ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో సమాచార పౌరసంబధాల శాఖ వేరయ..ఈ శాఖలో ప్రభుత్వ మీడియా సలహాదారులు జర్నలిస్టులకిచ్చిన హామీలు.. మంత్రుల సూచనలు.. జర్నలిస్టు వ్యతిరేకతను పట్టించుకోకుండా వీరు మొండిగా కోర్టులకు సమాధానాలు చెబుతారయ..ఏంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే ఎడిటింగ్ చేయని వార్తలో కాలుపెట్టినట్టే.. మీరు చదువుతున్నదంతా అక్షర సత్యం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అబాసు పాలుచేయాలని చూస్తున్నారో..లేదంటే అత్యుత్సాహం ప్రదర్శించి జర్నలిస్టులంతా ప్రభుత్వంపై తిరగబడేలా చేస్తున్నారో.. అదీకాదంటే దేశం మొత్తం ఏపీలోని సమాచరశాఖనే తొంగిచూసేలా మీడియాను నియంత్రించేలా చేయాలని ప్రత్యేక పథకం వేశారో తెలీదు గానీ.. సమాచారశాఖలో ఉన్నతాధికారులు జర్నలిస్టులు ఏమైపోయినా తాము అనుకున్నదే చేస్తూ ముందుకు వెళుతూ వార్తల్లో నిలుస్తున్నారు.. మీడియాలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని నిబంధనలు అమలు చేసి వేలల్లో వున్న అక్రిడేటెడ్ జర్నలిస్టులను వందల్లోకి తెచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నామనే సంకేతాలను పంపుతున్నారు.. నిబంధనలు ఎవరికైనా ఒకేలా వర్తింపచేసే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమాచారశాఖ మాత్రం డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిబద్దతగావున్నా..మంత్రులు ముక్కుసూటిగా వున్నా..మీడియా సలహాదారులు సూచనలు చేస్తున్నా అవేమీ తమకు పట్టవన్నట్టు వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల వ్యవహారంలో ఇటు మంత్రులు, మీడియా సలహాదారులు జర్నలిస్టు సంఘాలకు పత్రికా ముఖంగా ఎవరికీ అన్యాయం జరగకుండా అక్రిడిటేషన్లు ఇస్తామని, ఆందోళన చెందవద్దని హామీలిస్తూ అదే మీడియాలో ప్రకటిస్తున్నా..తాము మాత్రం ఇచ్చిన జిఓ నెంబరు 142 ఆధారంగానే వ్యవహరిస్తామంటూ మొండిగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్లపై కెనీసం అవగాహన లేని అధికారులను అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులుగా చేర్చి, జర్నలిస్టుల సంఘాలను పక్కకు పెట్టిన విషయమై ఇప్పటికే కోర్టుకి వివరణ ఇచ్చేపనిలో పడినా..నేటికీ అధికారుల తీరులో మార్పు రాలేదు సరికదా.. ప్రభుత్వం తరపున ఇచ్చిన జీఓ ప్రకారం అయినా అక్రిడిటేషన్లు సక్రమంగా ఇస్తున్నారా అంటే దానికీ సరైన సమాధానం ఇవ్వడంలేదు.. పెద్ద పత్రికలకు వారి సొంత న్యూస్ ఏజెన్సీల ద్వారా ప్రచురితమైన క్లిప్పింగులను అనుసరించి పత్రిక పేరుతో అక్రిడిటేషన్లు మంజూరు చేశారు సమాచారశాఖ అధికారులు. అసలు ఒక పత్రికకు పత్రికపేరుతో వచ్చే క్లిప్పింగులతో కాకుండా న్యూస్ ఏజెన్సీ క్లిప్పింగులతో దరఖాస్తు చేస్తే ఆ పత్రికలకు పత్రికల పేరుతో అక్రిడిటేషన్లు ఎలా ఇస్తారు..దానికి ఏదైనా ప్రత్యేక జీఓ వుందా..అలాని సదరు పత్రికలు న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో అక్రిడిటేషన్లకు దరఖాస్తు చేశాయా అంటే దీ లేదు.. కానీ జీఓలో ఉన్నట్టుగా సంబంధిత అధీక్రుత పత్రాలు, క్లిప్పింగులు, ఇతరత్రా అన్నీ ఆన్ లైన్ సమర్పిస్తే తప్పా అక్రిడిటేషన్లు ఇవ్వమని తెగేసి చెబుతున్న అధికారులు పెద్ద పత్రికలు న్యూస్ ఏజెన్సీ క్రెడిట్ లైన్ తో పెట్టిన క్లిప్పింగులకు ఎలా అక్రిడిటేషన్లు ఇచ్చారనే విషయమై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే విషయమై విశాఖజిల్లాలోని మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దాఖలైన 15 అంశాల సమాచారహక్కు చట్టం దరఖాస్తులో ప్రస్తావించిన