతం అయ్యిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారని, తంతోపతండాలుగా ప్రజలు ఆ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు.   సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఈ నెల 26 న  శ్రీకాకుళంలో ప్రారంభం అయి 29 న అనంతపురంలో ముగిసిందన్నారు. వర్షం కారణంగా  26 న తేదీన విజయనగరంలో బహిరంగ సభ నిర్వహిణకు కొంత సమస్య ఏర్పడినప్పటికీ, 27 న రాజమండ్రిలో, 28 న నర్సరావుపేట మరియు 29 న అనంతపురంలో బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.  ఈ బస్సు యాత్రలో మరియు బహిరంగ సభల్లో 17 మంది ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ బస్సుయాత్రలో మరియు బహిరంగ సభల్లో పాల్గొనపోయినప్పటికీ ఆయన  బొమ్మ చూపి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారన్నారు.  రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగ్గ విధంగా ప్రజారంకమైన పాలన రాష్ట్రంలో జరుగుచున్నదని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలనతో ప్రజల్లో అచంచల విశ్వాసం ఏర్పడటం వల్లే తమ బస్సుయాత్ర సఫలీకృతం అయిందన్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సరళి ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు బంగారు బాట వేసే విధంగాను మరియు సామాజిక విప్లకారుల ఆలోచలకు అద్దం పట్టేలా ఉందని ఆయన కొనియాడారు.

Tadepalli

2022-05-31 15:21:49

ఏపీకీ సీడీటీఎల్ సేవ‌లు అందాలి

హైద‌రాబాదులోని సీడీటీఎల్ (సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ లేబొరేట‌రీ) సేవ‌ల‌ను ఏపీకి కూడా అందించాల‌ని ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని డిప్యూటీ డ్ర‌గ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియా డాక్ట‌ర్ ఎ.రామ‌కృష్ణ‌న్ ను కోరారు. మంగ‌ళగిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లో ఉన్న త‌న చాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఏపీ, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన డ్ర‌గ్ కంట్రోల్ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని డ్ర‌గ్ విభాగ సిబ్బందికి కేంద్ర డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు పూర్తిస్థాయిలో స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కోరారు. స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు సాధించవ‌చ్చ‌ని చెప్పారు. హైద‌రాబాదులోని సీడీటీఎల్ సేవ‌ల‌ను ఏపీకి పూర్తి స్థాయిలో అందించాల‌ని కోరారు. బ్ల‌డ్ బ్యాంకుల్లో సుర‌క్షిత ర‌క్తం అందేలా చొర‌వ‌చూపాల‌ని, హెచ్ఐవీ రోగుల‌కు చెందిన ర‌క్తం ఊసే ఎక్క‌డా లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. క్లినిక‌ల్ ట్రైల్స్ స‌మ‌యంలో డీసీజీఐ అధికారులు స్థానికంగా ఉండే రాష్ట్ర స్థాయి అధికారుల‌కు కూడా స‌మాచారం అందించాల‌ని చెప్పారు. 

దీనివ‌ల్ల క్లినికల్ ట్ర‌యిల్స్ విష‌యంలో లోపాలు లేకుండా నివారించ‌వ‌చ్చ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా క్లినిక‌ల్ ట్ర‌యిల్స్ జ‌రిగేలా చూడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందని చెప్పారు. ప్ర‌పంచ‌స్థాయి నైపుణ్యం పొందేలా రాష్ట్రాల్లోని డ్ర‌గ్ విభాగం అధికారుల‌కు సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గ‌నైజేష‌న్ (సీడీఎస్‌సీవో) తో శిక్ష‌ణ ఇప్పించాల‌ని కోరారు. మంత్రి విజ్ఞ‌ప్తుల‌పై డిప్యూటీ డ్ర‌గ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియా డాక్ట‌ర్ ఎ.రామ‌కృష్ణ‌న్ సానుకూలంగా స్పందించారు. హైద‌రాబాదులోని సీడీటీఎల్ ఇక‌పై ఏపీకి కూడా సేవ‌లు అందిస్తుంద‌ని చెప్పారు. రాష్ట్రంలోని అధికారుల‌తో పూర్తి స్థాయిలో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌నిచేస్తామ‌ని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో పాటు, రాష్ట్ర డ్ర‌గ్ విభాగం డైరెక్ట‌ర్ ప్రసాద్‌, ప‌లు ఫార్మా కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-31 15:14:00

