1 ENS Live Breaking News

25 నుంచి తిరుమలలో హ‌నుమ‌జ్జ‌యంతి

తిరుమ‌ల‌లో మే 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. మే 25న తిరుమ‌ల‌లోని శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్ర‌హానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. నాద‌నీరాజ‌నం వేదిక‌, ఆకాశ‌గంగ‌, జ‌పాలి ప్రాంతాల్లో ధార్మికోప‌న్యాసాలు, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. మే 29న ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వలకు సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది.  శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి బుధ‌వారం ఉద‌యం అభిషేకం, అర్చన, నివేదనలు నిర్వహిస్తారు. అదేవిధంగా, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద గ‌ల  శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి నిలువెత్తు విగ్రహానికి  మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు టిటిడి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల నుండి ఏడో మైలు వ‌ర‌కు ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఉచిత ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించింది.

నాద‌నీరాజ‌నం వేదికపై ...
  నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వ‌ర‌కు ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఇక్క‌డ మే 25న "అంజ‌నానంద‌నం వీరం" అనే అంశంపై ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, మే 26న "సుంద‌రే సుంద‌రః క‌పిః" అనే అంశంపై డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, మే 27న "వీరో హ‌నుమాన్ క‌పిః" అనే అంశంపై డా. ఎం.ప‌వ‌న‌కుమార్ శ‌ర్మ‌, మే 28న "జ్ఞానినామగ్ర‌గ‌ణ్యం" అనే అంశంపై ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, మే 29న "రామ‌వైభ‌వ స్ఫూర్తి" అనే అంశంపై డా. ఎం.జి.నంద‌న‌రావు ఉప‌న్య‌సిస్తారు.

ఆకాశ‌గంగ వ‌ద్ద ...
ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉదయం 10 నుండి 11 గంటల వ‌ర‌కు  ప్ర‌ముఖ పండితులు శ్రీ హ‌నుమ అవ‌తార ఘ‌ట్ట ప్ర‌వ‌చ‌నాలు చేస్తారు. ఉద‌యం 11 గంట‌ల నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌రకు అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో భ‌క్తిసంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

జ‌పాలిలో...
జ‌పాలి శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉదయం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు, తిరిగి మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌రకు అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో భ‌క్తిసంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

Tirumala

2022-05-24 12:25:01

మే26న వ‌యోవృద్ధుల కోటా టోకెన్లు విడుదల

తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారి కోసం జులై నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టోకెన్ల కోటాను మే 25వ‌ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. కాగా, ఈ విధంగా బుక్ చేసుకున్న వారిని ప్ర‌స్తుతం ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల స్లాట్‌లో ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుండి ఉద‌యం 10 గంట‌లకు బ‌దులుగా మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో అనుమ‌తిస్తారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని టిటిడి కోరుతుంది. ఆగస్టు నెల‌కు సంబంధించిన గ‌దుల కోటా మే 26వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ఈ అవకాశాన్ని వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని టిటిడి మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరుతోంది.

Tirumala

2022-05-24 10:51:13

ఈఎన్ఎస్ లైవ్ వార్తకు స్పందన.. వారి ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైల్స్ కి కదలిక..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కి సంబంధించి మూడు రోజుల్లోగా ఉద్యోగుల డిక్లరేషన్ ఫైల్స్ స్వీకరించాలని  రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వాస్తవానికి గత అక్టోబర్ 2నాటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది. అనూహ్య పరిణామాల మధ్య వారి సర్వీసు ప్రొబేషన్ గడువుని 9నెలలు పెంచింది. 8నెలలు పూర్తవుతున్న తరుణంలో ‘వారి సర్వీస్ రెగ్యులైజేషన్ పై క్లారిటీ ఏది..?’ శీర్షికన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్,  వెబ్ సైట్  Ens Live మరియు www.enslive.net ద్వారా ఏకకాలంలో సచివాలయ ఉద్యోగుల ఇబ్బందులు, బాధలను ప్రత్యేక కధనంగా ప్రచురించింది. దీనితో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మేనెలాఖరు నాటికల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రెగ్యులైజేషన్  ఫైళ్లను ఆయా శాఖలకు పంపాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఆదేశించింది. దీనితో రాష్ట్రంలోని 15005 సచివాలయాల్లోని సుమారు లక్షా 28వేల మంది ఉద్యోగులకు చెందిన ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైళ్లకు కదలిక వచ్చింది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ గడువుని అమాంతంగా పెంచేసినా.. ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకున్న వారి విషయంలో మాత్రం నిభందనలు ఖచ్చితంగా అమలు చేసింది. పెంచేసిన గడువుతోపాటు, మహిళా ఉద్యోగులు తీసుకున్న ఆరు నెలల ప్రసూతి సెలవుల గడువు పూర్తయిన తరువాత మాత్రమే ఉద్యోగులకు చెందిన సర్వీస్ ప్రొబేషన్ ఫైళ్లను అధికారులు జాల్లా శాఖలకు చేరవేస్తున్నారు. దీనితో రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు వారు చేస్తున్న సచివాలయ ఉద్యోగాలను వదిలిపెట్టి పోయారు. అంతేకాకుండా విశాఖజిల్లాల్లో ఒక సచివాలయ ఉద్యోగి సర్వీసు రెగ్యులర్ కాకపోవడం, పని భారం అధికంగా ఉండటంతో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మేనెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రెగ్యులైజేషన్ ఫైళ్లు డిఎస్సీ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కు చేరితే అక్కడి నుంచి ఫైనాన్స్ శాఖకు వెళ్లి ఆపై ఏజీ నుంచి ఖజానాశాఖకు వీరి ఫైల్స్ చేరుకుంటాయి. ఈ తంతు అంతా జరగడానికి సుమారు నెలరోజులు సమయం పడుతుంది.  దీనితో అన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ కి సంబంధించిన ఫైళ్లను పంపాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వున్న 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఆయా జిల్లాశాఖలను ఆదేశించడంతో గత 2 రోజులుగా ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైళ్లకు మోక్షం వచ్చంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూలై నెల నుంచి సర్వీస్ ప్రొబేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయి, వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేస్కేలు అందుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టుగా పీఆర్సీతో కూడిన పేస్కేలు ఇస్తుందా...లేదంటే హెచ్ఆర్ ఏలో కోతలు వేసిన పేస్కేలు ఇస్తుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి వుంది. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఉద్యోగుల విషయంలోగానీ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల విషయంలోగానీ వాటిని ప్రజలకు తెలియజేసేందుకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్, వెబ్ సైట్  Ens Live మరియు www.enslive.net ద్వారా ఏకకాలంలో ప్రత్యేక కధనాలు ప్రచురిస్తూ వచ్చింది. అదే క్రమంలో ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో కూడా  ప్రత్యేకంగా కథనం ప్రచురించడంతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చి తమ సర్వీసు ప్రొబేషన్ ఫైళ్లకు మోక్షం కలిగిందంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విశాఖపట్నంలోని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ప్రధాన కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అయితే ఇపుడే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, వారి సమస్యలు, అక్కడక్కడా తేడా ఉద్యోగులు చేసే తప్పుడు పనులపైనా కూడా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ తన గళం బలంగా వినిపిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టే అన్ని జనరంజక కార్యక్రమాలను కూడా ప్రజల ముందుకు ప్రత్యేక వార్తా కధనాలుగా తీసుకు వస్తామని కూడా ప్రకటిస్తున్నాం. జనం గళంగా ప్రారంభమైన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎప్పుడూ జనం వెంట..జనం కోసం మాత్రమే పనిచేస్తుందని, ఈ విషయంలో ఏ రాజకీయపార్టీకి, నాయకులకు కొమ్ముకాసేది లేదని.. బల్లగుద్ది చెబుతున్నాం. తెలుగు ప్రజల గుండె చప్పుడు ఈఎన్ఎస్ లైవ్..  అరచేతిలో విశ్వవార్తల సమాహారం..!

