1 ENS Live Breaking News

ens live హాస్పటల్ ప్రొఫైల్ లో మీకోసం

మీరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులా.. మంచి ఆరోగ్య సేవలు అన్నివర్గాల ప్రజలకు అందిస్తారా.. తక్కువ సమయంలో మీ ఆసుపత్రికోసం సమస్త ప్రజలకు తెలియ జేయాలనుకుంటున్నారా.. అయితే మీకు చక్కటి వేదిక Ens Live మొబైల్ న్యూస్ యాప్ మరియు అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.esnlive.net భారతదేశపు తొలితెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్).. ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! ద్వారా మీ ఆసుపత్రిలో అందించే చక్కటి వైద్యం కోసం అన్నివర్గాల ప్రజలకు మేం తీసుకువెళతాం. దానికి మీరు చేయాల్సిందల్లా మీ పూర్తివివరాలు, ఆసుపత్రి ఫోటో, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి తదితర వివరాలు మాకు సమర్పించడమే. ఇంకెందుకు ఆలస్యం ఇపుడే 9490280270, 9390280270లో సంప్రదించి..మీ ఆసుపత్రి సేవలు ప్రపంచానికి తెలియజేయండి..!

Tadepalli

2022-09-01 02:06:14

బయోమెట్రిక్ పడితేనే ఇక జీతభత్యాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఇలా అన్నిచోట్ల ప్రజలకు అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా భయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సును పక్కాగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సు పక్కాగావేస్తే తప్పా నెలాఖరుకి జీతబత్యాలు వచ్చే పరిస్థితితి లేదని తేల్చి చెప్పింది. అందుకోసం సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నిశాఖలకు ఆదేశాలు జారీచేసింది.  ఈ విషయంలో ఏ ఒక్కప్రభుత్వశాఖకు వెసులుబాటు లేదని, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే సమయంలో అధికారులతోపాటు, ఉద్యోగులూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్యాలయాల పనివేళల్లో ప్రజలు ఏ పనిపై వచ్చినా వారికి సిబ్బంది అందుబాటులో ఉండి వారి పనులు సత్వరమే చేస్తారనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

సచివాలయాల్లో 3సార్లు బయో మెట్రిక్..
ప్రభుత్వ శాఖల్లో తొలిసారిగా తీన్ మార్ బయోమెట్రిక్ ను గ్రామ, వార్డు సచివాలయశాఖలో అమలు చేశారు. ఇక్కడ ఉద్యోగులు రోజులో మూడు సార్లు భయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. మొత్తం 19శాఖలకు చెందిన సిబ్బందిలో అత్యవసర పని ఉన్నప్పుడు తప్పా బయటకు వెళ్లే వీలులేకుండా ఏర్పాట్లను పక్కాగా అమలు చేస్తోంది. నెలలో హాజరు లో తేడాలు, తక్కువ వస్తే సదు ప్రభుత్వశాఖ జిల్లా, డివిజన్, మండల శాఖ అధికారుల నుంచి డ్యూటీ సర్టిఫికేట్ తెస్తే తప్పా జీతాల బిల్లులు కూడా సచివాలయాల్లో పెట్టడం లేదు. దీనితో రోజులో మూడు సార్లు బయోమెట్రిక్ వేసే తొలి ప్రభుత్వ శాఖగా గ్రామ,వార్డు సచివాలయశాఖ తొలిస్థానంలో ఉంది. చాలా చోట్ల పాత పంచాయతీ కార్యదర్శిలు, కొందరు సచివాలయ కార్యదర్శిలు బయో మెట్రిక్ హాజరు విషయంలో తేడాలు చేస్తున్నవారిని కూడా ప్రభుత్వం గుర్తించి ఒక్కొక్కరినీ ఇంటికి పంపే కార్యక్రమానికి కూడా తెరలేపింది.

విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్..
విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తోపాటు, పిల్లల హాజరుని కూడా ఇకపై ఉపాధ్యాయులు ఆన్ లైన్ లో చేపట్టాల్సి వుంటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీఓ కూడా జారీచేసింది. ఒక్క విద్యాశాఖలోనే ఉపాధ్యాయులు మొత్తం 13 రకాల యాప్ లలో డేటా ప్రతినిత్యం అప్లోడ్ చేయాల్సి వుంటుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠ్యాంశాలు చెప్పే సమయం కంటే ప్రభుత్వం ఇచ్చిన యాప్స్ లలో డేటాను నమోదు చేయడానికే అత్యధిక సమయం పడుతోంది. అందులోనూ ఇన్ని రకాల యాప్ లు ఇచ్చిన ప్రభుత్వం ఎవరికీ సెల్ ఫోన్లు మాత్రం ఇవ్వలేదు. దీనితో ఉపాధ్యాయుల సొంత సెల్ ఫోన్లు కొనుగోలుచేసి ఒక ఫోన్ ను పాఠశాల యాప్ ల కోసం, మరో ఫోను వారి సొంత కార్యకలాపాలకోసం వినియోగించాల్సి వస్తున్నది. ప్రతినిత్యం చాలా అంశాలకు చెందిన ఫోటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేయాల్సి రావడంతో  ఫోన్ మెమొరీలు సైతం నిండిపోయి సొంత అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థి ఏర్పడి ఒక్కొక్క ఉపాధ్యాయుడూ రెండు ఫోన్లు కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇపుడు ప్రభుత్వం ఆన్ లైన్ అటెండెన్సు యాప్ లోనే డేటాను అప్లోడ్ చేయాలని చెప్పడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది.

నిబంధనలు పాటించకపోతే వేటు తప్పదు
ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు ఖచ్చితంగా ప్రభుత్వ యాప్ లను ఖచ్చితంగా వినియోగించాలి. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లోనే బయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. అలా కాకుండా నచ్చినట్టు చేయాలని చూస్తే ఇంటికి వెళ్లిపోవడానికి సిద్దపడాలి. మొన్నటి వరకూ పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది వారికి నచ్చినట్టుగా విధులు నిర్వహించేవారు ఇపుడు అక్కడ కూడా విధులకు ఎన్నిగంటలకు వస్తున్నారు..? ఎన్నిగంటలకు విధులు ముగించుకొని వెళుతున్నారు తదితర వివరాలు తెలుసుకునేందుకు ఆన్ లైన్ అటెండెన్సును ప్రభుత్వం ఖచ్చితంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మండల కార్యాలయాల్లో కూడా ఆన్ లైన్ అటెండెన్సు యాప్ లను అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. అమలు చేసిన శాఖల వివరాలను రాష్ట్ర కార్యాలయంలోని డేష్ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పరిపాలనలో మార్పులు, చేర్పులు తీసుకు వచ్చి ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖలను అందుబాటులో ఉంచేలా చేయడంలో వడివడిగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వ యాప్ లపై ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నవేళ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్ లైన్ అటెండెన్సు అమలు చేసే చర్యలు ముందు ముందు ఎలాంటి ఫలితాలు తెస్తాయనేది..!