కోర్టుకేసులు తొలగితేనే వారి సర్వీసు రెగ్యులర్

అనుకున్నట్టే జరిగింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల సర్వీసు ప్రొబేషన్ విషయంలో మరో బాంబు పేల్చింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కోర్టు కేసులు క్లియర్ అయిన శాఖల సిబ్బందికి మాత్రమే సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని, మిగిలిన శాఖల సిబ్బంది విషయంలో కోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి ఉండాలని ఆదేశాలు జారీచేసింది. దీనితో నియామకాల విషయంలో కోర్టు కేసులున్న సచివాలయ మహిళా పోలీసులు అంతా ఆందోళన చెందుతున్నారు. 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి సుమారు మూడు కేసులు వరకూ మహిళా పోలీసుల నియామకాలు చట్టవిరుద్దంగానూ, రాజ్యాంగ ఉల్లంగణ ద్వారా జరిగాయని కోర్టుల్లో పిల్స్ దాఖలు అయ్యాయి. దానికితోడు దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ ను ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 33నెలలు చేయిస్తోంది. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగుల్లోకి చేరిన రెగ్యులర్ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారిని రెగ్యులర్ చేసి వారికి పే స్కేలు వర్తింప చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా జరగకపోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 14350పైగా మహిళా పోలీసులు డైలమాలో పడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ ను 33 నెలలకు పెంచేసిన ప్రభుత్వం, ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వ నిబంధన అమలు చేసింది. దానితో చాలామంది మహిళా ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ మరో 6నెలలు పొడిగింపు వర్తింపచేశారు. ఇప్పటికే 9నెలలు అదనంగా పొడిగించిన సర్వీస్ ప్రొభేషన్ చేస్తున్న సచివాలయ ఉద్యోగులకు, ఇపుడు కోర్టుకేసులు శాపంగా పరిణమించాయి. ఎన్నో ఆశలతో విధుల్లోకి చేరిన ఉద్యోగులకు, ప్రభుత్వం ప్రొభేషన్ ను 9నెలలు పెంచేయడం వలన సుమారు లక్ష రూపాయల వరకూ పేస్కేలు మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి ఆరునెలలు అదనంగా పనిచేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇపుడు కోర్టు కేసుల విషయం తెరపైకి రావడంతో అది ఇంకా ఎన్నినెలలకి ఫైనల్ హియరింగ్ కి వస్తుందో తెలియని పరిస్థితి.

ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు కేసులు తేలేవరకూ సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం పేస్కేలు కూడా వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. రాజ్యాంగ విరుద్ధంగా సచివాలయ మహిళా పోలీసు నియామకాలు జరిగాయని దాఖలైన వాజ్యంలో అవతలి వ్యక్తి ఆధారాలు కోర్టుకి సమర్పించినా, వాటిని కోర్టు ఏకీబవించినా.. సచివాలయ మహిళా పోలీసు పోస్టులన్నీ రద్దు అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఒకవేళ కోర్టులో కేసులు తేలకపోయినా వీరి సర్వీసును రెగ్యులర్ చేయరు సరికదా.. ఎంతకాలమైనా ప్రభుత్వం నిర్ధేశించిన రూ.15వేలకే వారంతా ఉద్యోగాలు చేయాల్సి వుంటుంది. సాధారణంగా ఈ తరహా కోర్టుకేసులంటే రెండు మూడేళ్లు సమయం పడుతుంది. ఈ తరుణంలో తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి అదనంగా పనులు అప్పగించడం దగ్గర నుంచి 2వ శనివారం, ఆదివారాలు ఆఖరికి ప్రభుత్వ సాధారణ సెలవుల్లో సైతం దిశయాప్ లు, ప్రత్యేక కార్యక్రమాలు, సిటిజన్ ఔట్ రీచ్ అంటూ అదనపు విధులు చేయించిన ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్, ఇతర కోర్టు కేసుల విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చింది. తీరా ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేసే సమయానికి కోర్టుకేసులను తెరపైకి తీసుకువచ్చి.. కోర్టు కేసులు తేలేవరకూ వారి సర్వీసులు రెగ్యులైజేషన్ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో మహిళా పోలీసులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఈ తరుణంలోనే కోర్టు కేసులు బలపడితే వీరందరినీ..జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖల్లో ఖాళీగా పోస్టుల్లో భర్తీచేస్తారనే కొత్త ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. కోర్టుకేసులు, సర్వీసు ప్రొబేషన్ గడువు జూన్ నెలాఖరుతో ముగుస్తున్న వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..!

Tadepalli

2022-05-31 03:50:04

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం..

EnsLive Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. EnsLive Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole salers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు :9390280270లో సంప్రదించండి.

Tadepalli

2022-05-30 17:56:22

YSRCP నుంచి అనంతబాబు సస్పెన్షన్

ఎట్టకేలకు వైఎస్సార్సీపీ అధిష్టానం ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకుంది. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టైన ఎమ్మెల్సీని పార్టీ నుంచి  స‌స్పెండ్ చేసింది. ఈ మేర‌కు  బుధ‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  ఆంధ్రప్రదేశ్ లో క‌ల‌క‌లం రేపిన  డ్రైవర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టైన అనంత‌బాబు ప్ర‌స్తుతం జ్యుడిషియ‌ల్ రిమాండ్‌లో  ఉన్నారు.  డ్రైవర్ ను తానే హత్య చేశానని తన తప్పుని ఒప్పుకోవడంతో వెంటనే శిక్షపడింది. వాస్తవానికి హత్యకేసులో అరెస్టు అయిన వెంటనే పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా..చాలా వరకూ తాత్సారం చేసింది. అయితే ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు, మీడియా పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లడంతో చేసేదేమీ లేక ఆఖరికి ఈ రోజు ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కేవలం పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది ఎమ్మెల్సీ పదవి విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి నేర చరిత్ర ఉన్నవారి విషయంలో పార్టీ అధిష్టానం గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం తో పార్టీతోపాటు, పదవి నుంచి కూడా తప్పిస్తుంది. కానీ వైఎస్సార్సీపీ కేవలంల పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ విషయంలో కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Tadepalli

2022-05-25 13:56:51

రైతుబజార్లలో కూరగాయలు సమ్రుద్దిగా ఉండాలి

రాష్ట్రంలో వివిధ రైతు బజారుల్లో ప్రజలకు అవసరమైన వివిధ నిత్యావసర సరుకులు, కూరగాయలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో నిత్యావసర సరకుల ధరల స్థితిగతులపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రతిరోజూ నిత్యావసర సరకుల ధరలను మానిటర్ చేయాలని ధరల పెరుగుదల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.నిత్యావసర వస్తువుల ధరల మానిటర్ చేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తేనున్నట్టు సిఎస్ పేర్కొంటూ దానిని అర్ధగణాంక విభాగం(డైరెక్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్) అధికారులు రూపొందిస్తున్నట్టు సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.ఈయాప్ ను మార్కెటింగ్ శాఖ,పౌరసరఫరాల శాఖలు,తూనికలు కొలతలు శాఖ,విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగాలు వినియోగించుకుని నిరంతరం ధరలను పర్యేవేక్షించాల్సి ఉంటుందని సిఎస్ డా.సమీర్ శర్మ చెప్పారు.

        రైతు బజారుల్లో వివిధ కూరగాయలను కూడా పూర్తిగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ రైతు బజారుల సిఇఓ మరియు మార్కెటింగ్ శాఖల అధికారులను సిఎస్ సమీర్ శర్మ ఆదేశించారు.ముఖ్యంగా ప్రస్తుతం టమాటా ధరలు అధికంగా ఉన్నందున మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతుల నుండి నేరుగా టమాటాలను కొనుగోలు చేసి రైతు బజారుల్లో నిర్దేశిత ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

        ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇఓ కార్యదర్శి మరియు కమీషనర్ గిరిజా శంకర్,మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న,విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్,ఆయిల్ ఫెడ్   తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.అలాగే వీడియో లింక్ ద్వారా రాష్ట్ర సహకార మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మదుసూదన రెడ్డి,విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్ బాగ్చి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-25 13:15:51

ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో హెల్త్ సాఫ్ట్ వేర్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకూ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ విధానాన్ని తీసుకు రావాలని యోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వ వైద్య విధానాల్లో సమూల మార్పులు తీసుకు రావచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. వాస్తవానికి ఈ విధానం డా.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రావాల్సి వుంది. దివంతగత వైఎస్సార్ అనంతరం అది మరుగున పడిపోయింది.  తాజాగా మళ్లీ ఈ విషయం ఇపుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం  తెరపైకి తీసుకు వచ్చినట్టు తెలిసింది. ఈ సాఫ్ట్ వేర్ పనిచేసే విధానం తెలిస్తే ప్రతీఒక్కరూ ఆశ్చర్యపోతారు. అదే సమయంలోప్రభుత్వానికి మందులు, ఇతరత్రా సౌకర్యాల విషయంలో కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఆ సాఫ్ట్ వేర్ ఏవిధంగా పనిచేస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. ఒక రోగి ఆసుపత్రికి రాగానే ఆరోగి యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబరుతో ఒక డేటాబేస్ ను తయారు చేస్తారు. తరువాత ఆయనకి ఏ విధమైన వైద్యం అందించారో కూడా వివరాలు ఆ డేటా బేస్ ఫైల్ లోనే పొందుపరుస్తారు. మందులు, క్లినికల్ టెస్టులు ఇలా మొత్తం సమాచారం ఆ ఫైల్ లో ఉంటాయి. ఇలా ప్రతీ నెలా ఎంతమంది  రోగులు వస్తున్నారు..రాష్ట్రం మొత్తం మీద ఏ తరహా రోగాలు అధికంగా నమోదు అవుతున్నాయి.. వాటికి కావాల్సిన మందులు ఏమిటి, ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఏ తరహా రోగాలకు మందులున్నాయి.. అనే విషయాలన్నీ రాజధానిలోని సెంట్రల్ డేటా బేస్ సిస్టమ్ లో నమోదు అవుతాయి. తద్వారా రాష్ట్రంలోని ఏఏ ప్రాంతాల్లో ఏఏ రోగాలు అధికంగా నమోదుఅవుతున్నాయో తెలుసుకోవడానికి వీలుపడుతుంది. అంతేకాకుండా సదరు పీహెచ్సీకి జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోరేజి నుంచి మందులు సరఫరా చేయడం ద్వారా అనసర మందుల వినియోగం,  కొనుగోలు కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా రోగులకు ఏ తరహామందులు అందుబాటులో లేవో కూడా సదరు డేటాబేస్ ఫైలులోనే ఇండెంట్ పెట్టడానికి ఆస్కారం వుంటుంది. పైగా రోగికి పూర్తిస్థాయిలో వైద్యం అందడంతోపాటు, అత్యవసర సమయంలో రోగిని జిల్లా ఆసుపత్రికి సర్జరీ కోసం తరలించాల్సి వస్తే.. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోగికి ముందుగా ఏ ఏ రకాల మందులు ఇచ్చారు.. ఆపరేషన్ సమయంలో ఇంకేరకాల మందులు ఇవ్వాలనే విషయం జిల్లా ఆసుపత్రుల్లోని వైద్యులకు కూడా ఈ-కేషీట్ ద్వారా తెలుస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యం అందించడానికి అందుబాటులో ఉన్న చాలా రకాల మందులను కొనుగోలు చేస్తున్నది. వాటిలో కొన్ని మాత్రమే ఉపయోగ పడి మిగిలిన మందులన్నీ కాలం చెల్లిపోవడంతో వాటిని మొక్కలకు ఎరువుగా కానీ.. ఎక్కడో చెత్తకుప్పలోగానీ వేసేస్తున్నారు. ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ ను వినియోగించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆసుపత్రుల్లో ఎంత మంది రోజులకు వైద్య సేవలు అందాయి.. ఎంతమందికి ఆపరేషన్లు ఏఏ అవయవాలకు చేశారు.. ఎన్ని మందులు వినియోగించారు.. దానికి అయిన ఖర్చు ఎంత ఇలా మొత్తం సమాచారం ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు నమోదు అయిపోతాయి. అంతేకాకుండా ఈ విధానం అందుబాటులోకి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసీ విభాగం కూడా ప్రైవేటు ఆసుపత్రులు, మందుల షాపులను తలదన్నేవిధంగా తయారవుతుంది. పైగా ఏ రోగి ఎన్ని రకాల మందులు వాడారు, మోతాదుకి మించి వాడారా.. అలా వాడితే వచ్చే దుష్ప్రభావలు ఏంటి అనే విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆస్కారం వుంటుంది.

ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ఎపడమిక్ సీజన్ లో వివిధ రకాల రోగాలు గిరిజనులను పట్టి పీడిస్తుంటాయి. ఆ సమయంలో వారికి ఏ తరహా మందులు కావాలి, ఏఏ రకాల క్లినికల్ పరీక్షలు చేయాలనే విషయమై కూడా ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది. తద్వారా జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ అధికారులు కేవలం ఆయా ఎపడమిక్ సీజన్ లో కావాల్సిన మందులను మాత్రమే అందుబాటులో ముందుస్తుగా ఏర్పాటుచేసుకోవడానికి వీలుపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమిస్తోంది. ఇపుడు ఆ హెల్త్ సాఫ్ట్ వేర్ కూడా అందుబాటులోకి వస్తే మరిన్ని ఫలితాలు నమోదు చేయవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా వుంది. అయితే ప్రస్తుతం ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ అంశం ప్రాధమిక దశలోనే ఉంది. కాగా ప్రస్తుతం అన్ని కార్పోరేట్ ప్రైవేటు ఆసుపత్రులు ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ ను వినియోగించి అనేక ప్రయోజనాలు పొందడంతోపాటు, అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నాయి. చూడాలి రాష్ట్రప్రభుత్వం ఆలోచన చేస్తున్న ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ ఎప్పటిలోగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఏరియా ఆసుపత్రలు, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తుందో..!

Tadepalli

2022-05-25 02:32:32