భయంకరమైన కోవిడ్ సమయంలో పోలీసులు అందించిన సేవలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానాని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ డ్యూటీ మీట్ -2020 లో ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ కులాలకు, రాజకీయాలకు అతీతంగా అర్హత గలిగిన ప్రతి పేదవారికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. దశల వారి మధ్యపాన నిషేధం అమలుకు శ్రీకారం చుట్టి పేదలు ఉన్నత చదువులు చదువుకోవాలనే వుద్దేశ్యంతో ఇంగ్లీస్ మీడియం పాఠశాలు గా మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఎస్.సి., బి.సి., మైనారటీలు బాగుపడాలని, బానిసతత్వం పోతే సమానత్వం వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ ఆశయం ప్రతి పేదవాడు ఉన్నతవిద్యలు చదవాలనే ఆశయానికి ముఖ్యమంత్రి అనుసరిస్తూ కులాలకతీతంగా డిప్యూటీ సి.ఏం.పదవులు ఎస్.సి., ఎస్.టి., మైనారిటీ, బి.సి., లకు ఇచ్చారని అన్నారు. సమాజంలో పవిత్ర మైన ఉద్యోగం పోలీస్, డిజిపి ఆధ్వర్యంలో శాంతి భద్రతలు బాగున్నాయని, కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రి ఆశయం మేరకు బ్యారాబిడ్డలను వదిలి సేవలందించారు ధన్యవాదాలు అన్నారు. నేడు జగన్ మోహన్ రెడ్డి గారు మాదవుడులా నవరత్నాలు అమలుచేసి కుటుంబాలను ఆడుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత మొదటి పోలీస్ మీట్ శ్రేవారి చెంత జరగడం మీకు ధైర్యాని కల్పించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్నో సంవత్సరాలు ఇల్లులేని పేదలకు దేశ చరిత్రలో లేనివిధంగా 30 లక్షలు పైగా ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వాలలో ఓటుహక్కు లేని గ్రామాలు జిల్లాలోనే ఏడు వుండేవి వారికి స్వాతంత్రం కల్పించారని అన్నారు.
తిరుపతి శాసన సభ్యులు మాట్లాడుతూ నాచిన్న తనంలో స్కాట్ ల్యాండ్ పోలీస్ అంటే గొప్పాని అంటే అప్పుడే మన పోలీస్ స్వేచ్ఛగా పనిచేయనిస్తే అంతకు మించి చేస్తామని ఆంద్రప్రదేశ్ పోలీస్ అన్న మాటలు గుర్తొస్తున్నాయని అనారు. సమర్థవంతంగా పనిచేయబట్టే నేడు అనేక బహుమతులు మన రాష్ట్ర పోలీసులు అందుకున్నారని అన్నారు. రాష్టా విభజన తరువాత 6 సంవత్సరాలు తరువాత ఈ పోలీస్ డ్యూటీ మీట్ -2020 జరగడం శుభపరిణామని సాంకేతిక నేరాలు దీనివల్ల అదుపులోకి వస్తాయనే నమ్మకం కలుగుతున్నదని అన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త మాట్లాడుతూ ప్రజాలుగాని, నేను గాని ప్రశాంతంగా వున్నమంటే పోలీస్ వ్యవస్త కారమని అన్నారు. గత పది సంవత్సరాల నా ఉద్యోగంలో పోలీస్ సిబ్బంది ప్రతిభా మెరుగుపడుతూ వుందని, దీనివల్ల ప్రజలే లాభపడుతున్నారనేది గుర్తించాలని అన్నారు. దేశ చరిత్రలో మన రాష్ట్రం నేడు ఎన్నో బహుమతులు అందుకున్నా దిశా యాప్ ద్వారా మహిళల్లో ధైర్యం, వారు వాడుతున్న విధానం చూస్తే అర్థమవుతుందని అన్నారు. శ్రీవారి పాదాల చెంత 6 సంవత్సరాల తరువాత పోలీస్ డ్యూటీ మీట్ అభినందనీయం అన్నారు.
‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు పోరాటం సాగించిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలోని సీతారామరాజు దాడులుచేసిన పోలీస్స్టేషన్లు, పోరాట ప్రాంతాలు అభివృద్ధిచేయడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో సీతారామరాజు దాడులుచేసిన రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగిలోని వాస్తవ (పాత) పోలీస్ స్టేషన్ల అభివృద్ధికి జిల్లా ఎస్పీ అద్నామ్ నయీం అస్మీ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికీ అల్లూరి దాడిచేసిన నాటి వాస్తవ అడ్డతీగల పోలీస్స్టేషన్ను జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, పోలీస్శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి సర్వం సిద్ధమై నట్లు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు తెలిపారు. పర్యాటకులు స్వేచ్ఛగా సందర్శించుకొనే విధంగా పాత పోలీస్స్టేషన్ చుట్టూ ప్రహరీగోడ నిర్మించి, ముఖ ద్వారం ఏర్పాటుచేసి, ఆ ప్రాంతాన్ని పూలమొక్కలతో ఉద్యాన వనంగా రూపొందించాలని నిర్ణయించనట్లు సిఐ రవికుమార్, ఎస్సై నాగేశ్వరరావులు తెలిపారు. ఈ మేరకు డి.సి.సి.బి. చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు), రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనక్ష్మిలు పోలీసులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అల్లూరికి సంచరించిన ప్రాంతాలు చిరస్థాయి భావి భారత పౌరులకు పర్యాటక కేంద్రాలుగా కనిపించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సమాచార పౌర సంబంధాల శాఖ నేటికీ పూర్తిస్థాయి వెబ్ సైట్ కి నోచుకోలేదు..కేంద్రంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబీ) మాదిరి అన్ని రాష్ట్రాల్లోనూ సమాచారశాఖ అన్ని జిల్లాలు, అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల సమాచారం, జీఓలు తెలియజేయడానికి రాష్ట్రప్రభుత్వం సమాచారశాఖకు ఒక పూర్తిస్థాయి వెబ్ సైట్ ఉండాలి. సదరు వెబ్ సైట్ నుంచే మీడియా, పత్రికలు విషయాన్ని తీసుకోవాలి. రాష్ట్రంలో జరిగే అభివ్రుద్ధి కార్యాక్రమాలు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల పర్యటనలు ప్రభుత్వ శాఖల తాజా సమాచారాన్ని ఆ వెబ్ సైట్ లో పొందుపరచాలి. ఈ విధంగానే కేంద్ర ప్రభుత్వం అన్నిప్రభుత్వ శాఖలు, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఇతర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పీఐబీ వెబ్ సైట్ లో అందుబాటులో వుంచుతుంది. దానిని అన్ని మీడియా సంస్థలు తీసుకొని, వాటికి కొంత సమాచారాన్ని జోడించి ప్రజలకు వార్తల రూపంలో తెలియజేస్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం అటు విద్యావంతులు, ప్రజలు తెలుసుకోవడానికి వీలుపడుతుంది. ప్రభుత్వ శాఖల అధికారులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ల సమాచారం ఈ వెబ్ సైట్ లో పెట్టడం ద్వారా మీడియా సంస్థలు కూడా రాష్ట్ర అభివ్రుద్ధికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ వెబ్ సైట్ నుంచి సేకరించి ప్రజలకు తెలియజేసే ఆస్కారం వుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకు వెబ్ సైట్లు పెట్టినప్పటికీ, ప్రత్యేకంగా రాష్ట్రప్రభుత్వానికి, అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్ల పర్యటనలు, ఇతర అభివ్రుద్ధి కార్యక్రమాల సమాచారం తెలియజేసేందుకు సమాచారశాఖకు మాత్రం నేటికీ పూర్తిస్థాయి వెబ్ సైట్ ను అందుబాటులోకి తేలేదు. అన్నిజిల్లాల్లో జిల్లాకి సంబంధించిన వెబ్ సైట్లు ఉన్నప్పటికీ కనీసం అందులో సైతం సమాచారశాఖ ప్రభుత్వ శాఖలకు చెందిన రోజువారీ సమాచారం గానీ, ప్రెస్ నోట్లుగానీ అందుబాటులో ఉంచడం లేదు. సీఎంఓ ప్రెస్ నోట్లు సైతం కొన్ని మీడియా సంస్థలకే సమాచారం అందుతోంది
మంత్రులు పీఆర్వోలు ఉన్నా లేనట్టే..
