1 ENS Live Breaking News

యాత్రికుల కోసం కంప్లైంట్ ట్రాకింగ్..

తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు..వారు పొందే గదులు, యాత్రికుల సౌక‌ర్యాల‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచ‌న‌లు వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ అప్లికేష‌న్ రూపొందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ఐటి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల గోకులంలో గ‌ల కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం  అద‌న‌పు ఈవో వివిధ విభాగాల అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో వేలాది గ‌దులు ఉన్నాయ‌ని, ఆయా ప్రాంతాల్లో గ‌దులు పొందిన యాత్రికులు ఫ‌ర్నీచ‌ర్‌, ప‌రుపులు, కొళాయిలు, ప‌రిశుభ్ర‌త‌, లైట్లు త‌దిత‌ర‌ స‌మ‌స్య‌ల‌ను తెలిపేందుకు వీలుగా ప్ర‌త్యేకంగా సెల్ నంబ‌రు ఏర్పాటు చేయాల‌ని రిసెప్ష‌న్ అధికారులను ఆదేశించారు. ఈ నంబ‌రుతో పాటు అవ‌స‌ర‌మైన ఇత‌ర స‌మాచారాన్ని అన్ని గ‌దుల్లో స్టిక్క‌ర్ల ద్వారా యాత్రికుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. గ‌దులు పొందిన యాత్రికుల‌కు పంపే ఎస్ఎంఎస్‌లో కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ స‌మాచారం ఉంచాల‌న్నారు. యాత్రికుల ఫిర్యాదులు/సూచ‌న‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుకు వీలుగా రిసెప్ష‌న్ విభాగం త‌గినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. గ‌దుల్లో మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.  అంత‌కుముందు సుప‌థం మార్గం ద్వారా భ‌క్తుల ప్ర‌వేశానికి సంబంధించి ఆల‌య అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మీక్షించారు. ఈ స‌మావేశాల్లో డెప్యూటీ ఈవోలు ర‌మేష్‌బాబు, లోక‌నాథం,  భాస్క‌ర్‌, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి, విజివో  బాలిరెడ్డి, ఈఈ(ఎఫ్ఎంఎస్‌) మ‌ల్లికార్జున ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-20 16:59:01

శ్రీవారికి కొప్పెర హుండీ విరాళం..

తిరుమల శ్రీవారికి మంగ‌ళ‌వారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుప‌తి స‌మీపంలోని కొప్పెర‌వాండ్ల‌ప‌ల్లెకు చెందిన  కొప్పెర సాయిసురేష్‌, కొప్పెర కుమార్ ఈ మేరకు హుండీని ఆలయంలో పేష్కార్  శ్రీ‌హ‌రికి అందించారు. రాగి, ఇత్త‌డితో క‌లిపి త‌యారుచేసిన ఈ హుండీ బ‌రువు 60 కిలోలు ఉంటుంద‌ని, దీని విలువ రూ.1.50 ల‌క్ష‌ల‌ని దాత‌లు తెలిపారు. తాము 200 ఏళ్లుగా వంశ‌పారంప‌ర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు స‌మ‌ర్పిస్తున్నామ‌ని దాత‌లు వెల్ల‌డించారు.

Tirumala

2021-07-20 16:53:35

మిజోరం గవర్నర్‌గా కె.హరిబాబు..

మిజోరం గవర్నర్ గా  హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గతవారంలోనే కేంద్రం ఆయనను మిజోరం గవర్నర్ గా నియమించింది. ఆయన ఐజ్వాల్ లో ఆయన గవర్నర్ గాఈరోజు  ప్రమాణం చేశారు. దేశవ్యాప్తంగా ఇటీవలనే గవర్నర్లను కేంద్రం బదిలీ చేసింది.  ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ నెల 18 నుండి రాజధాని నగర పరిధిలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. హరిబాబు మిజోరం రాష్ట్రానికి 22వ గవర్నర్ గా ఇవాళ భాద్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో సీఎం జోరామ్‌తంగా, టాన్‌లూయా,ఉప ముఖ్యమంత్రి స్పీకర్,లాలిన్లియానా పైలో, మంత్రుల మండలి ముఖ్య కార్యదర్శి,డీజీపీతో పాటు పలు పార్టీ ముఖ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Haryana

2021-07-19 15:16:42

తిరుమల శ్రీవారికి స్వర్ణకఠారి విరాళం..

తిరుమల శ్రీవారికి సోమవారం స్వర్ణకఠారి విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన దాత  ఎం.ఎస్.ప్రసాద్ ఈ మేరకు స్వర్ణకఠారిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అందించారు.  ఈ స్వర్ణకఠారిని 2 కిలోల బంగారు, 3 కిలోల వెండితో తయారు చేశారని, దీని విలువ ఒక కోటి రూపాయలకు పైగా ఉండొచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, తను శ్రీవారికి స్వర్ణకఠారిని ఇస్తానని మొక్కుకున్నానని ఇప్పటి స్వామివారి మొక్కు తీరిందని అన్నారు. స్వామి దయతో కరోనా వైరస్ పూర్తిగా నశించి జనజీవనం సాధారణ స్తితికి రావాలని కోరుకుటున్నానని అన్నారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-19 14:53:41

తిరుమ‌ల‌కు ప్లాస్టిక్ బాటిళ్లు తేవద్దు..

తిరుమల ప‌విత్ర‌త‌ను, స్వ‌చ్ఛ‌త‌ను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామ‌ని, భ‌క్తులు ఈ విష‌యాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు తీసుకురావ‌ద్ద‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం వివిధ విభాగాల అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌కు ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు చేర‌కుండా అలిపిరి చెక్‌పాయింట్ వ‌ద్ద త‌నిఖీలు చేసి వాటిని తొల‌గిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లోని దుకాణాల్లో ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌న్నారు. వీటికి ప్ర‌త్యామ్నాయంగా గాజు, కాప‌ర్‌, స్టీల్ వాట‌ర్ బాటిళ్లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచాల‌ని కోరారు. 2 నెల‌ల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి తిరుమ‌ల స్థానికులు, వ్యాపారులు స‌హ‌క‌రించాల‌న్నారు. భ‌క్తుల అవ‌స‌రాల కోసం అన్ని కాటేజీల్లో జ‌ల‌ప్ర‌సాదం తాగునీరు, జ‌గ్గులు, గ్లాసులు ఏర్పాటు చేశామ‌న్నారు. స‌ద‌రు జ‌గ్గులు, గ్లాసుల‌ను ప్ర‌తిరోజూ శుభ్రం చేస్తున్న‌ట్టు చెప్పారు.   ఈ స‌మావేశంలో టిటిడి ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, డెప్యూటీ ఈవోలు  విజ‌య‌సార‌థి,  హ‌రీంద్ర‌నాథ్‌,  లోక‌నాథం,  భాస్క‌ర్‌, ఇఇలు  శ్రీ‌హ‌రి,  మ‌ల్లికార్జున‌ప్ర‌సాద్‌, డిఇ  స‌ర‌స్వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-19 13:46:38

శ్రీవారి రూ.300 దర్శన టిక్కెట్లు విడుదల..

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఆగస్టు నెల కోటా రూ.300 టిక్కెట్లు రేపు(మంగళవారం) ఉదయం 9గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్ధం 5వేల టిక్కెట్లను రేపు ఉదయం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నామన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వీటిని ఆన్ లైన్ లో ముందస్తుగా బుక్ చేసుకోవాలని టిటిడి అధికారులు కోరతున్నారు. ప్రతీరోజూ 5వేట టిక్కెట్లను భక్తుల కోసం ఆన్ లైన్ లో ఉంచతున్నట్టు ప్రకటించిన టిటిడి ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది.

Tirumala

2021-07-19 13:18:19

రాష్ట్రాలకు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు..

 కొవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌న్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో రాష్ట్రాల‌కు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీల‌క సూచ‌న‌లుచేసింది. ఆరోగ్య మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుపెర‌చాల‌ని, పిల్ల‌ల కోసం స‌రిప‌డా ప‌డ‌క‌ల‌ను అందుబాటులో ఉంచ‌డంతో పాటు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాల‌పై దృష్టి సారించాల‌ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌ను కోరింది. రూ 23,123 కోట్ల‌తో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన భార‌త కొవిడ్‌-19 అత్య‌వ‌స‌ర స్పంద‌న, ఆరోగ్య వ్య‌వ‌స్ధ‌ల స‌న్న‌ద్ధ‌త ప్యాకేజ్ కింద చేసిన ఏర్పాట్ల‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం స‌మీక్షించింది. ఈ సంద‌ర్భంగా ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శులు అన్ని రాష్ట్రాల వైద్యాధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. కొవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, కాంటాక్టుల‌ను గుర్తించి చికిత్స చేయ‌డం, ఐసోలేట్ చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయాల‌ని కోరింది. కీల‌క ఔష‌ధాలు, టెస్టింగ్ కిట్స్‌, పీపీఈ కిట్ల ల‌భ్య‌తను పెంపొందించుకోవాల‌ని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌ను కోరింది.

New Delhi

2021-07-15 16:00:03

తిరుమలలో అత్యుత్తమ సాంకేతిక భద్రత..

ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించిన‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని పిఏసి-4లో గ‌ల కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం ఈవో, అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో భ‌ద్ర‌తా మ‌రియు నిఘా వ్య‌వ‌స్థలు చాల బాగుంద‌న్నారు. కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌ను శాశ్వ‌త‌ భ‌వ‌నంగా పిఏసి-4లో ఏర్పాటు చేసేందుకు అవ‌స‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. ఇజ్రాయ‌ల్ టెక్నాల‌జీతో కూడిన భ‌ద్రాత వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. తిరుమ‌ల‌ను నేర ర‌హిత పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు టిటిడి భ‌ద్రాత సిబ్బంది అంకిత భావంతో ప‌నిచేస్తున్నార‌ని అభినందించారు. త్వ‌ర‌లో మ‌రిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాల‌న్నారు. త‌ద్వారా మ‌రింత ప‌టిష్ఠ‌మైన‌ భద్రత వ్య‌వ‌స్థ‌ను తిరుమ‌ల‌లో ఏర్పాటు చేయాల‌ని సివిఎస్వోను కోరారు.  

       అంత‌కుముందు సివిఎస్వో  గోసినాథ్‌జెట్టి మాట్లాడుతూ ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో అన్ని ప్రాంతాల‌లోని 1654 సిసి కెమ‌రాలు ఉన్నాయ‌ని, వీటిలో 1530 సిసిటివిల‌ను కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌కు అనుసంధానించిన‌ట్లు తెలిపారు. ఇందులో ఎక్క‌డ క్రైమ్ జ‌రిగిన వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని మొబైల్ భ‌ద్ర‌తా సిబ్బంది ట్యాబ్‌కు మేసేజ్ వెళ్లుతుంద‌ని, త‌ద్వార త‌క్కువ స‌మ‌యంలో అక్క‌డ‌కు చేరుకుని నేరాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని చెప్పారు. భ‌క్తుల ర‌ద్ధీ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో సిసి కెమ‌రాల ప‌నితీరును, శేషాచ‌ల అడ‌వుల్లోని వ‌న్య‌మృగాల సంచారం, అవి రోడ్ల‌పైకి, జ‌న సంచారం ఉన్న ప్రాంతాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు సిసిటివిలో రికార్డు అయిన వేంట‌నే, అటోమేటిక్‌గా ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన సైర‌న్‌లు మ్రోగి జంతువులు అడ‌విలోకి వెళ్లిపోయే విధానాని, తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నం, వ‌స‌తి మ‌రియు ల‌డ్డూల ద‌ళారుల‌ను, దొంగ‌ల‌ను ప‌ట్టుకోవ‌డం, త‌ప్పిపోయిన వారి ఆచూకీ క‌నుగొని వారి బంధువుల‌కు అప్ప‌గించుటకు సంబంధించిన‌ వీడియో క్లిపింగ్‌ల‌తో వివ‌రించారు.

        అనంత‌రం ఈవో విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌త్యేక ప్ర‌తిభ క‌న‌ప‌ర‌చిన 29 మంది పురుషులు, ఒక మ‌హిళ మొత్తం 30 మంది టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బందిని అభినందించి, న‌గ‌దు బ‌హుమ‌తిని అందించారు. త‌రువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సిసిటివిల‌ ప‌నితీరును కూడా ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు.  తిరుమ‌ల న‌డ‌క‌దారిలోని ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం నుండి ఏడ‌వ మైలు వ‌ద్ద ఉన్న శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం వ‌ర‌కు మెట్ల మార్గంలో ఈవో న‌డిచి వెళ్ళి అక్క‌డ జ‌రుగుతున్న‌ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అభివృద్ధి ప‌నుల‌ను మ‌రింత నాణ్య‌త ప్ర‌మాణాల‌తో, వేగంగా పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా అలిపిరి పాదాల మండ‌పం పైభాగంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప‌రిశీలించారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ నెలలో శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఉన్నందున సెప్టెంబ‌ర్‌ నాటికి  ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

       టిటిడి అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో ఏడ‌వ మైలు వ‌ద్ద శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం వ‌ద్ద ఏర్పాటు చేస్తున్న ఉద్యాన‌వ‌నాల‌ను ఈవో ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా డిఎఫ్‌వో  చంద్ర‌శేఖ‌ర్ పెంచుతున్న మొక్క‌ల‌ను గురించి ఈవోకు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఈ  నాగేశ్వ‌ర‌రావు, విజివో బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-13 10:54:37

13న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 16వ తేదీన సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని జూలై 13న‌ మంగళవారం  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం భ‌క్తుల‌ను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Tirumala

2021-07-09 12:37:09

అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం..

తిరుమలలోని శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకి హైదరాబాద్‌కు చెందిన‌ భవ్యా గ్రూప్ చైర్మన్  ఆనంద్ ప్రసాద్ రూ. కోటి రూపాయ‌లు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు. బుధవారం ఈ మేరకు దాత ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో  అదనపు ఈవో  ఎ.వి. ధర్మారెడ్డికి దాత డిడిని అందజేశారు. తమవంతుగా శ్రీవారి భక్తులకు అన్నదానం చేయాలని దాతలు కోరారు. సాధారణ భక్తులకు శ్రీవారి సేవలను, దర్శనాలను మరింత చేరువ చేయాలని దాతలు ఈఓని కోరారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-07 13:29:30

New Delhi

2021-07-06 16:55:06

రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం..

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని వ‌సంత మండపంలో రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణంలో భాగంగా జూలై 6వ తేదీన‌ రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం చేయ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మ‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో శ‌నివారం ఉద‌యం ఆయ‌న అధికారులు, పండితుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వ‌సంత మండ‌పంలో జూన్ 11న ప్రారంభ‌మైన రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణంకు ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తొంద‌న్నారు. ఇందులో భాగంగా జూలై 6న రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం సంద‌ర్భంగా ఎస్వీబీసీ ప్ర‌సారంలో ప్ర‌త్యేక గ్రాఫిక్స్, వ‌సంత మండ‌పంలో అశోక‌వ‌నంను త‌ల‌పించే సెట్టింగ్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. యుద్ధ‌కాండ‌ 109 నుండి 114 వ‌ర‌కు ఉన్న 270 శ్లోకాల‌ను పారాయ‌ణం చేస్తార‌ని చెప్పారు. ఇందులో 111వ స‌ర్గ 14వ శ్లోకంలో శ్రీ రామ‌చంద్ర‌మూర్తి రావ‌ణునిపై బాణం ఎక్కు పెట్ట‌డంతో ప్రారంభ‌మై, 19వ శ్లోకంలో వ‌ధించ‌డంతో పూర్త‌వుతుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హార‌తి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.

        రామ‌ణ సంహారంపై శ్రీ తాళ్ళ‌పాక అన్న‌మాచార్యుల‌వారు ర‌చించిన కీర్త‌న‌ల‌ను అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆల‌పిస్తార‌ని వివ‌రించారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్నిఉద‌యం 8.30 గంట‌ల నుండి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంద‌ని తెలిపారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని హార‌తులు ఇచ్చి స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో  సురేష్‌కుమార్, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని, ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వేద పండితులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-03 11:08:09

శ్రీ‌వారి ద‌ర్శ‌నం వాయిదా వేసుకోవ‌చ్చు..

తిరుమ‌ల శ్రీ‌వారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు క‌లిగిన గృహ‌స్తులు శ్రీ‌వారి  దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం టిటిడి క‌ల్పించింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి జూన్ 30వ తేదీల మ‌ధ్య  వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు పొందిన భ‌క్తులు బుకింగ్ తేదీ నుండి సంవత్సరంలోపు శ్రీ‌వారి దర్శనం చేసుకోవ‌చ్చు. భక్తులు ఈ మార్పును గమనించి, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టిటిడి కోరుతుంది.

తిరుమల

2021-07-02 15:46:41

వైద్య రంగానికి అధికంగా నిధులు..

 కొవిడ్‌-19 విపత్తు వేళ దేశ వ్యాప్తంగా నిశ్వార్ధంగా సేవలందించిన వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాని  ప్రసంగించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు రాత్రింబవళ్లు శ్రమించారని..దానిని జాతి గుర్తుంచుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా  ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ కేటాయింపులను రెట్టింపు చేశామని చెప్పిన మోడీ ఆరోగ్య మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం తోడ్పాటు ఇస్తుందని వివరించారు. ఆరోగ్య మౌలిక సౌకర్యాలకు రూ.50వేల కోట్ల రుణ హామీ పథకం తెచ్చినట్లు తెలిపారు. వైద్యులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇతర దేశాలతో పోలిస్తే వైద్యరంగంలో భారత్‌ మెరుగ్గానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు.

New Delhi

2021-07-01 15:12:56

శ్రీ‌వారి భ‌క్తుల‌కు పారదర్శక సేవ‌లు..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత పారదర్శక సేవలు అందించేందుకు టిటిడి కౌంట‌ర్ల‌ను మ‌రింత నైపుణ్యంతో నిర్వ‌హించ‌నున్న‌ట్లు అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఇందుకుగాను వృత్తి నిపుణ‌త క‌లిగిన ఏజెన్సీల ద్వారా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా గురువారంనాడు తిరుమ‌ల‌లోని ల‌డ్డూ కౌంట‌ర్లలో ఆయ‌న పూజ‌లు నిర్వ‌హించి ఏజెన్సీ సిబ్బందితో ల‌డ్డూ కౌంట‌ర్లలో సేవ‌ల‌ను ప్రారంభించారు.  అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిటిడిలో భ‌క్తుల‌కు విశేష సేవ‌లందిస్తున్న ప‌లు  కౌంట‌ర్ల‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా, వృత్తి నిపుణ‌త‌తో నిర్వ‌హించే ఏజెన్సీల‌ను అహ్వానించామ‌న్నారు. ఇందులో బెంగుళూరుకు చెందిన‌ కెవిఎం ఎన్‌ఫో అతి తక్కువ ధరకు టెండ‌రు వేసింద‌న్నారు. ఇకపై తిరుమ‌లలోని ల‌డ్డూ కౌంట‌ర్లు, క‌ల్యాణ క‌ట్ట త‌ల‌నీలాలు స‌మ‌ర్పిచే భ‌క్తులకు టోకెన్లు ