1 ENS Live Breaking News

గ్రామ సచివాలయాల్లో అవినీతి రాబంధులు-2

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాల్లో ఈ-క్రాప్ బుకింగ్ లో కోట్ల రూపాయాల్లో జరిగిన అవినీతి వెనుక చాలా పెద్ద పెద్ద తలకాయలే ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న సర్వీసుల్లో చేరిన సచివాలయాల్లోని అగ్రికల్చర్, హార్టికల్చర్ విలేజ్ అసిస్టెంట్లకు అసలు స్థానికంగా వున్న బినామీ రైతులు, భూములు, సర్వే నెంబర్ల జాబితాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై లోతుగా పరిశోధన జరుగుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతున్న ఈ-క్రాప్ బినామీ స్కామ్ వెనుక భారీ గుంటనక్కలు దాగివున్నాయని చెతున్నారు. ప్రభుత్వం రైతులకు పంటనష్టాలు ఈక్రాప్ లో నమోదైన మొత్తాలన్నింటికీ పరిహారం ఇస్తుందని రాష్ట్ర సచివాలయం నుంచి సమాచారం అందుకునే రాష్ట్రవ్యాప్తంగా ఈ భారీ అవినీతికి పాల్పడినట్టు ఇప్పుడిప్పుడే అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన రెవిన్యూ రికార్డులు, సర్వే నెంబర్ల జాబితా మొత్తం సేకరించడంతోపాటు, వ్యవసాయశాఖలో రైతులు, కౌలు రైతుల జాబితాలను సేకరించి భారీమొత్తాన్ని కొల్లగొట్టడానికి పథక రచన చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల్లోని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు చెబుతున్న లెక్కలు, షోకాజ్ నోటీసులు ఇచ్చిన మొత్తాలు చూస్తుంటే ఇందులో ఎవరి పరిధిలో వారు చక్కగా సర్దేసుకున్నట్టుగానే కనిపిస్తున్నది..

సర్వేశాఖతో కాకుండా రెవిన్యూశాఖతో విచారణ..?
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు పాల్పడిన బినామీ బాగోతాన్ని వాస్తవానికి జిల్లా అధికారులు సర్వేశాఖతో విచారణ చేయిస్తే ఏ సర్వే నెంబరులో ఎంతెంత పరిధిలోని విస్తీర్ణంలో భూములు ఉన్నాయనే విషయం బయటకు తెలుస్తుంది. కానీ అధికారులు తెలివిగా రెవిన్యూశాఖలోని వీఆర్వోలు, ఆరఐలతో విచారణ చేపడుతున్నారని ఈ విషయంలో ముందుగానే రెవిన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్ సిబ్బంది గ్రామపరిధిలోనే మిలాఖత్ అయినట్టు తెలిసింది. పంపకాలు, పర్శంటేజీలు కుదిరన చోట రికార్డులు బాగానే ఉన్నాయని, వీరిచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా అధికారులు కూడా ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మమ అనే విచారణ పూర్తిచేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అంతే తప్పా అసలు భూముల రికార్డులకు సంబంధించి సర్వేశాఖలోని గ్రామ సర్వేయర్లతోగానీ, మండల సర్వేయర్లతో గానీ విచారణ చేయించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. కోట్ల రూపాయాల్లో అవినీతి జరగడంతో రెవిన్యూ అధికారుల వద్ద అయితేనే రికార్డులు సక్రమంగా ఉంటాయని జిల్లా అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు విచారణ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అందులోనూ విచారణ మొత్తం జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అంతా సక్రమంగానే జరుగుతుందనే విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చి తమకు అవినీతి మరకలను అంటుకోకుండా జిల్లా అధికారులు జాగ్రత్త పడుతున్నట్టుగా తెలిసింది.

తేడా వచ్చిన కోట్ల రూపాయలు అవినీతి కాదట..
ఈ-క్రాప్ బుకింగ్ లో జరిగిన కోట్ల రూపాయల అవినీతిని కప్పిబుచ్చేందుకు జిల్లా అధికారులు కూడా రోజు మాట.. పూటకో ప్రకటన మీడియాకి లీకులిస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు అగ్రికల్చర్, హార్టికల్చర్ సహాయకులు ఇచ్చిన సంజాయిషీలు నమ్మసక్యంగా లేవని ప్రకటించిన అధికారులు..ఈరోజు షోకాజ్ నోటీసులైతే ఇచ్చాం గానీ తేడాగా వచ్చిన మొత్తం అంతా అవినీతి జరిగినట్టు కాదని..అది ప్రాధమిక సమాచారం మాత్రమేనని మాట మార్చుతుండటం వెనుక జరిగిన అవినీతి మొత్తాన్ని కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలా అనుకుంటే నెల్లూరు, పశ్చిమగోదావరి, అంభేద్కర్ కోనసీమ జిల్లాల్లో సుమారు 50 మందికి పైగా వీఏఏలు, వీహెచ్ఏలను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నిస్తే.. అక్కడి సంగతి మాకు తెలియదు కానీ..మా జిల్లాల్లో మాత్రం పక్కాగా విచారణ చేపడుతున్నామని మిగిలిన జిల్లాల్లో అధికారులు రక రకాలు మాట్లాడుతుండటంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుఫాను సమయంలో పంట నష్టం పెద్దగా జరగలేదని ప్రకటించిన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు ఇపుడు ఈ-క్రాప్ బుకింగ్ పక్కాగానే జరిగిందని చెప్పడం వెనుక పలువురు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.

తేడా మిల్లర్ల దగ్గర నుంచి బినామీరైతుల సమాచారం
అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు ఈ-క్రాప్ బుకింగ్ చేసే సమయంలో కొందరు అవినీతి మిల్లర్ల దగ్గర నుంచి బినామీ రైతుల జాబితా సేకరించి ఈ భారీ స్కామ్ కి పాల్పడినట్టు తెలుస్తుంది. గతంలో మిల్లర్ల ద్వారానే ధాన్యం కొనుగోలు చేసిన సమయంలో రైతులు, కౌలు రైతులు సమాచారం మొత్తం సేకరించి ఈ-క్రాప్ పంటనష్టాలు నమోదు చేసే సమయంలో గ్రామ సచివాలయ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా నమోదు ప్రక్రియ తతంగం నడిపి ఆపై వచ్చిన మొత్తాలను కూడా నేరుగా రైతుల ఖాతాల నుంచే డ్రా చేసినట్టుగా చెబుతున్నారు. అలా డ్రా చేసిన సమయంలో అటు రెవిన్యూ అధికారులు, ఇటు అగ్రికల్చర్, హార్టికల్చర్ శాఖల్లోని కొందరు అధికారులు, రెవిన్యూ అధికారులకి ఇవ్వాలని చెప్పి పంపకాలు కూడా చేసినట్టుగా తెలిసింది. చాలాచోట్ల సక్రమంగా పర్శంటేజీలు పంపకాలు జరిగిన చోట రికార్డులు సక్రమంగా ఉన్నాయని.. అలా పంపకాలు పూర్తికాని చోట్ల మాత్రమే అవినీతి జరిగినట్టుగా బయటకి వచ్చిన తరువాత.. సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు రావడానికి కారణం అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

అవినీతిని కప్పిబుచ్చేందుకు రంగంలోకి దిగిన మధ్యవర్తులు
రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయాల్లో జరిగిన ఈ-క్రాప్ బుకింగ్ బినామీ అవినీతిని ఏం జరగనట్టుగా కప్పిబుచ్చేందుకు అన్నిజిల్లాల్లో కొందరు ఆయా నియోజకవర్గాల్లోని వచ్చే ఎన్నికల్లో సీటు దక్కదని పక్కాగా నమ్మకానికి వచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగినట్టుగా జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంతో మరికొందరు ఎమ్మెల్యేలు, ఇతర మాజీ మంత్రులు ఈ అవినీతి అంశాన్ని తమ దగ్గరకు తీసుకొచ్చి తమను మధ్యలోకి లాగొద్దని చెప్పినట్టుగా కూడా చెబుతున్నారు. అధికారికంగా అగ్రికల్చర్, హార్టికల్చర్ గ్రామసచివాలయ సిబ్బంది అవినీతికి పాల్పడినా అందులో బయటకు తెలియకుండా రెవిన్యూశాఖకు చెందిన వీఆర్వోలు, ఆర్ఐలు కొన్ని చోట్ల తహశీల్దార్లు కూడా ఉన్నట్టుగా తెలిసింది. భూములు విషయం, సమాచారం, సర్వేనెంబర్లు కేవలం రెవిన్యూ అధికారులు, సిబ్బంది దగ్గరే ఉండటంతో జరిగిన అవినీతికి సంబంధించి నొక్కేసిన మొత్తం పంచుకోవడానికి, పర్శంటేజీలు ఇప్పించడానికి రెవిన్యూ భాగస్వామ్యం అయినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యవర్తులను కూడా వీళ్లే గుర్తించి రాయబారం కూడా నడుపుతున్నట్టు తెలిసింది. ఆ విధంగా నొక్కేసిన దానిలో సింహభాగం ఇస్తే అసలు అవినీతే జరగనట్టుగా చూస్తామని సచివాలయ అవినీతి రాబంధులకు భరోసా ఇచ్చారని సమాచారం.

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రం
2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గ్రామ, వార్డు సచివాలయశాఖలోని అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు చేసిన ఈ భారీ ఈ-క్రాప్ బినామీ అవినీతినే అస్త్రాలు చేసుకోవాలని చూస్తున్నట్టుగా అపుడే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏఏ జిల్లాల్లో ఎంతెంత మొత్తంలో అవినీతి జరిగింది, ఎంత మంది సిబ్బంది సస్పెండ్ కి గురయ్యారనే సమాచారాన్ని సేకరించి ఎదురుదాడి చేయడానికి సిద్దమవుతున్నారని తెలిసింది. దానికోసం బినామీ రైతుల పేర్లతో జరిగిన మోసాన్ని బయటపెట్టి ప్రజల ముందుకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ కూడా చేపట్టినట్టుగా చెబుతున్నారు.అంతే కాకుండా ఏ బినామీ రైతుల పేర్లు, సర్వే నెంబర్లతో అయితే భారీ మొత్తంలో కొల్లగొట్టారో సదరు రైతులు, కౌలు రైతులతోనే ఆందోళనలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బినామీ రైతులే రోడ్డెక్కడం విశేషం.

ముఖ్యగమనిక..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ప్రతీ విషయాన్ని ప్రజల ముందుకి తీసుకెళ్లే భాద్యతను స్వీకరించిన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ Ens Live, అధికారికి న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా జరిగిన వాస్తవాలను ప్రత్యేక కథనాలుగా అందిస్తున్నామని తెలియజేస్తున్నాం. అంతే తప్పా సచివాలయ ఉద్యోగులపై గానీ, ప్రజాప్రతినిధులపైగానీ, ప్రభుత్వంపై గానీ ఎలాంటి తేడా అభిప్రాయాలు లేవని ప్రకటిస్తున్నాం. ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందుకి ప్రత్యేక కథనాలు తెచ్చే ఈఎన్ఎస్ భారీ స్థాయిలో జరిగిన అవినీతి విషయంలో కూడా వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా పెద్ద సాహసమే చేస్తున్నామని..అయినా అవినీతిని బయట పెట్టే ప్రక్రియలో ఎవరికీ భయపడేది లేదని కూడా దైర్యంగా ప్రకటికిస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావివ్వకుండా ప్రజల పక్షాన మాత్రమే నిలబడి, ప్రభుత్వానికి నష్టం తెచ్చిన గ్రామసచివాలయ అవినీతి రాబంధుల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గమని కూడా మాటిస్తున్నాం..!