Tadepalli

2022-05-24 03:18:09

3ఏళ్ల YSRCP ప్రభత్వ పాలనలో ప్లస్, మైనస్

ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు అంటే మే 23 వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజల ముందుకి వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఒకటి కాదు రెండు  ఏకంగా 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని టీడీపీని చావుదెబ్బకొట్టి మరీ గెలిచింది వైఎస్సార్సీపీ. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాలో పార్టీ టిడిపిని మట్టికరిపించింది క్లీన్ స్వీప్ చేసేసింది. దీనితో ఎంతో చరిత్ర ఉన్న టీడీపీ 23 సీట్లకే పరిమితం అయిపోయింది. అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనంతోనే ఉంటున్నాం అన్నట్టుగా సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి ముందుకే తెచ్చింది. ఎక్కడైనా, ఏ వ్యవస్థలో అయినా నూటికి నూరు శాతం ఎవరూ బాగా చేయలేరు. ఇక్కడ కూడా అదే జరిగింది. స్వతహాగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహరెడ్డి ఆలోచనో.. లేదంటే సలహాదారులు, ప్రభుత్వంలోని ముఖ్య అధికారుల దారిమళ్లింపో తెలీదు కానీ, కొన్ని కొన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆ దిశలో ఒక వర్గానికి పూర్తిగా విలన్ గా మారిపోయింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అయితే మెజార్టీ వర్గానికి మాత్రం మేలు జరిగిందనే వాదన మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎక్కడా చెక్కు చెదరలేదు.  ఈ క్రమంలోనే మరికొంతమందికి తీవ్ర అన్యాయం కూడా జరిగింది. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతోపాటు, పథకాలు కూడా ప్రజాకర్షణకు నోచులేకపోయాయి. ఈ దిశలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల నాడిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ens live mobile news app, www.enslive.net ద్వారా 26 జిల్లాల్లో గ్రౌండ్ లెవల్ సర్వేని చేపట్టింది. ఇందులో ఆశక్తికర విషయాలు వెలుగు చూశాయి. సాధారణ ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, పథకాలు పొందిన లబ్దిదారులు చెప్పిన విధంగా ప్లస్, మైనస్ లు వారీగా  ఏ విధమైన స్పందన తెలియజేశారో  ఇక్కడ వారి మాటలనే వార్తగా  తెలియజేస్తున్నాం. 


ప్లస్ లు ఈ విధంగా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీగా వైఎస్సార్సీపీకి గుర్తింపు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఒక నూతన విధానం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, లక్షా 28వేల ఉద్యోగాల కల్పన, నవరత్నాలతో పేదల వద్దకే సంక్షేమ పథకాల తరలింపు, నాడు-నేడు తో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్పు, దళారీలు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే జమ, ప్రతీ పేదవాడికి ఇల్లు మంజూరు, సమర్ధవంతంగా కరోనా వైరస్ ను టీకాతో ఎదుర్కోవడం, ప్రజలకు అందుబాటులో మందులు ఏర్పాటు చేయడం, ఆసుపత్రుల అభివ్రుద్ధి, కొత్త పీహెచ్సీల నిర్మాణం, 104 వాహనాలతో ప్రజల ముందుకే వైద్యసేవలు, పశువులకు వైద్యం అందించడానికి సంచార పశువైద్యశాలలు, గ్రామాల్లో యూ పీహెచ్సీల ఏర్పాటు, నూతన విద్యావిధానంతో కేజీ నుంచి ఇంటర్ వరకూ సీబీఎస్ఈ సిలబస్ విద్య, మహిళలకు ఆర్ధిక స్వావలంబన, డ్వాక్రా రుణాల మాఫీ, అన్ని ప్రాంతాల అభివ్రుద్ధి కోసం నూతన జిల్లాల ఏర్పాటు, యువతకు ప్రత్యేక ఉపాది శిక్షణా కార్యక్రమాలు, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే అత్యధిక సంక్షేమ పథకాలు నిరుపేదలకు నగదు రూపంలో ఆర్ధికంగా అందించడం. వాహన మిత్ర, రైతు భరోసా, మత్స్యరా భరోసా, ఫాస్టర్లు ఆర్దిక తోడ్పాటు, న్యాయవాధులకు ఆర్ధిక తోడ్పాటు, 45ఏళ్లు నిండిన వారికి ప్రతీ ఏటా ఆర్దిక సహాయం, వ్రుత్తిదారులకు ఆర్ధిక సహాయం, పావలా వడ్డీ రుణాలు, ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రైతులకు, పాడి రైతులకు సేవలు, ప్రభత్వ ఆధ్వర్యంలోనే ధాన్యం కొనుగోళ్లు ఆన్ లైన్ లోనే నేరుగా రైతులకు పేమెంట్లు, ఎరువుల నుంచి పురుగు మందుల వరకూ అన్నీ ఆర్బీకేల్లోనే ఏర్పాటు, అత్యవసర వైద్యసేవల కోసం 108లు, ఆసుపత్రుల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా పారామెడికల్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీచేయడం, గ్రామసచివాలయ ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్సు శిక్షణ ఇప్పించడం, చాలా ప్రభుత్వ శాఖల్లో అధికారుల హోదాలు మార్పు చేయడం, కమర్షియల్ టాక్స్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించడం, ప్రైవేటు పాఠశాలలను తలదన్నేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యతోపాటు, లాంగ్వేజి ఇంప్రూవ్ మెంట్ కార్యక్రమం అమలు చేసి, విద్యార్ధులకు పాఠశాల స్ధాయి నుంచే ఆంగ్లంలో పట్టు వచ్చేలా చేయడం, అన్ని సామాజిక వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడం.. ఇలా ప్రభుత్వంలోని ప్లస్ లు చెప్పుకొచ్చారు.


ఇక మైనస్ లు ఈ విధంగా ఉన్నాయి..
ఎంతో సాఫీగా సాగే రేషన్ సరుకుల ప్రక్రియను విచ్చిన్నం చేసి, ఇంటింటికీ రేషన్ సరుకులు అని అట్టర్ ఫ్లాప్ పధకం పెట్టి వాహనాల ద్వారా .. అన్ని రేషన్ సరుకులు కుదించేసి ఒక్క బియ్యం మాత్రమే పంపణీచేయడం,  ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక విధానాలకే పెద్దపీట వేయడం, ప్రభుత్వ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ అమలు చేయడం, హెచ్ఆర్ఏలో కోత విధించడం, పించను దారులకు క్వాంటమ్ పించను తగ్గించయడం, రద్దు చేస్తామన్న సీపీఎస్ స్థానంతో రివర్స్ లో జిపిఎస్ విధానం తెరపైకి తేవడం, ప్రతీఏటా జాబ్ కేలండర్ ప్రకటించి ఉద్యోగాలు తీస్తామని చెప్పి కేవలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఒక్కటే తీసి చేతులు దులుపుకోవడం, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగుల రెండేళ్ల సర్వీస్ ప్రొబేషన్ 33 నెలలకు పెంచడం, ప్రతిపక్షంలో ఉండగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగ విధానాన్ని రద్దుచేయాలని పోరాటం చేసి, తీరా అధికారంలోకి వచ్చిన తరువాతన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ, ఇతర గ్రూప్-1, 2, ఉద్యోగాలు భర్తీచేయకపోవడం, కొత్త జిల్లాల్లో ఉద్యోగులు, అధికారుల ప్యాట్రన్ విధానం పూర్తిగా మార్చేసి, ఉద్యోగాల్లో కోత విధించడం, దేశంలో ఎక్కడా లేనివిధంగా మీడియాను, ప్రెస్ ను, జర్నలిస్టులను పూర్తిగా అణగదొక్కి జర్నలిస్టు గుర్తింపు కార్డు అక్రిడిటేషన్ మంజూరుకి కొత్త రకాల విధి విధానాలు తీసుకు వచ్చి పూర్తిగా నియంత్రణ చేయడం, ప్రభుత్వంలోని తప్పులను చూపే మీడియాపై కేసులు పెట్టి భయపెట్టడం, అధికార పార్టీ సొంత మీడియాకే ప్రభుత్వ ప్రకటనలు మంజూరు చేసి, చిన్న పత్రికలను పూర్తిగా పక్కనపెట్టేయడం, ప్రభుత్వ శాఖల అభివ్రుద్ధి, సంక్షేమ పథకాల సమాచారం అందించే సమాచారశాఖపూర్తిగా నిర్వీర్యం చేయడం, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోవడం, అలాగనిఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయపోవడం, సచివాలయ ఉద్యోగాలు భర్తీచేసే సమయంలో అయినా కాంట్రాక్టు విధానంలో పనిచేసేవారికి వెయిటేజీ ఇవ్వకపోవడం, యూనివర్శిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీచేయకపోవడం, కొత్త యూనివర్శిటీలు ప్రకటన తప్పా వాటని ఏర్పాటు చేయకపోవడం, ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతులు మంజూరు చేసి ప్రభుత్వ యూనివర్శిటీల మనుగడకు ముప్పుతేవడం, ఉద్యోగాల భర్తీచేపట్టకపోయినా.. నియామక వయస్సును పెంచకపోవడం, కొత్త ఉద్యోగాలు తీయడానికి వీలు లేకుండా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే రెండేళ్లు సమయం పెంచేయడం, విద్యావిధానంలో మార్పులు తీసుకు వస్తామన్న ప్రభుత్వం ఖాళీగా ఉన్న లాంగ్వేజి , వ్యాయామ, ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులను భర్తీచేయకపోవడం, నేర చరిత్ర ఉన్నవారికే రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న, చేపడుతున్న మైనస్ లు వివరించారు.

మొత్తం మీద వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరధం పట్టిన తరువాత. సంక్షేమ పథకాలు, అభివ్రుద్ధి నిరుపేదలకు, మహిళలకు ఆర్ధికంగా నగదు పంపిణీ, కోవిడ్ నియంత్రణ అదీ కూడా కేంద్రం సహకారంతో తప్పితే, అభివ్రుద్ధి ఎక్కడా జరగలేదని 90శాతం మంది కుండ బద్దలు కొట్టారు. అయితే ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలన్నీ నగదు రూపంలో నేరుగా తమ ఖాతాలకే పంపి ఆర్ధికంగా ఆదుకున్నారని మాత్రం మహిళలంతా ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నారు. మళ్లీ మళ్లీ వైఎస్ జగన్ మాత్రమే సీఎంగా రావాలని కోరుకున్నారు. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల నుంచి  మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రెండవ, శనివారం, ఆదివారం, ప్రభుత్వ శెలవుల్లో కూడా ప్రత్యేకంగా పనులు, డ్యూటీలు వేసి కుటుంబాలతో కనీసం ప్రశాంతంగా గడిపే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని ఉద్యోగులంతా ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఇదే ప్రభుత్వ ఉద్యోగుల్లో 30శాతం మంది ప్రభుత్వం చేసే ప్రతీ పనిని కూడా స్వాగతించారు. సరైన సమయంలో సరైన విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని కీర్తిస్తున్నారు. మరో పక్క అధికారపార్టీకి చెందిన సర్పంచ్ లు అయినా నిధులన్నీ దారి మళ్లిపోయాయని ఇటు స్థానిక సంస్థల్లో కూడా నిరాశే మిగిలింది. ఇక వ్యాపారులు, సంస్థలు కోవిడ్ లాంటి సమయంలో వ్యాపారాలు జరగకపోయినా దారుణంగా జీఎస్టీ వసూలు చేశారని మండి పడుతున్నారు. ఇన్కమ్ టాక్సులు కట్టకపోయినా, ఐటిరిటర్న్స్ వేయించడాన్ని సాకుగా చూపి ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేశారని అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందుకో లేకపోయిన మరో వర్గం ప్రజలు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకు సంబంధించిన వారి అభిప్రాయాలను నిశ్శంకోచంగా తెలియజేశారు. ఈ విషయాలను తెలియజేసే సమయంలో ప్రభుత్వం చేసిన తేడా పనులు ప్రభుత్వంలోని పెద్దలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు నచ్చకపోయినా వాస్తవాలను మాత్రమే ఇక్కడ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ens live mobile news app, www.enslive.net ద్వారా తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేశాం. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఏ రాజకీయపార్టీకి గానీ, సంస్థలకు గానీ కొమ్ముకాయదని కూడా విన్నవిస్తున్నాం.

