1 ENS Live Breaking News

బాలింతల ప్రాణాలను 33% కాపాడే అజిత్రోమైసిన్

సాధారణ యాంటీబయాటిక్‌ అయిన అజిత్రోమైసిన్‌ను బాలింతలకు ఇవ్వడంద్వారా వారికి ఇన్‌ఫెక్షన్‌లు సోకడం, మృత్యువాత పడే ప్రమాదాన్ని 33% వరకు తగ్గించవచ్చుని పరిశోధకులు గుర్తించారు. ఒకరకంగా తల్లులకు ఇదొక శుభవార్త అని అమెరికాకు చెందిన అలబామా విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు.  ఇటీవలే ప్రసవం ద్వారా బిడ్డనుకన్న 29వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించగా అందులో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రసవ సమయంలో వీరిలో కొంత మందికి 2 గ్రా అజిత్రోమైసిన్‌ను అందించారు. ఔషధాన్ని తీసుకున్న సమూహంలో ఇన్‌ఫెక్షన్‌లు, మరణాల శాతం 1.6ఉండగా తీసుకోని సమూహంలో ఇది 2.4 % గా నమోదైంది. ఈ కిటుకును అవలంబించడంవల్ల పుట్టిన శిశువులపై అనుకూల, ప్రతికూల ఫలితాలు ఉండబోవని 2020 సెప్టెంబరు - 2022 ఆగస్టు మధ్య జరిగిన ఆ అధ్యయనం స్పష్టం చేసింది. సో ఇప్పటివరకూ యాంటీ బయోటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయన్న మాటకు విరుగుడు వచ్చినట్టే..

United States

2023-02-20 12:16:36

ఒకేసారి 100 ఫోటోలు పంపేయొచ్చు..వాట్సప్ కొత్త ఫీచర్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్ వినియోగదారులకు మరిన్ని కొత్త ఆప్డేట్స్ ను తీసుకు వస్తున్నది. ఒకేసారి 100 ఫోటోలను మంచి క్వాలిటీతో పంపించుకునే విధంగా ఈ కొత్త అప్డేట్ రాబోతుంది. ఇప్పటికే వివిధ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న వాట్సాప్‌ తాజాగా ఈ సూపర్‌ అప్డేట్‌ను తీసుసుకు వస్తున్నట్టు ప్రకటిం చింది. సాధారణంగా వాట్సాప్‌లో ఒకేసారి 30కి మించి ఫొటోలు పంపడానికి వీల్లేదు. ఎక్కువ ఫోటోలు షేర్‌ చేయాల్సి వచ్చినపుడు యూజర్లు తెగ ఇబ్బంది పతున్నారు. దానిని గుర్తించిన వాట్సప్  ొకేసారి 100 ఫోటోలు పంపే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇక ఇతరులకు పంపించే డాక్యుమెంట్లకు సైతం క్యాప్షన్ పెట్టుకునే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకు వచ్చింది. త్వరలో మరిన్ని అప్డేట్స్ తీసుకురావడం కోసం ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు టెలీగ్రామం కూడా సరికొత్త ఫీచర్లను వాట్సప్ కు ధీటుగా తీసుకురాబో తున్నట్టుగా వార్తలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

United States

2023-02-17 09:04:01

మెసేజింగ్ యాప్ వాట్సప్ లో రానున్న అదిరిపోయే ఫీచర్లు

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం గుడ్ న్యూస్ ను చెప్పింది. ఎప్పటి కప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల చూపు పక్క యాప్స్ పైకి తిప్పుకోనీయకుండా చేస్తున్న వాట్సప్ ఇపుడు  మరింతగా ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. 2023లో డెస్క్ టాప్ స్క్రీన్ లాక్, వ్యూ వన్స్ టెక్ట్స్, ఐఫోన్ వినియోగదారులకు PiP వీడియో కాల్స్ వంటి  సౌకర్యాలను త్వరలోనే  తీసుకు వస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే వాటి యొక్క పని పూర్తికాగా, టెస్టింగ్ దశలో ఉన్నాయని, టెస్టింగ్ సమయం పూర్తికాగానే బగ్స్ లేని యాప్ ను ప్లే స్టోర్ లో అందుబాటుల ఉంటుందని పేర్కొంది. ఫోటోలు, వీడియోలు సులభంగా తీసుకునేందుకు డెడికేటెడ్ వీడియో మోడ్, ఒకే నెంబర్ తో అనేక ఫోన్లలో లాగిన్ అయ్యేలా కాంపానియన్ మోడ్ లు త్వరలో వచ్చే అప్డేటెడ్ యాప్ లో ఉంటాయని వినియోగదారులకు సులభతరమైన,  ఎక్కువ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వాట్సప్ పేర్కొంది.

2023-02-13 04:26:55

టర్కీ సరిహద్దులో భారీ భూకంపం శవాల దిబ్బగా సిరియా

ట‌ర్కీ, సిరియా దేశాల సరిహద్దులో ఈతెల్లవారుజామున అతి శక్తివంతమైన భూకంపం సంభవించిన నేపథ్యంలో దాని ప్రభావానికి  ట‌ర్కీ, సిరియా దేశాల్లో ఇప్ప‌టికే 650 మందివరకూ మ‌ర‌ణించిన‌ట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ భూకంపం వ‌ల్ల మ‌ర‌ణాల సంఖ్య దాదాపు ప‌ది వేల‌కు చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు అమెరికాకు చెందిన జియోలాజిక‌ల్ స‌ర్వే అంచ‌నా వేసింది. కాగా, భవన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసే పనిలో సహాయక సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఎప్పటికప్పుడు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు మృతదేశాహాలో ఆ ప్రాంతం శోకసంద్రమైంది.

Syria

2023-02-06 10:18:20

మరణశిక్షలు సౌదీ అరేబియాలో చాలాఎక్కువ

అరబ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో మరణ శిక్షలు అమలు జరుగుతున్నాయి. తమ ప్రభుత్వం మరణ శిక్షలను తగ్గిస్తుందని యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనకు విరుద్ధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మరణశిక్షలు విధిస్తున్నారు. 2015-2022 మధ్యలో ఏడాదికి సగటున 129 మరణ శిక్షలు అమలయ్యాయి. 2010-14తో పోలిస్తే 82 శాతం పెరిగాయి. గత ఒక్క ఏడాదిలోనే 147 మందికి మరణశిక్ష విధించారు. ప్రపంచ దేశాల్లో ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో ప్రస్తుతం సౌదీ అరేబియా కూడా. ఇక్కడ అమలవుతున్న మరణశిక్షలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

Saudi Arabia

2023-02-03 05:17:02

ఈరోజు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్స్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ఈరోజు కీలకమైన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అందులో కొన్ని టాప్ టెన్ లో ఉన్నవి ఏంటంటే..#Prabhas, #ADANIENT, #TarakaRatna, #GOAT, #FireStormIsComing, #FarahKhan, #AirAsia, #Rolex , #Chiranjeevi, #ExMuslimonYoutube ముఖ్యంగా ప్రభాస్, అధానిఈఎన్టీ, తారకరత్న, గోట్ హ్యాష్ ట్యాగ్ లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్ లో వచ్చే పోస్టులకు కూడా వీటినే చాలా మంది నెటిజన్లు వినియోగించడం విశేషం..

United States

2023-01-29 13:37:57

ప్రపంచవ్యాప్తంగా గుగూల్లో 12వేల ఉద్యోగాలు ఫట్

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా ఆ లోటును భర్తీచేసుకునేందుకు పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ  ఉద్యోగులను ఇంటింటికి పంపేస్తున్నాయి. తాజా 12,000 మందిని గూగుల్ ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు సంస్థ CEO సుంద‌ర్ పిచాయ్ ప్రక‌టించారు. కొలువు లు కోల్పోయిన అమెరిక‌న్ ఉద్యోగులకు ఇప్ప‌టికే ఈమెయిల్స్ పంపించారు. మాస్ లేఆఫ్స్‌లో భాగంగా కంపెనీలో 6% ఉద్యోగులను విధుల నుంచి త‌ప్పించారు. జాబ్స్ కోల్పోయిన ఉద్యోగుల‌కు త‌గిన ప‌రిహార ప్యాకేజ్ చెల్లిస్తామ‌ని పిచాయ్ చెప్పారు. 16 వారాల వేత‌నంతో పాటు ప‌లు ప్ర‌యోజ‌నాల‌ను వ‌ర్తింప‌చేస్తామని ప్రకటించారు. గుగూల్ లాంటి సంస్థలో ఉద్యోగం అంటే చాలామంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రాజభోగంగా భావిస్తారు. కానీ ఇపుడు అదే గుగూల్ సంస్థ ఉద్యోగులను క్రమేపీ తగ్గిస్తుండటం చర్చనీయాంశ అవుతోంది.

