1 ENS Live Breaking News

అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖలోనైనా నిబంధనలకు విరుద్ధంగా ఏస్థాయి అధికారి వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటాం..వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలతోపాటు, ప్రభుత్వ శాఖలు కూడా ముఖ్యం..ప్రభుత్వ శాఖల సేవలు దేశానికే ఆదర్శంగా నిలవాలి..ఇవీ తరచుగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి చెబుతున్న మాటలు.. కానీ ముఖ్యమంత్రి మాటలుగానీ, ఉన్నత ఆశయాలుగానీ సమాచారశాఖలోని ఉన్నతాధికారులకు పట్టడం లేదు.. కాదు కాదు పట్టించుకోవడం లేదు.. సీఎం గొంతుచించుకొని పదే పదే ఆ మాటలు ప్రతీ సభలోనూ, సమావేశంలోనూ చెబుతున్నా సమాచారశాఖ అధికారుల తీరులోగానీ, వ్యహారంలోని ఎలాంటి మార్పులేదనే విషయం ఇపుడు జీఓనెంబరు 142 ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసే అక్రిడిటేషన్ల విషయంలో(న్యూస్ ఏజెన్సీలకు ఇచ్చే అక్రిడిటేషన్లు) రుజువైంది. మీడియా నియంత్రణే లక్ష్యంగా దేశరాజ ధాని పీఐబీలోని అక్రిడిటేషన్ల మంజూరులోకూడా లేని నిబంధనలన్నీ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని పదే పదే కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నారు సమాచారశాఖలోని ఉన్నతాధికారులు.. చేసిన తప్పులకు కోర్టుల్లో కౌంటర్లు వేసుకుంటూ ప్రతిపక్షాలతో నానా మాటలు, కామెంట్లు పడేలా చేస్తున్నారు. ఇక సమాచారశాఖ న్యూస్ ఏజెన్సీలకిచ్చే అక్రిడిటేషన్ల విషయానికి వచ్చేద్దాం.. భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, టీవీ ఛానళ్లు ఎరికైనా కేంద్ర, రాష్ట్ర సమాచారశాఖ అధికారులు నిబంధనలు పాటించే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి. కానీ నిబంధనలను పక్కనపెట్టి నేషనల్ న్యూస్ ఏజెన్సీలకు కేవలం ఒక్క లెటర్ ఇచ్చారనే కారణంతో యూఎన్ఐ, ఏఎన్ఐ, పీటిఐ, డిఎన్ఎస్ వంటి న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు ఇచ్చేశారు సమాచారశాఖ అధికారులు. అదే విశాఖజిల్లాలోని న్యూస్ ఏజెన్సీలకు మాత్రం మీడియా అక్రిడిటేషన్ కమిటీలో అప్రూవల్ చేసినా నిబంధనల పేరుతో దరఖాస్తులను బుట్ట దాఖలు చేశారు. సమాచారశాఖ నిబంధనల ప్రకారం జిల్లా న్యూస్ ఏజెన్సీలకు మూడేళ్లు కాలపరిమితి నిండాలి, అదే రాష్ట్రస్థాయి న్యూస్ ఏజెన్సీలకు ఐదేళ్లు, జాతీయ న్యూస్ ఏజెన్సీలకు పదేళ్లు కాలపరితి నిండితే అందులో పనిచేసే జర్నలిస్టులు అక్రిడిటేషన్లు పొందేందుకు అర్హులు అదీ ప్రభుత్వం న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ ప్రకారం అనుబంధ ప్రభుత్వ అనుమతి పత్రాలు, ప్రొప్రైటర్ ఐటి రిటర్న్స్, లేబర్ లైసెన్స్, షాప్ష్ అండ్ ఎస్టాబ్లిస్ మెంట్ లైసెన్స్, సదరు న్యూస్ ఏజెన్సీ నుంచి చందాదారులుగా జాబితా, పత్రికు, టీవీ ఛానళ్లు, న్యూస్ వెబ్ సైట్లు యొక్క క్లిప్పింగులు సమాచారశాఖకు అందించిన తరువాత వాటిని అక్రిడిటేషన్ కమిటీ ముందుంచాలి. కానీ అలా కాకుండా విశాఖలోని సమాచారశాఖ అధికారులు నేరుగా ఒక జర్నలిస్టు సంఘం సిఫారసు చేసిన లెటర్ హెడ్ తో సదరు న్యూస్ ఏజెన్సీలన్నింటికీ అక్రిడిటేషన్లు ఇచ్చేశారు. ఇదేమంటే అక్రిడిటేషన్ కమిటీ సిఫారసు చేసిందని అటు కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ను కూడా తప్పుదారి పట్టించారు. అధికారులను అయితే నమ్మించారు గానీ, సమాచారహక్కు చట్టం క్రింద దాఖలైన దరఖాస్తుకు మాత్రం విశాఖలోని సమాచారశాఖ అధికారులు సమాధానం చెప్పలేదు. దీనితో గత మూడేళ్ల నుంచి న్యూస్ ఏజెన్సీలకు ఏ ప్రాతిపదికన అక్రిడిటేషన్లు మంజూరు చేశారు, సదరు న్యూస్ ఏజెన్సీలు సమాచారశాఖకు దాఖలు చేసిన అనుబంధ పత్రాలు అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో కావాలని ఆర్టీఐ  దరఖాస్తు దారు విశాఖ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దరఖాస్తు దాఖలు చేశాడు. దీనితో దరఖాస్తుతో సమాచారశాఖ అధికారులు రుజువులు చూపించడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ దరఖాస్తుకి సమాచార శాఖ అధికారులు గానీ, అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గానీ రుజువులు చూపించకపోతే అధికారులు చేసిన తప్పులకు, నిబంధనలు పక్కన పెట్టి మంజూరు చేసిన అక్రిడిటేషన్లకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. అంతేకాదు ప్రస్తుతం కొత్త అక్రిడిటేషన్లు కూడా