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అందరు మంత్రులకు వేలకు వేలు జీతాలు వెచ్చించి పీఆర్వోలను ఏర్పాటు చేసింది. వాళ్లంతా మంత్రుల పర్యటనలు, కార్యక్రమాలను టీవి ఛానళ్లకు స్క్రోలింగ్ పాయింట్స్ ఇస్తున్నారు తప్పితే ప్రతీరోజూ ప్రజల ముంగిటకు వెళ్లే పత్రికలకు న్యూస్ ఫార్మాట్ లో ప్రెస్ నోట్లు మాత్రం పంపడం లేదు. కాదు కాదు పంపడం వచ్చే పీఆర్వోలు లేరు. మంత్రులు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలోని పత్రికలు, మీడియా సంస్థల రిపోర్టర్లను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి అందులో స్క్రోలింగ్ పాయింట్లును మాత్రమే అందిస్తున్నారు. ఇలా చేయడంతో పత్రికలకు సమాచారం పూర్తిస్థాయిలో అందడటం లేదు. వాస్తవంగా రాష్ట్రానికి ఒక శాఖకు మంత్రి అంటే ఆ మంత్రికి సంబంధించిన సమస్త సమాచారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించాల్సిన అవసరం ప్రభుత్వం మంత్రి దగ్గర ఏర్పాటు చేసిన పీఆర్వోపై వుంది. కానీ మంత్రుల దగ్గర పనిచేసే కొందరు పీఆర్వోలు ఆ నియోజకవర్గానికి, జిల్లాకే పరిమితం అవుతున్నారు. తమకు సంబంధించిన పత్రికల్లో వార్తలొస్తే చాలులే అన్నట్టుగానే మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని సమాచారశాఖకి పూర్తిస్థాయి వెబ్ సైట్ లేని కొరత, ఇబ్బంది మీడియా సంస్థలకు కొట్టొచ్చిన్నట్టు కనిపిస్తుంది. అదే రాష్ట్రంలో సమాచారశాఖ వెబ్ సైట్ వుంటే అపుడు ఖచ్చితంగా అన్నిశాఖల మంత్రులకు చెందిన సమాచారాన్ని ఇటు డీపీఆర్వోలు, అటు మంత్రుల దగ్గర పీఆర్వోలు ఆ వెబ్ సైట్ లో న్యూస్ ఫార్మాట్ రూపంలో ప్రెస్ నోట్లు పొందు పరచడం వలన రాష్ట్రంలోని అన్ని మీడియా సంస్థలకు సమాచారం తెలిసే అవకాశం వుంది. అటు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సొంత పీఆర్వోలను ఏర్పాటు చేసుకొని వారికి తమ ప్రాంతంలోని నచ్చిన మీడియా సంస్థలకే తమ నేతల సమాచారాన్ని పంపుతుండటం కూడా విశేషం.
ప్రభుత్వ శాఖల సమాచారం ఇవ్వని డీపీఆర్వోలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల సమాచారాన్ని మీడియాకి ఇచ్చే సమాచారశాఖ అధికారులు రాష్ట్ర విభజన తరువాత జిల్లాలకే పరిమితం అయిపోయారు. వాస్తవానికి పక్కజిల్లాల మీడియా సంస్థలకు సమాచారాన్ని మెయిల్ రూపంలో పంపడం ద్వారా అధికారులు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవదు. కానీ మాజిల్లా అధికారుల సమాచారం మా జిల్లాల్లో వస్తే చాలు పక్కజిల్లాలకు కూడా ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు సమాచారశారశాఖ అధికారులు. ఒక్కముక్కలో చెప్పాలంటే మేము పక్కజిల్లాల మీడియాకి ప్రెస్ నోట్లు పంపంమని తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలకు చెందిన డీపీఆర్వోలు మాత్రం తమ జిల్లా అధికారుల సమాచారాన్ని అన్ని జిల్లాలకు పంపుతున్నారు. తద్వారా సదరు జిల్లాల్లో జరిగిన అభివ్రుద్ధి కార్యక్రమాలు పక్కజిల్లాలకు కూడా తెలుస్తున్నాయి. ఇదే సమయంలో సమాచారశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయం తమకేమీ పట్టదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకు పక్కజిల్లాల మీడియా సంస్థలకు ప్రభుత్వ శాఖల సమాచారం పంపించలేదనే విషయాన్ని ప్రశ్నించకపోవడంతో అధికారులు తాము అనుకున్నదే సాధించినట్టు ఫీలైపోతున్నారు. అందులోనూ సిబ్బంది కొరత కూడా సమాచారశాఖను వేధిస్తోంది. కొత్తగా 13 జిల్లాల్లోనూ ఏపీఆర్వోలను ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా అందులో ఏ ఒక్కరికీ ప్రెస్ నోట్లు రాయడం చేతకకపోవడంతో వారిని డిపీఆర్వోలు కార్యాలయ పనులకి వినియోగిస్తున్నారు. సమాచారశాఖ ఎలాగూ అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్ సైట్ రూపొందించలేదు. కనీసం జిల్లాల డీపీఆర్వోలను ఆదేశిస్తే..ఆ వెబ్ సైట్ వచ్చేంత వరకైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమాచారం అన్ని జిల్లాల్లో ఉండే మీడియాకి తెలుస్తుందనే కోణంలో ఆలోచించకపోవడం గమనార్హం. అన్ని ప్రభుత్వశాఖలకు ప్రత్యేకంగా వెబ్ సైట్లు, యాప్ లను నిర్మించిన ప్రభుత్వం ఒక్క సమాచారశాఖ విషయంలోనే అన్ని జిల్లాల సమాచారం రాష్ట్రంలోని అన్ని మీడియా సంస్థలకు అందించాలనే కోణంలో ఎందుకు ఆలోచించడం లేదో తెలియడం లేదు.. ఈ విషయంలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..!
ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ న్యూస్ వెబ్ సైట్లు, ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురవుతున్నాయి. ఎంత గట్టిగా సెక్యూరిటీలు, యాంటీ వైరస్ లు వినియోగిస్తున్నా చాలా న్యూస్ వైబ్ సైట్లు, ముఖ్యమైన కంపెనీలకు చెందిన వెబ్ సైట్లు, ప్రభుత్వ శాఖలోని శాఖలకు చెందిన వెబ్ సైట్లు హాకర్ల బారిన పడకుండా ఎవరూ ఆపలేకపోతున్నారు. కొందరు అదేపనిగా న్యూస్ వెబ్ సైట్లను చెడగొట్టే పనిలో ఉన్నారని సమాచారం. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హ్యాకింగ్ అయిన న్యూస్ వెబ్ సైట్ లలో కంటెంట్ మాత్రమే పోతుంది. దానికి నిర్వాహకులు ప్రత్యేకంగా సొంత హోస్టింగ్ సర్వర్ లను తీసుకుంటున్నారు. గతంలో గ్రూపు హోస్టింగ్ పద్దతిలో న్యూస్ వెబ్ సైట్లు హోస్టింగ్ జరిగేవి. అలా గ్రూపు వెబ్ సైట్లు హోస్టింగ్ ఇచ్చే సర్వర్లు కూడా డేటా సెక్యూరిటీ విషయంలో ప్రత్యేకంగా డేటాను భద్రం చేయడంలో విఫలం అవుతున్నాయి. కొద్ది మొత్తానికి డేటాను కూడా ఎలా దాచిపెట్టి ఉంచాలా అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రైవేటు హోస్టింగ్ సర్వర్ నిర్వాహకులు. దీనితో ఈ సమయంలోనే కొన్ని వెబ్ సైట్లకు వచ్చిన రేటింగ్ ను చెడగొట్టడానికి హ్యాకర్లు వ్యూవర్ షిప్ అధికంగా వున్న న్యూస్ వెబ్ సైట్లపై కన్నేసి వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఫలితంగా సదరు న్యూస్ వెబ్ సైట్ ను గుగూల్ లో సెర్చ్ చేస్తుంటే వేరొక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. దానికోసం హ్యాకర్లు న్యూస్ వెబ్ సైట్ కి ట్యాగ్ లైన్లను కోడింగ్ తోనే మార్చేస్తున్నారు. అలాంటి హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవడానికి చిన్న చిన్న న్యూస్ వెబ్ సైట్లకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనితో ఒక వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైతే మరోక వెబ్ సైట్ ను రూపొందించుకంటున్నారు నిర్వాహకులు. మరికొందరు ముందడుగు వేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఉపయోగం అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. న్యూస్ వెబ్ సైట్లను కాపాడుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. మరికొందరు ఇదే హ్యాకింగ్ ను వ్రుత్తిగా చేసుకొని కొన్ని కేసుల్లో పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి ఊచలు లెక్కిస్తున్నా..బయటకు వచ్చి కూడా మళ్లీ హ్యాకింగ్ లు చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేస్తే న్యూస్ వెబ్ సైట్లకే కాదు, ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లకు కూడా రక్షణ ఉండదనే విషయాన్ని గుర్తించాలి..!