United States

2023-01-28 14:16:24

ఈరోజు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్స్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ఈరోజు కీలకమైన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అందులో కొన్ని టాప్ టెన్ లో ఉన్నవి #TarakaRatna 
#Prabhas,  #T20Is, #Adaniscam, #PakistanEconomy, #Enzo Fernandez, #AkhileshYadav, #YogiAdityanath, #Hindenburg, #18Pages, ముఖ్యంగా తారక రత్న , ప్రభాస్, పాకిస్తాన్ ఎకానమీ, యోగిఆధిత్యనాధ్, అఖిలేష్ యాదవ్ హ్యాష్ ట్యాగ్ లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్ లో వచ్చే పోస్టులకు కూడా వీటినే చాలా మంది నెటిజన్లు వినియోగించడం విశేషం..

United States

2023-01-28 13:36:57

చీతాలను తెంచ్చేందుకు ద‌క్షిణాఫ్రికాతో ఒప్పందం

భారతదేశంలో తిరిగి చీతాను (చిరుత‌) ప్ర‌వేశ‌పెట్టేందుకు ద‌క్షిణాఫ్రికా రిప‌బ్లిక్‌,  భార‌త రిప‌బ్లిక్ అవ‌గాహ‌నా ఒప్పందంపై ఈరోజు సంత‌కాలు చేశాయి. ఒప్పందం ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 2023లో తొలిబ్యాచ్‌గా 12 చిరుతల‌ను ద‌క్షిణాఫ్రికా నుంచి ఇక్క‌డ‌కు త‌ర‌లించ‌నున్నారు. ఇవి, 2022లో న‌మీబియా నుంచి భార‌త్‌కు తీసుకువ‌చ్చిన ఎనిమిది చిరుత‌ల‌తో క‌లిసి ఉంటాయి.  చిరుత‌లను పున‌రుద్ధ‌రించ‌డం కేంద్రం ప్రాధాన్యతగా తీసుకుంది‌. ఫిబ్ర‌వ‌రిలో 12 చిరుత‌ల‌ను దిగుమ‌తి చేసుకున్న అనంత‌రం, రానున్న ఎనిమిది నుంచి 10 ఏళ్ళ వ‌ర‌కు ప్ర‌తి ఏడాది 12 చొప్పున ఈ చిరుత‌ల‌ను తీసుకురావాల‌న్న‌ది ప్ర‌ణాళిక‌. 

ద‌క్షిణ ఆఫ్రికా జాతీయ జీవ వైవిధ్య సంస్థ (ఎస్ఎఎన్‌బిఐ), ద‌క్షిణాఫ్రికా జాతీయ పార్కులు (ఎస్ ఎ ఎన్ పార్కులు), ద‌క్షిణాఫ్రికాలోని చీతా రేంజ్ ఎక్స్‌పాన్ష‌న్  ప్రాజెక్ట్ అండ్ ఎండేంజ‌ర్డ్ వైల్డ్ లైఫ్ ట్ర‌స్ట్ (ఇడ‌బ్ల్యుటి)  స‌హ‌కారంతో అట‌వీ , మ‌త్స్య‌, ప‌ర్యావ‌ర‌ణ శాఖ (డిఎఫ్ఎఫ్ఇ), జాతీయ టైగ‌ర్ క‌న్స‌ర్వేష‌న్ అథారిటీ (ఎన్‌టిసిఎ),వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యుఐఐ) ఈ బ‌హుశాస్త్ర సంబంధిత అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌య ప‌రుస్తున్నాయి. భార‌త‌దేశంలో చిరుత‌ల‌ను తిరిగి ప్ర‌వేశ‌పెట్ట‌డంపై అవ‌గాహ‌న ఒప్పందం (ఎంఒయు)  భార‌త‌దేశంలో ఆచ‌ర‌ణీయ‌, సుర‌క్షిత‌మైన చిరుత జ‌నాభాను ఏర్ప‌ర‌చేందుకు ఇరు పార్టీల మ‌ధ్య స‌హ‌కారాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డ‌మ కాక ప‌రిర‌క్ష‌ణ‌ను ప్రోత్స‌హిస్తుంది. అవ‌గాహ‌నా ఒప్పందం ప్ర‌కారం, సాంకేతిక‌త‌లు, నిర్వ‌హ‌ణ‌లో వృత్తినిపుణుల‌కు శిక్ష‌ణ‌, విధానం, విజ్ఞానం బ‌దిలీ ద్వారా భారీగా కార్నివోర్ (మాంసాహారం తీసుకునే జంతువుల‌)  ప‌రిర‌క్ష‌ణ‌తో పాటుగా, ఇరు దేశాల మ‌ధ్య స్థానాంత‌ర‌ణం చేసిన చిరుత‌ల ద్వైపాక్షిక సంర‌క్ష‌ణ‌ను ఏర్పాటు చేయ‌డం కోసం ఇరు దేశాలు స‌హ‌క‌రించుకుంటాయి. అంతేకాకుండా ప్ర‌తి ఐదేళ్ళ‌కు ఎంఒయులోని అంశాల‌ను అది స‌హేతుకంగా ఉండేందుకు స‌మీక్షిస్తారు. 

Delhi

2023-01-27 13:16:13

ఇండోనేషియాలో మరోసారి కంపించిన భూమి

ఇండోనేషియా ప్రజలు భూకంపాలతో వణికిపోతున్నారు. తాజా ఇక్కడ మరోసారి భూకంపం స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది.. టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం అర్థరాత్రి భూమి కంపించింది. దీనితో భయాందోళనకు గురైన ప్రజలు బయటకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు USGS వెల్లడించింది. సముద్ర మట్టానికి 12 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. కాగా, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Tobelo

2023-01-24 02:22:42

పాకిస్థాన్ లో తీవ్ర స్థాయికి చేరిన ఆర్ధిక సంక్షోభం

పొరుగుదేశం పాకిస్తాన్ లో ఆర్ధిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీనితో దీంతో దేశవ్యాప్తంగా పొదుపు చర్య లను అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇటీవల ఇంధన పొదుపు చర్యలను ప్రకటించిన ప్రభుత్వం ఇపు డు తాజాగా రాత్రి 8.30 గంటలకే మార్కెట్లను, 10 గంటలకు ఫంక్షన్ హాళ్లు మూసివేయాలని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఫిబ్రవరి నుండి బల్బుల తయారీని, జులై నుండి నాసిర కం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తామ ని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 30% విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటున్నామని ఉత్తర్వుల తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

Pakistan

2023-01-04 04:55:19

ఆదాయ మార్గల వేటలో సోషల్ మీడియా దిగ్గజం

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విట్టర్’ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్కెటింగ్ మార్గాన్ని ఎంచుకుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో అనుమతించబడిన రాజకీయ ప్రకటనల రకాలను మరింతగా విస్తరింపజేస్తామని ట్విట్టర్  తెలిపింది. యూఎస్ లో ‘కాజ్ బేస్డ్ యాడ్స్’ కోసం తమ ప్రకటనల విధానాన్ని కూడా సడలించనున్నట్లు పేర్కొంది. తమ ప్రకటనల విధానాన్ని టీవీ, ఇతర మీడియా అవుట్ లెట్ ల ద్వారా ప్రచారం చేసి ట్విట్టర్ ప్రమోషన్ పెంచనుందట. 2019లో ట్విట్టర్ రాజకీయ ప్రకటనలను నిషేధించింది 2023లో అవే రాజకీయ ప్రకటనలు ప్రోత్సహించడం చర్చనీయాంశం అవుతుంది.

California

2023-01-04 04:30:05

అలాంటి వాళ్లకి టోక్యో ప్రభుత్వం బంపర్ ఆఫర్

టోక్యోలో జననం నానాటికీ భారీగా పెరిగిపోతున్నారు. ప్రభుత్వం ఏం చేసినా దానిని నియంత్రించలేకపోతున్న ది. చివరికి దారిలేక  జపాన్ ప్రభుత్వం మరో ఆఫర్ ప్రకటించింది. టోక్యోను వీడి వెళ్లే వారికి 10 లక్షల యెన్ లు (దాదాపు రూ.6.35 లక్షలు) ఇస్తామంది. ఈఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జననాల రేటు తక్కువగా ఉన్న, వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాలకు కుటుంబాలు తరలివెళ్లేందుకు 2019 నుంచి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. టోక్యోకు ప్రజలు పోటెత్తుతుండడంతో మిగిలిన పట్టణాల్లో జనాభా తగ్గిపోయి సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి.

Tokyo

2023-01-04 03:45:40

ఎలన్ మస్క్ తో మామూలుగా ఉండదు మరి

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి సిబ్బందికి చుక్కులు చూపిస్టున్నాడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్ నుంచి వస్తున్న ఆశక్తి విషయాలు ప్రపంచమంతా వైరల్ అవుతున్నాయి.  ఈ క్రమంలో కొన్ని నిర్వాకాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఓవైపు పొదుపు చర్యలకు దిగుతూనే పారిశుధ్య సిబ్బంది వేతన పెంపుకు  డిమాండ్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి వారందరినీ  పీకిపడేశారు మస్క్. దాంతో సరైన నిర్వహణ కార్యాలయాల్లోని లేక బాత్రూములన్నీ భరించలేనంత కంపు  కొడుతున్నాయని సిబ్బంది మొత్తుకుంటు న్నారు. చివరికి వాటిలో టాయిలెట్ పేపర్లకు కూడా దిక్కు లేదట! వాటిని ఇంటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని  వాపోతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. పలు నగరాల్లోని ట్విట్టర్ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా  కరువయ్యారట! నిర్వహణ భారం తగ్గించుకు నేందుకు ఉద్యోగులందరినీ రెండంతస్తుల్లోనే కుక్కి నాలుగింటిని ఖాళీ చేశారట మస్క్. మరో పక్క సిబ్బందిని వీలై నంత వరకూ వర్క్ ఫ్రం హోం చేయాలని చెబుతున్నారట. కాగా టెస్లా.. స్పేస్ ఎక్స్.. తది తర సొంత కంపెనీల నుంచి సిబ్బందిని ట్విట్టర్ కు తరలిస్తుండటం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది..

Washington

2023-01-01 04:41:38

వాట్సప్ గ్రూపుల వారికి బ్యాడ్ న్యూస్..

వాట్సప్ గ్రూపుల ద్వారా ఎక్కువ మందికి సమాచారం తెలియజేయాలనుకున్నవారికి వాట్సప్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే గ్రూపు సభ్యుల సంఖ్యను 1560 పెంచుతున్నామంటూ ప్రకటన చేసిన వాట్సప్ ఆ ప్రక్రియ అందుబాటులోకి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందనే సంకేతాలు విడుదల చేసిందనే వార్త ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. టెలీగ్రామ్ కి పోటీగా గ్రూపు సభ్యుల సంఖ్యను పెంచుతూ, మంచి మంచి ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న వాట్సప్ ఇటీవలే గ్రూపు సభ్యుల సంఖ్యను 256 నుంచి 560కి పెంచుతున్నట్టు ప్రకటించింది. కానీ అది అందుబాటులోకి రాకుండానే ఇపుడు మరో ప్రచారం వైరల్ అయ్యింది. అయితే వాట్సప్ మాత్రం అఫిషియల్ గా గ్రూపు సభ్యుల సంఖ్యను పెంచే విషయంలో టెలీగ్రామ్ కి పోటీగా మెల్ల మెల్లగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టెలీగ్రామ్ లక్షల మందితో గ్రూపుని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించగా దానికి పోటీగా ఒక్కో అడుగూ వేస్తూ వాట్సప్ కూడా తన వినియోగదారులకు గ్రూపు సభ్యుల సంఖ్యను పెంచుతున్నామంటూ ఆశలు కల్పించింది. ఇటీవలే సర్వర్ సమస్యతో సుమారు రెండు గంటల పాటు పనిచేయకుండా ఆగిపోయిన వాట్సప్ త్వరలోనే ఆ సమస్యలన్నింటినీ అధిగమించిన తరువాత గ్రూపు సభ్యుల సంఖ్య, గ్రూపు కాలింగ్ సభ్యుల సంఖ్యను పెంచనుందని సమాచారం అందుతుంది. అయితే అది జనవరి 2023 నాటికి వస్తుందా..లేదంటే ఇంకా సమయం పడుతుందా అనేది వాట్సప్ స్వయంగా ప్రకటించాల్సి ఉంది..!

United States

2022-10-30 04:43:00