Tadepalli

2022-05-23 14:21:40

దిశ యాప్ కి ఖాకీ యూనిఫారం మోకాలడ్డు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, విద్యార్ధినిలు, గ్రుహిణిలు సంరక్షణార్ధం అత్యంత ప్రతి ష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఖాకీ యూనిఫారం మోకాల డ్డుతోంది. ఏంటి దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడానికి ఖాకీ యూనిఫారంకి సంబంధం ఏంటని అమరా వతిలోని ఏపీ పోలీస్ బాస్ డీజీపీ నుంచి అనకాపల్లిలోని పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వరకూ అనుమానం కలుగక మానదు. దిశయాప్ ఇనిస్టాల్ కి సంబంధించిన వాస్తవ పరిస్థితి తెలుసుకుంటే అదే డీజీపి నుంచి కానిస్టేబుల్ వరకూ అన్నన్నా.. ఇంత జరుగుతోందా అంటూ ముక్కున వేలేసుకుంటారు. అప్పుడు పూర్తిస్థాయిలో ఖాకీలే రంగంలోకి దిగి.. దిశ దశను మార్చి రాష్ట్రంలోని నలు దిశలు వ్యాపించేలా చేసి ఆండ్రాయిడ్ ఫోను వాడే ప్రజలందరూ ఈ యాప్ ని వినియోగించేలా చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దిశయాప్ ని ప్రత్యేకంగా  మహిళల రక్షణకోసం ప్రవేశపెట్టింది. యాప్ ని ప్రవేశ పెట్టిన దగ్గర నుంచి సాధారణ పోలీసులతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా వున్న 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 14వేల పైచిలకు వున్న సచివాలయ మహిళా పోలీసులకు ఆ బాధ్యతను అప్పగించారు. సచివాలయ ఉద్యోగుల పేరులో పోలీస్ ఉంది తప్పితే.. ఆ పోలీసుల ఒంటిపై ఖాకీ యూనిఫారం లేదు. ఖాకీ యూనిఫారం వున్న పోలీసులంతా ఎస్పీ నుంచి కానిస్టేబుళ్ల వరకూ కార్యాలయాలకే పరిమితం అవుతూ(కొన్నిచోట్ల), సచివాలయ మహిళా పోలీసులు, ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇనిస్టాల్ చేయించే దిశ యాప్ సంఖ్యను మానటరింగ్ చేస్తున్నారు. 

సాధారణంగా పోలీస్ యూనిఫారం వేసుకున్న వ్యక్తిని చూస్తే ఎలాంటి వ్యక్తికైనా చిన్న ఆందోళన, భయం, భక్తి, మరికొందరికి చిరాకు కూడా కలుగుతుంది. పోలీసోడు కనపబడితే నాకెందుకు వచ్చిన తలొనొప్పి అనుకొని ఏం చెబితే అది చేసే పరిస్థితికూడా వుంటుంది. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వంలోని పోలీస్ శాఖ కూడా పెద్ద తప్పు చేసింది. గ్రామస్థాయిలోని సచివాలయ మహిళాపోలీలకు అప్పగించిన దిశయాప్ ఇనిస్టాల్స్ విషయంలో ఖాకీ యూనిఫారం వేసుకున్న పోలీసులు కూడా పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అయితే ప్రజల్లో కూడా మార్పు వచ్చేది. కానీ యూనిఫారం లేని మహిళా పోలీసులు వెళ్లి దిశయాప్ పై అవగాహన కార్యక్రమాలు పెడితే అవి ప్రజల్లోకి చేరడం లేదు. అడపా దడపా అప్పుడప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరుతో చేసే కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీలు, డివిజన్ స్థాయిలో డిఎస్పీలు, స్టేషన్ పరిధిలో ఎస్ఐలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పితే మిగిలిన సమయంలో ఆ బాధ్యత అంతా సచివాలయ మహిళా పోలీసులే చక్కబెడున్నారు. అలాగని నిత్యం పోలీసులకు దిశయాప్ పైనే ద్రుష్టిమొత్తం కేంద్రీకరించాలంటే అదికూడా జరగని పరిస్థితి.. అలాగని ఖాకీ రోడ్డుపైకి వెళ్లకపోతే సాధారణ ప్రజలు దిశ యాప్ ఇనిస్టాల్ చేయని దుస్థితే ఇప్పటి వరకూ కనిపిస్తూ వచ్చింది. దిశ యాప్ కోసం తెలిసినవారు సచివాలయ మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తే అప్పటికి ఇనిస్టాల్ చేసుకుంటున్నారు. లేదంటే తరువాత చూద్దామని లైట్ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం యువత ఆండ్రాయిడ్ ఫోన్లలో టిక్ టాక్, షేర్ చాట్, ఇనిస్టా గ్రామ్, ఫేస్ బుక్ వంటి వాటితోనే కాలం గడుపుతున్నారు తప్పితే రక్షణగా ఉండే దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవడానికి ఎవరూ ముందుకి రావడంలేదు. ఒక వేళ గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక దిశ యాప్ ని అప్పటికి ఇనిస్టాల్ చేసుకున్నా.. ఆ తరువాత వెంటనే యాప్ ని డిలీట్ చేసేస్తున్నారు. కానీ ఇనిస్టాల్ చేసుకున్న సంఖ్య మాత్రం పోలీస్ శాఖ డాష్ బోర్డులో కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో దిశ యాప్ పైపా.. దాని వినియోగంపైనా పూర్తిస్థాయిలో అవగాహన లేదు. అలాగని సచివాలయ మహిళా పోలీసులతో నిర్వహించే కార్యక్రమాలు వారి విధుల వరకూ సరిపోతున్నాయి తప్పితే ప్రజల్లోనూ, యువతలోనూ, ముఖ్యంగా విద్యార్ధినిల్లోనూ మార్పు తీసుకు రాలేకపోతున్నాయి. ‘శంఖంలో పోస్తేనే తీర్ధం’ అన్నట్టుగా దిశ యాప్ కోసం ఖాకీ యూనిఫారం వేసుకున్న పోలీసోడు చెబితేనే ప్రజలు వినే పరిస్థితి వచ్చింది..ఖచితంగా వినితీరుతున్నారు అంతే.. అలాకాకుండా పేరులో పోలీసు ఉండి.. ఒంటిపై ఖాకీ యూనిఫారం లేని సచివాలయ మహిళా పోలీసులు దిశ కోసం ఎంత చెప్పినా అక్కడక్కడ కొంత మంది యువత తప్పితే మిగిలిన ఎక్కవ శాతం మంది దిశయాప్ ని ఇనిస్టాల్ చేసుకునే పరిస్థితి కనిపిండం లేదు.

ఈ తరుణంలో రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లను దిశయాప్ విషయంలో రంగంలోకి దించిన తరువాత నెలకి ఒకసారి చేపట్టే స్పెషల్ డ్రైవ్ లో మాత్రం అత్యధిక సంఖ్యలో యాప్ ఇనిస్టాల్స్ వస్తున్నాయి. తప్పితే వాటి వినియోగం, యాప్ పై అవగాహన మాత్రం ప్రజల్లో రావడం లేదు. అది జరగాలంటే స్టేషన్ పరిధిలోని ఎస్ఐ, సిఐ, డివిజన్ స్థాయిలో డిఎస్పీ, జిల్లా స్థాయిలో ఎస్పీ, రాష్ట్రస్థాయిలో డిజీపీ రంగంలోకి దిగితే తప్పా ఫలితం వచ్చేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం పోలీసుశాఖలో ఎస్ఐ నుంచి డీజీపి వరకూ దిశ యాప్ పర్యవేక్షణ, అప్పుడప్పుడూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు తప్పితే.. దిశయాప్ ఇనిస్టాల్స్ చేయించే విషయంలో కొంతమంది రోడ్లపైకి వచ్చినా.. అధికశాతం స్టేషన్ స్థాయిలోనే పోలీసు సిబ్బంది రోడ్డుపైకి సీరియస్ గా వచ్చిన ప్రజలకు యాప్ చేరువ చేస్తున్నది తక్కువగా కనిపిస్తున్నది. ఏదో ప్రత్యేక కార్యక్రమాలు పెట్టినపుడు, ఉత్సవాలు ఊరేగింపుల్లో తప్పితే. ఇలా పర్యవేక్షణ చేసేకన్నా స్టేషన్ స్థాయిలో ప్రతిరోజూ ఇద్దరు లేదా ముగ్గు కానిస్టేబుళ్లతో మహిళా పోలీసులు కలిసి ప్రజల ముందుకి వెళితే ఖాకీ యూనిఫారం చూసిన భయంతోనో, భక్తితోనో లేదంటే గౌరవం తోనో..అదీ కాదనుకుండే యాప్ ఇనిస్టాల్ చేసుకోకపోతే ప్రత్యేక తలనొప్పి వస్తుందనే భయంతోనైనా దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడానికి ముఖ్యంగా యువత ముందుకి వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు ప్రతీరోజూ గుడులు, బడులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మార్కెంటింగ్ చేసే సిబ్బందిలా బాబ్బాబు అంటూ తిరిగి తిరిగి దిశ యాప్ ఇనిస్టాల్ చేయిస్తా ఉంటే.. వీరు అటు తిరిగే లోపు ఆ యాప్ ని డిలీట్ చేస్తున్నారు యువత. ఆ వాస్తవ సాంకేతిక కారణాలు, ఇబ్బందులు పర్యవేక్షణ చేసే పోలీసులకు తెలియడం లేదు. అంతేకాదు ఇదే కారణంతో చాలా మందికి యాప్ వినియోగించే అవకాశం, అవసరం కూడా రావడం లేదు. 

ముఖ్యంగా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా వారు మిగిలిన వారికి దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి ఆస్కారం వుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలోని పోలీస్ బాస్ డీజీపి దగ్గర నుంచి స్టేషన్ లోని హోం గార్డు వరకూ యాప్ వారి ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవాలి. గ్రామస్థాయిలో సచివాలయ సిబ్బంది, మండల స్థాయిలో మండల అధికారులు, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు,  కళాశాలలు, యూనివర్శిటీలు, వివిధ రాజకీయపార్టీల నేతలు ఇలా ప్రతీ ఒక్కరూ యాప్ ఇనిస్టాల్ చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలి. ముఖ్యంగా ప్రతీనెలా రాష్ట్రవ్యాప్తంగా దిశ యాప్ ద్వారా ఎంత మందిని పోలీసులు రక్షించారు. ఎంతమంది నిందులకు శిక్ష పడిందనే విషయాలు ప్రసార మాద్యమాల ద్వారా  తెలియజేయడంతోపాటు, జిల్లాస్థాయిలోనూ ఆ సమాచారం గ్రామాల వరకూ తెలిసేలా అదే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాల్సి వుంది.  అన్ని రకాల ప్రసార మాద్యమాల ద్వారా దిశయాప్ వినియోగంపై చతన్యపూరిత కధనాలు, ప్రసారాలు చేయించాలి. ముఖ్యంగా వాహననం నడిపే ప్రతీ ఒక్కరిలోనూ దిశయాప్ ఇనిస్టాల్ చేయించగలిగితే రాష్ట్రప్రభుత్వం లక్ష్యం నెరవేరడంతోపాటు దిశ చట్టంగా మారే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. పోలీసులు స్టేషన్ లో నుంచే పర్యవేక్షణ చేస్తున్నంత కాలం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసు యాప్ ఇనిస్టాల్ చేయిస్తుంటే.. అంతే స్పీడులో యువత ఆ యాప్ ని డిలీట్ చేస్తూ ఉంటారనడంలో ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన పనిలేదు..!?

Tadepalli

2022-05-23 03:22:01

ఆ విద్యార్ధు ఇంగ్లీషుకి సీఎం జనగ్ ఫిదా..

కాకినాడ జిల్లా, తొండంగి మండలం, బెండపూడి హైస్కూలు విద్యార్ధినిలు ఇంగ్లీషు మాటలకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఫిదా అయిపోయారు. విద్యార్ధులంతా అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీషులో మాట్లాడుతుంటే.. సీఎం జగన్ వారిని ఉత్తేజ పరుస్తూ విద్యార్ధులందరితోనూ ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయిలో విద్యార్ధులు ఇంగ్లీషు నేర్చుకోవాలనే లక్ష్యంతో అన్ని పాఠశాలల్లో సిబీఎస్సీ సిలబస్ ను అమలు చేయడంతోపాటు, ప్రత్యేక విద్యావ్యవస్థను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. బెండపూడి విద్యార్ధులను సీఎం నేరుగా తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడటం ఇపుడు రాష్ట్రంలోనే కాదు..దేశంలోనే హాట్ టాపిక్ అవుతోంది.

Tadepalli

2022-05-19 16:45:33

ఇక గ్రామాల్లోనే పశువులకు వైద్యసేవలు..