పెద్ద పత్రికలకు న్యూస్ ఏజెన్సీ క్లిప్పింగులతో పెద్ద పత్రికలు అక్రిడిటేషన్ కి దరఖాస్తు చేస్తే పత్రికల పేరుతో సమాచారశాఖ అక్రిడిటేషన్లు మంజూరు చేసింది. అంటే ఇక్కడ సమాచారశాఖ అధికారులు కావాలనే నిబంధనలు పక్కన పెట్టినట్టుగా ఒప్పుకున్నట్టు అయ్యింది. విచిత్రం ఏంటంటే పెద్ద పత్రికల క్లిప్పింగులన్నీ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో సమర్పించి, ఇతర అనుబంధ పత్రాలన్నీ ఆర్ఎన్ఐ, పత్రికలకు సంబంధించిన ఫార్మాట్ లో పత్రికలు సమర్పించినా వాటికి సమాచారశాఖ అక్రిడిటేషన్లు మంజూరు చేసింది. అంటే ఇక్కడ జీఓనెంబరు 142 నిబంధనలన్నీ పక్కన పెట్టినట్టుగానే అధికారులే ఇచ్చిన అక్రిడిషన్ల సాక్షిగా దొరికిపోయినట్టు అయ్యింది. అలా న్యూస్ ఏజెన్సీల క్లిప్పింగులు సమర్పించినపుడు సమాచారశాఖ సదరు న్యూస్ ఏజెన్సీ పేరుతోనే అక్రిడిటేషన్లు కూడా మంజూరు చేయాలి...అదీ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో అక్రిడిటేషన్ కు దరఖాస్తు చేస్తే. కానీ ఇక్కడ పెద్ద పత్రికలన్నీ అటు న్యూస్ ఏజెన్సీ కాకుండా, ఇటు న్యూస్ పేపర్ ఫార్మాట్ లో కాకుండా దరాఖాస్తు చేసినా సమాచారశాఖ మాత్రం పత్రికల పేరుతోనే అక్రిడిటేషన్లు మంజూరు చేసింది. పైగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇపుడు న్యూస్ ఏజెన్సీలు కూడా అన్ని రకాల పత్రాలు ఆన్ లైన్ లో సమర్పిస్తే తప్పా అక్రిడిటేషన్లు మంజూరు చేసేది లేదని, ఇవి కమిషనర్ కార్యాలయం నుంచి తమకు వచ్చిన ఉత్తర్వులనీ విశాఖలోని సమాచారశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగని న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో విశాఖ జిల్లాలోని న్యూస్ ఏజెన్సీలు ఆన్ లైన్ లో అన్ని రకాల పత్రాలు సమర్పించి, వివిధ పత్రికల క్లిప్పింగులు నేరుగా పత్రికలు తీసుకెళ్లి సమాచారశాఖ కార్యాలయంలో అందిస్తే... అలా అందించినా ఆన్ లైన్ లో పత్రికల క్లిప్పింగులు సమర్పించాల్సిందేనని మెలిక పెట్టి జిల్లా స్థాయి న్యూస్ ఏజెన్సీల అక్రిడిటేషన్ దరఖాస్తులను పెండింగ్ లో పెట్టాయి. వాస్తవానికి న్యూస్ ఏజెన్సీలకు సంబంధించిన వందల సంఖ్యలో వున్న క్రెడిట్ లైన్ క్లిప్పింగులు అన్ లైన్ లో సమర్పించడానికి వీలుపడదు. కానీ ఏదోవిధంగా న్యూస్ ఏజెన్సీలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సమాచారశాఖ అధికారులు దరఖాస్తుతోపాటు, వివిధ పత్రికలకు చెందిన ప్రెస్ క్లిప్పింగ్ పత్రికలను భారీ సంఖ్యలో తీసుకొని, ఇపుడు ప్రెస్ క్లిప్పింగులు కూడా ఆన్ లైన్ లో సమర్పించాలని చెబుతోంది. ఒకేసారి పత్రికలన్నీ నేరుగా సమాచారశాఖ కార్యాలయంలో అందిస్తే ఇపుడెలా సమర్పిస్తామని ప్రశ్నిస్తే దానికి తాము ఏమీ చేయలేమని, ఖచ్చితంగా ఆన్ లైన్ అన్ని రకాల అనుబంధ పత్రాలతోపాటు, క్లిప్పింగులు కూడా సమర్పిస్తే తాము ఏమీ చేయలేమని చెబుతున్నారు.  అలా అయితే న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో పత్రికలు సమర్పించిన దరఖాస్తులకు ఎలా అక్రిడిటేషన్లు మొదటి విడతలో ఎలా మంజూరు చేశారని సమాచారహక్కు చట్టం ద్వారా విశాఖ జిల్లా మీడియా కమిటీకి దాఖలు చేసిన 15 అంశాలపై అటు కమిటీ చైర్మన్ గానీ, ఇటు సమాచారశాఖ గానీ సమాచారం ఇవ్వడానికి తడబడుతున్నాయి.  అదేసమయంలో అక్రిడిటేషన్ కమిటీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యను ప్రెస్ కౌన్సిల్ కూడా సుమోటాగా స్వీకరించడం ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినట్టు అయ్యింది. మరోపక్క అక్రిడిటేషన్ కమిటీ విషయమై, నిబందనలు, జీఎస్టీ తదితర అంశాలపై సమాచారశాఖ కోర్టుల్లో కౌంటర్ దాఖలు చేయనుంది. కావాలని సమాచారశాఖ అధికారులు తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జర్నలిస్టుల విషయంలో కోర్టు మెట్లు ఎక్కించేలా చేసినా ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది.  ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ  పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పక అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..4 లో ప్రభుత్వ మీడియా సలహా దారులు జర్నలిస్టు సంఘాలకు ఇచ్చిన హామీలేంటి, సమాచారశాఖ అధికారులు వాటిని పట్టించుకోకుండా ఎలా వ్యవహరిస్తున్నారు...కావాలనే మొండిగా వెళుతూ, కోర్టులో కౌంటర్లు ఎందుకు దాఖలు చేస్తున్నారు..తదితర అంశాలతో మళ్లీ కలుద్దాం..!