Guntur

2022-09-01 01:40:31

వైద్యరంగంలో 45వేల ఉద్యోగాలు భర్తీచేశాం

పేద, మధ్య తరగతి ప్రజలందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తూ వైద్య రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చి వినూత్న మార్పులకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ కృష్ణబాబు తెలిపారు. గత మూడేళ్లలో వైద్య శాఖలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేసామన్నారు. విజయవాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్ లోని బుధవారం రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య, వైద్య సేవల వివరాలను మీడియా ప్రతినిధులకు వివరించారు.  ఈ సందర్భంగా ఎం.టీ. కృష్ణబాబు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు  వైద్యరంగంలో ఏర్పడిన ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామని,  ఇప్పటికే 45 వేల మందిని నియమించామని తెలిపారు. కొత్తగా 5వేల మందిని నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. వైద్యరంగంలో నాడు-నేడు కింద రూ.16,255 కోట్లతో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, అన్నిస్థాయిల్లో వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలతో పాటు మరో 16 క్రొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తున్నామని.. వీటిలో 5 మెడికల్ కాలేజీలు 2023 నాటికి సిద్దం చేస్తున్నామని, మిగతా కాలేజీలు 2024 నాటికి పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. అలాగే గ్రామస్థాయి నుంచి ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువచేస్తూ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో కలిపి మొత్తం 5 మంది వైద్యసిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. అలాగే ప్రతీ మండలంలో 2 పీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతి పీహెచ్‌సీ నుంచి టెలి మెడిసిన్‌ సదుపాయం కల్పించి అందరికీ వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ఒక మెడికల్ హాబ్ ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. 

గ్రామ స్థాయి నుంచి.. ప్రతి పీహెచ్‌సీలో 67 రకాల మందులు, 14 రకాల టెస్టులు అందుబాటులో​ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పీహెచ్‌సీలో గర్భిణీలు, బాలింతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలకనుగుణంగా ప్రతి గర్బిణీకి రెండు సార్లు స్కానింగ్ చేయిస్తున్నామని, బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో వారిని క్షేమంగా ఇంటికి చేరవేస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు డాక్టర్, ఆశా, ఏఎన్ఎంల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తూ ఎప్పటికప్పుడు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నప్పటికీ 1, 2 శాతం లోపాలను కొన్ని మీడియా సంస్థలు ఎత్తిచూపుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా ప్రచారం కల్పించి ప్రజలకు మరింత మేలు కలిగేలా వారు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.  

రాష్ట్రంలో 2,400 ఆసుపత్రుల్లో, ఇతర రాష్ట్రాల్లో 238 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సమర్థవంతంగా అమలు జరగుతుందని ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. జూలై నెల వరకూ ఆరోగ్యశ్రీ అన్ని బిల్లుల చెల్లింపులు పూర్తి చేశామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 83,400 మంది ఆరోగ్యశ్రీలో వైద్యసేవలు పొందారని, వీరికి ప్రభుత్వం 85 కోట్లు ఖర్చు చేసిందని, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 40 కోట్లు ప్రభుత్వం వెచ్చించి ఈ పథకం కింద వైద్య సేవలు అందించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25 శాతం వరకూ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనిని 50 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భవ, ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో  పనిచేసే వైద్యులకు అందించే ప్రొత్సాహకాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. 

రిమోట్ ప్రాంతాల్లో పని చేయటానికి నిపుణులు, వైద్యులు ముందుకు రావటం లేదనే కారణంతో అటువంటి ప్రాంతాల్లో పని చేయటానికి వచ్చే స్పెషలిస్టులకు 50 శాతం, ఎంబీబీఎస్ వైద్యులకు 30 శాతం అదనపు ప్రయోజనాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. స్పెషలిస్టుల కొరత తీర్చేందుకు ఏడాది పాటు పీజీ విద్యార్థులకు రూరల్ ఏరియాలో సర్వీస్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ ల కొరత ఉందన్నారు. పులివెందులలో 17 మంది డాక్టర్లు ఉన్నారని, మిగతా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశామన్నారు. బయోమెట్రిక్ హాజరు పెట్టిన తర్వాత డాక్టర్ల పనితీరు మెరుగుపడిందన్నారు. 

వైద్య రంగంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలను సెప్టెంబర్ చివరి నాటికి భర్తీ చేస్తామన్నారు. పాడేరు ప్రాంతంలో ఏడుగురిలో ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయని, కానీ పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ జె. నివాస్ తెలిపారు. అయినా టిష్యూ కల్చర్ కోసం శాంపుల్స్‌ ను విశాఖకు పంపించామని, గురువారం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని నివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. 

Vijayawada

2022-08-31 16:24:56

ఏపీపీఎస్సీలో కొత్త సిలబస్ బీఅలర్డ్..!

ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) పోటీ పరీక్షలకు సంబంధించి భారీ స్థాయిలో మార్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని పరీక్షలకు సంబంధించి సిలబస్ మార్చాలని యోచిస్తున్నట్టు సమాచారం. దానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడానికి ప్రభుత్వం ఎపీపీఎస్సీ నిర్వాహకులతో సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. చాలా ఏళ్ల నుంచి పోటీ పరీక్షలకు సంబంధించినంత వరకూ సిలబస్ పాతదే ఉండటమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తోపాటు ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించి స్టాండర్డ్ సిలబస్ ను మాత్రమే అభ్యర్ధులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఆ పాత సిలబస్ తో కాకుండా మారిన పరిస్థితులకు అనుగునంగా సిలబస్ మార్చి ఇకపై వచ్చే పదేళ్లలో పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతీ ఏడాదీ ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ కేలండర్ ను కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టు అధికారులు సైతం చెప్పుకొస్తున్నారు.

పదేళ్ల నుంచి ఒక సిలబస్సే కారణం..
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ఏళ్ల నుంచి ఒక ఆనవాయితీని అనుసరిస్తున్నది. ప్రతీ పదేళ్లకు ఒకసారి సిలబస్ ను వివిధ పోటీపరీక్షలకు ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు మారుస్తూ వస్తున్నది. అందులోభాగంగానే ఈ ఏడాది కూడా నోటిఫికేషన్లు ఇచ్చే ముందు సిలబస్ మార్పు విషయాన్ని ప్రకటిస్తుందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అంచనాలు వేస్తున్నారు. అంతేకాదు చాలా ఏళ్ల నుంచి ఈ విధానమే కొనసాగుతుండంతో పోటీపరీక్షల అభ్యర్ధులను కూడా అలెర్ట్ చేస్తూ వస్తున్నది. ప్రతీ ఏడాదీ జాబ్ కేలండర్ ను ప్రకటించకపోయినా..ప్రతీ పదేళ్లకు ఒకసారి ఏపీపీఎస్సీ సిలబస్ ను మాత్రం మార్పు చేస్తూ కమిషన్ తన గుర్తింపును చాటుకుంటోంది. దానికి తోడు చాలా కాలం నుంచి గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్ధులు లాంగ్ గ్యాప్ నుంచి ప్రిపరేషన్ లోనే ఉండిపోయారు.

ముందస్తుగా స్టాండర్డ్ సిలబస్ పైనే కోచింగ్..
APPSC సిలబస్ ఎప్పుడు ఏవిధంగా మార్చినా తమ కోచింగ్ సెంట్ల అభ్యర్ధులు నష్టపోకుండా అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, ఇతర జనరల్ స్టడీస్ పై కూడా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సిలబస్ మార్పులకు అనుగుణంగా కోచింగ్ లు ఇస్తున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్లు త్వరలోనే రాబోతున్నాయనే ప్రచారం నేపథ్యంలో మారబోయే సిలబస్ కి తగ్గట్టుగా కూడా మార్పులు, చేర్పులు చేసే కోచింగ్ లు ఇస్తున్నారు. ఇటు అభ్యర్ధులు కూడా  5వ తరగతి నుంచి డిగ్రీ వరకూ పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలపైనే ఎక్కువగా ద్రుష్టిపెడుతున్నారు. పైగా పోటీ పరీక్షల సరళిపై ప్రతీ ఒక్కరికీ పూర్తిగా అవగాహన పెరిగిన ద్రుష్ట్యా ప్రభుత్వం గానీ, ఎపీపీఎస్సీ గానీ సిలబస్ మార్చినా ఎక్కడా ఇబ్బంది పడకూడదనే విధంగాతోనే ప్రిపరేషన్ లో మునిగి తేలుతున్నారు అభ్యర్ధులు.

కొత్తసిలబస్ పట్ల జాగ్రత్తలు..విజయం మీదే
ప్రస్తుతం ఎపీపీఎస్సీ అన్ని పోటీ పరీక్షలకు సిలబస్ మారుస్తుందనే ప్రచారం నేపథ్యంలో అభ్యర్ధులు కూడా చాలా జాగ్రత్తలు పడాలని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఏపీపీఎస్సీ అభ్యర్ధులను ఒడపోత పోసే విధానంలో భాగంగా సిలబస్ లో మార్పులు చేసినా దానికి అనుగుణంగానే ప్రిపరేషన్ లో తేడాలు గమనించుకొని వ్యూహాత్మకంగా ముందుకి సాగాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సమకాలీనా రాజకీయాలు, రాష్ట్రీయ, జాతీయ అంశాలతోపాటు, అంతర్జాతీయ విషయాలను, కరెంట్ అఫైర్స్  విషయంలో జాగ్రత్తలు పాటించడంతోపాటు అర్ధమెటిక్, రీజనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే..స్టాండర్డ్ గా ఉండే జనరల్ స్డడీస్ విషయంలో భయపడే పనుండదని కూడా పలువురు ప్రముఖ కోచింగ్ ఎక్స్ పర్ట్ లు తెలియజేస్తున్నారు. ప్రతీ పదేళ్లకు ఒకసారి ఏపీపీఎస్సీ సిలబస్ ను మార్పు చేయడం అనాదిగా వస్తున్న విషయమే అనే విషయాన్ని అభ్యర్ధులు పూర్తిస్థాయిలో ద్రుష్టిలో పెట్టుకొని తమ కోచింగ్ ను కూడా గత పదేళ్ల మోడల్ పేపర్లను ద్రుష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ చేసుకోవాలని..అదేవిధంగా ప్రస్తుత అంశాలను కూడా కలగలిపి చదువుకోవాలని చెబుతున్నారు. ఎప్పుడు..ఏ విధంగా ఒడపోత కార్యక్రమానికి ఎపీపీఎస్సీ తెరలేపినా అభ్యర్ధులు మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా విజయ సంకల్పంతోనే ముందుకు సాగాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net కూడా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.!

Guntur

2022-08-31 08:00:21

ens live పొలిటికల్ ప్రొఫైల్ లో మీ పబ్లిసిటీ

మీరు రాజకీయ నాయకులా..మీరు చేస్తున్న కార్యక్రమాలు బాహ్య ప్రపంచానికి తక్కువ సమయంలో ఎక్కువగా తెలియజేయాలనుకుంటున్నారా.. అయితే దానికి సరైన వేదిక Ens Live మొబైల్ న్యూస్ యాప్ మరియు అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.esnlive.net భారతదేశపు తొలితెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్ (ఈఎన్ఎస్).. ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! ద్వారా మీ పొలిటికల్ గ్రాఫ్ ను అన్ని వర్గాల ప్రజలకు మేం తీసుకు వెళతాం. దానికి మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, రాజకీయపార్టీకి చెందిన లోగో లేదా ఫోటో, మీ చక్కనైనా పాస్ పోర్టు సైజు ఫోటో, మీ చదువు, అనుభవం, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి తదితర వివరాలు మాకు సమర్పించడమే. ఇంకెందుకు ఆలస్యం ఇపుడే 9490280270, 9390280270లో  సంప్రదించగలరు. మీకోసం బాహ్య ప్రపంచానికి తెలియజేయండి..!


Visakhapatnam

2022-08-31 04:37:45

కాష‌న్ డిపాజిట్‌పై పనిగట్టుకొని దుష్ప్ర‌చారం

తిరుమలలో కాష‌న్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్ర‌భుత్వం వినియోగించుకుంటోంద‌ని, ఈ కార‌ణంగానే ఆల‌స్యంగా భ‌క్తుల ఖాతాల్లోకి చేరుతోంద‌ని కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఇలాంటి అవాస్త‌వాల‌ను భక్తులు న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది. కాష‌న్ డిపాజిట్ సొమ్మును భ‌క్తుల ఖాతాల్లోకి పంపుతున్నామ‌ని తెలియ‌జేసింది. ఈ విష‌యంలో అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసిన ఎంఎల్‌సి  బీటెక్ ర‌విపై టిటిడి అధికారులు సోమ‌వారం తిరుమ‌ల టూ టౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు క‌రంట్ బుకింగ్‌, ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో గ‌దులు బుక్ చేసుకుంటున్నారు. భ‌క్తులు గ‌దులు ఖాళీ చేసిన త‌రువాతి రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌లోపు కాష‌న్ డిపాజిట్ రీఫండ్ ఎలిజిబిలిటి స్టేట్‌మెంట్‌ను అధీకృత బ్యాంకులైన ఫెడ‌ర‌ల్ బ్యాంకు లేదా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుల‌కు పంపడం జ‌రుగుతుంది. ఈ బ్యాంకుల అధికారులు అదేరోజు అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌లోపు(బ్యాంకు ప‌నిదినాల్లో) సంబంధిత మ‌ర్చంట్ స‌ర్వీసెస్‌కు పంపుతారు. 

మ‌ర్చంట్ స‌ర్వీసెస్ వారు మ‌రుస‌టిరోజు క‌స్ట‌మ‌ర్ బ్యాంకు అకౌంట్‌కు పంప‌డం జ‌రుగుతుంది. క‌స్ట‌మ‌ర్ బ్యాంకు వారు సంబంధిత అమౌంట్ క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్‌(ఏఆర్ నంబ‌రు)ను, సొమ్మును సంబంధిత భ‌క్తుల అకౌంట్‌కు పంపుతారు. క‌స్ట‌మ‌ర్ బ్యాంకు వారు భ‌క్తుల అకౌంట్‌కు సొమ్ము చెల్లించ‌డంలో జాప్యం జ‌రుగుతోంద‌ని టిటిడి గుర్తించ‌డం జ‌రిగింది. ఒక‌వేళ భ‌క్తులు యాత్రికుల స‌మాచార కేంద్రాలు, కాల్ సెంట‌ర్, ఈ-మెయిల్‌ ద్వారా స‌మ‌స్య‌ను టిటిడి దృష్టికి తీసుకొచ్చిన ప‌క్షంలో పైవివ‌రాల‌తో సంబంధిత బ్యాంకుల్లో విచార‌ణ చేయాల‌ని భ‌క్తుల‌కు సూచించ‌డం జ‌రుగుతోంది.

           రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధ‌న‌ల ప్ర‌కారం 7 బ్యాంకు ప‌నిదినాల్లో కాష‌న్ డిపాజిట్ రీఫండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జులై 11 నుండి 4, 5 రోజుల్లో రీఫండ్ చేరే విధంగా టిటిడి యుపిఐ విధానంలో రీఫండ్ చేయ‌డం జ‌రుగుతోంది. దీనివ‌ల్ల నేరుగా భ‌క్తుల అకౌంట్‌కే రీఫండ్ సొమ్ము చెల్లించ‌డం జ‌రుగుతోంది.

            ఇదిలా ఉండ‌గా కొంద‌రు వ్య‌క్తులు ప‌నిగ‌ట్టుకుని కాష‌న్ డిపాజిట్‌కు సంబంధించి టిటిడిపై దుష్ప్ర‌చారం చేయ‌డం మంచిది కాదు. వాస్తవంగా కాష‌న్ డిపాజిట్ సొమ్ము నేరుగా భ‌క్తుల ఖాతాల‌కే చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి వినియోగించుకుంటున్నాయని ఆరోపించడం శోచనీయం.  వాస్త‌వాల‌ను నిర్ధారించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టిటిడి తెలియజేస్తోంది.

Tirumala

2022-08-29 12:26:55

కొత్తజిల్లాల్లో కలెక్టర్లకు నివాస సముదాయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విభజించిన 13 జిల్లాల అభివ్రుద్ధి లక్ష్యంగా ముందుకి అడుగులు వేస్తోంది. మొన్నటి వరకూ కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాలకు స్థలసేకరణ పూర్తి చేసిన ప్రభుత్వం ఇపుడు తాజాగా కొత్త జిల్లాల్లోని కలెక్టర్లు, జెసిలు, ఎస్పీ, జిల్లా ఫారెస్టు అధికారి వంటి సివిల్ సర్వీస్ అధికారులు, జిల్లా అధికారులకు నివాస సముదాయాలను కూడా నిర్మించాలని యోచిస్తున్నది. దానికోసం కూడా ప్రభుత్వ స్థలాల ఎంపిక పూర్తిచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేసే జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఉమ్మడి 13 జిల్లాల్లో మాత్రమే సివిల్ సర్వీస్ మరియు జిల్లాశాఖలకు చెందిన అధికారులకు నివాస సముదాయాలు ఉన్నాయి. అదే తరహాలలో కొత్త జిల్లాల్లోని అధికాకులకు కూడా నివాస స్థలాలు, క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొత్తజిల్లాల్లోని చాలా మంది కలెక్టర్లు ప్రైవేటు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. మరికొందరు ఉమ్మడి జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి వారందరికీ నివాస సముదాయాలు నిర్మిస్తే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వసతి సమకూర్చినట్టు ఉంటుందని భావిస్తున్నారు.

75 ప్రభుత్వ శాఖల అధికారులకు క్వార్టర్స్..
రాష్ట్రప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల జిల్లా అధికాకులకు కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ, జెసి స్థాయిలోనే నివాస సముదాయాలను కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల నుంచి అధికారులు కొత్త జిల్లాలకు రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఇలా అయితే పరిపాలన ముందుకు సాగడం కష్టమని, కొత్త జిల్లా అభివ్రుద్ధి కష్ట తరంగా మారుతుందని భావించిన ప్రభుత్వం జిల్లా అధికారులకు కూడా నివాస సముదాయాలు కల్పించాలని చూస్తోంది. ఆ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా నిత్యం జిల్లాశాఖల అధికారులు కూడా ప్రజలకు, ప్రభుత్వానికి అందుబాటులో ఉంటారనేది ప్రభుత్వ భావన. ఉమ్మడి జిల్లాల్లో అయితే చాలా చోట్ల రెవిన్యూ క్వార్టర్స్ నిర్మించి అందులో జిల్లా అధికారులకు సముదాయాలు ఏర్పాటు చేశారు. ఇపుడు అదే విధంగా ప్రత్యేకంగా క్వార్టర్స్ ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల అభివ్రుద్ధితోపాటు కొత్త జిల్లాల్లో కూడా అన్ని రకాల మౌళిక వసతులు కూడా కల్పించినట్టు అవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు స్థలాల గుర్తింపు వేగవంతం చేస్తున్నారు.

సర్క్యూట్ హౌస్..జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లు
ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల్లో మాదిరిగా కొత్త జిల్లాల్లో కూడా ప్రభుత్వంలోని ముఖ్యమైన అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి విడిది చేసేందుకు వీలుగా సర్క్యూట్ హౌస్ లు, జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లు,  కొత్తజిల్లాల్లోకి జిల్లా పరిషత్ లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఈ విధంగా గెస్ట్ హౌస్ లు ఏర్పాటు చేయడం ద్వారా ఏ జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు ఆ జిల్లాల్లోనే ఉంటారనేది కూడా ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా విభజించి పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ.. అధికారుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉమ్మడి జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనే తమ కార్యకలాపాలు చేపడుతున్నారు. అలా చేయడం ద్వారా ప్రజలకు ప్రజా ప్రతినిధులు కూడా దూరంగా ఉంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనితో ఏ కొత్త జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, జిల్లాశాఖల అధికారులకు సంబంధించి వేర్వేరుగా నివాస సముదాయాలు, సర్క్యూట్ హౌస్ లు, జిల్లా పరిషత్ లు, గెస్ట్ హౌస్ ల నిర్మాణం చేపట్టడం ద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన ప్రజాప్రతినిధులు జిల్లాలకు వచ్చినపుడు అక్క బసచేయానికి వీలవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా కొత్త జిల్లాలకు అధికారులకు బదిలీలు జరిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివాసాలకోసం ఆలోచించే పని కూడా ఉండదు.

కొత్తజిల్లాల అభివ్రుద్ధి దిశగా అడుగులు
రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు నివాస సముదాయాలు నిర్మాణాలు చేపట్టడం ద్వారా కొత్త ప్రాంతాల్లో కూడా అభివ్రుద్ది వేగం పుంజుకుంటుందని తద్వారా కొత్త జిల్లాలకు నిజమైన గుర్తింపు, కొత్త రూపు వస్తాయని కూడా రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కొత్త జిల్లాల విభజన, అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారించినట్టుగా కూడా కనిపిస్తుందని రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వ పరంగా భవనాలు, క్వార్టర్స్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరిగితే ప్రైవేటు పరంగా కూడా విద్యా సంస్థలు హోటళ్లు, కమర్షియల్ మాల్స్ ఇలా అన్ని రకాలుగా కూడా కొత్త జిల్లా కేంద్రాలు అభివ్రుద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో జరిగిన అభివ్రుద్ధి కంటే కొత్త జిల్లాలో మరింత ఎక్కువగా జరగాలంటే ప్రభుత్వపరంగా నిర్మాణాలు ఉండాలని సీఎం వైఎస్ జగన్ భావించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆలోచన మేరకు అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు, గెస్ట్ హౌస్ లు, జిల్లా పరిషత్ ల నిర్మాణాలు జరిగితే 2024 తరువాత వచ్చే ప్రభుత్వం మరింతగా కొత్త జిల్లాలను అభివ్రుద్ధి చేయడానికి ఆస్కారం వుంటుంది. ఇప్పటికే కొత్తజిల్లా కేంద్రాలు కొద్ది కొద్దిగా రూపు రేఖలు మారుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ శాస్వత ప్రభుత్వ నిర్మాణాల ఆలోచన మరింతగా అభివ్రుద్ధికి బాటలు వేయనున్నది.

Amaravati

2022-08-29 01:58:02

వినాయకచవితికి ఎలాంటి ఆంక్షలు లేవు

వినాయక చవితి నిమజ్జనం ఘనంగా జరుపుకోవడానికి పోలీసు శాఖ సహకరిస్తుంది..పండుగ నిర్వహణకుఎటువంటి ప్రత్యేక ఆంక్షలు విధించటం లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎప్పటిలాగే వినాయక నిమజ్జనం ఘనంగా జరుపుకోవాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత ఎస్పీ, కమిషనర్, డీఐజీను సంప్రదించాలని సూచించారు. పోలీసు సిబ్బంది సైతం నిమజ్జన కమిటీలతో సమన్వయం చేసుకుని పని చేస్తున్నాయని పేర్కొన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లలో ముందుగా సమాచారం అందించాలలన్నారు. అంతేకాకుండా ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి కూడా  తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన వివరాలు తెలియజేయాలన్నారు. పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలన్నారు.

 పందిళ్ళు, మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నింబంధనలు 2000 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా స్పీకర్లను వినియోగం ఉండాలన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాటిని వినియోగించాలని, మండపాల వద్ద క్యూలను మేనేజ్ చేసే భాద్యతను పోల్లీసు శాఖ తో పాటు ఆర్గనైజయింగ్ కమిటీ తీసుకోవాలన్నారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ  ప్రతినిధులు కాపలా ఉండాలని సూచించారు. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్ లకు ఆదేశాలు జారిచేసినట్టు వివరించారు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు, వేషధారణలు, డీజేలపై స్థానిక పోలీసులకు సమాచారం అందించడం తప్పని సరి స్పష్టం చేశారు.

Guntur

2022-08-28 16:36:10

సీఎం ప్రకటనతో కుప్పకూలిన ఫ్లెక్సీ బ్యానర్లు

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష్ పార్టీల నాయకులు,  ప్రభుత్వ అధికారులు ఎక్కడి వస్తే అక్కడ ఫ్లెక్సీ..పుట్టినరోజుకి ఫ్లెక్సీ..ఎవరైనా చనిపోతే ఫ్లెక్సీ..సినిమా ప్రచారాలు..ప్రముఖల పర్యటనలు ఇలా దేనికైనా ప్లాక్టిక్ ఫ్లెక్సీలే..ఇవన్నీ ఆగస్టు 26 వరకూ మాత్రమే.. ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి విశాఖలో ప్లాస్లిక్  ఫ్లెక్సీలపై నిషేధం ప్రకటించిన తరువాత ఒక్కసారిగా ఫ్లెక్సీలు,  ప్రింటర్లు అంతా కుప్పకూలిపోయాయి. ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు వేయకూడదని..వాటిపై నిషేదం ప్రకటిస్తున్నామని చెప్పిన ప్రకటన అన్ని వర్గాలు, వ్యారస్తులు, కంపెనీలు, సినిమా పరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేటివరకూ కిరాణా షాపుల్లో నేటికీ ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రభుత్వం హెచ్చరికలు చేసినా నియంత్రించలేకపోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లలోనే మంచినీరు.. కూల్ డ్రింకులు..ఆఖరికి షాపింగ్ మాల్ లో సామాన్లు తెచ్చుకోవడానికి కూడా ప్లాస్టిక్ కవర్లు మాత్రమే వినియోగిస్తున్నారు. వీటిపై నిషేదం వున్నా ఎక్కడా అమలు కావడం లేదు. ఈ తరుణంలో సీఎం చేసిన ప్రకటన ఒక్కసారిగా వ్యాపార వర్గాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. వాస్తవానికి ప్లాస్టిక్ నియంత్రణ మానవాళి మనుగడకు శాపంగా మారిన తరుణంలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగా అవి ఎక్కడా అమలు కావడం లేదు. అలాంటిది ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ ప్రకటించగానే అవి ప్రింటింగ్ చేసే ప్రింటర్లు, పరిశ్రమల వారంతా లబో దిబో మంటున్నారు. 

ప్రింటర్ల మనుగడ ప్రశ్నార్ధకం
ఇప్పుడిప్పుడే మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఫ్లెక్సీ  ప్రింటర్లు ఏర్పాటు చాలా జోరుగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇపుడు ప్రతీ చిన్నకార్యక్రమానికి ఫ్లెక్సీలు ప్రింట్ చేయించడం అలవాటు చేసుకున్న సమయంలో ఒకేసారి దానిని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించడం ఒకింత ప్రజాప్రనిధులకు కూడా మింగుడు పడటం లేదు. ఇకపై ఏ గ్రామానికి వెళ్లినా రంగు రంగుల ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిదారి కనిపించాయా..వారి చుట్టూ సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకునే పరిస్థితిలు ఇపుడు అధికంగా ఉన్నాయి. అలాగని గుడ్డపై ప్రింటింగ్ వేయిస్తే ప్లాస్టిక్ ఫ్లెక్సీ కంటే రెండింతలు రేటు అధికం అవుతుంది. రేటు పోయినా..ఫ్లెక్సీలో కనిపించినంతగా గుడ్డపై ప్రింటింగ్ కనిపించదు ప్రజలను ఆకట్టుకోదు. ఈ తరుణంలో ప్రింటర్లు, వారికి అత్యధికంగా వ్యాపారాలు ఇచ్చే ప్రజాప్రతినిధులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఫలింతంతా ఫ్లెక్సీ ప్రింటర్ల మనుగడ ప్రశ్నార్ధకం కానుంది. సీఎం ప్రకటనలో ఉన్న ప్రింటర్లంతా వాటిని బేరం పెట్టే పనిలో పడతారనే ప్రచారం కూడా అపుడే ప్రారంభమైంది.

ప్రభుత్వ కార్యాలయాల్లోనే అత్యధిక వినియోగం
ప్రభుత్వం ప్లాస్టిక్ పై బ్యాన్ ప్రకటించడం శుభ పరిణామమే అయినా వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అత్యధికంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వినియోగం అధికంగా జరుగుతుంది. ప్రజలకు అవసరయ్యే విధంగా ఏర్పాటు చేసే బోర్డులు కూడా ప్రభుత్వశాఖల్లోనే అధికంగా ప్రింట్ చేయిస్తుంటారు. ప్రతీ కార్యాలయం ముందు, కార్యాలయం లోపల కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తిచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, ఇతర మండల కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా బోర్డులన్నీ ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసినవే ఉన్నాయి. ప్రజాప్రతినిధులు ఎంత ఎక్కువగా ఫ్లెక్సీలు వినియోగిస్తారో..దానికి వందరెట్లు రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరుగుతుంది. ఈనేపథ్యంలో సీఎం చేసిన ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తో అందరి గొంతులోనూ పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యాలయాలు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. వాటిని సీఎం ప్రకటన నేపథ్యంలో తొలగిస్తారా అంటే ఏ ఒక్క అధికారి  దగ్గర నుంచీ సరైన సమాధానం ఇంకా వెలువడలేదు.

ప్లాస్టిక్ కవర్లనే నియంత్రించలేకపోయారు..?
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్నే పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోయింది. ఈ తరుణంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తే అలమలు జరుగుతుందా అంటే ఖచ్చితంగా అమలు జరగదని..ప్లాస్టిక్ ఫ్లెక్సీల వరకూ అనుమతులు మళ్లీ అత్యధిక మంది అభ్యర్ధనతో తిరిగి అనుమతిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి చేసిన ప్రకటనకు, సింగిల్ యూజ్ ప్లిస్టిక్ నియంణత్రకు తీసుకున్న కఠిన నిర్ణయాలు గాలికి ఎగిరిపోయినట్టే అవుతుందనే వాదన కూడా మరో వైపు బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రముఖ కంపెనీలు సీతల పానియాలు, మంచినీరు, ఇతర ఉత్పత్తులన్నీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిళ్లలోనే పెట్టి వ్యాపారాలు చేస్తున్నాయి. వాటిపై నాటి నుంచి నేటి వరకూ ఎక్కడా నిషేధం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచంలో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గ్లాసులు వ్యర్ధాలనే పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. అలాగని అవి తయారు చేసే సంస్థలపై చర్యలు తీసుకుంటారా అంటే ఆ ఒక్కటీ ప్రభుత్వం చేయడం లేదు. ప్లాస్టిక్ వినియోగించేవారిపైనా.. చిన్న చిన్న వ్యాపార సంస్థలపైనా కేసులు నమోదు చేస్తున్నది. ఇలాంటి తరుణంలో సీఎం చేసిన చేసిన ప్లాక్ ఫ్లెక్సీలు రద్దు ప్రకటన ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సీఎంచేసిన  ప్రకటనతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా నేటి వరకూ ఏ ఒక్కరూ తమ తమ కార్యాలయాలతోపాటు పార్టీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ఫ్లెక్సీలను మాత్రం తొలగించకపోవడం విశేషం.

సీఎం ప్రకటన  ఆచరిస్తే గ్రీన్ ఏపీగా రూపాంతరం 
ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, కవర్లు, గ్లాసులు, బాటిళ్లు ఇతర సింగిల్ యూజ్ ప్లాస్లిక్ ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించగలిగితే రాష్ట్రం గ్రీన్ ఏపీగా అవతిరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అలా జరగాలంగే చాలా అడ్డంకులను ఎదుర్కొని ప్రజలను చైతన్యవంతులను చేస్తే తప్పా అది సాధ్యం కాదు. అన్నింటికంటే ముందుగా ప్లాస్టిక్ బాటిళ్లు తయారు చేసే సంస్థలను ప్రభుత్వం పనిగట్టుకొని నియంత్రించాల్సి వుంటుంది. అయితే అది జరిగే వీలు లేదు సరిగా ఆ పనిగా మాత్రం కార్య రూపంలో  కనిపించడం లేదు. భూమిని తినేస్తున్న ప్లాస్టిక్ బూతాన్ని తరిమికొట్టాలంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగంపై బ్యాన్ విధించాల్సి వుంటుంది. అలా జరిగిన క్రమంలో కొంత మేరక వినియోగం నేరుగా తగ్గే పరిస్థికి వస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో ప్రకటించిన ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోందనని విశ్లేషకులు రక రకాల అంచాలు వేస్తున్నారు. చూడాలి ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ స్టేట్ గా మార్చాలనుకున్న సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కల ఏ మేరకు సాకారం అవుతుందనేది.. కాకపోతే ఖచ్చితంగా అవ్వాలనే ప్రతీ ఒక్కరం కోరుకుని.. ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది..లేదంటే ఇదే ప్లాస్టిక్ భూమితోపాటు జీవకోటి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుంది..!

Guntur

2022-08-28 04:09:08

ఇక ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదు

సామజిక మాధ్యమాల్లో న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోవడంపై హైకోర్టు మండిపడింది. అంతేకాకుండా కోర్టులపై బాధ్యతరహితంగా వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది.  సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు విపరీతంగా పెరిగిపోయాయని వ్యాఖ్యానించిన హైకోర్టు  కోర్టులు, న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా, ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని సుమోటోగా తీసుకుంది.  నమోదైన కేసులో హైకోర్టుకు క్షమాపణలు తెలిపానని చంద్రశేఖర్ వాదనలు వినిపించారు.  తనను ప్రతివాదుల జాబిత నుంచి తొలగించినా .. సీబీఐ అరెస్ట్ చేసి పది రోజులు జైల్లో పెట్టిందన్నారు.  వాటిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఆ పై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Guntur

2022-08-27 14:04:30

అయ్యా మహాప్రభో మాగోడు కాస్త వినండి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని  కార్యక్రమాల, సంక్షేమ పథకాలపై ప్రచారారం, సామాచా రాన్ని ప్రజలకు మీడియా ద్వారా చేరవేసే సమాచార, పౌరసంబంధాల శాఖను సిబ్బంది కొరత అత్యంత తీవ్రంగా వేధిస్తోంది. ఉమ్మడి 13 జిల్లాల్లోనే అనుకుంటే..ఇపుడు ఆ ఇబ్బందులు కొత్త 13 జిల్లాల్లో మరింత అధికం అయ్యాయి. సిబ్బంది కొరత సమాచారశాఖను దారుణంగా వెంటాడుతుండటంతో అన్నిపనులూ ఉన్న కొద్దిపాటి సిబ్బందే చేసుకోవాల్సి వస్తున్నది. దీనితో సరైన సమాయానికి మీడియాకి ప్రభుత్వ సమాచారం ఇవ్వడానికి వీలుపడటం లేదు. ప్రభుత్వం రాష్ట్రంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ఖాళీలలను అంచెలంచలుగా భర్తీచేస్తున్నప్పటికీ ప్రభుత్వ సమాచారం ప్రజలకు తెలియజేసే సమాచారశాఖపట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్నట్టే కనిపిస్తోంది. ఏళ్ల తరబడి ఈ శాఖలో ప్రధాన విభాగాల ఖాళీలు భర్తీకావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉండాల్సిన సిబ్బందిలో కనీసం సగం కంటే తక్కువగా ఉండంటంతో కొత్త జిల్లాల్లో కూడా సమాచారశాఖ కార్యాలయంలో కేవలం ముగ్గురు, నలుగురు సిబ్బందితోనే నెట్టుకు రావాల్సిన దుస్థిని ఏర్పడుతోంది. దీనితో మహా ప్రభో మా శాఖలో సిబ్బంది లేక నానా పాట్లు పడాల్సి వస్తోంది.. దయచేసి కొద్దిమందినైనా నియమించాలని రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని సమాచారశాఖ అధికారులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అన్నిశాఖల మంత్రుల వద్ద తమశాఖ గోడును వెల్లబోసుకుంటన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం.

సమాచారశాఖలో ఉండాల్సిన సిబ్బంది
సమాచార, పౌరసంబంధాల శాఖలో ప్రభుత్వ సమాచారాన్ని సంక్షేమ పథకాల వివరాలను సకాలంలో మీడియాకి అందించాలంటే కింద పేర్కొన్నట్టుగా సిబ్బంది ఉండాల్సి ఉంది. జిల్లా పౌరసంబంధాల అధికారి, సహాయ పౌరసంబంధాల అధికారి, ఫోటో గ్రాఫర్, కార్ డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, వీడియో గ్రాఫర్, కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, జూయిర్ అసిస్టెంట్, కంపోజర్ లేదా మెసెంజర్, ప్రొజక్షన్ ఆపరేటర్,  అటెండర్ ఉండాల్సి వుంది. ఉమ్మడి 13 జిల్లాల్లోనే ఈ శాఖలో ప్రభుత్వం ఈ విధంగా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. దానితో ఆయా విభాగాల్లోని సిబ్బందిని అత్యవసర పనులకు వినియోగించుకుంటూ కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారు ఈ శాఖలోని అధికారులు. అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్ కార్యక్రమాలు, ఎపుడైనా మంత్రుల కార్యక్రమాలు తప్పితే..ఇతర జిల్లాశాఖల వివరాలు మీడియాకి ఇవ్వడం లేదు. అదేంటని ప్రశ్నిస్తే..మాకు సమయం అంతా కలెక్టరేట్ ని కవర్ చేయడానికే సరిపోతుందని, సిబ్బంది లేకపోతే ఉన్న కొద్దిమందితో ఎలా అన్ని ప్రభుత్వశాఖల సమాచారాన్ని ఇవ్వగలమని తిరిగి ప్రశ్నిస్తున్నారు.

అక్కరకు రాని ఏపీఆర్వోల నియామకాలు..
సమాచారశాఖలోని అధికారులు నెత్తీనోరూ కొట్టుకుంటే ప్రభుత్వం గతంలోని ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు 13 మంది ఏపీఆర్వోలను మాత్రమే నియమించి ఊరుకుంది. వారంతా ఉమ్మడి జిల్లాలకే డీపీఆర్వోలు, డీడీ, ఏడీల దగ్గర పరిమితం అయిపోయారు. చాలా సంవత్సరాల నుంచి ఈ శాఖలో ఫోటోగ్రాఫర్లు, ఏపీఆర్వోలు, కార్యాలయ 4వ తరగతి సిబ్బంది ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీనితో ఉన్న సిబ్బందితోనే సమాచారశాఖ సర్ధుకొని పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల్లో ఒకటిగా వున్న ఈ శాఖలో ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులను నియమించాల్సి వున్నా.. కారుణ్య నియామకాల్లో తప్పా ప్రత్యేకంగా ఈ శాఖకు సరిపడ సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. ప్రభుత్వాలు మారినా..ఈ శాఖకు ప్రత్యేకంగా మంత్రులు వచ్చినా కూడా ఎందుకనో ఇక్కడ మాత్రం నియామకాలు చేపట్టడం లేదు ప్రభుత్వం. 

నోటిఫికేషన్లకు అతీగతీలేదు
గత కొన్ని నెలల క్రితం పరిమితంగా డీపీఆర్వోలు, ఏపీఆర్వో రెగ్యులర్ ఉద్యోగాలకు ఏపీలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా వాటికి పోటీ పరీక్ష నేటివరకూ పెట్టకపోవడం విశేషం. ఆ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు పరీక్షలు పెడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలో కూడా తెలియడం లేదని సదరు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నవారు వాపోతున్నారు. పాత ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఇచ్చిన ఆ నోటిఫికేషన్ లో ఇపుడు తాజాగా కొత్త పోస్టులను పెంచడానికి ఆ పోటీపరీక్ష నిర్వహించ లేదా..? లేదంటే పూర్తిగా రద్దు చేయడానికి ఇంత ఎక్కువ కాలం పరీక్ష్ పెట్టలేదా? అనే ప్రశ్నలకు సమాచారశాఖ, ఏపీపీఎస్సీ నుంచి సమాధానం నేటికీ రాలేదు.

రాష్ట్రంలో అరకొరగానే మీడియాకి సేవలు..
ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో మీడియాకి సమాచార, పౌరసంబంధాల శాఖ ద్వారా మీడియాకి సహకారం పూర్తిగా తగ్గిపోయింది. ఉన్న ఆ కొద్ది మందిలో వేళ్లపై లెక్కపెట్టే జిల్లాలు మాత్రమే మీడియాకి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందిస్తూ సహకారం అందిస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో ప్రెస్ అక్రిడిటేషన్లు, పెద్ద, చిన్న పత్రికలు, టీవీఛానళ్ల నెపంతో అనుకున్నవారికి తప్పా ఇతర చిన్న, మధ్యతరహా మీడియాకి సమాచారం అందించడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే తమకు కమిషనర్ నుంచి ఆదేశాలున్నాయని చెప్పి తప్పించుకుంటున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోలేని మీడియా సంస్థలకు, పత్రికలకు స్థానిక జిల్లా అధికారులు తప్పా.. ఇతర జిల్లాల డీపీఆర్వోలు, డీడీలు, ఏడీలు సమాచారం ఇవ్వడంలో కరాఖండీగా వ్యవహరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ సమాచారం ఎన్ని జిల్లాలకు  మీడియా ద్వారా వెళితే అంతగా జిల్లా సమాచారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తెలుస్తుందనే విధంగా అధికారులు వ్యవహరిస్తూ అన్ని రకాల మీడియాకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిజంగా కమిషనర్ చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలను పట్టించుకోనవసరం లేదని చెప్పారో లేదో తెలియదు గానీ..అడ్మిన్ యాక్సెస్ మాత్రమే ఉన్న ప్రెస్ వాట్సప్ గ్రూపుల్లో కూడా నెంబర్లు యాడ్ చేయడానికి ఆయా జిల్లాల్లోని డిపీఆర్వోలు తెగ నొప్పులు పడిపోతున్నారు. 

ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, సమాచారశాఖ మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లినా అటు సమాచాశాఖ కమిషనర్ నుంచి గానీ, డీపీఆర్వోల నుంచి గానీ ఎక్కడా చలనం రాకపోగా..సహకారం అందించే డీపీఆర్వోలపై మీడియాను దూరం పెట్టే ఇతర డీపీఆర్వోలు గొడవలకు దిగుతుండటం విశేషం. చాలా సంవత్సరాల నుంచి సమాచారశాఖలో ఏపీ కేడర్ కి చెందిన అధికారులను నేరుగా కమిషనర్లుగా నియమించకపోవడం, రాష్ట్రంలో జిల్లాల్లో మీడియాకి సమాచారశాఖ ద్వారా అందుతున్న సేవలను కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో సమీక్షలు జరగక పోవడం వలనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చిన్న, మధ్య తరహా మీడియా ఆవేదన వ్యక్తం చేస్తున్నది. చూడాలి ఇప్పటికై ప్రభుత్వం సమాచార శాఖలోని ఖాళీలు భర్తీచేసి, మీడియాకి పూర్తిస్థాయిలో సమాచారం ఇస్తుందో లేదంటే ఎప్పటి మాదిరిగానే ప్రభుత్వ సమాచారాన్ని మీ పత్రిక, ఛానల్ లో వేయకపోతే దేశానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని మాట్లాడుతున్నట్టుగా అలాగే వదిలేస్తుందో అనేది..!

Guntur

2022-08-27 02:35:37

సీఎం YS.జగన్ ప్రకటనతో ఉలిక్కిపడ్డ ఏపీ

సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి విశాఖలో సంచనల ప్రకటన చేశారు. దీనితో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉలిక్కిపడింది. ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.  శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. ఈ వేదిక నుంచే ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై బ్యాన్‌ ప్రకటించడంతో అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అత్యధికంగా ప్లాస్టిక్ ప్లెక్సీలతో ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఇంకా సీఎం ఏమన్నారంటే..  పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని, గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.  ఉదయం కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలను వలంటీర్లు క్లీన్‌ చేశారు. ఈ సందర్భాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. ఈరోజు విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగిందన్నారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోందని.. అందుకే సముద్రాన్ని మనమంతా కాపాడుకోవాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలోని సాగర తీరప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరూ తీసుకోవాలని పిలుపు నిచ్చారు.

పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుందని... రీసైకిల్‌ చేసి పలు ఉత్పత్తులు తయారు చేయడంతోపాటు..పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్‌..  2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మార్చి చూపిస్తామన్నారు. ప్లాస్టిక్‌ నుంచి రీసైక్లింగ్‌ నుంచి తయారు చేసిన షూస్‌, కళ్ల జోడులను స్వయంగా ధరించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు పార్లే సంస్థ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-26 06:52:52

ens న్యూస్ ఏజెన్సీకి subeditors కావలెను

భారతదేశపు తొలితెలుగు నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)..ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! అధికారిక మొబైల్ న్యూస్ యాప్ EnsLive అరచేతిలో విశ్వవార్తల సమాహారం.. మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్, త్వరలో రానున్న దినపత్రిక లో పనిచేసేందుకు సబ్ ఎడిటర్లు కావలెను, అభ్యర్ధులు కనీసం డిగ్రీ చదివి ఉండి.. అన్ని రకాల అంశాలను న్యూస్ ఫార్మాట్ లో రాయడంతోపాటు, ఇంటర్నెట్ పై పూర్తిస్థాయి అవగాహన, వార్తలను చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో ఎడిటింగ్ చేయగల సామర్ధ్యం కలిగి వుండాలి. అభ్యర్ధులు కనీసం డిగ్రీ పాసై ఉండాలి..జర్నలిజం చదివి, గతంలో మీడియాలో పనిచేసిన వారికి  ప్రాధాన్యత ఇవ్వబడును.  ఆశక్తి ఉన్నవారు 9490280270, 9390280270లో వెంటనే సంప్రదించగలరు. ఎంపికైన వారికి గుర్తింపు కార్డుతోపాటు, ఆకర్షణమైన జీతం ఇవ్వబడును.

Visakhapatnam

2022-08-26 06:23:32

ప్రకృతి వ్యవసాయంపై జిల్లాలో శిక్షణలు

రసాయన ఎరువులు క్రిమిసంహారక మందుల నుంచి నేల తల్లిని కాపాడటమే ధ్యేయంగా,  ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రతి జిల్లాలో పెద్ద  ఎత్తున రైతు శిక్షణా  కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శ్వేతా భవనం లో గురువారం టీటీడీ గోసంరక్షణ శాల  ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులకు, రాష్ట్రంలోని నోడల్ గోశాలల నిర్వాకులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం చేపట్టింది.  కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా  సుబ్బారెడ్డి మాట్లాడుతూ,  దేశంలో ఎక్కడా  లేని విధంగా ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ఏర్పాటు చేసి రైతులను ఈ దిశగా అడుగులు వేయిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా టీటీడీ కూడా గో సంరక్షణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు టీటీడీ గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తోందన్నారు.

నోడల్ గో శాలలు తమ పరిధిలో ఉన్న గోశాలలను సమన్వయం చేసుకుంటూ,  వాటి నిర్వాహకులకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు.  ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు టీటీడీ ఉచితంగా ఆవులు, ఎద్దులు ఇస్తోందన్నారు. రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి,  ఆ ఉత్పత్తులను టీటీడీ ఎలా సేకరిస్తుందనే అంశాలపై నిపుణులతో అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరూ తమ పరిధిలోని మిగిలిన రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించాలని చైర్మన్ పిలుపునిచ్చారు. గో పోషణకు ఇబ్బంది ఉన్న గోశాలల ను ఆదుకునే ఆలోచన చేస్తామన్నారు.

గో ఆధారిత వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి గత ఏడాదిన్నరగా ప్రసాదాలు తయారు చేస్తున్నామని, ఇది శాశ్వతంగా కొనసాగేందుకు రైతులను  గో ఆధారిత వ్యవసాయం వైపు నడిపించే లా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. రైతులు గో ఆధారిత వ్యవసాయం పై దృష్టిపెట్టి నేలతల్లిని, తద్వారా మానవాళిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇస్కాన్ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు రేవతి రమణ దాస్ మాట్లాడుతూ, టీటీడీ గోవు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలిపేలా చేపట్టిన కార్యక్రమాలు  అభినందనీయమన్నారు. ఆవు పాలు అల్జీమర్స్ రాకుండా చేయడానికి  మంచి మందులా పని చేస్తాయన్నారు.  గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం అంశాల్లో  ఇస్కాన్  టీటీడీ తో కలసి పనిచేస్తోందన్నారు. గోమాత వైశిష్ట్యం, గో ఆధారిత వ్యవసాయం వలన సమాజానికి కలిగే  మేలును ఆయన వివరించారు.

టీటీడీ  గో సంరక్షణ కమిటీ సభ్యులు  రామ్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ,  రైతుల గురించి అప్పట్లో దివంగతముఖ్యమంత్రి వైయస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచించి ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణాల మాఫీ లాంటి కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. ఆయన కుమారుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రకృతిని కాపాడటానికి రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తున్నారన్నారు. స్వతహాగా రైతు బిడ్డ , గో ప్రియుడు అయిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.  టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి,  జెఈవో లు సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, గోశాల  డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి , శ్వేతా డైరెక్టర్  ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న  తిరుపతి జిల్లా డివి సత్రం కు చెందిన రైతులకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 8 గోవులను ఉచితంగా అందించారు. గోవులను తీసుకుని వెళుతున్న వాహనాన్ని ఆయన ఈవో  ధర్మారెడ్డి ,జె ఈవో లు సదా భార్గవి  వీర బ్రహ్మం తో  కలసి జెండా ఊపి సాగనంపారు .

Tirupati

2022-08-25 14:03:47

ENS న్యూస్ ఏజెన్సీకి రిపోర్టర్లు కావలెను

భారతదేశపు తొలితెలుగు నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)..ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..! అధికారిక మొబైల్ న్యూస్ యాప్ EnsLive అరచేతిలో విశ్వవార్తల సమాహారం.. మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ కి ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో పనిచేసేందుకు జిల్లా రిపోర్టర్లు, కెమెరామాన్లు, అడ్వర్ టైజ్ మెంట్ మేనేజర్లు కావలెను. కనీసం డిగ్రీ చదివి ఉండి.. తెలుగులో వార్తలు కంపోజ్ చేయగల సామర్ధ్యం, సామాజిక రాజకీయ అంశాలపై అవగాహన కలిగిఉండాలి. యాడ్స్ మేనేజర్లకు అన్ని రకాల ప్రకటనలు సేకరించడంలో అవగాహన ఉండాలి. ఆశక్తి ఉన్నవారు 9490280270, 9390280270లో వెంటనే సంప్రదించగలరు. ఎంపికైన వారికి ప్రెస్ అక్రిడిటేషన్ సౌకర్యంతో పాటు ఆకర్షణమైన జీతం, టార్గెట్లు ఉంటాయి.

Amaravati

2022-08-25 06:35:16