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పశువులకు అన్నిరకాల ఉచిత వైద్యసేవలు అందించడానికి సంచార పశు వైద్య అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల ఆంబులెన్స్‌ సేవలు గురువారం అమరావతిలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి జెండా ఊపి ప్రారంభించారు. మొదటి విడతలో  రూ.143 కోట్ల వ్యయంతో  రూపొందించిన 175 పశువుల అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పాడిరైతులకు ఈ సంచార పశువైద్య అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూశాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక, మత్య్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, పశుసంవర్ధశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-19 15:29:07

సరసమైన ధరలకు టమాటా విక్రయాలు..

రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో ఈ నెల 20 నుండి  సరసమైన ధరలకు టమాటాల విక్రయం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  కాకాని గోవర్థన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే  టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు.  ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గిన నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల నుండి  టమాటాను దిగుమతి చేసుకుని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడంపై ప్రభుత్వం తీవ్ర్రంగా పరిగణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ మార్కెట్లో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా ప్రక్క రాష్ట్రాల నుండి టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రం లోని అన్ని రైతు బజార్ల ద్వారా  సరసమైన ధరలకే టమాటాలను విక్రయించేందుకు చర్యలను తీసుకుంటుంన్నట్లు మంత్రి తెలిపారు. తదననుగుణంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైతు బజార్ల సి.ఇ.ఓ.కు కూడా ఆదేశాలు జారీచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిని ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 20 నుండి రైతు బజార్లలో  సరసమైన ధరలకే  విక్రయిస్తున్న టమాటాలను కొనుగోలు చేసుకోవాలని వినియోగదారులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.  

Tadepalli

2022-05-19 15:17:05

ఏపీలో 26జిల్లా సమాఖ్యలు.. DyCm బూడి

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా జిల్లాలు ఏర్పడినందున 26 జిల్లా సమాఖ్యలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని తన చాంబర్ లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పంచాయతి రాజ్, గ్రామీణాభివ్రుద్దిశాఖ పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, కొత్తగాల ఏర్పడిన 13 జిల్లాల్లో జిల్లా సమాఖ్యలు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్ తో శతశాతం ఆడిట్ నిర్వహిస్తూ, జనరల్ బాడీ సమావేశాలు చక్కగా నిర్వహించాలని ఆదేశించారు. మహిళా సంఘాల అభ్యున్నతి కి వీఏఓలు కీలకంగా వ్యవహిరించేలా చూడాలన్నారు. 30-50 గ్రూపులకు ఒక  విఏఓ ఉండేలా చూడాలని హేతుబద్దంగా వారి నియామకాలు జరపాలన్నారు. ఇకపై మహిళలే వీఏఓలుగా ఉండాలని, దానికి సంబంధించి నిభంధనల మార్పు చేస్తూ వారి వయస్సు 18-45 వయస్సు ఉండేలా చేయాలన్నారు. అంతేకాకుండా స్థానికులకు, కాస్త చదువుకున్నవారికి మాత్రమే ఈ అవకాశాలు కల్పించాలన్నారు. మండల కమిటీ తో హెల్త్  సర్టిఫికేట్ ల వెరిఫికేషన్ చేయించడంతోపాటు అక్రమంగా సర్టిఫికేట్లు ఇచ్చిన వైద్యులపై చర్యలు  తీసుకోవాలని కూడా ఆదేశించారు. వికలాంగత్వ నిర్దారణ కోసం 6 నెలలకు ఒక సారి ప్రత్యెక సదరం క్యాంప్ ల ఏర్పాటు చేయాలని, ఆ సమాచారాన్ని అన్ని ప్రచార మాద్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-19 15:09:50

ఏపీ ఎలక్టోరల్ చీఫ్ గా ముకేష్ కుమార్ మీనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరవతి సచివాలయం ఐదో బ్లాక్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఛాంబరుకు మద్యాహ్నం 12.00 గంటలకు విచ్చేసిన ఆయన 12.06 గంటలకు కె.విజయానంద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే  ముకేష్ కుమార్ మీనా ను   కె.విజయానంద్  దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బందిని ముకేష్ కుమార్ మీనాకు ఆయన పరిచయం చేశారు.

Tadepalli

2022-05-19 12:22:37

ఎస్సీ మహిళలకు హెవీ డ్రైవింగ్ లో శిక్షణ

ఎస్సీ మహిళలకు ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా నియమించడానికి అవసరమైన హెవీ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. శిక్షణానంతరం దాదాపు 320 మహిళలు బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలను పొందే అవకాశం ఉందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది రూ.136 కోట్లతో ఇన్ కం జనరేషన్, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను చేపట్టనున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న పథకాలను సచివాలయంలో మంత్రి నాగార్జున సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పిఎం అజయ్ పథకం కింద ఈ ఏడాది రూ.136 కోట్లతో పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగానే ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఇన్ కం జనరేషన్ కార్యక్రమాలను చేపడతామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా పలు వృత్తి విద్యలలో శిక్షణలు ఇస్తామని, ఈ శిక్షణ పొందిన వారికి తప్పనిసరిగా ఉద్యోగాలు లభించేలా చూస్తామని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగానే ఎస్సీ మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. హెవీ వెహికల్ డ్రైవర్లుగా శిక్షణ పొందిన మహిళలు ఆర్టీసీలో బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేసిన 320 డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అవన్నీ కూడా శిక్షణానంతరం ఎస్సీ మహిళలకు వచ్చేలా చూస్తామని మేరుగు నాగార్జున వివరించారు. డ్రైవింగ్ తో పాటుగా కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా మహిళలకు నర్సింగ్ లోనూ శిక్షణలు ఇస్తామని తెలిపారు. పిఎం అజయ్ పథకంలో భాగంగానే  ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూములలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపడతామని వివరించారు. ఎన్.ఎస్.ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.కే.ఎఫ్.డీ.సీ, భూమి కొనుగోలు  (ఎల్పీఎస్) తదితర పథకాలకు సంబంధించిన ప్రగతిని ఈ సందర్భంగా సమగ్రంగా సమీక్షించారు. కాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి  17 ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయని గుర్తించడం జరిగిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ భూములు ఎక్కడా అన్యాక్రాంతం కాకుండా వాటిని సర్వే చేసి సరిహద్దులు గుర్తించి, కంచె వేయడంతో పాటు అవి ఎస్సీ కార్పొరేషన్ భూములనే విషయాన్ని తెలియజేసే విధంగా వాటిలో బోర్డులను కూడా పాతాలని అధికారులను నాగార్జున ఆదేశించారు. ఖాళీ భూములు కాకుండా గతంలో కోళ్ల పెంపకం కోసం లబ్దిదారులకు లీజు కింద ఇచ్చిన భూములు కూడా ఉన్నాయని వాటన్నింటిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1407 పౌల్ట్రీ షెడ్ల కోసం సుమారు 594 ఎకరాల భూములను కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం ఈ షెడ్లలో 1245 దాకా నిరుపయోగంగా ఉన్నాయని అధికారులు గుర్తించడం జరిగిందని నాగార్జున వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కే.హర్షవర్ధన్, ఎస్సీ కార్పొరేషన్ జీఎం కరుణకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.