Amaravati

2022-08-25 02:56:45

గ్రామ సచివాలయాల్లో అవినీతి రాబంధులు-1

గ్రామ సచివాలయాల్లో పట్టుమని వారి సర్వీసు మూడేళ్లు పూర్తిగా నిండలేదు.. నిన్నకాక మొన్ననే వారి 33నెలల సర్వీసు ప్రొభేషన్ రెగ్యులర్ అయ్యింది.. దానికంటే ముందుగానే ఒక్కొక్కరూ రూ.లక్షల్లో ఈ-క్రాప్ బుకింగ్ లో బినామీ పేర్లతో అవినీతి. ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయల నిలువుదోపిడీ.. ఏపీ సీఎం.వైఎస్.జగన్మోహనరెడ్డి దేశం మొత్తం తొంగి చూసేలా ఏర్పాటు చేసిన మానసపుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో కనీవినీ ఎరుగని అవినీతి.. ఇప్పటికే మూడు జిల్లాల్లో సుమారు 50 మందికి పైగా  గ్రామీణ వ్యవసాయ, గ్రామీణ వాణిజ్యశాఖలకు చెందిన సహాయకుల సస్పెండ్.. కోట్లలో అవినీతి నమోదు..ఇదే ఇపుడు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో హాట్ టాపిక్. అసలు ఏ దైర్యంతో ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారో తెలియక ఇటు అధికారులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగాల్లో చేరిన కొత్తల్లోనే లక్షల రూపాయాల్లో అవినీతికి పాల్పడితే మొత్త సర్వీసులో వీరంతా ఏ స్థాయిలో స్కాములు చేస్తారోనంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  సభలు సమావేశాల్లో ఎంతో ఘనంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోసం ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు ఎంతో గొప్పగా ప్రచారం చేస్తూ..ప్రజలకు చేరువ చేస్తున్న వేళ..ఇదేశాఖలో నియమితులైన గ్రామీణ సిబ్బంది ఇంత పెద్ద మొత్తంలో చేసిన అవినీతి మిగిలిన ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బందికి ఒక ప్రధాన చర్చగా మారిపోయింది. రాష్ట్రప్రభుత్వశాఖల చరిత్రలోనే అతిపెద్ద అవినీతిగా..అత్యధిక మంది సిబ్బంది పాలుపంచుకున్న స్కాముగా ఈ-క్రాప్ బినామీ బుకింగ్ స్కామ్ పేరుపొందింది.

అవినీతి జరిగిన విధానమెట్టిదనినా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ప్రక్రుతి వైపరీత్యాల జరిగిన వెంటనే ఆదుకునేందుకు ఈ-క్రాప్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనితో నష్టపోయిన సాగు రైతులు ఎంత విస్తీర్ణంలో పంటలు నష్టపోయారో ఈవిధానం ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. సరిగ్గా ఇక్కడే గ్రామ, వార్డు సచివాలయశాఖలో సిబ్బందిగా వున్న గ్రామీణ వ్యవసాయ, వాణిజ్యపంటల సహాయకులు బినామీ రైతులు, బినామీ విస్తీర్ణం పేరుతో ఆన్ లైన్ లో పంటల నష్టాన్ని నమోదు చేశారు. పంటల నష్టంపై ప్రభుత్వానికి భారమైనా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సిబ్బంది నమోదు చేసిన నష్టానికి పరిహారం చెల్లించింది. కట్ చేస్తే సిబ్బంది నమోదు చేసిన సుమారు 60శాతానికి పైగా భూములు, పంట నష్టాలు అన్నీ బినామీ, నకిలీ అని ప్రభుత్వ ఉన్నతాధికారులకే అనుమానం కలిగింది. దీనితో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అనుకున్న మొత్తం కంటే ఎందుకు అధికంగా నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చిందనే విషయంలో జిల్లాల్లోని వ్యవసాయశాఖ జెడీఏలు, ఏడీలు సచివాలయాల్లో పనిచేసే వీఏఏలకు, వీహెచ్ఏలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. దానితో సచివాలయ సిబ్బంది  వాటికి ఇచ్చిన సమాధానాలు పొంతన కుదరకపోవడంతో అధికారులు లోతుగా విచారణ చేయడంతో సిబ్బంది అవినీతికి పాల్పడిన విషయం బట్టబయలు అయ్యింది. ఫలితంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 24 మందిని, పశ్చిమగోదావరి జిల్లాలో 23 మందిని, కాకినాడ జిల్లాలో ఒక్కరిని ఆయా జిల్లా కలెక్టర్లు సస్పెండ్ చేశారు. పెద్ద ఎత్తున  వ్యవసాయ, వాణిజ్య పంటలశాఖలో జరిగిన అవినీతి గుప్పుమని బయటకు పొక్కింది.

4 జిల్లాల్లో 227 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు
రాష్ట్రవ్యాప్తంగా భారీ మొత్తంలో జరిగిన అవినీతికి సంబంధించి ఇప్పటి వరకూ శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లాలో 64 మందికి, కాకినాడ జిల్లాలో 80 మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో 84 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 25 మంది, గ్రామీణ వ్యవసాయ, వాణిజ్య పంటల సహాయకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే దానికి సచివాలయ వీఏఏలు, వీహెచ్ఏల నుంచి వచ్చిన సమాధానాలు సంత్రుప్తికంగా లేవని అధికారులే నిగ్గు తేల్చారు. ఇదే సమయంలో కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో షోకాజ్ విచారణ దశలోనే ఉండిపోయింది. కాని మూడు జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా సచివాలయ సిబ్బంది చేసిన తప్పు తేలడంతో నిందితులైన వారందరినీ సస్పెండ్ చేసేస్తున్నారు.

రెవిన్యూశాఖకు వాటా ఇవ్వనందుకే అసలు ముసలం..
ప్రభుత్వశాఖలైన ఆగ్రికల్చర్, హార్టికల్చర్ కు చెంది గ్రామ సచివాలయ సహాయకులు బినామీ పేర్లతో ఈ-క్రాప్ బుకింగ్ చేయడం.. ఆపై జిల్లా అధికారులు విచారణ చేసిన సమయంలో రెవిన్యూ శాఖకు చెందిన వీఆర్వోలు, ఆర్ఐలు ద్వారా అధికారులు సమాచారాన్ని సేకరించారు. ఆ సమయంలో నొక్కేసిన మొత్తంలో వాటాలు ఇచ్చిన చోట మాత్రం రికార్డులన్నీ బాగానే ఉన్నాయని..వాటాల పంపకాలు కుదరని చోట మాత్రమే అవినీతి బయటకు వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కొద్ది సమయంలోనే లక్షల రూపాయలు బినామీ పేర్లు పెట్టి.. ఆమొత్తాలను రైతుల ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నట్టు తెలుసుకున్న రెవిన్యూశాఖ సిబ్బంది గ్రామస్థాయిలో కొర్రీలు వేయడం ప్రారంభించిందని చెబుతున్నారు. మొత్తానికి పంపకాల్లోని తేడాల వలనే రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయాల్లో జరిగిన అవినీతి బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. విశేషం ఏంటంటే ఉబయ గోదావరి జిల్లాల్లో చాలా మంది వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా పదోన్నతులు పొందిన వారు కూడా ఈ అవినీతిలో భాగస్వాములుగా ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా నొక్కేసిన మొత్తంలో ఇటు మూడు శాఖలకు చెందిన గ్రామీణ సహాయకులు వారి వారి జిల్లా అధికారులకు కూడా ముడుపులు ఇవ్వాలని అక్కడ పర్శంటేజీల్లో తేడాలు బెడిసికొట్టిన పిదప అసలు విషయం రచ్చ రచ్చ అయినట్టు ఇపుడు జిల్లా అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారని తెలిసింది..

అవినీతి రుజువైనా విచారణలతోనే కాలక్షేపం..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయ శాఖలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, రెవిన్యూ విభాగాలకు చెందిన గ్రామీణ సహాయకులు కోట్లలో అవినీతికి పాల్పడినా ఇటు ప్రభుత్వం, జిల్లా అధికారులు షోకాజు నోటీసుల పేరుతో కాలయాపన చేయడం..కొన్ని జిల్లాల్లో సస్పెండ్ లు చేసి చేతులు దులుపుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ..షోకాజు నోటీసులు అందుకున్నవారు ఇచ్చిన సంజాయిషీలు సంత్రుప్తికరంగా లేవంటూనే విచారణ కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు విచారణ విశేషాలను జెసీలు, జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నామని చెబుతున్న జిల్లా అధికారులు చెప్పే మాటలకు కూడా పొంతన అస్సలు కుదరడం లేదు. ప్రభుత్వ ఉద్యోగలంలోకి వచ్చిన 33నెలలకే లక్షల రూపాయలు అవినీతికి పాల్పడిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కేవలం సస్పెండ్ లు చేసి.. రికవరీలకు పూనుకోవాలని చూడటం పట్ల కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మరోవైపు ప్రభుత్వంలోని కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖలో వెలుగుచూసిన ఈ భారీ స్కామ్ పై ఆధారాలు సేకరించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగడం కూడా విశేషం.. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన అవినీతిపై గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్య కార్యదర్శి నుంచి వ్యవసాశాఖ ముఖ్యకార్యదర్శి నుంచిగానీ, ప్రభుత్వం నుంచి నేటి వరకూ ఎలాంటి ప్రకటనా రాలేదు. చూడాలి ప్రభుత్వశాఖలో అతి పెద్ద భారీ అవినీతి విషయంలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!

tadepalli

2022-08-24 04:31:58

గ్రామ సచివాలయశాఖలో రూ.కోట్లలో స్కామ్..!

తాడితన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు ఇంకొకడుంటాడని ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్ శాఖకు చెందిన గ్రామీణ సహాయకులు నిరూపించారు.. ఒక్కొక్కరూ బినామీ రైతుల పేర్లతో రికార్డులు స్రుష్టించి పది లక్షలకు పైగానే అడ్డంగా నొక్కేసి జిల్లా అధికారులతో సహా పంచేసుకున్నారు. కొన్ని చోట్ల ఈ విషయం బయటకు పొక్కకపోయినా.. కొన్ని జిల్లాల్లో నొక్కేసిన మొత్తం లక్షలు, కోట్లు దాటేయడం, బినామీలుగా చూపించి రైతులు రోడ్డెక్కడంతో జరిగిన అవినీతిపై అధికారులు విచారణ చేపడితే డొంకంతా కదులుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అత్యధికంగా అత్యధికంగా రూ.15కోట్లు నెల్లూరు జిల్లాలో అధికారులు లెక్కలు తేల్చి 25 మంది గ్రామీణ వ్యవసాయ సహాయకులపై వేటు వేయగా..కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకూ రూ.11 లక్షలు లెక్కలు తేల్చి ఒక గ్రామీణ ఉద్యానవన సహాయకుడిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలు, విభజన జరిగిన తరువాత 26 జిల్లాల్లోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్టు అధికారులు గుర్తించినప్పటికీ కొన్ని చోట్ల అధికారులు, దెబ్బ నప్పించిన ఉద్యోగులు, మరికొందరు ప్రజాప్రతనిధిల అండదండలంతో విషయం బయటకు పొక్కలేదని చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రంగంలోకి దిగడంతో అసలు విషయం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. రాష్ట్రవ్యాస్తంగా కోట్ల రూపాయాల్లో జరిగిన ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎంత మందికి ఎంతెంత ముట్టింది.. జిల్లాల వ్యాప్తంగా బినామీ పేర్లతో జరిగిన మోసం ఎంత అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నారనే విషయం ఇపుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది.

9నెలలు అదనంగా పనిచేయించినందుకేనా..
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయంలో తమతో అదనంగా 9నెలలు పనిచేయించి.. పేస్కేలులో నష్టం వచ్చేలా చేసి.. పెంచిన పీఆర్సీకి ఎరియర్స్ ఇవ్వకుండా అదనంగా పనిచేయించుకుందని అనుకున్నారో ఏమో..ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి బినామీ పేర్లు పెట్టి నొక్కేయాలని పథకం వేశారు. ఒకరో ఇద్దరో అనుకుంటే పర్వాలేదు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది కూడబలుక్కొని చేసినట్టుగానే ఈ భారీ అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయాల్లో ఈ స్కామ్ జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే చాలా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వశాఖ అయిన గ్రామ, వార్డు సచివాలయం పరువు పోకుండా ఉండేందుకు అవినీతికి పాల్పడిన వారి దగ్గర నుంచి రికవరీలు పెట్టినా..కొన్ని చోట్ల మాత్రం విషయం బయటకు వచ్చేసింది. దీనితో ఏం చేయాలో తెలియని అధికారులు సచివాలయ సిబ్బందిపై సస్పెండ్ వేటు వేశారు. అయితే ఈ అవినీతి తవ్వేకొద్దీ బయపడుతుండటంతో తమ మెడలకు ఎక్కడ చుట్టుకుంటుందేమోనని భయపడుతున్న జిల్లాశాఖల అధికారులు విచారణలు చేపట్టి దొరికిన వారిని దొరికినట్టుగా చేసిన అవినీతిని గుర్తించి సస్పెండ్లు చేస్తున్నారు. చేసిన అవినీతి మొత్తాన్ని రికవరీలు పెడుతున్నారు.

పూర్తిగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం..
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 శాఖలకు చెందిన సిబ్బందిపై ఆయా జిల్లా శాఖల అధికారుల పర్యవేక్షణ లోపం ఇప్పటిది కాదు. ప్రభుత్వంలో శాఖ ఏర్పాటైన దగ్గర నుంచే ఉంది. జిల్లా అధికారులు తాము ఏం చేసినా పట్టించుకోవడం లేదనే విషయాన్ని గుర్తించిన వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది మూకుమ్మడిగా భారీ అవినీతికి తెరలేపారు. చేసిన అవినీతికి లక్షల రూపాయల ప్రభుత్వ, ప్రజా ధానాన్ని అప్పనంగా నొక్కేసినా విషయం బయటకు రాలేదు. కొన్ని చోట్ల జరిగిని మోసం రైతులు గుర్తించి అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లడంతో ఏమీ చేయలేని స్థితిలో మాత్రమే అధికారులు విచారణ జరిపి బినామీ పేర్లతో అవినీతికి పాల్పడిన సిబ్బందిపై సస్పెండ్ వేటు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బినామీ స్కామ్ జరిగినా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇప్పటి వరకూ బయటకు వచ్చింది. మిగిలిన జిల్లాల్లో కొందరు అధికారులు విచారణల పేరుతో విషయాన్ని బయటకు రానీయలేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

పంపకాల వద్ద తేడాలే బెడిసి కొట్టాయా..
గ్రామ సచివాలయశాఖలోని వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది చేసిన ఈ అవినీతి విషయంలో జిల్లా అధికారులు, మండల అధికారులకు సిబ్బంది చేసిన చేతి వాటంలో ఇచ్చే పర్శంటేజీలు కుదరకే జరిగిన భారీ స్కామ్ బయటకు వచ్చినట్టుగా కూడా చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ స్కాము బయటకు రానీయకుండా మీడియా ప్రతినిధులు కూడా తలో కొంత పుచ్చుకున్నారనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నది. అలా విషయాన్ని బయటకు రానీయకుండా ఉండేందుకు మీడియాకు కూడా వారు చేసిన అవినీతిలో రెండుశాతం మొత్తాన్ని బినామీ పేర్లతో అవినీతికి పాల్పడిన సిబ్బంది ఖర్చు చేసి ముడుపులు ఇచ్చారని..దానికోసమే చాలా జిల్లాల నుంచి అవినీతి జరిగిన విషయం బయటకు రాలేదని భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో అధికారులు జరిగిన మోసం, అవినీతిని బయటపెట్టిన తరువాత మీడియాకూడా ఏమీ తెలియనట్టుగా అధికారులు చెప్పింది రాస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. కొన్ని చోట్ల అవినీతికి పాల్పడిన సిబ్బందిని కాపాడేందుకు పర్శంటేజీలు తీసుకున్న మీడియా వెనుకేసుకు వచ్చే ప్రతయత్నాలు.. విచారణ జరగుతున్న సమయంలో హడావిడి కూడా చేస్తుందనే ప్రచారం గుప్పుమంటోంది.

ఈ భారీ అవినీతికి దూరంగా స్థానిక ఎమ్మెల్యేలు..
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖల్లో బినామీపేర్లతో గ్రామ సచివాలయ సిబ్బంది నొక్కేసిన ఈ అవినీతి వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేల ద్రుష్టికి వెళ్లినా.. తాము కూడా అవినీతిలో భాగం పంచుకున్నట్టు ప్రభుత్వం ద్రుష్టికి, ఇంటెలిజెన్సు అధికారుల ద్రుష్టికి వెళితే వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కవని ముందుగానే గ్రహించిన చాలా మంది ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. తప్పుచేసిన అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల ద్రుష్టికి విషయాన్ని తీసుకెళ్లి చేసిన తప్పుని మాఫీ చేయాలని భారీ ఎత్తున రాయబారాలు నడిపినా..ఆ బురదను తమకు అంటించవద్దని చాలా మంది అధికారపార్టీ ప్రజాప్రతినిధులు  మూడు శాఖల అధికారులకు, అవినీతికి పాల్పడిక సిబ్బందికి మొహం మీదే చెప్పేసి.. వెనక్కు పంపేసినట్టుగా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ సీటు రాదని, ఇప్పటికే కన్ఫార్మ్ అయిపోయిన ప్రజాప్రతినిధులు మాత్రం కొన్ని జిల్లాల్లో గ్రామసచివాలయశాఖ సిబ్బంది చేసిన తప్పును కప్పి పుచ్చేందుకు జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ఇప్పుడిప్పుడే జనాల్లోకి తీసుకెళుతున్నారని సమాచారం అందుతోంది.. ఏది ఏమైనా.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశం మొత్తం తొంగిచూసే విధంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రికగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఇంత పెద్ద స్థాయిలో మూడు శాఖలకు చెందిన సిబ్బంది అవినీతికి పాల్పడటం, అది కాస్త పెద్ద రచ్చ జరగడం నిజంగా అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా కొందరు అధికారులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారంతా కూడా ఈ భారీ స్కాములో భాగస్వాములుగా మారే ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్టుగా చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి చెందిన మూడుశాఖల(అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్) ఇలా మూడు శాఖలకు చెందిన సిబ్బంది సిబ్బంది చేసిన అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతే లోలోన దాగిన మరింత అవినీతి బయటకు వచ్చే అవకాశాలున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.. చూడాలి ఈ విషయంలో ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంటుందోనని..!

Tadepalli

2022-08-23 05:01:15

పదోన్నతలూ లేవు.. పూర్తిస్థాయి అధికారులూ లేరు

ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా విభజించిన 13 జిల్లాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఐ లాంటి సివిల్ సర్వీస్ అధికారులు తప్పా రాష్ట్రప్రభుత్వానికి చెందిన 75 ప్రభుత్వ శాఖల్లో పూర్తిస్థాయి జిల్లా అధికారులు లేరు. ఆగ మేఘాలపై రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా అయితే విభజించి గెజిట్లు విడుదల చేసింది తప్పితే..కొత్త జిల్లాలో మాత్రం అన్నిశాఖలకు జిల్లా అధికారులను నియమించకపోగా.. జిల్లాస్థాయి అధికారి హోదా లేకపోయినా..నియమించిన అధికారే జిల్లా అధికారి అవుతారని పేర్కొంది. అన్ని ప్రభుత్వ శాఖలకు ఇన్చార్జి అధికారులు, డిప్యూటేషన్ పై అధికారులు తప్పా..పూర్తిస్థాయి పదోన్నతి పొందిన అధికారులు లేరు. దీనితో కొత్త జిల్లాల్లో పరిపాలన గాడిన పడటం లేదు.. అలాగని ఉన్న ప్రభుత్వ శాఖల్లోనైనా పదోన్నతుల దస్త్రాలు కదులుతున్నాయా అంటే అవన్నీ ఆయా ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిల పేషీల్లో మూలుగుతున్నాయి. ఇటు పదోన్నతులు లేక..అటు పూర్తిస్థాయి అధికారి అని చెప్పుకోలే..కొన్ని జిల్లాల్లో ఒకే అధికారి రెండు మూడు శాఖలు కూడా అదనపుబాధ్యతలతో చూడాల్సి వస్తున్నది. ఇటు రాష్ట్రప్రభుత్వం కూడా సివిల్ సర్వీస్ అధికారులకి ఇచ్చే ప్రాధాన్యత రాష్ట్రశాఖల్లో జిల్లా అధికారులకు ఇవ్వడం లేదనే విషయం జిల్లా విభజనల తరువాత మరోసారి తేటతెల్లమవుతోంది.

అరకొర సిబ్బంది..జిల్లాకి ఒక్కరే అధికారి..
ప్రస్తుతం 75 ప్రభుత్వశాఖల్లో మినిస్టీరియల్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొత్త జిల్లాల్లో వేళ్లపై లెక్కపెట్టేంత మందిని మాత్రమే ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వున్న సిబ్బందితో పనిచేయించాలంటే ప్రభుత్వ అధికారులు అదనపు సమయం పనిచేయాల్సి వస్తున్నది. అరకొర సిబ్బందితో కొత్తజిల్లాల్లో పనులు ముందుకి సాగకుండా ఎక్కడికక్కడే చతికలబడి ఉండిపోతున్నాయి. కొందరు జిల్లా అధికారులు తమ పైస్థాయి అధికారులతో మాట పడేకంటే అదనంగా రెండు మూడు గంటలకు పనిచేస్తే ఇచ్చిన పని పూర్తవుతుందనే ఉద్దేశ్యంతో ఉన్నసిబ్బందినే బ్రతిమిలాడుకొని పనులు చేయించాల్సి వస్తున్నది. కొన్నిచోట్ల మినిస్టీరియల్ సిబ్బందికి పని భారం అధికం కావడంతో తమను ఉంచితే ఉంచాలని..లేదంటే సెలవులు పెట్టి వెళ్లిపోతామని చెప్పే పరిస్థితికి తీసుకు వస్తున్నారు. దీనితో జిల్లా అధికారులు ఉన్నసిబ్బందితోనే ఎంత వరకూ పనులు జరిగితే అంతవరకూ పనులు చేయించుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వశాఖకు 5 నుంచి 13 రకాల మొబైల్ యాప్స్ ని అందుబాటులోకి తీసుకురావడంతో వాటి వినియోగానికే సమయం అంతా కేటాయించాల్సి వస్తున్నది. అందులోనూ జిల్లా అధికారులకే ప్రభుత్వం జిల్లాశాఖలకు ఇచ్చిన యాప్స్ వినియోగించడం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అయితే జిల్లా అధికారి కింద డివిజనల్ స్థాయి, వారికింద మండల స్థాయి అధికారులు, అధిక సంఖ్యలో మినిస్టీరియల్ సిబ్బంది ఉండేవారు దానితో సాంకేతికంగా అవగాహన ఉన్నవారితో జిల్లా అధికారులు పనిచేయించుకునేవారు. ఆ పరిస్థితి జిల్లాల విభజన తరువాత పూర్తిగా మారిపోవడంతో ఉన్న ఒకే ఒక్క జిల్లా అధికారి నానా పాట్లు పడాల్సి వస్తున్నది.

పదోన్నతులకు ఆమడదూరంలో అధికారులు..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వశాఖల్లో ఎక్కడో ఒకటి అరా ప్రభుత్వ శాఖలకు మినహా మిగిలిన ప్రభుత్వ శాఖల్లో సిబ్బందికి, అధికారులకూ పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది. పదోన్నతులు కల్పించడం ద్వారా ఉద్యోగులకు, అధికారులకు ఇచ్చే జీతాలు పెరుగుతాయి. కొందరు అధికారులకైతే వసతులు కూడా సమకూర్చాల్సి వుంటుంది. ప్రభుత్వం ఆదాయంలోని అత్యధిక భాగం మొత్తం సంక్షేమ పథకాలకు కేటాయించడంతో ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఆర్ధిక భారం నెపంతో చాలా ప్రభుత్వశాఖల్లో ఇప్పటికే కల్పించాల్సిన పదోన్నతులు కల్పించకపోవడంతో సీనియర్ అధికారులు కూడా జూనియర్ అధికారులతో సమానంగానే విధులు నిర్వహించాల్సి వస్తున్నది. అలాగని పదోన్నతులు కల్పిస్తే ఆర్ధిక భారం పడి.. దాని ప్రభావం ప్రభుత్వంపై పడి ఖాళీ అయిన ఉద్యోగాల ప్రదేశంలో కొత్త ఉద్యోగాలు తీయాల్సి వస్తుందనే కారణంతో ఇటు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా ఏళ్ల తరబడి అలాగే వదిలాశారు. ప్రస్తుతం కొత్త జిల్లాల్లో అలా పదోన్నతులు కల్పించకపోవడం వలన పూర్తిస్థాయి జిల్లా అధికారులను ప్రభుత్వం నియమించలేక.. ఉన్నవారినే సర్ధుబాటు చేసి అందరినీ జిల్లా అధికారుల కోవకే తీసుకు వచ్చి పనులు చేయిస్తున్నది.

విధాన పరమైన నిర్ణయాలకు అన్నీ అడ్డంకులే..
ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల్లోనూ పూర్తిస్థాయిలో జిల్లా అధికారులను నయమించకపోవడం వలన ప్రభుత్వశాఖల్లో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సాంకేతిక కారణాలు మోకాలడ్డుతున్నాయి. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులను వారి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేసి..వారికి కొత్త పేస్కేలు ఇవ్వడానికి ప్రభుత్వం పాత ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టర్లు, జిల్లా అధికారులనే వినియోగించాల్సి వచ్చింది. అప్పటికి కొత్త జిల్లాలు ఏర్పాటై అన్ని ప్రభుత్వ శాఖలకూ అధికారులు, అన్ని జిల్లాలకు కలెక్టర్లను ప్రభుత్వం నియమించినా ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ ఫైలు విషయంలో పాత జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి జిల్లాల అధికారులకే అధికారం కట్టబెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో జిల్లాలో అధికారులు, కొత్తగా వచ్చిన కలెక్టర్లు, ఎస్పీలు అలిగి ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి కూడా తీసుకెళ్లారు. దానితో ఉమ్మడి జిల్లాల్లో ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ ఉమ్మడి జిల్లాల అధికారులతోనే పూర్తిచేయించాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.  అన్ని ప్రభుత్వశాఖలకు జిల్లా అధికారులు లేకపోవడంతో ఒక్కో జిల్లా అధికారికి రెండు మూడు జిల్లాలు ఇన్చార్జి బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. అదే ప్రభుత్వం ఉన్న అధికారులకు, ప్రభుత్వశాఖల్లో పదోన్నతులు కల్పిస్తే పూర్తిస్థాయిలో కొత్త జిల్లాల్లోనూ అధికారులను నియమించడానికి మార్గం సుగమం అవుతుంది. కానీ ఇది ఆర్ధిక పరమైన అంశం కావడంతో ప్రభుత్వం రెండు అడుగులు వెనక్కివేసి ఉన్న అరకొర అధికారులతోనే పనులు చేయిస్తున్నది. ఇదే పద్దతి కొనసాగితే 2024 తరువాత అత్యధిక సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తారు. అపుడు ఒకే సారి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అపుడు ఇపుడున్న ఆర్ధిక భారం కంటే వందరెట్లు భారం ప్రభుత్వంపై పడుతుంది. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ప్రభుత్వశాఖల్లో అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కొత్తజిల్లాల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించడానికి, రానున్న కాలంలో కొత్త ఉద్యోగాల కల్పనకు, అధికారులు, సిబ్బంది కొరతను అధిగమించవచ్చును. దీనితో మార్గం సుగమం అయి విధాన పరమైన నిర్ణయాలు అమలు చేయడానికి, పరిపాలనను గాడిలో పెట్టడానికి వీలుపడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి..!


Guntur

2022-08-22 01:44:28

కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ

విజయవాడ నగరంలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని శనివారం ఉదయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. విజయవాడ కోర్టుతో జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సిటీ సివిల్‌ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్‌ మోహనరెడ్డిలు కలిసి మొక్క నాటారు.

Vijayawada

2022-08-20 07:24:13

సచివాలయ బదిలీలకు సర్వీస్ రూల్స్ మోకాలడ్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపినా.. ఇంకా పూర్తికాని ఉద్యోగుల సర్వీస్ ప్రొబేషన్, విడుదల కానీ సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్  మోకాలడ్డుతున్నాయి. వినడానికి కాస్త ఇబ్బందిగానే ఉన్నా ఇది ప్రక్రియ ముందుకి సాగడానికి వీలులేకుండా ఉన్న సాంకేతిక వాస్తవం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒక లక్షా 21 వేల మంది సచివాలయ ఉద్యోగల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం జీఓనెంబరు 5 ద్వారా ఇటీవలే ప్రకటించి ఆగస్టు1 నాటికి కొందరికి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేసి.. కొత్త పేస్కేలు కూడా అమలు చేసింది. ఇదే సమయంలో మెటర్నటీ లీవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ మాత్రం ఆరు నెలలు సెలవులు తీసుకోవడంతో వారి సర్వీస్ ప్రొబేషన్ మరింత ముందుకి వెళ్లింది. ఫలితంగా జూలై 31 నాటికి రాష్ట్రంలో చాలా మంది సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ నిలిచిపోయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తయిన తరువాత మాత్రమే ఉద్యోగులకు బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఇపుడు అన్నీ సాంకేతిక ప్రతిబంధకాలు మోకాలడ్డటంతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాస ఎదురవుతున్నది. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేయాలని ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిని కోరిన వెంటనే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపై కార్యాచరణ మొదలు పెట్టి, పాత ఉమ్మడి 13 జిల్లాల నుంచి ఎంత మంది ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తయింది..? ఇంకా ఎంత మంది ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ కావాల్సి వుంది..? అనే సమాచారం తెలుసుకున్నపుడు.. ఇంకా చాలా మంది ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తవలేదనే విషయాన్ని రాష్ట్ర అధికారులు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని సీఎంఓకి సమాచారం అందించారు. వెంటనే సీఎంఓ నుంచి ఉద్యోగులందరి సర్వీసు ప్రొభేషన్ మొత్తం పూర్తయిన తరువాత మాత్రమే బదిలీలకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని..లేదంటే చాలా మంది ఉద్యోగులు బదిలీలకు అర్హత సాధించరని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది.

కారుణ్య నియామకాలు, పదోన్నతులు అలా..
రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో చాలా మంది సిబ్బందిని కారుణ్య నియామకాలు, మరికొందరిని నేరుగా వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించింది. అలా వచ్చిన వారు చాలా మంది సచివాలయ శాఖలో ఉన్నారు. వారితోపాటు ఉద్యోగం వచ్చిన తరువాత ఆలస్యంగా చేరినవారు, మెటర్నటీ లీవులు తీసుకున్నవారు అత్యధిక సంఖ్యలోనే సచివాలయశాఖలో సర్వీస్ ప్రొభేషన్ కాకుండా ఉండిపోయారు. వాస్తవానికి పోయిన నెలలో రోజుల వ్యవధిలో కొంత మంది ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ పూర్తి అయినా జిల్లాశాఖల అధికారుల నుంచి ఆఖరి దస్త్రాలు డిఎస్సీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ సంతకం అయి జాబితాలు సిద్దం కాలేదు. దీనితో చాలా మంది ఉద్యోగులకి గత నెలలో సర్వీసు పూర్తయినా లిస్టులు రాని కారణంగా వారి సర్వీసు ప్రొబేషన్ పూర్తికాలేదు. అలాగని ఈ ఆగస్టు నెలలో అయినా వారికి సంబంధించిన జాబితాలు వస్తాయనుకుంటే ఆ జాబితాలు ఇంకా జిల్లా శాఖల కార్యాలయాలకు డిఎస్సీ కమిటీ చైర్మన్ నుంచి రాలేదు. దీనితో ఈనెలలో 20 నుంచి 25వ తేదీలోగా సాలరీలు పెట్టే సమయానికి జాబితాలు వస్తే తప్పా మరికొందరు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ అయి పేస్కేలు అందుకునే పరిస్థితి ఉండదు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19జిల్లాశాఖలకు చెందిన జిల్లా అధికారులు ఇప్పటికే జాబితాలు రూపొందించి డిఎస్పీ చైర్మన్ కు ఫైల్స్ పంపారు. కానీ అటునుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీనితో తమ సర్వీసు ప్రొభేషన్ ఈనెలలో నైనా పూర్తవుతుందా..? లేదా అనే అనుమానాన్ని  సచివాలయ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ తలనొప్పి..
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 శాఖల సిబ్బందికి సంబంధించి చాలా శాఖల సిబ్బందికి ప్రభుత్వం సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగులకు బదిలీలు చేయాల్సి వస్తే ముందుగా ప్రభుత్వం రూపొందించిన సర్వీసు నిబంధనల ఆధారంగా బదిలీలు చేపడతారు. బదిలీల్లో లోకల్ జిల్లాలు, నాన్ లోకల్ జిల్లాలకు ఉద్యోగులు బదిలీలు కోరుకుంటే దానికోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించాల్సి వుంటుంది. అయితే వాటికోసం ప్రభుత్వం ఏవిధంగా నిబంధనలు రూపొందిస్తుందనే విషయంలో నేటి వరకూ క్లారిటీ లేదు. తొలుత అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రమోషన్ ఛానల్, సర్వీస్ రూల్స్ రూపొందిస్తే తప్పా బదిలీల విషయంలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఈ అంశాలన్నీ ద్రుష్టిలో పెట్టుకుంటే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏ ఒక్క పని కూడా ముందుకి కదిలే పరిస్థితి లేదు. సచివాలయ ఉద్యోగులంతా విధుల్లోకి చేరి సుమారు మూడేళ్లు కావొస్తున్నా ప్రభుత్వం నేటికీ వారి సర్వీసు రూల్స్ విషయంలో ఎలాంటి జీఓలు జారీ చేయలేదు. కొన్ని శాఖలకు పదోన్నతులకు సంబంధించిన ఛానల్ ఏర్పాటు చేసినా..ఎన్నేలకు పదోన్నతి కల్పిస్తారనే విషయాన్ని కూడా అందులో పొందుపరచలేదు. దీనిని బట్టీ చూస్తే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ విషయంలో శాఖల వారీగా ప్రత్యేక జీఓలు వస్తే తప్పా బదిలీలకు సంబంధించిన ఫైలు ముందుకి కదిలే పరిస్థితి లేదు. ప్రభుత్వం బదిలీలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ రాష్ట్రశాఖల అధికారులు చేసిన తప్పిదాల వలన ఇప్పట్లో బదిలీలు జరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

బదిలీల ఆశలపై నీళ్లు చిలకరింపే..
సచివాలయ ఉద్యోగుల బదిలీల ఆశలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. సాంకేతికంగా నీళ్లు చల్లినట్టే కనిపిస్తుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా తమ ఉద్యోగాలు రెగ్యులరైజేషన్, బదిలీలకు సంబంధించిన అర్జీలు ప్రభుత్వానికి పెడుతున్నారు తప్పితే.. 19శాఖలకు సంబంధించినంత వరకూ సర్వీసు రూల్స్, పదోన్నతుల విషయంలో ప్రత్యేకంగా జీఓలు విడుదల చేయాలనే విషయంలో ప్రభుత్వం ద్రుష్టికి ఒక్క అర్జీ కూడా వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. సాధారణంగా ఒక కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటైతే ఏ శాఖకు అనుబంధంగా శాఖ ఏర్పాటవుతుందో..పాత శాఖలోని సర్వీసు నిబంధనలను కొత్తగా ఏర్పాటు చేసే శాఖలకు జతచేస్తారు. కానీ.. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన తరువాత ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ప్రత్యేకంగా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ కి సంబంధించి ప్రత్యేక జీఓలు జారీచేస్తూ వచ్చింది. రెండు మూడు ప్రభుత్వశాఖలు మినహా ఇతర శాఖలకు సంబంధించినంత వరకూ జీఓలు రాకపోవడంతో ఇపుడు ప్రభుత్వం బదిలీలకు ఆమోదం తెలిపినా..సాంకేతికంగా బదిలీలు చేపట్టలేని పరిస్థితి ఎదురైంది. దీనితో సచివాలయ ఉద్యోగుల బదిలీల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. అయితే ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగని, చూడని విధి విధానాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రస్థాయి అధికారులు అమలు చేస్తుండటంతో..ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి కూడా గ్రామ, వార్డు సచివాలయశాఖలో నెలకొంది. చూడాలి.. గ్రామ, వార్డు సచివాల ఉద్యోగులకు సంబంధించి నేటి వరకూ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా, జీఓలు కూడా ఇవ్వకుండా బదిలీల విషయంలో అటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు, ఉద్యోగులకు ప్రభుత్వం ఏ విధమైన హామీ ఇస్తుంది.. ఏం చేసి చూపిస్తుందనేది..!

Guntur

2022-08-20 01:22:59

సీపీఎస్ పై మళ్లీ కథ ముందుకొచ్చింది..

సీపీఎస్ పై కథ మళ్లీ ముందుకొచ్చింది.  ఆర్థిక భారం కారణంగా సీపీఎస్​ను రద్దు చేసి ఓపీఎస్​ను అమలు చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం సీపీఎస్‌ అంశంపై వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు 5 గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. పాత పింఛను విధానమే కావాలి, జీపీఎస్‌పై చర్చకు కూడా సిద్ధంగా లేమని సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. దీనితో సీపీఎస్​ రద్దుపై పీఠముడి వీడలేదు. మధ్యే మార్గంగా జీపీఎస్​ను అమలు చేస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపినా.. ఉద్యోగులు మాత్రం సీపీఎస్​ను రద్దు చేసి, ఓపీఎస్​ను అమలు పరచాలని ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్​ను ఒప్పుకోబోమని చెప్పారు. అంతేకాకుండా సెప్టంబర్ ఒకటిన సీఎం ఇంటి ముట్టడి మాత్రం జరిగి తీరుతుందని స్పష్టంచేయడంతో ప్రభుత్వం కూడా తమ వాణిని బలంగానే వినిపించింది. సీపీఎస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌)పై చర్చకు కూడా తాము సిద్ధంగా లేమని.. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్‌) అమల్లోకి తేవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు తెగేసి చెప్పినా ప్రభుత్వం ససేమిరా అనడం విశేషం.  ఓపీఎస్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ప్టెంబరు 1న తలపెట్టిన ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి, విజయవాడలో మిలియన్‌ మార్చ్‌, బహిరంగ సభ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎవరి వాదనకు వారు కట్టుబడటంతో ప్రతిష్టంభన వీడలేదు. ప్రభుత్వం నియమించిన కమిటీలో మరో సభ్యుడు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశానికి హాజరవలేదు. దీనితో బుగ్గనతో మాట్లాడాక, మరోసారి చర్చలకు పిలుస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రి బొత్స, సజ్జల తెలియజేశారు. అయితే జీపీఎస్‌ అంశంపై చర్చించేందుకైతే తాము రాబోమని ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమల్లోకి తెస్తామని విస్పష్టమైన ప్రకటన చేస్తేనే చర్చలకు వస్తామని చెప్పడంతో సీపీఎస్ అంశం మళ్లీ రసకందాయంలో పడింది.

ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఉంది. పలు దఫాలుగా చర్చలు జరిపి ఈ సమస్యకు త్వరలోనే ముగింపు పలకాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఉద్యోగులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అంశంపై తగు నిర్ణయం తీసుకుంటుందని వారికి సజ్జల చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు’’ అని సమావేశం అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే  మరియదాస్‌పాత పింఛను విధానంపైనా.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అమలవుతున్న విధానంపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చామని.. సానుకూల స్పందన ఆశిస్తున్నామనుకున్నాం కానీ ప్రభుత్వం ఆ దిశగా కాకుండా జీపీఎస్ అమలు చేస్తామని చెప్పడం పట్ల ఉద్యోగ సంఘాలు అభ్యంతరం తెలియజేశాయి. దీనితో సీపీఎస్ కధ మళ్లీ ముందుకొచ్చినట్టు అయ్యింది. సాధ్యమైనంత వరకూ సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం ఎక్కడా అనుకూలంగా లేదనే సంకేతాలు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం తెలియజేసింది.

Guntur

2022-08-19 14:39:18

శ్రీ వారి సేవలో సుప్రీం చీఫ్ జస్టిస్..

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ  కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . ఆలయం ఎదుట  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి , ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి జస్టిస్ రమణ కు స్వాగతం పలికారు . ఆలయ ప్రదక్షిణగా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు . రంగనాయకుల మండపంలో  వేద ఆశీర్వచనం అనంతరం చైర్మన్  వైవి సుబ్బారెడ్డి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు . తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయన్ , టీటీడీ ఈవో   ఎ వి ధర్మారెడ్డి , సీవీఎస్వో నరసింహ కిషోర్ ,ఆలయ డిప్యూటీ  ఈవో రమేష్ బాబు పాల్గొన్నారు.

Tirumala

2022-08-19 11:25:08

ఎన్నికల ముందే బకాయి డీఏలకు మోక్షం..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఇవ్వాల్సిన డీఏ బకాయిలకు మోక్షం కలగాలంటే 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ ఆగాల్సిందేనా.. ఎన్నికల ముందు బకాయి డీఏలే తాయిలాలుగా ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ద్రుష్టి మొత్తం సామాన్య ప్రజల సంక్షేమం మీదే వుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజల సంక్షేమం కాదని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను మంజూరు చేస్తే సంక్షేమ పథకాల అమలుకి ఆర్ధిక ఇబ్బందులు వచ్చిపడతాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సమయానికి జీతాలు అందుతున్నాయి కనుక డీఏల బకాయిలన్నీ ఎన్నికల ముందు రిలీజ్ చేయడం ద్వారా ఉద్యోగులకు ఒకే సారి డిఏలు ఇచ్చినట్టుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికిప్పుడు బకాయి డిఏలు ప్రభుత్వ అధికారులకిచ్చే మొత్తంతో నవరత్నాల్లోని ఒక పథకానికి అర్హులైన వారికి నగదు బదిలీల చేయవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా ఉండటంతోనే బకాయి డిఏల ఊసెత్తడం లేదని ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వ తీరుపైన తీవ్ర ఆగ్రహం ఉన్నారు.

డిఏ ఇవ్వాల్సి వస్తే.. సచివాలయాల భారం కూడా
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు డీఏలు ఇవ్వాల్సి వస్తే ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసులు రెగ్యులర్ అయ్యాయి కనుక రాష్ట్రవ్యాప్తంగా వున్న ఒక లక్షా 21వేల మంది సచివాలయ ఉద్యోగులకు కూడా డిఏ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే బకాయి డీఏ భారం ప్రభుత్వంపై పడుతుండగా..ఇపుడు గ్రామ,వార్డు సచివాలయాలు కూడా తోడవుతాయి. అపుడు మరింత ఆర్ధిక భారం అవుతుంది. అయితే ఇప్పటి కిప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు డీఏ ఇస్తే సచివాలయ ఉద్యోగులకు డీఏ ఇచ్చే పనుండదు. అలా కాకుండా డీఏ బకాయిలు ఇవ్వడానికి సమయం తీసుకుంటే..సచివాలయ ఉద్యోగులకు కూడా డీఏ ఇవ్వాల్సి వచ్చి ప్రభుత్వానికి మరింత ఆర్ధిక భారంగా పరిణమిస్తుంది. కాగా ఇప్పటికే దగ్గర దగ్గర రెండు డీఏలు కోల్పోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలో ఇచ్చే డీఏ ఇవ్వకపోతే మాత్రం అటు సచివాలయ ఉద్యోగుల నుంచి కూడా ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే పీఆర్సీ ప్రకటించి సచివాలయ ఉద్యోగులకు ఎరియర్స్ మొత్తాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇపుడు డీఏల కోత కూడా విధిస్తే దాని ప్రభావం వచ్చే ఎన్నికలపై చాలా తీవ్రంగా పడే అవకాశాలు కూడా లేకపోలేదు.

పీఆర్సీకి ముసలం తెచ్చింది సచివాలయాలే..
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు పీఆర్సీకి ముసలం తెచ్చింది గ్రామ, వార్డు సచివాలయ శాఖ అనే విషయం ఎవరికీ తెలియకపోవడం విశేషం.ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ద్రుష్టిలో ఉంచుకొనే పీఆర్సీ ఇచ్చే సమయానికి పాత డీఏలు, హెచ్ఆర్ఏ స్లాబులను ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్ధిక భారం లేకుండా కుదించింది. అలా కుదించిన మొత్తాన్ని భర్తీచేస్తున్నట్టుగా అదే మొత్తాన్ని ఉద్యోగులకు పీఆర్సీ కింద మంజూరు చేసింది.  దాని ప్రభావంతో సచివాలయ ఉద్యోగులు 9నెలలు పీఆర్సీ పేస్కేలు, ఆ సమయంలో ఒక డీఏ, పెరిగిన పీఆర్సీ ఎరియర్స్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఆవిషయాన్ని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించకుండా ఉండేందుకు నేరుగా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తున్నట్టుగా ప్రకటించి రెండేళ్లు దాటిన ఉద్యోగులకు ఆగస్టు1కి కొత్తగా పెరిగిన పేస్కేలును అమలు చేసింది ప్రభుత్వం. దీనితో ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య, వారికి ఏ అదనపు మొత్తం ఇచ్చినా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిపే ఇవ్వాల్సి రావడంతో ఆ భారాన్ని ప్రభుత్వం మోసే పరిస్థితి కనిపించడంలేదు. దీనితో ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేయకుండా దాటవేస్తూ వస్తున్నది. వాస్తవానికి పాత పేస్కేలు ప్రకారం పెంచిన పీఆర్సీ మొత్తం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిఉంటే ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు చాలా మొత్తం జీతం ఇవ్వాల్సి వచ్చేది. అలా ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేందుకే సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేసే సమయానికి హెచ్ఆర్ఏ, డీఏ స్లాబులను పూర్తిగా కుదించేసింది ప్రభుత్వం.

సచివాలయ ఉద్యోగులకు తప్పా..అందరికీ డీఏలు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ అయ్యేనాటికి 9నెలల పేస్కేలతోపాటు ఒక డీఏ, పీఆర్సీ ఎరియర్స్ కూడా కోల్పోయారు. వాళ్ల సర్వీసు రెగ్యులైజేషన్ ఆగస్టులోనే అయ్యింది కనుక సర్వీస్ రెగ్యులర్ అయిన తరువాత ఆరునెలలకు ఒక డీఏ ప్రభుత్వం ఇవ్వాలి. అలా ఇచ్చేటట్టు అయితే సచివాలయ ఉద్యోగులు మరో డీఏ కూడా కోల్పోతారు. అలా పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులకు డీఏలు, హెచ్ఆర్ఏ, ఇతర ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందనే ఏటూగానీ సమయానికి అంటే.. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన రెండేళ్ల ప్రొబేషన్ సమయానికంటే ఆలస్యం 9నెలలు ఆలస్యంగా ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించింది.  ఇంకా అందులో చాలా మంది మహిళా ఉద్యోగిణిలు మెటర్నటీ లీవు తీసుకున్న సందర్భంగా వారి సర్వీసు మరో ఆరు నెలలు పొడిగింపు వర్తించింది. ప్రభుత్వం జీఓ నెంబరు 5లో ప్రకటించినట్టుగా ఒక లక్షా 21 వేల మంది ఉద్యోగులకు కూడా పూర్తిస్థాయిలో సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ కాలేదు. ఆగస్టు1వ తేదీ నాటికి కొంతమంది ఉద్యోగులకే సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ అయ్యింది. మెటర్నటీ లీవులు తీసుకున్నవారందరూ పాత పద్దతిలో రూ.15 వేలు మాత్రమే జీతాలు తీసుకున్నారు. అలా సెప్టెంబరు 1నాటికైనా మిగిలిన వారికి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ అవుతుందా అంటే దానికి ఇంకా డీఎస్సీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ల నుంచి క్రమబద్దీకరణ ఉత్తర్వులు రాలేదు. ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీనాటికి ఉద్యోగులందరికీ జీతాలు పెట్టాల్సి వుంది. అయినప్పటికీ నేటికీ గత నెలలో సర్వీసు క్రమబద్దీకరణ కానివారి జాబితాలు ఇంకా సచివాయాలకు చేరలేదు. దీనితో సచివాలయ ఉద్యోగులకు తప్పా మిగిలిన ఉద్యోగులందరికీ డీఏ వచ్చే అవకాశం వుంది అదీ కూడా ఎన్నికల ముందు తప్పా.. అంతకు ముందు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం బకాయి డీఏల విషయంలో ఏం చేస్తుంది..ఎప్పుడు చెల్లిస్తుంది..దానికోసం ఎప్పుడు ప్రకటిస్తుందనేది..!

Guntur

2022-08-19 01:58:54

2023 ప్రెస్ అక్రిడిటేషన్లు ఉమ్మడి జిల్లాల్లోనే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్లు ఉమ్మడి 13 జిల్లాల్లోనే 2024 వరకూ ఇస్తుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను అయితే మార్చింది తప్పితే చాలా వరకు విధాన పరమైన కార్యకలాపాలు ఉమ్మడిజిల్లాల్లోనే చేపడుతుండటమే దీనికి కారణం కనిపిస్తుంది. ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫైళ్లపై పాత జిల్లా కలెక్టర్లు, పాత జిల్లాశాఖల అధికారులే సంతకాలు చేసి ఆర్డర్లు జారీ చేశారు. ఇపుడు కొత్త జిల్లాల్లో పనిచేసే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు కూడా పాత ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఉన్నచోటనే సమాచారశాఖ చేయించాలని చూస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ విషయంలో ఇప్పటికే ఆయా జిల్లాల సమాచారశాఖ డీడీలు కూడా ఇదే విషయాన్ని రాష్ట్ర సమాచారశాఖకు తెలియజేశారని చెబుతున్నారు. వాస్తవానికి ఏ జిల్లాలో కలెక్టర్ ఉంటే ఆ జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్ చైర్మన్ హోదాలో కలెక్టర్ కార్డులు జారీ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్నీ నిబంధనలకు విరుద్దంగానే జరుగుతుండంటంతో ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో పాత నిబంధనే పాటించాలని సమాచారశాఖ యోచిస్తుందనే ప్రచారం జరుగుతుంది.

జిల్లా పరిషత్ లు మారేంత వరకూ ఉమ్మడి జిల్లాలే
ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు 26 జిల్లాలు అయినా జిల్లా పరిషత్ లు మాత్రం ఉమ్మడి జిల్లా కేంద్రంగానే పనిచేస్తున్నాయి. పాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవీకాలం పూర్తయ్యేంత వరకూ ఉమ్మడి జిల్లాల కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతాయని..అధికారులు చెప్పుకొస్తున్నారు. ఒక్క జిల్లా పరిషత్ లు మాత్రమే కాకుండా పాత ఉమ్మడి జిల్లాల కార్యాలయాల వ్యవహారాలు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని.. కొత్త జిల్లాల్లో మాత్రం పరిపాలన కేంద్ర సర్వీసులకు సంబంధించినంత వరకూ ఇప్పుడిప్పుడే అధికారాల బదలాయింపులు జరుగుతున్నాయని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. వాస్తవానికి చాలా సంస్థలకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండి పలు కీలక వ్యవహారాలు చేయాల్సి వుంటుందనే విషయాన్ని ప్రస్తావించినపుడు.. ఉమ్మడి జిల్లాల్లో చేపట్టే కార్యకలాపాలు తప్పించి ఇతర కార్యక్రమాలు, అధికారాలు అన్నీ కొత్త జిల్లాల కలెక్టర్లకు జిల్లా అధికారులకు సంక్రమిస్తాయని.. కొన్ని వ్యవహారాలు మాత్రం పాత ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారులు మాత్రం చేస్తారని అన్నారు. ఇదే ఫార్ములా మొన్నటి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ సమయంలో కూడా పాత జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులే ఆఖరి దస్త్రాలుపై సంతకాలు చేసి ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చింది చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల విభజన జరిగినప్పటికీ చాలా వరకూ విధానపరమైన బదలాయింపులు మాత్రం జరగాల్సి వుందని వివరించారు.

కొత్త జిల్లాల్లో పేరుకే సమాచార పౌరసంబంధాల శాఖ..
రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల్లో పేరుకే సమాచారశాఖ కార్యాలయాలు, సిబ్బంది పనిచేస్తున్నారు. విధాన పరమైన నిర్ణయాలు, వ్యవహారాలు మాత్రం మాత్రం ఉమ్మడి జిల్లాకేంద్ర కార్యాలయాల నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జర్నలిస్టులకు ప్రభుత్వం జారీ చేసే ప్రెస్ అక్రిడిటేషన్లు కూడా పాత జిల్లా కార్యాలయాల్లోనే ఈసారి చేపడతారని జిల్లా సమాచారశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి కొత్త జిల్లాల్లో పదోన్నతులు పొందిన అధికారులను, జిల్లా అధికారులగా నియమించాల్సి వుంది. కానీ ప్రభుత్వ శాఖల్లో పరిపాలనా సౌలభ్యం కోసం సీనియర్ అధికారులను జిల్లా అధికారులుగా, డిప్యూటేషన్ పద్దతిపై కొత్త జిల్లాల్లో అధికారులుగా ప్రభుత్వం నియమించింది. దీనితో చాలా వరకూ కార్యక్రమాలు, కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాలు కొత్త జిల్లాలలోని అధికారులకు లేవు. దీనితో యదావిధిగా మళ్లీ పాత జిల్లా కార్యాలయాల నుంచే పనులు చేయించాల్సి వస్తుంది. ఇలా ఒక్క సమాచార పౌర సంబంధాల శాఖ మాత్రమే కాకుండా 75 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని పనులు, వ్యవహారాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసుకు వస్తుంది.

మీడియాకి సమాచారం ఇవ్వడంలో పూర్తివైఫల్యం..
ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పాత జిల్లాల్లోని పాత వ్యవహారం మాదిరిగానే సామాచర పౌర సంబంధాల శాఖ మీడియాకి సమాచారం ఇవ్వడంలో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తోంది. పెద్ద పత్రికలు, టీవీ ఛానళ్లు మినహా ఇతర చిన్నతరహా మీడియాకి మాత్రం సమాచారం ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వానికి చెందిన అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ నోట్లు కేవలం పెద్ద మీడియా సంస్థల్లోలని జర్నలిస్టులకే సమాచార శాఖ ఇవ్వడం, వారి నెంబర్లు మాత్రమే అధికారిక ప్రెస్ గ్రూపులో యాడ్ చేయడం ఇపుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అంతేకాకుండా సమాచారశాఖ అవినీతి వ్యవహారాలు బయట పెట్టే చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలను ప్రభుత్వ వ్యతిరేక మీడియాగా ముద్ర వేసి వారికి సమాచారం అందించడం మానేస్తున్నది. ఈ విషయమై కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలను మీడియా సంప్రదిస్తే.. అక్రిడేటెడ్ మీడియా జర్నలిస్టులను మాత్రమే రాష్ట్ర కార్యాలయం ప్రెస్ గ్రూపులో యాడ్ చేయాలని ఆదేశాలున్నాయని వీరు చేసే తప్పును కమిషనర్ కార్యాలయం మీదకు నెట్టేస్తున్నది. చిన్న పత్రికలకు చాలా వరకూ ప్రెస్ అక్రిడిటేషన్లు ఇవ్వలేదనే విషయాన్ని పదే పదే ప్రశ్నించి జిల్లా కలెక్టర్ లేదా.. రెవిన్యూ అధికారుల ద్రుష్టికి తీసుకెళితే తప్పా మీడియా వాట్సప్, టెలీగ్రామ్ గ్రూపుల్లో జర్నలిస్టుల పేర్లు, నెంబర్లను చేర్చడం లేదు.

సమాచారశాఖ నిర్లక్ష్యమే కొత్త జిల్లాలకు శాపం..
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో అధికారుల ఇష్టారాజ్యం, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కొత్తజిల్లాలకు శాపంగా పరిమణమిస్తోంది. కొత్త జిల్లాల్లో అధికారులు, ప్రభుత్వ శాఖల సమాచారం పెద్ద మీడియా సంస్థలకు తప్పితే చిన్న మధ్య తరహా జిల్లా మీడియాకి తెలియడం లేదు. అలాగని పెద్ద మీడియా సంస్థలకు చెందిన పత్రికలు, టీవీ ఛానళ్లు అన్ని వర్గాల ప్రజలకు వెళుతున్నాయా అంటే అదీ జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తప్పితే మరెవర వద్దకూ పెద్ద పత్రికలు చేరడం లేదు. ఈ క్రమంలో  అన్ని వర్గాల ప్రజల వద్దకు వెళ్లే చిన్న, మద్య తరహా మీడియా, పత్రికలకు సమాచారశాఖ సమాచారం అందించడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమపథకాలకు సంబంధించిన సమాచారం మీడియాకి విడుదల చేయడం అంటే సమాచారశాఖ జేబులో నుంచి తమ నెలజీతం మొత్తం మీడియాకి ఖర్చు చేసేస్తున్నట్టు కొత్త జిల్లాల్లో డీపీఆర్వోలు, ఏపీఆర్వోలు తెగ ఫీలైపోతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అయిన తరువాత పెద్ద పత్రికల కంటే ముందుగా చిన్న, మధ్య తరహా పత్రికలు మాత్రమే కొత్త జిల్లాల్లో కార్యాలయాలు, జర్నలిస్టులను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకున్న కొందరు డీపీఆర్వోలు కొత్త జిల్లాల్లోని జర్నలిస్టులకు సమాచారాన్ని సకాలంలో అందిస్తుంటే నేటికీ అధికశాతం డీపీఆర్వోలు కొత్తజిల్లాల్లో మీడియాకు సమాచారం ఇచ్చేందుకు మాత్రం ముందుకి రావడంలేదు. ఈవిషయం సమాచారశాఖ కమిషనర్ కి తెలిసినా అంటీముట్టనట్టే వ్యవహరిస్తుండటం వలనే మీడియాకి కొత్త జిల్లాల్లో సమాచారం అందడం లేదనేది స్పష్టమవుతున్నది. పరిస్థితి ఇలానే ఉంటే కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో పరిపాలన ప్రారంభమైతే పరిస్థితి మరింత జఠిలంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇదే పరిస్థితి జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో కూడా తలెత్తుతుందని కూడా జర్నలిస్టులు రాష్ట్ర సమాచారశాఖకు పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా సమాచార పౌర సంబంధాల శాఖ తీరు మారుతుందా లేదా అనేది..!

Guntur

2022-08-18 01:29:29

అన్ని ప్రభుత్వశాఖలకూ ఫేస్ రికగ్నైజేషన్

ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల్లోని అధికారులు, సిబ్బంది ముందుకి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వస్తుందా అంటే అవుననే సమాధానం వస్తున్నది రాష్ట్ర అధికారుల నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే అధికారులు, సిబ్బంది సమయానికి విధులకు రావాల్సి వుంటుందనే ప్రభుత్వ ఆలోచన, అమలుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. తొలుత విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టపెట్టిన ప్రభుత్వం టైమ్ బాండ్ ఏర్పాటు చేసింది. తద్వారా ఉపాధ్యాయులంతా సరిగ్గా 9గంటలకు యాప్ లో అటెండన్స్ వేయాల్సి వుంటుంది. అలా సమయానాకి అటెండెన్సు వేయకపోతే ఆరోజు లీవుగా పరిగణిస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఈ ఒక్క యాప్ విషయంలో ఉపాధ్యాయులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తమకు సమయపాలన పెట్టడం నచ్చలేదని ఎదురు తిరిగినా దానిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా యాప్ వినియోగాన్ని అమలు చేసింది. చచ్చినట్టు 70శాతం మంది ఉపాధ్యాయులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను తమ మొబైల్ లో వేసుకొని అటెండెన్సు వేయాల్సి వచ్చింది. యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలనే డిమాండ్లు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువచ్చి కొంత మంది యాప్ లో అటెండెన్సు వేయకుండా ఉండిపోయారు. ఇపుడు ఈ అంశమే రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది..

పాఠాలు చెప్పకుండా మరుగు దొడ్లకు ఫోటోలు తీయాలా..
సమాజంలో ఉపాధ్యాయులంటే ఎంతో ఉన్నతమైన గౌరవం వుంది. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల యాప్స్ వలన పిల్లలకు పాఠాలు చెప్పడం మాట దేవుడెరుగు మరుగుదొడ్లు, భోజనాల వద్ద ఫోటోలు, వీడియోలు తీసేందుకే ప్రతీరోజూ విలువైన గంట సమయం వ్రుధా అవుతోందని ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ ఈ విధానమే అమలులో వుంటే ఇపుడు ప్రతీ రోజూ ఉదయం టంచనుగా 9గంటలకల్లా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్సు వేసే విధానాన్ని కూడా ఉపాధ్యాయులంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఏవేవో పనులు, కాగితాలపైనే మొత్తం పనంతా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగం అంటే సమాయానికంటే గంట ఆలస్యంగా వచ్చి.. గంట ముందుగానే ఇంటికి తిరుగు ముఖం పట్టే విధానాలకు చరమ గీతం పాడేందుకే ఈ కొత్తరకం యాప్ ని అమలులోకి తీసుకొచ్చామని చెబుతోంది ప్రభుత్వం.

నాడు-నేడుతో పాఠశాలల రూపం మారినా విద్యలో..?
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చినా..విద్యావిధానంలో మాత్రం ప్రభుత్వం అనుకున్నట్టుగా మార్పులు మాత్రం ఇంకా నోచుకోలేదు. నూతన విద్యాసంవత్సరం నుంచి సరికొత్త విద్యావిధానాలను అమలు చేయాలని చూసినా..ఇంకా ఎక్కడా ఫలితాలు మాత్రం ప్రభుత్వానికి కనిపించలేదు. దీనితో ప్రభుత్వం వ్యూహాత్మంగా తన అడుగులు వేస్తుందనే విషయం నేడు ఫేస్ రిగ్నైజేషన్ యాప్ ద్వారా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ముందుకి వచ్చినట్టుగా చెబుతున్నారు. నాడు-నేడు పథకం ద్వారా అమలు చేసిన అభివ్రుద్ధి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్నివిషయాల్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టుగానే ఉన్నట్టు కనిపిస్తోంది. టైమ్ బాండ్ యాప్ అటెండెన్సును నిరుపేద విద్యార్ధులకు నిశ్వార్ధంగా ప్రభుత్వ ఉచిత విద్యను అందించాలనుకునే ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నప్పటికీ.. ఆడుతూ, పాడుతూ విధులు నిర్వహించే ఉపాధ్యాయులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. యాప్ లు రూపొందించిన ప్రభుత్వం, వాటి వినియోగానికి సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి కూడా తీసుకెళ్లినా దానిని ప్రభుత్వం లైట్ తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుకు, ఉద్యోగులకు ఈ యాప్ వినియోగం, అమలు కాస్త కష్టంగా ఉన్నా..ప్రజల నుంచి మంచి స్పందన రవాడంతో ప్రజామోదం మేరకే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వినియోగంలోకి తేవడానికి యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. 

అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తరహా యాప్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వశాఖల్లోనూ విద్యాశాఖ తరహా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందాలని పైలట్ ప్రాజెక్టుగా ముందుగా విద్యాశాఖలోనే దీనిని ఏర్పాటు చేసింది. అయితే ఉపాధ్యాయుల నుంచి తీవ్రంగా ప్రతిఘటన ఎదురైనప్పటికీ ప్రభుత్వం మాత్రం అన్ని ప్రభుత్వశాఖల్లో ఈ తరహా యాప్ ని అమలు చేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింతగా చేరువ చేయాలని చూస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రస్తుతం అమలు చేస్తున్న యాప్ డేటా ఆధారంగా.. ఫేస్ రికగ్నైజేషన్ డేటాబేస్ కి లింక్ చేయడం ద్వారా మిగిలిన శాఖల్లో కూడా యాప్ ను వినియోగంలోకి తీసుకు రావడానికి అన్ని ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. ఒకప్పటి బయో మెట్రిక్ అటెండెన్సు కంటే నేటి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన 8గంటలూ విధులు ప్రభుత్వ ఉద్యోగులు క్రమం తప్పకుండా చేయకుండా వెనుతిరిగే పరిస్థితి ఉండదు. అలా ప్రభుత్వ పనిగంటల్లో ప్రజలకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలంటే పనిచేసే చోట మాత్రమే యాప్ పనిచేసేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. చూడా ఫలితాలు రానున్న రోజుల్లో ఈ యాప్ ద్వారా మిగిలిన ప్రభుత్వ శాఖల ద్వారా ఏ విధంగా ఫలితాలు వస్తాయనేది..!

Guntur

2022-08-17 01:58:02

శ్రీవారి వైభవోత్సవాల్లో పాల్గొని తరించండి

నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో జిల్లా వాసులు పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి   కాకాణి గోవర్ధన రెడ్డి కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో  మంగళవారం నుంచి ఈ  నెల 20వ తేదీ  వరకు వైభవోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా  తొలి రోజు ఉదయం నిర్వహించిన  వసంతోత్సవ పూజా కార్యక్రమంలో మంత్రి  గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సూళ్ళూరుపేట  శాసనసభ్యులు  టీటీడీ బోర్డు సభ్యులు  కిలివేటి సంజీవయ్య, నుడ ఛైర్మన్ ముక్కాల ద్వారాకానాథ్ లతో కలసి వసంతోత్సవంలో పాల్గొన్నారు.  ఈ సంధర్భంగా మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని ప్రజలందరికీ కల్పించాలని ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  సంకల్పంతో   వైభవోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం, వి పి ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులో 5 రోజుల పాటు జరుపుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. తిరుమలలో స్వామి వారికి జరిగినట్లుగానే ఇక్కడ శ్రీవారి సేవలు నిర్వహిస్తారని, జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకుని  శ్రీ వారి వైభవోత్సవాల్లో పాల్గొని  భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు. ఏడు సంవత్సరాల తర్వాత వైభవోత్సవాలు మళ్ళీ నెల్లూరులో నిర్వహించుకుంటున్నట్లు మంత్రి  తెలిపారు.  కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఐదు రోజుల పాటు నెల్లూరులోనే కొలువై ఉన్నట్లుగా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు, విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ల అధ్వర్యంలో   చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి  వెంకట నారాయణమ్మ, విశేష సంఖ్యలో భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Nellore

2022-08-16 13:40:31

సీపీఎస్ రద్దుపైనే 2024 ఎన్నికల ప్రభావం

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేడి ఈసారి సీపీఎస్ రద్దుతోనే మొదలయే దాని ప్రభావంతోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చి మడమ తిప్పేసిన ప్రభుత్వ తీరుతో ఉద్యోగులంతా గుర్రుగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా.. సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం తమకి అనుకూలంగా మాత్రమే అడుగులు వేసుకుంటూ వస్తోంది. దీనితో ఆగ్రహంతో వున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు. ఇప్పటికే రివర్స్ పీఆర్సీతో తీవ్ర ఆగ్రహంతో వున్న ఉద్యోగులకు ఇపుడు సీపీఎస్ రద్దు కూడా ఒక ప్రత్యేక ఛాలెంజ్ గా మారింది. ఎలాగైనా సీపీఎస్ రద్దు చేసే పార్టీలకే మద్దతు ఇవ్వాలని ఇప్పటికే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకోగా..తాము అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సీపీఎస్ రద్దు చేస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించింది. రద్దు చేస్తామన్న వైఎస్సార్సీపీ మాత్రం పీఆర్సీ అమలు చేసినట్టుగానే సీపీఎస్ రద్దు విషయంలో కూడా రివర్స్ గేర్ లోనే రావాలని చూస్తోందని ఉద్యోగులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఇచ్చిన హామీని అమలు చేసి మమ అనిపించుకోవాలనే లక్ష్యంతో ఇటు ప్రభుత్వం సీపీఎస్ విషయంలో మరోసారి రాజకీయం చేసి దానిని వచ్చే 2024 ఎన్నికల బూచీగా చూపించే ప్రయత్నాలకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్దం చేస్తోందనే ప్రచారం జరుగా సాగుతోంది.

సీపీఎస్ రద్దు విషయంలో తగ్గేదేలేదు..
స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధి విధానాలన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చవి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి అసలు ప్రభుత్వాలు రాజకీయం చేస్తే ఎలా వుంటుందనే అంశం చాలా స్పష్టంగా అర్ధమైంది. ఈ విషయంలో సమ్మెలు, పెన్ డౌన్ లు కాకుండా ప్రభుత్వశాఖలు, ఉద్యోగ సంఘాల వారీగా ఒకే తాటిపైకి వచ్చి ప్రధాన డిమాండ్ల సాధన చేసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల మనుగడ కష్టమనే నిర్ణయానికి ఉద్యోగులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. చేస్తున్న ఆందోళన బయటకు తెలియనీయకుండా సీపీఎస్ రద్దు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తే తప్పా ఏ రాజీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చే వ్యూహాత్మంగా అడుగులు వేయాలని చూస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా విభజించు పాలించు అన్న సూత్రాన్ని పాటిస్తూ.. ఉద్యోగ సంఘాలను అనుకూలంగా చేసుకొని ఆడిస్తున్న విషయాన్ని ఇటు ఉద్యోగులు కూడా గుర్తించి తమన పని తాము చాపకింద నీరులా చేసుకు పోతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నవేళ ఉద్యోగుల తమ స్వరం పెంచడంతోపాటు, ఎన్నికల కార్యాచరణ కూడా ఈసారి చాలా గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎలా పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రభుత్వ ఉద్యోగుల ప్రభావం 2024 ఎన్నికల్లో చూపించాలని కంకణం కట్టుకున్నాయని చెబుతున్నారు.


ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఏపీ ప్రత్యేకంగా..
 సీపీఎస్ రద్దు విషయంలో ఇప్పటికే అమలు చేసిన రాజస్థాన్, చత్తీస్ ఘడ్  రాష్ట్రాలు మాదిరిగా కాకుండా..ప్రభుత్వానికి కలిసొచ్చే విధంగా సీపీఎస్ రద్దు విషయంలో సమూల మార్పులు చేయాలని ఇటు ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాల్లో అధ్యయనాలు కూడా చేయించి..అక్కడ రద్దు చేసినట్టుగా కాకుండా సీపీఎస్ రద్దులో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ మార్కు కనిపించేలా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనపిస్తోందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. పీఆర్సీ విషయంలో ఏ విధంగా అయితే జీతాలు పెంచినట్టుగా ఏ విధంగా అయితే కాగితాలపై లెక్కలు చూపించి.. ముందుగానే హెచ్ఆర్ఏ, డీఏ శ్లాబుల్లో కోతలు విధించి.. ఆ పై పీఆర్సీ అమలు చేసి.. అదే మొత్తం పెరిగినట్టుగా చూపిచిందో..ఆ విధంగానే ఇపుడు సీపీఎస్ రద్దు కూడా చేస్తే..ఇచ్చిన హామీ అమలు చేసినట్టుగా అవుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నదని..ఉద్యోగ సంఘాలు తమ సమాజిక మాద్యమాల ద్వారా ప్రచారాలు చేస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వం మూడో కంటికి తెలియకుండా ఏ విధంగా రహస్య అధ్యయనాలు, కార్యాచరణ చేస్తున్నదో ఆ విషయాలన్నీ మొత్తంగా ముందే తెలుసుకొని ఉద్యోగ సంఘాలు 2024 ఎన్నికలకు సిద్దం కావాలనే సంకేతాలను కూడా పంపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్ని సమయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఏ పనైనా చేసుకుంటే..ఇక ఉద్యోగులు, అధికారులు ఉన్నది ఎందుకనే అంశాన్ని తెరపైకీ తీసుకువచ్చారు.

తేడా సీపీఎస్ రద్దును ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీల అమలు ఇప్పటి వరకూ కాస్త తేడాగానే అమలు చేసిన ప్రభుత్వం అదేవిధంగా సీపీఎస్ రద్దు కూడా తేడాగానే చేయాలని చూస్తే దానిని నమ్మకుండా తమ తీర్పు అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా చూపించాలనే నిర్ణయాయినికి ఉద్యోగులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతేకాకుండా మొన్నటికి మొన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా రెండేళ్ల సర్వీసు అనంతరం ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అధనంగా 9నెలలు కేవలం రూ.15వేలకే ఉద్యోగాలు చేయించి, ఆ పై పీఆర్సీ బెనిఫిట్స్ ఇవ్వకుండా చేతులు దులుపుకున్న వైనాన్ని కూడా ఉద్యోగ సంఘాలు ఎన్జీఓల ద్వారా అందరిలోనూ చైతన్యం కల్పిస్తున్నాయి. ఇదే పద్దతి కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అనుకున్న విధానాలనే అమలు చేస్తుంది తప్పితే ఉద్యోగుల డిమాండ్లలన్నీ అలానే ఉండిపోతాయని.. మనుగడ కూడా ప్రశ్నార్ధకం అవుతుందని.. దానికోసం సమూహంగా ఉద్యోగుల భద్రత కోసం తీసుకునే నిర్ణయాలు చరిత్ర కావాలనే లక్ష్యంతో పనిచేయాలని హిత బోద చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం తేడాగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగుల పవర్ ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తామనే సంకేతాలు కూడా అపుడే విడుదల చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది.

సీపీఎస్ విషయంలో సామ, వేద, దండోపాయాలు..
సీపీఎస్ రద్దు చేయకుండా ఉద్యోగుల విషయంలో సామ, వేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్న ప్రభుత్వం ఇదే పద్దతిని కొనసాగించి 2024 ఎన్నికల్లో మరోసారి ఉద్యోగులను నమ్మించే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు వారి వారి కూటముల్లో పెద్ద ఎత్తున ప్రాచారానికి తెరలేపారు. ఈ విషయంలో ఉద్యోగులంతా కలిసికట్టుగా లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నష్టపోతామనే విషయాన్ని, ఏ విధంగా నష్టం జరుగుతుంది..పీఆర్సీ విషయంలో ఇపుడు జరిగిన నష్టాన్ని గ్రాఫ్ లు గా వేసి మరీ ప్రచారం చేస్తున్నారు ఉద్యోగులు. ఈ విషయం ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లినా తాడో పేడో అన్నట్టుగా ఉండటంతో.. ప్రభుత్వ ఉద్యోగులను సీపీఎస్ రద్దు అంశం తోనే బురిడీలను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సీపీఎస్ రద్దు విషయంలో కొత్తగా అధ్యయనాలు చేసి.. సీపీఎస్ రద్దు చేసిన రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో మాదిరిగా కాకుండా.. ప్రభుత్వం అనుకున్న విధంగా విధి విధానాలు ఖరారు చేయడానికి ప్రభుత్వం చూస్తోందని మీడియా సైతం కోడై కూస్తోంది. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రచారం చేస్తూనే..ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఉద్యోగ సంఘాల ప్రతినిధులను, ఉద్యోగులను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడంలో పై చేయి సాధిస్తున్నది ప్రభుత్వం. అయితే అన్నింటినీ నిసితంగా పరిశీలిస్తున్న ఉద్యోగులు, మొన్నటి వరకూ ఉద్యోగ సంఘాల్లో మాత్రమే చైతన్యం తీసుకు వచ్చి..నేడు ప్రజలను కూడా చైతన్య పరిచే కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. ఎక్కడైనా జన సమ్మర్ధం ఉన్నచోట ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చేస్తున్న వ్యవహారాలను పనిగట్టుకొని ప్రచారం చేయడం మొదలు పెడుతున్నారు. ప్రభుత్వం ఒకలా ఆలోచిస్తుంటే..దానికి రెండు రెట్లు ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగ సంఘాలు ముందుంటున్నాయి. మొత్తానికి సీపీఎస్ రద్దు విషయంలో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న వ్యవహారం 2024 ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపించే విధంగా అటు ఉద్యోగ సంఘాలు, ఇటు ప్రభుత్వ కార్యాచరణ దెబ్బా దెబ్బగా ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతున్నది. చూడాలి ఏం జరుగుతుందనేది..!

Guntur

2022-08-16 02:09:42

ఉద్యోగుల బదిలీలకు కొత్త మార్గదర్శకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మార్గదర్శకాలు రెడీచేసే పనిలో పడ్డారు అధికారులు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ శాఖల్లో సచివాలయ ఉద్యోగుల శాఖ కొత్తది కావడం.. సుమారు 19 శాఖల ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం కూడా ఇపుడు బదిలీల విషయంలో ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం ఉత్పన్నమవుతున్నది. దానిని అధిగమించడం కోసం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 శాఖల ఉద్యోగులకు సంబంధించిన మాత్రుశాఖల్లో అమలు జరుగుతున్న సర్వీసు నిబంధనలు అమలు చేయాలా, లేదంటే అందరు ఉద్యోగులకు సంబంధించినంతవరకూ కొత్త శాఖ కావడంతో వాటికి ప్రత్యేకంగా నిబంధనలు, పదోన్నతుల చార్టు ఏర్పాటు ఏర్పాటు చేయాలా అనే మీమాంశలో ప్రభుత్వం పడినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం సచివాలయ శాఖ ఏర్పాటై అక్టోబరు 2 వస్తే మూడేళ్లు పూర్తవుతుంది. అందులోనూ చాలా వరకూ ఉద్యోగాల భర్తీ స్థానికత ఆధారంగానే జరిపినా.. కొందరికి మాత్రం పక్కజిల్లాల్లో పోస్టింగులు ఇచ్చారు. వీటన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకొని సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేసే విషయంలో పాత జిల్లాశాఖల నిబంధనలు అమలు చేస్తారా..లేదంటే  అంతర్ జిల్లాల బదిలీల కోసం కొత్త నిబంధనలు తెరపైకి తీసుకు వస్తారా అనే విషయంలో రాష్ట్ర స్థాయి అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు.


బదిలీలు  ఏ విధంగా జరుగుతాయో..
గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులకు సంబంధించినంత వరకూ స్థానికత ఆధారంగా సచివాలయాల్లో పోస్టింగులు ఇచ్చారు. ప్రస్తుతం వాటి ఆధారంగానే జిల్లా పరిధిలో అయితే రోస్టర్ విధానంలో బదిలీలు చేయాల్సి వుంటుంది. అదే రోస్టర్ లో ఎంత శాతం మేర బదిలీలు చేస్తారు. ఇందులో మహిళలు, పురుషులకు ఎంత పర్శంటేజిలో బదిలీలు చేస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఒక వేళ మొత్తంగా బదిలీలు చేపట్టినా కదిలి పోవడానికి సచివాలయ సిబ్బంది మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి బదిలీలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేయడంతో సాధ్యమైనంత త్వరగా అంటే డిసెంబరు లోగా బదిలీలకు సంబంధించిన జీఓ విడుదల చేయడానికి రాష్ట్ర సచివాలయశాఖ అధికారులు కరసత్తు చేపట్టారు. అంతేకాకుండా ఎంత మంది సిబ్బందికి ప్రస్తుతం రెండేళ్లు పూర్తి చేసుకొని సర్వీసు రెగ్యులర్ అయ్యింది.. ఇంకా ఎంతమందికి కావాల్సి వుంది..డిసెంబరు లోగా ఇంకా ఎంత మందికి సర్వీస్ ప్రొబేషన్ పూర్తికాదు..అందులో మెటర్నటీ సెలవులు తీసుకున్నవారెంతమంది. తదితర వివరాలతో కూడా జాబితా కూడా సేకరించే పనిలో పడ్డారు రాష్ట్ర అధికారులు. ఇటు జాబితా.. అటు బదిలీల నిబంధనలు పూర్తయితే జీఓ జారీకి మార్గం సుగమం అవుతుంది.

ఉద్యోగుల అభిప్రాయ సేకరణకు వెబ్ సైట్..
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో భాగంగానే ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో జిల్లాల వారీగా అన్ని శాఖలకు సంబంధించి ఎంత మంది ఉద్యోగులు బదిలీలకు ముందుకొస్తున్నారు..ఎంతమందికి కోరుకోవడం లేదనే సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి అభిప్రాయాలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత ప్రత్యేకంగా జీఓ జారీ చేసి ఆపై బదిలీలకు డిఎస్సీ కమిటీకి బాధ్యతలు అప్పగిస్తారని కూడా చెబుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జరగాలంటే సుమారు మూడు నుంచి ఐదు నెలలు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం విధినిర్వహణలో వున్న లక్షా 21 వేల మంది ఉద్యోగులకు సంబంధించి మొత్తం సర్వీస్ ప్రొబేషన్ పూర్తయిన తరువాత బదిలీలు చేపడితే అందరికీ న్యాయం చేసినట్టుగా వుంటుందనే కోణంలో అధికారులు ప్రభుత్వానికి, మంత్రులకు తెలియజేయగా వారంతా అంగీకరించారని సమాచారం. దీనితో ఈ అంశం ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈసీ నిబందన కూడా తోడయ్యే అవకాశం..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ఎన్నిక కమిషన్ ఆదేశాలు కూడా తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో గ్రామస్థాయిలో సిబ్బందిని మార్చకపోతే ఉద్యోగులు ప్రజలను వివిధ సంక్షేమ పథకాల విషయంలో ప్రభావితం చేసే అవకాశాలపై ఈసీ కూడా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం వుంటుంది. అలా ఎన్నికల సంఘాలనికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే సచివాలయ సిబ్బందికి బదిలీలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, సచివాలయాల పరిధిలో సిబ్బంది మొత్తం కొత్తవారే విధుల్లోకి చేరుతారు. తద్వారా అక్కడి ప్రజలను ఏ విషయంలోనూ ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉండదు. ప్రభుత్వశాఖల్లో ఎప్పుడు బదిలీలు జరిగినా..అవి ఎన్నికలకు ముందు జరిగితే వాటిని ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడే ప్రభుత్వాలు చేపడతాయి. అలా సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు అమలు జరిగినా జరవచ్చుననే సంకేతాలు కూడా ఉద్యోగుల్లోకి వెళుతున్నాయి.


అంతర్ జిల్లాల బదిలీల్లో మరో కొత్త మెలిక..
ఆంధప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో సాధారణ బదిలీలతోపాటు, అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి కూడా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలున్నాయి. ఒక వేళ రెండికీ జీఓ విడుదల చేస్తే.. పక్క జిల్లాల బదిలీలు కోరుకునేవారు లాస్ ఆఫ్ సర్వీసు నిబంధనకు అంగీకరించాల్సి వుంటుందా అంటే అవుననే వాదనే బలంగా వినిపిస్తుంది. ఆ విధంగా జరిగితే స్థానిక జిల్లాలో ఉన్న సర్వీసు మొత్తం రద్దై..కొత్త గా బదిలీ జరిగిన జిల్లాలో సర్వీసు మొదలవుతుంది. ఆ విధంగా జరిగితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడేళ్లో, లేదంటే ఎనిమిదేళ్లకో జరిగి పదోన్నతుల విషయంలో ఇలా లాఫ్ సర్వీస్ కోల్పోయిన ఉద్యోగులు పదోన్నతులు కూడా కోల్పోతారు. ప్రభుత్వం ఆవిధంగా బదిలీలు చేపడుతుందా..లేదంటే మ్యూచ్ వల్ విధానంలో బదిలీలు చేపడుతుందా.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్న ద్రుష్ట్యా అందరికీ ఒకే నిబంధన అమలు చేసి బదిలీలు చేస్తుందా..? అనేవిషయంలో క్లారిటీ రావాల్సి వుంది. ఏది ఏమైనా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో అతి తక్కువ సమయంలోనే అంటే మూడేళ్లకే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం పచ్చజెండా ఊపడం..దానికి అనుగుణంగానే పనులన్నీ చకా చకా జరిగిపోవడం నేడు రాష్ట్ర వ్యాప్తం అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ చర్చనీయాంశం అవుతోంది..!

Guntur

2022-08-15 07:11:07

పంద్రాగస్టుకి మహిళా పోలీసులకు యూనిఫాం

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు పంద్రాగస్టు వేడుకల్లో ఖాకీ దుస్తులతో గౌరవ వందనం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14వేలకు పైగా వున్న మహిళా పోలీసులకు ప్రభుత్వం యూనిఫారం ఇవ్వాలని నిర్ణయించింది. దానికోసం మూడు నెలలు ముందే పోలీస్ స్టేషన్లు వారీగా సచివాలయ మహిళా పోలీసులకు డ్రెస్ కొలతలు కూడా తీసుకున్నారు. ఆ మేరకు అన్ని జిల్లాలకు 2 నెలల క్రితమే యూనిఫారం చేరుకుని కుట్టు పనులు కూడా పూర్తిచేసుకుంది. ఈ కార్యక్రమం మొత్తం జూలై నెలాఖరుకే ప్రభుత్వం పూర్తిచేసింది. ఆగస్టు 1వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరించిన ప్రభుత్వం మిగిలిన శాఖల సిబ్బందికి యూనిఫాం ఇచ్చినట్టుగానే సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన ఖాకీ యూనిఫాం కూడా అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాల వారీగా ఆయా పోలీసు స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య ఆధారంగా వీటిని అందించనున్నారు.

ఆగస్టు 15న యూనిఫాంతో జెండా వందనం..
గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు యూనిఫారం ఈవారంలోనే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మహిళా పోలీసులంతా ఖాకీ యూనిఫాంతోనే 2022 పంద్రాగస్టు వేడుకల్లో
 పాల్గొంటారు. ఇప్పటికే యూనిఫాం కుట్టు కార్యక్రమాలు, షూ, బెల్ట్, విజిల్, నేమ్ బోర్డు, కేప్ ఇలా అన్ని సిద్దం చేయడంతో డీజీపీ ఆదేశాల కోసం మేరకు మాత్రమే ఎదురు చూస్తున్నట్టుగా అధికార యంత్రాంగం చెప్పుకొస్తోంది. డీజీపీ నుంచి ఉత్తర్వులు రాగానే వాటిని మహిళా పోలీసులకు పంపిణీ చేసి తద్వారా గ్రామస్థాయిలో మహిళల రక్షణ ప్రారంభించనుంది ప్రభుత్వం. ఇప్పటి వరకూ మహిళా పోలీసులంటే పేరుకే సచివాలయాల్లో ఉన్నారు తప్పితే వారిని ప్రజలు గుర్తించడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఖాకీ యూనిఫాం వేసుకోవడం ద్వారా ప్రజలు కూడా సచివాలయాల్లో మహిళా పోలీసులను సులువుగా గుర్తుపట్టడంతోపాటు వారి సమస్యలు నేరుగా వచ్చి చెప్పుకోవడానికి, వారి ద్వారా స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి.

యూనీఫాంలోనే సచివాలయ సిబ్బంది..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం అందరూ ప్రభుత్వం కేటాయించిన యూనిఫాంలోనే విధులకు హాజరవుతున్నారు. ఒక్క మహిళా పోలీసులు మాత్రమే సివిల్ డ్రెస్ లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వీరు కూడా ఖాకీ యూనిఫాం వేసుకుంటే సచివాలయ సిబ్బందికి మొత్తం డ్రెస్ కోడ్ అమలు జరిగినట్టే. ఇప్పటి వరకూ అరకొరగా యూనిఫాం వేసుకు వస్తున్న సిబ్బంది ఇకపై పూర్తిస్థాయిలో ప్రజలకు కనిపించే విధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నది. ఏ ఒక్క సిబ్బంది అయినా యూనిఫాం వేసుకురాకపోతే కఠిన చర్యలు కూడా తీసుకునే విధంగా అధికారులు ప్రత్యేక ద్రుష్టిసారిస్తున్నారు. ప్రజలు సచివాలయ సిబ్బందిని కేవలం ప్రభుత్వం కేటాయించిన డ్రెస్ కోడ్ ఆధారంగానే గుర్తిస్తున్నారు. అయితే దానికి భిన్నంగా చాలా మంది సచివాలయ ఉద్యోగులు డ్రెస్ సక్రమంగా వేసుకోకపోగా ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాంను బ్యాండ్ మేళంగా అభివర్ణిస్తూ వరి నచ్చిన దుస్తులతో విధులకు హాజరవుతున్నారు. ఇకపై అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకొని..డ్రెస్ కోడ్ లోనే విధులకు హాజరయ్యే విధంగా చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అన్ని ప్రభుత్వశాఖల అధికారులను ఆదేశించినట్టుగా చెబుతున్నారు. చూడాలి మహిళా పోలీసులకు ఖాకీ యూనిఫాం అందజేసిన తరువాతనైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందితో తరచుగా యూనిఫాం వేసుకుని వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటారో..లేదంటే యదావిధిగా పేరుకే ప్రకటనలు చేసి.. అమలుని గాలికి వదిలేస్తారో..!

Guntur

2022-08-06 01:02:41