Visakhapatnam

2021-01-18 12:43:50

అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..2

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఒక పక్క తమ ప్రభుత్వం అన్నిపనులు ముక్కుసూటిగా చేస్తుందని, నిబంధనలు ఎవరు అతిక్రమించినా క్షమించేది లేదని, అలాంటివారెవరైనా ఉపేక్షించేది లేదని.. పదేపదే ప్రతీ సమావేశంలోనూ గొంతు చించుకొని మరీ చెబుతుంటే..  సమాచారశాఖలోని ఉన్నతాధికారులు సీఎం మాటలు సీఎంవే...మా పనులు మావే అన్నట్టు వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసే ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో పెద్ద పత్రికల విషయంలో నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ అక్రిడిటేషన్లు జారీ చేసి తమ ఆదిపత్యాన్ని..అత్యుత్యాహాన్ని ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఫలితంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కేసును సుమోటాగా స్వీకరించడం, కోర్టులో కేసులు ఇలా అన్ని విధాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టుతున్నా..సమాచారశాఖ అధికారులు మాత్రం తాము ఇచ్చిందే జీఓ..తాము అమలు చేసేవే నిబందనలు అంటున్నారు..ఇక వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం సమాచారశాఖ వెబ్ సైట్ ద్వారా అక్రిడిటేషన్ల కోసం పెద్ద పత్రికల నుంచి దరఖాస్తులు కోరినపుడు ఈనాడు పత్రిక కొన్ని అక్రిడిటేషన్లకు ఈనాడు పేరుతోనూ, మండల అక్రిడిటేషన్లకు న్యూస్ టుడే పేరుతోనూ, సాక్షి న్యూస్ లైన్ పేరుతోనూ, కొన్ని క్లిప్పింగులు సాక్షిపేరుతోనూ, ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ పేరుతోనూ, కొన్నింటినీ ఆంధ్రజ్యోతి పేరుతోనూ, వార్త  ప్రభాతవార్త, ఆంధ్రప్రభ ప్రభన్యూస్ పేరుతోనూ, అదేవిధంగా ఇంగ్లీషు పత్రికలు కూడా, క్లిప్పింగ్లులు తమ సొంత న్యూస్ ఏజెన్సీల పేరుతో క్లిప్పింగులు సమర్పించాలి(న్యూస్ ఏజెన్సీ పేరుతో సమర్పిస్తే).. అలా కాకపోతే, పత్రిక పేరుతోనే నేరుగా క్లిప్పింగులు సమర్పించాలి. అలా కాకుండా అటు న్యూస్ ఏజెన్సీ పేరులేకుండా, ఇటు పత్రిక పేరు(క్రెడిట్ లైన్ లేదా డేట్ లైన్) లేకుండా క్లిప్పింగులు సమర్పిస్తే సదరు పత్రికలు సమర్పించిన న్యూస్ క్లిప్పింగులకు ఆధారం ఏమిటి..? ఒక వేళ సదరు పెద్ద పత్రికల సొంత న్యూస్ ఏజెన్సీల పేరుతో క్లిప్పింగులు సమర్పిస్తే సమాచారశాఖ జారీచేసిన జిఓనెంబరు 142 ఆధారంగా న్యూస్ ఏజెన్సీల క్లిప్పింగులు సమర్పించాలంటే కనీసం 5 ఎంపానల్ కలిగిన పత్రిక క్లిప్పింగులను, ఒక్కోఅక్రిడిటేషనకు 200 క్లిప్పింగులు చొప్పున సమర్పించాలి... అవి పెద్ద పత్రికలు ఎక్కడ సమర్పించాయి..? అదే  సదరు న్యూస్ ఏజెన్సీ షాప్ప్ అండ్ ఎస్టాబ్లిస్ మెంట్ నిబంధనల ప్రకారం ఫర్మ్ సర్టిఫికేట్, ఇతర ప్రొప్రైటర్ ఆడిట్ రిపోర్టు, లేబర్ లైసెన్సు, ఇతరత్రా అన్ని ద్రువీకరణ పత్రాలుసమర్పించాలి..కనీసం ఆ విధంగానైనా ఒక్క పత్రికైనా సమర్పించిందా..?  కొన్ని ప్రధాన పత్రికలు ఇటు న్యూస్ ఏజెన్సీకి కాకుండా అటు పత్రిక పేరుతో కాకుండా క్రెడిట్ లైన్ లేని క్లిప్పింగులు సమర్పిస్తే సమాచారశాఖ వారందరికీ తొలివిడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేసేసింది. దీనితో సదరు పెద్ద పత్రికలకు ఈ రకంగా అంటే న్యూస్ ఏజెన్సీ కాకుండా పత్రిక కాకుండా ఏదైనా తమకి నచ్చినట్టు సమర్పించడానికి ఏదైనా ప్రత్యేక జీఓ ఇస్తేనే ఆ రకంగా పత్రికలు తమకి నచ్చినట్టు క్లిప్పింగులు ఇతర అనుబంధ పత్రాలు సమర్పించాలి.. అలా కాకుండా సదరు పెద్ద పత్రికల కోసం ప్రత్యేకంగా ఎలాంటి జీఓలు ఇవ్వకపోయినా.. సమాచారశాఖ అధికారులు అక్రిడిటేషన్లు మంజూరు చేయడాన్ని అనేవిషయాన్ని సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు దారుడు సుమారు 15 అంశాలను ఈ కోణంలోనే ప్రస్తావిస్తూ, విశాఖజిల్లాలోని మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కు సమర్పించాడు. గతంలో కూడా ఇదే విధంగా సమాచార హక్కుచట్టం ద్వారా దరఖాస్తు చేసినా విశాఖజిల్లాలోని సమాచారశాఖ అధికారులు సమారాచాన్ని ఇవ్వలేదు సరికదా దరఖాస్తును బుట్టదాఖలు చేసింది. అదేమంటే ఇవిమాకు ప్రభుత్వ నిబంధనలని ఇక్కడి పౌర సమాచార అధికారి నొక్కి వక్కానించారు. పక్కాగా నిబంధనలు పాటించి, ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసిన వారికి అక్రిడిటేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, సమాచారశాఖ ఉన్నతాధికారులు ఈ ప్రధాన పత్రికల విషయంలో ఏదైనా ప్రత్యేక జీఓ జారీచేశారా అంటే అదే లేదు. విశేషం ఏంటంటే ఏ సంస్థ అయినా ఐదుగురు ఉద్యోగులు, అంతకంటే అధికంగా సిబ్బంది పనిచేస్తే లేబర్ యాక్టు ప్రకారం లేబర్ లైసెన్సు పొందాల్సి వుంది. కానీ సమాచారశాఖ ప్రస్తుతం మొదటి విడతలో జారీచేసిన ఏ పత్రిక కూడా లేబర్ లైనెస్స్ సమర్పించలేదు. వేజ్ బోర్డు జీతాలు అమలు చేయడం లేదు.. ఉన్న అధికారిక ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్పులు గానీ, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సమాచారాన్ని కూడా సమాచారశాఖకు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసినపుడు సమర్పించలేదు. కేవలం జీఎస్టీ ఒక్కటి పెద్ద పత్రికలు కట్టాయన్న నెపంతో మాత్రం వారికి అక్రిడిటేషన్లు తొలివిడతలో మంజూరు చేసేసింది. అంటే ముఖ్యమంత్రి తన మట్టుకు తాను సభలు, సమావేశాల్లో అవినీతికి, నిబంధనల ప్రకారంమే పనిచేస్తామని చెప్పుకుంటూ పోయినా...సమాచారశాఖ అధికారులు మాత్రం తమకి నచ్చినట్టు చేసుకుపోతామని చెప్పకనే చెప్పారు తొలివిడదలో కొన్ని ప్రధాన పత్రికలకు నిబంధనల ప్రకారంగా కాకుండా వారికి నచ్చినట్టుగా అక్రిడిటేషన్లు మంజూరు చేసి. ఓహో అంటే ఇక్కడ తమకు ఒకలా, మిగిలిన వారికి మరోలా చేస్తారని ఇతర పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు అర్ధం చేసుకోవాలన్నమాట. అలా అర్ధం చేసుకున్నా సమాచారశాఖ చేసిన తప్పును ఏవిధంగా కప్పిపుచ్చుకునే విషయంలో ఏ ఉన్నతాధికారి కూడా నేటికీ సమాధానం చెప్పలేదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా అర్ధం చేసుకోవాల్సింది ఏమిటింటే తమకు కావాల్సిన పత్రికలు అటు న్యూస్ ఏజెన్సీకి కాకుండా, ఇటు పత్రికలకు కాకుండా తమకు నచ్చినట్టు ఏ విధంగా అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసినా వారికి అక్రిడిటేషన్లు ఇచ్చేస్తారు..కానీ జీఓలో ఇచ్చిన నిబంధనలన్నీ మాత్రం ఇతర మీడియా సంస్థలకు పాటించాలి. అలా పాటించకపోతే అక్రిడిటేషన్లు ఇవ్వమని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం మాత్రమే సంబంధిత పత్రాలు ఆన్ లైన్ లో అప్లోడ్ చేసి, సదరు కాపీలన్నీ మళ్లీ డీపీఆర్వో కార్యాలయంలో అందజేస్తేనే అక్రిడిటేషన్ వస్తుందని డిడిలు, డిపీఆర్వోలు తెగేసి చెబుతున్నారు. మరి ఎటూ కాకుండా పెట్టిన పత్రికలకు అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చారని అడిగితే దానికి మా కమిషనర్ మాత్రమే సమాధనం చెప్పాలని, దానికి తాము బాధ్యులం కాదని చేతులెత్తేస్తున్నారు. ఇక రేపటి ఈఎన్ఎస్ ప్రత్యేక కధనంలో ఏ ఆధారాలున్నాయని గతంలో యూఎన్ఐ, పీఐటి, ఏఎన్ఐ, డిఎన్ఎస్, తదితర న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు మంజూరు చేశారు? ఎలాంటి ప్రెస్ క్లిప్పింగులు, ఇతర సంబంధిత ద్రువీకరణలు లేకుండానే నేషనల్ న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చారు? వారికి విశాఖలోని సమాచారశాఖ అధికారులు ప్రత్యేక మినహాయింపులు ఏమైనా ఇచ్చారా తదితర వ్యవహారాలన్నీ ప్రస్తావిద్దాం..ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ  పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పక అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..3తో మళ్లీ కలుద్దాం..!

Visakhapatnam

2021-01-17 19:27:16

అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచారశాఖ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జీఓనెంబరు 142 ద్వారా బడా పత్రికలకు  సదరు పత్రికలు దాఖలు చేసిన న్యూస్ ఏజెన్సీ  పేరుతో ఇచ్చిన క్లిప్పింగులతో సదరు పత్రికల పేరుతో అడ్డగోలుగా మంజూరు చేసిన అక్రిడిటేషన్ల వ్యవహారంపై సమాచారహక్కు చట్టం దరఖాస్తు దాఖలైంది. విశాఖజిల్లాలోని మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టరు పేరుతో దాఖలైన ఈ సమాచారహక్కుచట్టం దరఖాస్తులో కీలక అంశాలను దరఖాస్తు దారుడు ప్రస్తావిస్తూ, సమాచారం మొత్తం ఎలక్ట్రానిక్ రూపంలో కావాలని దాఖలు చేశారు. దానికి కారణం ప్రభుత్వం ప్రస్తుతం అక్రిడిటేషన్లన్నీ అన్ లైన్ లోనే దరఖాస్తు చేయడం దానికి ముఖ్య కారణం. ఒక్క విశాఖజిల్లానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు సమాచారశాఖ పెద్ద పత్రికలకు జారీచేసిన అక్రిడిటేషన్ల వ్యవహారంలో అటు పత్రికల నిబంధనలనూ, ఇటు న్యూస్ ఏజెన్సీల నిబంధనలనూ అమలు చేయకుండా అక్రిడిటేషన్లను మంజూరు చేసింది. ఆ విషయం ఇపుడు చర్చనీయాంశ అయ్యింది. విశాఖలో దాఖలైన సహచట్టం దరఖాస్తులోని 15 అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే... 1)సమాచారశాఖ ఇచ్చిన జీఓ142 నెంబరు ఆధారంగా ఎన్ని మీడియా సంస్థలు విశాఖజిల్లాలో అక్రిడిటేషన్ కోసం సమాచారశాఖ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాయి? ఎందుకు పాత జీఓ కాకుండా కొత్తజీఓను అమలు చేశారు? దానికి గల కారణాలు, మీడియా సంస్థల పేర్లు..ఇచ్చిన అక్రిడిటేషన్లు, సమాచారం..ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సివున్నది.. 2)ఎన్ని మీడియా సంస్థలు సమాచారశాఖ నిబంధనల ప్రకారం ఆన్ లైన్లో దరఖాస్తులు సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించాయి? వాటి వివరాలు, సమర్పించిన పత్రాల పీడీఎఫ్ సమాచారం(ఆన్ లైన్లో వున్నదే కనుక పెద్దగా ఖర్చు వుండదు డౌన్ లోడ్ చేసి ఇవ్వడానికి వీలుపడుతుంది) ..ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) కావాల్సి వున్నది.. 3)దేశవ్యాప్తంగా న్యూస్ ఏజెన్సీలన్నింటికీ ఒకే ఫార్మాట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నది అలా అయిన పక్షంలో జాతీయ న్యూస్ ఏజెన్సీలు ఎన్ని ఆన్ లైన్ లో అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తులు చేశాయి..చేసిన సమయంలో నిబంధనల ప్రకారం ఎన్ని పత్రికలు, ఛానళ్లు, చందారుల వివరాలు పొందు పరిచాయి..ఎన్ని పత్రికలకు సంబంధించిన ప్రెస్ క్లిప్పింగులు అప్లోడ్ చేశాయి..అదీ ఎంపానల్ మెంట్ అయిన వివరాలతో కూడినవి అవి కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 4)పెద్ద పత్రికలు తమ సంస్థ నుంచి అక్రిడిటేషన్ల కోసం సమాచారశాఖ ఆన్ లైన్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేస్తే పత్రిక పేరుతో దరఖాస్తు చేశాయా?..లేదంటే పత్రికకు సొంతంగా ఏర్పాటు చేసుకున్న న్యూస్ ఏజెన్సీ నుంచి దరఖాస్తు చేశాయా?...అలా న్యూస్ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసే ఒక పత్రికకే న్యూస్ సొంత ఏజెన్సీ ద్వారా వార్తలు అందిస్తే...ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ పత్రికల వార్తల క్లిప్పింగులు జతచేశారా? లేదంటే జత చేయలేదా..? జత చేయకపోతే సదరు పత్రిక పేరుతో లేని ప్రెస్ క్లిప్పింగ్ తో ఆ పత్రికకు ఏ ప్రభుత్వ జీఓ ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేశారు? వాటితో పాటు జర్నలిస్టుల నియామకపత్రాలు, లేబర్ యాక్టు ప్రకారం లేబర్ లైసెన్సు సదరు పెద్ద పత్రికలకు ఎన్ని అక్రిడిటేషన్లు జారీ చేశారు వాటి సంఖ్య.. అవి కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 5)గత ఐదేళ్లుగా ఏఎన్ఐ, పీటిఐ, యూఎన్ఐ, డిఎన్ఎస్ వార్త సంస్థలకు ఏ ప్రాతిపధికన అక్రిడిటేషన్లు మంజూరుచేశారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు న్యూస్ ఏజెన్సీలు వివిధ పత్రికల చందారుల వివరాలు, ప్రెస్ క్లిప్పింగులు, లేబర్ లైసెన్సు, షాప్స్ అండ్ ఎస్టాబ్లెస్ మంట్ సర్టిఫికేట్, ఉద్యోగుల జీతబత్యాలు, ఇతర ఖర్చులకు సంబంధించిన ప్రొప్రైటర్ యొక్క ఆదాయపు పన్ను, ఈ ఫైలింగ్ సర్టిఫికేట్,  చార్టెట్ అకౌంటెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లు పొందుపరిచాయా? పొందుపరిస్తే అవి ఎక్కడున్నాయి వాటిని అక్రిడిటేషన్ కమిటీలో పెట్టి ప్రస్తావిస్తే వాటియొక్క మినిట్స్ కాపీలు... విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులకు సమర్పించాయా..? సమర్పిస్తే వాటి నకళ్లు కూడా  ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 6)పత్రికలకైతే ఒక జర్నలిస్టుకి నెలకి 10 క్లిప్పింగులు చొప్పున 30 క్లిప్పింగులు అప్లోడ్ చేయాలి...కానీ సమాచారశాఖ న్యూస్ ఏజెన్సీలకు ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం ఒక్కో అక్రిడిటేషన్ కు 200 క్లిప్పింగులు జతచేయాలి...అది పీడిఎఫ్ చేసి అప్లో చేయడానికి వీలుపడని సమయంలో ఎలా సమాచారశాఖ అధికారులు న్యూస్ ఏజెన్సీలకు ఈ నిబంధన వర్తింప చేశారు?. దానికి సాంకేతిక కారణాలకు సంబంధించిన ఆధారాలు, సదుపాయాలు, ఉంటే తెలియజేయ గలరు వాటిని కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 7)పెద్ద పత్రికలు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలతో పాటు ఇతర పత్రికల క్లిప్పింగులు అక్రిడిటేషన్ కోసం ఆన్ లైన్ లో సమర్పించినవి సదరు పత్రిక పేరుతో కాకుండా..ఆ పత్రిక యొక్క సొంత న్యూస్ ఏజెన్సీ పేరుతో ప్రచురితం అయిన క్లిప్పుంగులు జతజేస్తే...సదరు పత్రికలకు పత్రిక పేరుతో అక్రిడిటేషన్ ఎలా మంజూరు చేశారు?.. అలా మంజూరు చేయడానికి పెద్ద పత్రికల కోసం ప్రత్యేక నియమ నిబంధనలు, జీఓలు  ఏమైనా ఉన్నాయా ? పత్రిక నుంచి అక్రిడిటేషన్ కి దరఖస్తు చేస్తే క్రెడిట్ లైన్ పత్రిక పేరుతోనే ఉండాలి అది ప్రభుత్వ నిబంధన, అలా కాకుండా ఈనాడు పత్రిక న్యూస్ టుడే, అని ఆంధ్రజ్యోతికి ఆన్ లైన్ అని, సాక్షి న్యూస్ లైన్ అని, వార్తకి ప్రభాతవార్త అని వార్తల క్లిప్పింగులు సమర్పిస్తే ప్రభుత్వం వాటిని సదరు పత్రిక వార్తలుగా ఎలా పరిగణిస్తుంది? అలా ప్రచురితం అయిన వార్తలు న్యూస్ ఏజెన్సీ వార్తలుగా పరిగణించాలి కదా..? అలా పరిగణించకపోయినా..వారికికోసం ఏదైనా ప్రత్యేక జీఓ గానీ, నియమ నిబంధనలు గానీ ఏమైనా ఉంటే వాటిని తెలియజేయగలరు.. ..అదే సమయంలో మిగిలిన పత్రకలకు కూడా ప్రభుత్వ సమాచారశాఖ ఏ న్యూస్ ఏజెన్సీ వార్తలు పెద్ద పత్రికల్లో ప్రచురణ జరిగినా వాటికి మాత్రం సదరు పేరుతోనే, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలనే పత్రికలకే వర్తిస్తుందా? అలా వర్తించినపుడు ఒక జర్నలిస్టు నెలకు పది వార్త క్లిప్పింగులు కాకుండా, న్యూస్ ఏజెన్సీ లెక్కలో పరిగణిస్తే సదరు పత్రికల నుంచి కూడా నెలకు 50 క్లిప్పింగులు ఆన్ లైన్ లోనే అప్లోడ్ చేయాల్సి వుంటుంది... ప్రస్తుతం సమాచారశాఖ మంజూరు చేసి అక్రిడిటేషన్లు ఆ నిబంధనలను అనుసరించి ఇచ్చారా..? ప్రస్తుతం ఇచ్చిన అక్రిడిటేషన్లకు సంబంధించిన నకలు, సదరు పత్రికలు అన్లైన్ లో సమర్పించిన ప్రెస్ క్లిప్పింగులు కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 8)అక్రిడిటేషన్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న పత్రికలు పత్రిక పేరుతో అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేశాయా?..లేదంటే ఆ పత్రిక కోసం సొంతంగా ఏర్పాటు చేసుకున్న న్యూస్ ఏజెన్సీల పేరుతో దరఖాస్తు చేశాయా..? న్యూస్ ఏజెన్సీల క్లిప్పింగులను ఎలా పత్రిక పేరుతో ప్రమాణికంగా తీసుకుంటున్నారో దానికి సాంకేతిక కారణలు, ఆ పత్రికల కోసం ప్రత్యేక నియమ నిబంధనలు ప్రభుత్వ జీఓల రూపంలో జారీ చేస్తేవాటియొక్క నకలు పీడిఎఫ్ లేదా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 9)ప్రభుత్వం ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం ఆదాయ పన్ను చెల్లించిన మీడియా సంస్థలు, న్యూస్ ఏజెన్సీల నిర్వాహకులకు రేషన్ బియ్యం కార్డు రద్దు చేశారు...అలాగని అన్ని నిబంధనల ప్రకారం న్యూస్ ఏజెన్సీలు నడుపుతున్నా వారికి అక్రిడిటేషన్లు మంజూరు విషయంలో ప్రత్యేక జీఓ ద్వారా కొర్రీలు వేస్తున్నారు. అయితే రేషన్ కార్డు కేన్సిల్ చేసినందుకు, సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు ఆదాయపన్ను రూపంలో కట్ చేసినందుకు మీ న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు అయినా ఇవ్వండి...లేదంటే ఇప్పటి వరకూ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందిన న్యూస్ ఏజెన్సీలకు అయిన నష్టాన్ని భర్తీ చేయండి.. ఒక వేళ రెండూ చేయడానకి కుదరదు అనుకుంటే ఎందుకు కుదరదో తెలియజేసే నిబంధనలనైనా లిఖిత పూర్వకంగా తెలియజేయండి.. అది కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 10)న్యూస్ ఏజెన్సీల నిర్వహణకు కంప్యూటర్లు, ఏసిలు, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలు, సిబ్బంది జీతాలు, ఇంటి అద్దెలు, సాఫ్టు వేర్లు, ఫ్యాక్స్ మిషన్లు, ప్రింటర్లు, స్కానర్లు,  ప్రభుత్వ అనుమతి పత్రాలు, బ్యాంకు కరెంటు అకౌంట్లు, చార్టెడ్ అకౌంట్ ఛార్జీలు, మొబైల్ ఫోన్లు, న్యూస్ యాప్ లు, న్యూస్ వెబ్ సైట్లు, లేబర్ లైసెన్సులు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ పత్రాలు నిర్వహణకు అయిన ఖర్చును, న్యూస్ ఏజెన్సీలు నిర్వహిణ ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. లేదంటే గత నాలుగేళ్లుగా చేసిన లక్షల రూపాయల ఖర్చు మొత్తం వ్రుధా పోయినట్టేనని అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, సమాచారశాఖ అధికారులు తెలుసుకోవాల్సి వుంది. ఇవేమీ మాకు పట్టవు మాకు నిబంధనలు మాత్రమే అమలు చేస్తాము అని ఖరాఖండీగా చెబితే నియమ నిబంధనలన్నీ అన్ని మీడియా సంస్థలకు ఒకేలా అమలు చేయాలి..