Tadepalli

2022-05-19 10:03:03

Tadepalli

2022-05-19 06:00:19

ప్రొబేషన్ గడువు భారీగా పెంచేసినా.. ప్రసూతి సెలవులు నిబంధన తప్పలేదు..

‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు’ అన్న సామెత మీకు గుర్తుందిగా.. సరిగ్గా ఆ సామెతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో  ఒక్కముక్క కూడా మిగిల్చకుండా పూర్తిగా వినియోగించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ గడువు రెండేళ్లు పూర్తయిన తరువాత కూడా అదనంగా 9 నెలలు పెంచేసినా, నిబంధనల ప్రకారం ఆ సమయంలో మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి ప్రభుత్వ నిబంధనలను మాత్రం పక్కాగా అమలు చేసింది.  ప్రసూతి సెలువులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు సంబంధించి సెలువులు ఇచ్చిన ఆరు నెలలకు జీతాలు ఇచ్చినా.. ఆరోజులన్నీ లెక్కగట్టిన ఆ తరువాత మాత్రమే సర్వీసు రెగ్యులైజేషన్ కు డాక్యుమెంటేషన్ ప్రక్రియ చేపట్టింది. దీనితో ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి నేటి వరకూ రెండవ శనివారం, ఆదివారం, సాధారణ సెలవులు అని తేడా లేకుండా అదనపు పనిగంటలు తమతో చేయించుకున్న ప్రభుత్వం అదనంగా 9నెలలు సర్వీసు ప్రొబేషన్  పెంచడం ద్వారా పేస్కేలు మొత్తం సుమారు రూ.లక్ష వరకూ కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇంకా రాలేదని వాపోతున్నారు. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రప్రభుత్వమూ చేయించని విధంగా తమతో 33 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్ లో విధులు చేపట్టేలా చేసి తమకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతంగా ఇచ్చిందని విమర్శిస్తున్నారు. 

దేశంలోనే ఒక వినూత్న వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి తమను ప్రత్యేక పోటీ పరీక్షలు పెట్టి ఉద్యోగాల్లోకి తీసుకున్నా.. ఆ సంత్రుప్తి మాత్రంలో తమలో ఎక్కడా కలగడం లేదనే నిరసన మహిళా ఉద్యోగుల్లో నెలకొని వుందని బహిరంగంగానే చెబుతున్నారు. తమ ఉద్యోగాలు అటెండరుకి ఎక్కువ.. జూనియర్ అసిస్టెంట్ కి తక్కువగా ఉన్నప్పటికీ పదోన్నతుల విషయంలోనైనా బాగుంటుందనుకుంటే అందులోనూ అవే ఇబ్బందులు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని, అసలు తమ సర్వీసులు రెగ్యులర్ అవుతాయో.. అయిన తరువాత ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా పేస్కేలు వుంటుందో.. లేదంటే ఇటీవల ప్రభుత్వం హెచ్ఆర్ఏ శ్లాబులు తగ్గించిన క్రమంలో జీతం మరింతగా తగ్గిపోతుందో తెలియని అయోమన స్థితిలో ఉన్నామని ఉద్యోగులంతా వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమాలరు ఒక లక్షా 25వేలకు మందికి పైగా ప్రస్తుతం ఉద్యోగులు 16 ప్రభుత్వశాఖలకు చెందిన వారు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 20శాతానికి పైగా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలువులు ఆరు నెలలు వినియోగించుకున్నవారు ఉన్నారు. వాస్తవానికి ప్రసూతి సెలవులు ఆరు నెలలు పూర్తయిన తరువాత మరో మూడు నెలలు స్పెషల్ బేబీకేర్ లీవ్ ను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. తమ పిల్లలు పుట్టిన సమయంలో తమ ఉద్యోగానికి సర్వీసు విషయంలో ఆరు నెలలు సర్వీసు రెగ్యులైజేషన్ కి వెనుక పడిపోయామని బాధపడుతున్న తల్లులు ఇక స్పెషల్ బేబీకేర్ సెలవులు తీసుకోకుండానే వారి పిల్లలను సాకుతూ వస్తున్నారు. మళ్లీ స్పెషల్ బేబీకేర్ లీవ్ పెడితే మరో మూడు నెలలు ప్రొబేషన్ పొడిగింపు వర్తిస్తుందనే భయంతో ఎవరూ ఆ సెలవుల జోలికే వెళ్లలేదు.

ఇప్పటికే సర్వీసు ప్రొబేషన్ ఆరునెలలు కాలం కోల్పోయిన మహిళా ఉద్యోగులు సర్వీసు ప్రొబేషన్ కు సంబంధించి జిల్లా అధికారుల నుంచి సర్వీస్ కంప్లీట్ డాక్యుమెంటేషన్లు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సర్వీసు ప్రొబేషన్ కాలాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా 9నెలలు గడువుని అదనంగా పెంచేసినా.. ప్రసూతి సెలవుల విషయంలో మాత్రం ఖచ్చితంగా నిబంధనలు అమలు చేసి, రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవుల్లోనూ ప్రత్యేకంగా అదనపు పనులు చేయించుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులతోనే అదనంగా పనులు చేయించుకుని నిబంధనల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ శాఖకు మిగిలిన ప్రభుత్వ శాఖల మాదిరిగా సడలింపులు, ప్రత్యేక సెలవులు, స్పెషల్ బేబీకేర్ లీవులు వుంటాయో ఉండవో, అసలు వాటిని తమకు అమలు చేస్తారో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొందని మహిళా ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు కూడా ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగానే ప్రసూతి సెలవులు, స్పెషల్ బేబీకేర్ లీవ్, కుటుంబ నియంత్ర ఆపరేషన్ చేయించుకోవడానికి సెలవులు ఇలా అన్ని అమలు చేయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. వీరి కోర్కెలు ఎలా వున్నా ముందు వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అయితేనే ఏమైనా జరగడాని, ప్రభుత్వాన్ని కోరడానికి అవకశం వుంటుందనే కొసమెరుపు మాటలు సర్వత్రా వినవస్తుండటం విశేషం..!

Tadepalli

2022-05-19 03:32:53

పథకాల లక్ష్యసాధనపై దృష్టి సారించాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సిఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది.ఈసమావేశంలో ప్రధానంగా గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదిక(ATR), సుస్థిరాభివృధ్ధి లక్ష్యాల సాధన,సైబర్ సెక్యురిటి,ఎపి ఆన్లైన్ లీగల్ కేసులో మానిటరింగ్ సిస్టమ్ తదితర అంశాలపై సమీక్షించారు.ముందుగా యాక్షన్ టేకెన్ రిపోర్టు కు సంబంధించి ఆయా శాఖల వారీగా కార్యదర్శులు వివరించారు.ముఖ్యంగా వివిధ పధకాలు,కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ డా.సమీర్ శర్మ ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.నాడు-నేడు కింద చేపట్టిన వివధ పనులు,నైపుణ్య శిక్షణాభివృద్ధి కార్యక్రమాలు,జాతీయ రహదార్లు,ఆర్ అండ్బి,పంచాయితీరాజ్ రహదార్లు అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆయా కార్యదర్శులు సిఎస్ కు వివరించారు.అదే విధంగా జగనన్న శాశ్వత భూహక్కు,జగనన్న సంపూర్ణ భూరక్ష పధకం,భూముల రీసర్వే,గ్రామాలు,పట్టణాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ తదితర అంశాలను సిఎస్ సమీక్షించారు.

ఎపి ఆన్లైన్ లీగల్ కేసు మేనేజిమెంట్ సిస్టమ్ (APOLCMS) గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ ఇదొక మంచి విధానమని లీగల్ కేసుల నిర్వహణకు సంబంధిత శాఖల్లో నియమించబడిన లైజన్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆయన ఆదేశించారు.సంబంధిత శాఖల లైజన్ అధికారులు ప్రతి రోజు ఈ ఎపిఓఎల్సియంను మానిటర్ చేస్తూ కోర్టుల్లో నమైదైన కేసు దానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ కార్యదర్శికి తెలియజేయడం ద్వారా ఆయా కేస్లులో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా కోర్టులకు సకాలంలో వివరాలు అందించాలని చెప్పారు.ఇకపై ప్రతినెల అడ్వకేట్ జనరల్ తో కలిసి జిపిలు,సంబంధిత శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి లీగల్ కేసులపై సమీక్షించడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించి కోర్టు కేసుల పెండెన్సీని తగ్గించేందుకు వీలుగా కోర్టులకు సకాలంలో వివరాలు సమర్పించేందుకు కృషి చేయాల్సి ఉందని సిఎస్.డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.

నీతి ఆయోగ్ నిర్దేశించిన ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ కార్యదర్శులను ఆదేశించారు.ఇందుకుగాను అందరు కార్యదర్శులు ఈఅంశాన్నినిరంతరం మానిటర్ చేయాలని చెప్పారు.సుమారు 415 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రణాళికాశాఖ ఎస్ఓపిలు(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను)రూపొందించినట్టు ఆశాఖ కార్యదర్శి విజయకుమార్ వివరించగా అందుకు అనుగుణంగా ఆయా లక్ష్యాల సాధనకు తగిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.అనంతరం సైబర్ సెక్యురిటీకి సంబంధించి రూపొందించిన డేటా బేస్ వివరాలను ఐటి మరియు కమ్యునికేషన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి వివరించారు.ఇంకా ఈసమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి కార్యదర్శులతో సిఎస్ డా.సమీర్ శర్మ సమీక్షించారు. ఈసమావేశానికి తొలుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్వాగతం పలికి అజెండా అంశాలను వివరించారు.సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాయిప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్,బి.రాజశేఖర్,రజత్ భార్గవ,అనంతరాము,పూనం మాలకొండయ్య, అజయ్ జైన్, వై.శ్రీలక్ష్మి,పలువురు ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-18 13:43:26

వారి సర్వీస్ రెగ్యులైజేషన్ పై క్లారిటీ ఏది..?

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలాఖరు నాటికి పండుగ వస్తుందా అంటే ఏమో  ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు ఆ శాఖ ఉద్యోగులు.. అదేంటి అనుకుంటున్నారా.. మాకూ(మీడియాకి కూడా) అదే డౌటనుమానం వచ్చింది. వాస్తవానికి ఏప్రభుత్వ శాఖలో అయినా ఉద్యోగంలో చేరిన రెగ్యులర్ ఉద్యోగికి రెండేళ్లు మాత్రమే సర్వీసు ప్రొబేషన్ ఉంటుంది. రెండేళ్లు దాటగానే ఆటోమేటిక్ గా సర్వీసు రెగ్యులర్ చేస్తూ సాధారణ ఉద్యోగిలా మారుస్తుంది ప్రభుత్వం. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన విధానమేమో.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సచివాలయ ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 33 నెలలు అంటే రెండేళ్ల 9 నెలలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం ప్రొబేషన్ సర్వీసు చేయిస్తోంది ఆ రూ.15వేలు మాత్రమే జీతం ఇస్తూ(కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఇదే ప్రభుత్వం నెలకు రూ.18వేలు ఇస్తోంది).. ఆ క్రమంలోనే జూన్ నెలాఖరు నాటికి సచివాలయ ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. దీనితో జూన్ నెల ఎప్పుడు వస్తుందా అంతా ఎదురు చూశారు. జూనెల నెల రావడానికి ఇంకా 13  రోజులు మాత్రమే గడువు వుంది. అయినా సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి క్యాబినెట్ భేటీలో కూడా సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ పై ప్రకటన వస్తుందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ ప్రకటన రాకపోవడంతో అంతా నిరాశ చెందారు. కానీ రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగుల నుంచి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా శాఖల అధికారులు మాత్రం రెగ్యులైజేషన్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తిచేస్తుంది. ఇంత జరుగుతున్నా ఉద్యోగుల్లో మాత్రం సర్వీసు రెగ్యులర్ అవుతుందా అంటే మళ్లీ ప్రొబేషన్ సర్వీస్ పొడిగిస్తారేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తప్పితే పక్కాగా చెప్పలేకపోతున్నారు. దానికి కారణం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలో అటు ప్రభుత్వం కూడా జిల్లాశాఖ అధికారులకు సరైన సమాచారం, ఆదేశాలు ఇవ్వకపోవడమే కారణంగా కనిపిస్తుంది.  రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను 9నెలల క్రిందట రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారికి ప్రొబేషన్ డిక్లేర్ చేసి వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. ఆఖరి 8వనెల అపుడే సగానికి పైగా రోజులైపోయినా.. ప్రభుత్వం నుంచి మాత్రం చిన్న ప్రకటన కూడా రాలేదు. చూడాలి జూన్ నెలలోనైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ.. వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తున్నామనే ప్రభుత్వ ప్రకటన వస్తుందో లేదోనని..!

Tadepalli

2022-05-18 04:56:47