అంశాలను ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే విధంగా ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ల ద్వారా అడ్డగోలు వ్యవహారాన్ని బహిర్గతం చేసే పనిలో పడ్డాయి. ప్రస్తుతం ఈ విషయమే రాష్ట్రంలో హాట్ టాపిక్. విశాఖజిల్లాలో దాఖలైన సమాచారహక్కు చట్టంలోని అంశాలకు సమాధానం చెప్పకపోయినా, నిబంధనలను అతిక్రమించి ఇచ్చిన అక్రిడిటేషన్ల వ్యవహారంలో ఖచ్చితమైన సమాచారం మొక్కుబడిగా ఇచ్చినా సదరు దరఖాస్తు దారుడు సమాచారశాఖ ఇచ్చిన ఆధారాలు, ప్రభుత్వ నిబంధనలు, దేశరాజధాని న్యూఢిల్లీలోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అమలు చేసే నిబంధనలతో కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అదే జరిగితే పుండుపై కారం చల్లినట్టుగా, ఇప్పటికే అత్యుత్సాహంతో కోర్టులకు వివరనిస్తూ వస్తున్న సమాచారశాఖ ఇపుడు మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ను కూడా ఇరకాటంలోకి నెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ముఖ్యంగా విశాఖజిల్లాలో జరిగే అక్రిడిటేషన్ కమిటీలో జరిగిన సమావేశ అంశాలు(మినిట్స్)ను సమాచారశాఖ అధికారులు ఎప్పుడూ సమావేశంలో రాయరు. ఇదే విషయమై గతంలో కూడా గొడవులు జరిగాయి. ఇలా చాలా తప్పులు చేసిన సమాచారఖను ఏదోలా ఒడ్డున పడేయాలని చూస్తున్న మీడియా సలహాదారుల సూచనలు కూడా సమాచారశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కోర్టు మెట్లెక్కి కౌంటర్లైనా దాఖలు చేస్తున్నారు తప్పితే తాము ఇచ్చిన జీఓని మార్చేది లేదంటూ వివిధ శాఖల అధికారులతోనే అక్రిడిటేషన్ కమిటీలు నిర్వహిస్తూ వచ్చారు. అందులో కొన్ని పెద్ద పత్రికలకు న్యూస్ పేపర్ ఫార్మాట్ లోనూ, ఇటు న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లోనూ కాకుండా దాఖలు చేసిన అక్రిడిటేషన్ ఫైలును ఆమోదించి ఇచ్చిన అక్రిడిటేషన్ల వ్యవహారానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సమాచారశాఖకు, జర్నలిస్టులకు మధ్య జరుగుతున్న వార్ ను తగ్గించడానికి ప్రభుత్వంలోని మీడియా సలహాదారులు జర్నలిస్టులకు ఇచ్చే హామీలను సమాచారశాఖ పట్టించుకోకుండా తాము అనుకున్నట్టే చేస్తూ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులో గౌరవ ప్రధమైన స్థానంలో వున్న రాష్ట్ర మీడియా సలహాదారులు, జాతీయ మీడియా సలహాదారుల సూచనలు, సలహాలు మాకు పట్టవన్నట్టు వ్యవహరిస్తోంది. ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..6 లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మీడియా సంస్థలు వేజ్ బోర్డు జీతాలు అమలు చేస్తున్నాయి..ఎన్ని మీడియా సంస్థలు కనీసం లేబర్ లైసెన్సులు కూడా తీసుకోకుండా పత్రికల నిర్వహణ చేస్తున్నాయి.. ఎన్ని న్యూస్ ఏజెన్సీలు అక్రిడిటేషన్ల దరఖాస్తు చేసినపుడు అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు ఇచ్చాయి..ఇవ్వకుండానే ఎన్ని సంస్థలకు అక్రిడిటేషన్లు జారీచేశారు తదితర వివరాలతో రేపటి ప్రత్యేక కధనంతో మళ్లీ కలుద్దాం..!
ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో దేశ రాజధాని పీఐబీలో కూడా లేని నిబంధనలు పెట్టిన సమాచాశాఖ.. ఈ శాఖలోని అటెంటడర్లుకు, వాచ్ మెన్ లకు కూడా ప్రభుత్వ అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చిందో అధికారులే సమాధానం చెప్పాల్సి వుంది. సమాచారశాఖలో ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి వెళ్లే డిడి, ఏడి, డిపిఆర్వో, ఏపీఆర్వో, ఫోటోగ్రాఫర్, సినిమా ఆపరేటర్, మైక్ సెట్ ఆపరేటర్లకు సమాచారశాఖ విధినిర్వహణలో భాగంగా అక్రిడిటేషన్లు మంజూరు చేస్తుంది. కానీ విశాఖజిల్లాలోని సమాచారశాఖలో మాత్రంలో అటెండర్లుకు, వాచ్ మెన్లకు కూడా సమాచారశాఖ అక్రిడిటేషన్లు మంజూరు చేసేసింది. దానికి కారణం కూడా లేకపోలేదు. జర్నలిస్టులతో సహా సమాచారశాఖలోని అక్రిడిటేడెస్ సిబ్బందికి కూడా ఆర్టీసీ బస్సు పాసులు మంజూరు చేయడంతో ఇబ్బడి ముబ్బడిగా కార్యాలయంలోని ఉన్న సిబ్బందికి మొత్తం అక్రిడిటేషన్లు ఇచ్చేసింది. ఈ విషయాన్ని బహిర్గతం చేయాలని కోరుతూ విశాఖజిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కు సమాచారహక్కుచట్టం 2005 ప్రకారం సమాచారశాఖలోని అడ్డగోలు అక్రిడిటేషన్ల వ్యహారం ఆధారాలతో సహా బయటకు తీసే ఉద్దేశ్యంతో దరఖాస్తు దాఖలైంది. అంతేకాదు సమాచారశాఖలోని కొందరు సిబ్బంది, అక్రిడిటేషన్ కమిటీలోని సభ్యుల అండ దండలతో నచ్చిన వారికి నచ్చినట్టుగా పరిమితికి మించి అక్రిడిటేషన్లు మంజూరు చేశారు. అందులోకొన్ని పెద్ద పత్రికలు కూడా ఉన్నాయి. సమాచారశాఖ జర్నలిస్టులకి అమలు చేసే నిబంధనలు ఎందుకు ప్రభుత్వశాఖ అయిన సమాచారశాఖలోని అధికారులు, సిబ్బంది, కార్యాలయ ఉద్యోగుల విషయంలో పాటించలేదో అధికారులే సమాధానం చెప్పాల్సి వుంది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి తదితర అతిముఖ్యమైన వారు వచ్చినపుడు సమాచారశాఖ లోని సిబ్బంది అవసరం అవుతారని, అందుకే వారికి అక్రిడిటేషన్లు ఇచ్చారని ఇక్కడి అధికారులు సమర్ధించుకున్నా ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేసే అటెండర్లకు పదో తరగతి అర్హతున్న ఉద్యోగులకు అక్రిడిటేషన్లు ప్రభుత్వం ఇవ్వకూడదు. కానీ సమాచారశాఖ వరకూ వస్తే ఒక నిబంధన, జర్నలిస్టులకు మాత్రం మరోలా కఠినతరమైన నిబంధనలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నిస్తే...మేమిచ్చిందే జీఓ దానిని ఎవరైనా పాటించాల్సిందేనని అధికారులు బల్లగుద్ది చెబుతున్నారు. పైగా తమ కమిషనర్ ఇచ్చిన జీఓ ప్రకారం అన్ని అనుబంధ పత్రాలు లేకపోతే అక్రిడిటేషన్ వచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పేస్తున్నారు కూడా. ఇలాంటి సమయంలో విశాఖజిల్లాలో అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దాఖలైన సమాచారహక్కుచట్టం దరాఖాస్తులోని పలు అంశాలను ఇపుడు అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ను ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే అటు న్యూస్ ఏజెన్సీ, ఇటు దిన పత్రికా కాని పెద్ద మీడియా సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా మొదటి విడతలో అక్రిడిటేషన్లు ఇచ్చేసిన సమాచారశాఖ తమను తాము సమర్ధించుకునే పనిలో పడింది. గత మూడేళ్లుగా సమాచారశాఖలోని కొందరు అధికారులు అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ను సైతం తప్పుదోవ పట్టిస్తూ వస్తూ, తమ అనుకూల మీడియాకి కూడా అక్రిడిటేషన్లు ఇచ్చేస్తూ వచ్చాయి. అయితే ఇపుడు వాటిని సమాచారహక్కు చట్టం ద్వారా కోరిన సందర్భంలో సమాచారశాఖ అధికారులు అపుడే జర్నలిస్టు సంఘాల నేతలను రంగంలోకి దించాయి. సమాచార హక్కుచట్టం క్రింద కోరిన సమాచారం మొత్తం అందినట్టుగా దరఖాస్తు దారుడితో చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఎన్నిచేసినా ప్రస్తుతం దాఖలైన సమాచారహక్కుచట్టం క్రింద దాఖలైన దరఖాస్తులోని విషయాలతో దరఖాస్తు దారు, సమాచారశాఖ ఇచ్చిన సమాచారంతో కోర్టుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జీఓ నెంబరు 142 ద్వారా అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలను లేకుండా కేవలం అధికారులతోనే కమిటీ వేయడానికి కోర్టు ద్వారా స్టేటస్ కో ఇచ్చిన నేపథ్యంతో సమాచారహక్కుచట్టం దరఖాస్తుతో అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఇచ్చిన సమాచారంతో పరిస్థితి, అధికారులు అడ్డగోలుగా ఇచ్చిన అక్రిడిటేషన్ల వ్యవహారం ఆధారాలతో సహా బహిర్గతం కానుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని సమాచారశాఖలోని రాష్ట్ర కమిషనర్ తో పాటు, అన్ని జిల్లా సమాచారశాఖ అధికారులకు జరుగుతున్న తంతు వార్తల రూపంలో ముందుగానే తెలుస్తుంది. ఈరోజు మీడియా సలహాదారుల విషయాన్ని తెలియజేయాల్సి వుండగా, దానికంటే ముందు సమాచారశాఖలోని అందరు సిబ్బందికి డిపార్టమెంటల్ అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని ముందుగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కధనాన్ని ముందు ఇచ్చేస్తున్నాం. ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..5 లో ప్రభుత్వ మీడియా సలహా దారులు జర్నలిస్టు సంఘాలకు ఇచ్చిన హామీలేంటి, సమాచారశాఖ అధికారులు వాటిని పట్టించుకోకుండా ఎలా వ్యవహరిస్తున్నారు...కావాలనే మొండిగా వెళుతూ, కోర్టులో కౌంటర్లు ఎందుకు దాఖలు చేస్తున్నారు..తదితర అంశాలతో మళ్లీ కలుద్దాం..!
రాష్ట్రంలోని శాసన సభ్యుల హక్కులను కాపాడవలసిన భాద్యత ప్రివిలేజస్ కమిటీ మీద ఉందని ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రివిలేజస్ కమిటీఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తిరుపతి పద్మావతీ అతిధి గృహంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రివిలేజస్ కమిటీ సభ్యులు మల్లాది విష్ణు, ఎస్.వెంకట చిన్న అప్పల నాయుడు, వి.వరప్రసాద్ రావు, శిల్పా చక్రపాణి రెడ్డి మరియు ఎ పి ఐ ఐ సి చైర్ పర్సన్ రోజా లతో కలసి ఛైర్మన్ జిల్లాలో ప్రోటోకాల్ అమలు తీరు పై జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్తా, జిల్లా ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శాసన సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ నియమావళిని అనుసరించాలని, శాసన సభ్యులు సమస్యల పరిష్కారం కొరకు ఇచ్చే లేఖలకు తీసుకున్న చర్యలకు సంబందించి తగు సమాచారం వెంటనే అందివ్వాలని , అధికారులు సంక్షేమ కార్యక్రమాలకు సంబందించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు అందివ్వాలని తెలిపారు. చిత్తూరు జిల్లాకు సంబందించి ఇప్పటి వరకు ప్రివిలేజస్ కమిటీకి ఎటువంటి ఫిర్యాధులు అందలేదని ఈ పద్ధతిని ఇలాగే కొనసాగించాలని తెలిపారు.
అనంతరం ప్రివిలేజస్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి , సభ్యులు మల్లాది విష్ణు, ఎస్.వెంకట చిన్న అప్పల నాయుడు, వి.వరప్రసాద్ రావు, శిల్పా చక్రపాణి రెడ్డి లతో కలసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, శాసనసభ ప్రివిలేజస్ కమిటీ 175 మంది శాసనసభ్యుల హక్కులను కాపాడటం, కీలకమైన శాసనసభ్యుల హక్కులకు భంగం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై ప్రివిలేజస్ కమిటీ దృష్టి పెడుతుందన్నారు. సాధారణంగా ప్రోటోకాల్ లో శాసన సభ్యుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ప్రివిలేజస్ కమిటీకి ఫిర్యాదులు అందుతాయని వాటిని కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్పీకర్ రిఫర్ చేసిన ఫిర్యాదులకు సంబందించి తొలి సమావేశం అమరావతిలో నిర్వహించామని తెలిపారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తొలి సమావేశం తరువాత రెండవ సమావేశం తిరుపతిలో నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. చిత్తూరు జిల్లాకు సంబందించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, ఈనెల 19న టీటీడీ అధికారులతో ప్రివిలేజస్ కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 175 మంది శాసనసభ్యులకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల చొప్పున సిఏండిఎఫ్ కింద నిధులు విడుదల చేయడం జరిగిందని ముఖ్యమంత్రి శాసనసభ్యులకు గౌరవించడంలో భాగంగా నిధులు విడుదలచేయడం జరిగిందని దీనిని అధికార యంత్రాంగం దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులు ప్రతిపాదించిన అంశాలను పరిగనలోకి తీసుకుని వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, జిల్లా సంయుక్త కలెక్టర్ (సంక్షేమం) రాజశేఖర్, డిఆర్ ఓ మురళి , తిరుపతి , చిత్తూరు ఆర్డీఓ లు కనకనరసారెడ్డి, రేణుక, తిరుపతి కార్పొరేషన్ ఇంచార్జి కమీషనర్ హరిత, డ్వామా , డీఆర్డీఎ పిడి లు చంద్రశేఖర్, తులసి వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు ఇకనుంచి రాత్రులు వెలగనున్నాయి. మీరు చదువుతున్నది నిజమే గ్రామాలు వెలగడం ఏంటి అనుకుంటున్నారా? అవునండీ గ్రామాల్లోన్ని వీధి దీపాల నిర్వహణ ఇకపై గ్రామసచివాలయాలు చూడనున్నాయి. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ పారిశుధ్య నిర్వహణతో పలు కార్యక్రమాలు, సేవలు, విధులను ప్రభుత్వం గ్రామసచివాలయాలకు అప్పగించింది. ఇపుడు ఆ సేవల్లో వీధి దీపాల నిర్వహణ కూడా చేరింది. ఇకపై గ్రామాంలో ఎక్కడ వీధిపాలు వెలగకపోయినా, పాడైనా తక్షణమే గ్రామసచివాలయాల ద్వారా వాటిని నిర్వహణ చేపట్టనున్నారు. దీనికోసం ఉన్నతాధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గ్రామసచివాలయాల్లో సుమారు 14 ప్రభుత్వ శాఖల ద్వారా సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఇపుడు వీధి దీపాల నిర్వహణ కూడా చేపట్టడంతో ప్రజలకు మరింతగా రాత్రి సమయంలో వీధుల్లో వెలుగులు నిండనున్నాయి. అదే సమయంలో వీటి నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తారా, లేదంటే కాంట్రాక్టు పద్దతిపై సిబ్బందిని తీసుకుంటారా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఉన్నతాధికారులు ఇవ్వలేదు. కాకపోతే గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ మాత్రం చేపట్టనున్నాయని మంత్రి ప్రకటించడం శుభపరిణామంగా కనిపిస్తోంది. దీంతో వీధి దీపాలు లేని గ్రామాలు, వీధులకు కూడా వీధి దీపాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మరో కొత్త ఒరవడికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మూడు ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి దిశగా సాగుతున్నారు. దీనికోసం 19వ తేదీ మంగళవారం, 20తేదీ బుధవారం ఆయన ఉత్తరాంధ్ర పర్యటనకు సన్నద్ధమయ్యారు. ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెడుతూ ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యతనిస్తూ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాలకు సంబంధిచిన ఇన్ ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల శాఖ అధికారులందరితో కలిసి సమావేశమై 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' చర్చించనున్నారు. స్థానికంగా పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు, భూముల కేటాయింపులో పారదర్శకత, పారిశ్రామికవేత్తలకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలన్నింటిపై సమగ్ర చర్చ జరపనున్నారు. అన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి..వేగం, పారదర్శకతకు పెద్దపీట వేసే వ్యూహంతో పరిశ్రమల శాఖ మంత్రి ముందుడుగు వేస్తున్నారు.