అలా ఎక్కడ అమలు చేశారో కూడా లిఖిత పూర్వకంగా పెద్ద పత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, శాటిలై ఛానళ్లు విషయంలో లిఖిత పూర్వకంగా అది కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 11)విశాఖ జిల్లాలో ఎన్ని మీడియా సంస్థలు వేజ్ బోర్డు నియమ నిబంధనలు పాటిస్తున్నాయో, వాటి వివరాలు కూడా లిఖిత పూర్వకంగా ఆధారాలు, సదరు సంస్థలు సిబ్బందికి ఇచ్చిన జీతాల యొక్క ఆడిట్ రిపోర్టులు, లేదంటే సదరు పత్రికలకు సొంతంగా ఏర్పాటు చేసుకున్న న్యూస్ ఏజెన్సీల యొక్క ఆడిట్ రిపోర్టులు, పత్రికలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులు, సదరు పత్రిక న్యూస్ ఏజెన్సీ కోసం తీసుకున్న లేబర్ లైసెన్స్, షాప్ష్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ ద్రువీకరణ, ప్రొప్రైటర్ ఆదాయపన్ను ఈఫైలింగ్ పత్రాలు కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 12)ఏదైనా మీడియా సంస్థకు పత్రికగానీ, టివి గానీ, న్యూస్ ఏజెన్సీ గానీ దేనికైనా ఎడిటర్, జర్నలిస్టు, ఫోటో గ్రాఫర్, సబ్ ఎడిటర్ లేకుండా ఒక న్యూస్...న్యూస్ ఫార్మాట్ లోకి రాదు. అలా అందరూ జర్నలిస్టులుగానే పరిగణింప బడతారు. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదిలక్షల లోపు టర్నోవర్ దాటిన న్యూస్ ఏజెన్సీలకు, ఇతర మీడియా సంస్థలకు ఇచ్చే అక్రిడిషన్ల సంఖ్య విషయంలో నిబంధలు ఎందుకు, ఏ జీఓ ప్రకారం మార్చారో కూడా తెలియజేయాలి... వాటికి గల కారణాలను మీడియా సంస్థలకు వివరించాలి..దానికి సంబంధించిన పత్రాలు వుంటే అవి కూడా ఎలక్ట్రానిక్ రూపంలోనూ ఇవ్వాలని కోరుతున్నాం.. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పీఐబి అక్రిడిటేషన్ మంజూరులోని లేని నియమ నిబంధనలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అమలు చేశారో కూడా లిఖిత పూర్వకంగా కావాల్సిన్నది. ఉంటే అది కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 13)సమాచారశాఖలోని అటెండరు దగ్గర నుంచి డిప్యూటీ డైరెక్టర్ వరకూ డిపార్ట్ మెంట్ అక్రిడిటేషన్లు మంజూరు చేసే ప్రభుత్వం ఏ నిబంధనలను అనుసరించి వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేస్తుంది? సమాచారశాఖలోని అక్రిడిటేషన్లు పొందిన ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వ సమాచారం సేకరించి మీడియాకి అందిస్తున్నారా? అలా అయితే సమాచార శాఖలో ఎంతమంది ఉద్యోగులు అక్రిడిటేషన్ తీసుకొని ప్రభుత్వ శాఖల సమాచారం, ప్రభుత్వ పథకాల సమాచారం అందిస్తున్నారు వారి వివరాలు, వారి విద్యా అర్హత వివరాలు కావాల్సి వుంది.. ఎందుకంటే ప్రభుత్వం పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కోసం పెట్టిన విద్యార్హత నిబంధనలు సమాచారశాఖలని అధికారులు, సిబ్బందికి కూడా అమలు చేయాల్సివుంటుంది.. వారికి లెక్కకు మించి అక్రిడిటేషన్లు ఎందకు మంజూరు చేస్తున్నారు..చేస్తే ఎన్ని అక్రిడిటేషన్లు ఏఏ కేడరలో ఉన్నవారికి మంజూరు చేశారు ఆ సమాచారం కూడా లిఖిత పూర్వకంగా కానీ ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 14)సమాచారశాఖలో అధికారులు జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో నిబంధనలకు దేశంలో లేని నిబంధనలు పెట్టడంతోపాటు గవర్నర్, ముఖ్య మంత్రి, ఇతర మంత్రులు కార్యక్రమాలకు అక్రిడేటెడ్ జర్నలిస్టులంతా కార్యక్రమాలకు హాజరు కాకపోయినా.. కార్యక్రమాలకు అత్యధిక మంది జర్నలిస్టులు హాజరైనట్టుగా,  అక్కడ వారికి టీలు, టిఫెన్లు, భోజనాలు, మంచినీరు బాటిళ్లలో కొనుగోలు చేసినట్టుగా.. ప్రత్యేక వాహనాలకు సంబంధించి చేసిన ఖర్చుల వివరాలు, గత మూడు సంవత్సరాలకు సంబంధించిన పూర్తి ఖర్చుల వివరాలు, ఆడిట్ రిపోర్టులు లిఖిత పూర్వకంగా కానీ ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 15)గత ఐదేళ్లుగా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు కాకుండా, సమాచారశాఖ సమావేశం పూర్తయిన తరువాత వాళ్లకి అనుగుణంగా రాసిన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మినిట్స్ వివరాలు కూడా  ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. పైన పేర్కొన్న అంశాలన్నీ అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ వివరాలు అందజేస్తే..ఆ వివరాలతో ప్రత్యేక వార్త కధనాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతోనూ, విశాఖజిల్లాలో సమాచారశాఖలోని జరిగిన కొన్ని అక్రమాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడానికి పైన పేర్కొన్న సమాచారం ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే సమాచార హక్కుచట్టం 2005 ప్రకారం..నిబంధనలు అనుసరించి కోర్టుఫీ స్టాంపు అతికించి మరీ ఇవ్వడంతోపాటు, దానికి సంబంధించిన రిసీవ్ కాపీని కూడా తీసుకుంటున్నామని తెలియజేయడమైనది. గడువులోపల అడిగిన సమాచారం ఇవ్వకపోయినా ఇదే అంశాలను అప్పిలేట్ అధికారికి దరఖాస్తు చేస్తామని కూడా ఈ దరఖాస్తులోనే తెలియజేస్తున్నాము. అంతేకాకుండా సమాచారశాఖ ఇచ్చిన సమాచారంతోనూ, మా దగ్గర వున్న సమాచారం, ప్రభుత్వం జారీ చేసిన జీఓల పూర్తివివరాలతో కోర్టును కూడా ఆశ్రయిస్తామని కూడా మిక్కిలి గౌరవంతో తెలియజేయడమైనది. ప్రభుత్వం దాపరికం లేని వివరాలు మీడియాకి ఇవ్వడానికి, సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తూ, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి నడుంబిగించి ఉన్నందున కోరిన సమాచారం కోరినట్టుగా సకాలంలో ఇవ్వాలని, ప్రభుత్వ గౌరవానికి సమాచారశాఖ ద్వారా ఎక్కడా భంగం వాటిల్లకుండా చేయాలని కూడా మిక్కిలి గౌరవంతో కోరడమైనది. 

విశాఖపట్నం

2021-01-16 19:15:20

2021-01-10 21:11:40

2021-01-10 20:23:29

2021-01-10 16:09:31

మా ప్రాణాలు ఫణంగా పెడతారా..

 కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు సరికాదని.. తమతో పాటు, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమని ఏపీ పోలీసు అధికారుల సంఘం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం కృషితో కరోనాపై నియంత్రణ సాధిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ప్రజాహితం కాదని పేర్కొంది. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా షెడ్యూల్‌ జారీ చేయడం.. పోలీసు సిబ్బందిని ఆందోళనకు గురిచేసిందన్నారు. కోవిడ్‌ మహమ్మారి వలన రాష్ట్రంలో 109 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 వేల మంది కరోనా బారిన పడ్డారు. ప్రజలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియలో పోలీస్‌ సిబ్బంది అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్‌ రవాణా, నిల్వకు పోలీస్‌ బందోబస్తు నిర్వహించవలసి ఉంటుంది.  ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వకుండా ఎన్నికల విధులకు హాజరు కావడం పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను పెను ప్రమాదంలో పెట్టినట్లే. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసేవరకు పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించలేరని’’ పోలీసు అధికారుల సంఘం స్పష్టం చేసింది.

Guntur

2021-01-09 20:39:57

2021-01-09 20:06:31

ప్రెస్ మీట్లతో ఉద్యోగ సంఘాల హడావిడి..

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసిన వేళ ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా ప్రెస్ మీట్లకు ఉపక్రమించాయి. రాష్ట్రంలో ఏక కాలంలో అన్ని ప్రభుత్వ సంఘాలు ప్రెస్ ముందుకి వచ్చి కరోనా సమయంలో ఎన్నికలేంటంటూ తమ బాధను వెల్లగక్కుతున్నాయి. వారితో పాటు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలకు సిద్దంగా లేమని చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అవసరం అనుకుంటే మూకుమ్మడిగా సెలవులు పెట్టడానికి సైతం ఉద్యోగ సంఘాలు సిద్దమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్నికల సంఘం చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిద్దామని ముందుకు వస్తున్నా దానికి ముందుగా ప్రభుత్వమే ముఖ్య కార్యదర్శి నుంచి తాము ఎన్నికలకు సిద్దంగా లేమని ఒక లేఖ విడుదల చేస్తుంది. ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి లేఖను చూసిన ఉద్యోగ సంఘాలు కూడా తమ ప్రకటనను మీడియా ద్వారా వెల్లగక్కుతున్నాయి. ప్రత్యేక ప్రెస్ మీట్లు పెట్టి మరీ కరోనా, సెకెండ్ వేవ్ కరోనా విషయంపైనే మాట్టాడటంతో పాటు, అన్ని అసోసియేషన్లు ముందస్తుగానే తమ అసమ్మతిని లేఖల ద్వారా ఎన్నికల సంఘానికి పంపుతున్నాయి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఏకమైపోవడం, కరోనా పరిస్తితులు తగ్గకపోవడం, ఇటు కోవిడ్ వ్యాక్సిన్ కు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల మద్దతు గట్టిగా ఉండటంతో ఈ సమయంలో ఎన్నికలను వాయిదా వేయించుకునే విషయంలో సఫలీ క్రుతం అయ్యేట్టుగానే కనిపిస్తున్నాయి. వాస్తంగా కూడా ఏపీలో కరోనా కేసులు మళ్లీ అధికం అవడమే ఉద్యోగ సంఘాలు వెనుకడుగు వేయడానికి కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఒకే మాట మీదికి రావడం కూడా చర్చనీయాంశం అవుతోంది..

Guntur

2021-01-09 18:44:57

స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే దైర్యం లేదు..

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ధైర్యం మాకు లేదంటూ ఏపీ ఉద్యోగుల సంఘం తేల్చేసింది. ఈ మేరకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్న అయన కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. 64 సంఘాలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయన్న ఆయన, అయినా నిన్న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని అన్నారు. అంత అత్యవసరంగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకు ? అని ప్రశ్నించారు. మరి ఐదేళ్ల‌కాల పరిమితిలో ఎన్నికలు ఎందుకు నిర్వహించ లేదు అని అయన ప్రశ్నించారు.  మీ ప్రయోజనాల కోసం..‌ మా‌ బతుకులను బలి పెట్ట వద్దన్న ఆయన ఇప్పుడు వ్యాక్సిన్ వస్తున్న సమయంలో ఎన్నికల ప్రక్రియ ఎందుకు ? ఫ్రంట్ లైన్‌ వారియర్స్ గా ఉన్న వారికి ముందుగా వ్యాక్సిన్‌ వేయాలని అన్నారు. కరోనా విధుల్లో ప్రజల కోసం  ఎంతో రిస్క్ తో పని చేశాం, ఎన్నికల కోసం కూడా మా‌ ప్రాణాలు ఫణంగా పెట్టలేమని అన్నారు. ఒక వ్యక్తి ఇగో ను సంతృప్తి పరచాలని ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ద పదువుల్లో ఉన్న వారు.. బాధ్యత కు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.  కరోనా సమయంలో  ఎన్నికల విధుల్లో పాల్గొనే ధైర్యం మాకు లేదన్న ఆయన కాదని‌ బలవంతం‌ చేస్తే.. న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. వేసవి సమయంలో అయితే... ఎన్నికల నిర్వహణ కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు. వ్యాక్సినేషన్ మాకు‌వేసిన తరవాత అయినా ఎన్నికలు పెడితే బాగుండేదని ఆయన అన్నారు. మా ప్రాణాల మీదకు వచ్చింది కాబట్టే...నేడు ఇలా మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పుడు అయినా పునరాలోచన చేయాలని అన్నారు.

Guntur

2021-01-09 18:28:38

2021-01-09 18:26:59

2021-01-09 17:26:51

2021-01-08 22:34:52

2021-01-08 22:22:51

2021-01-08 22:13:35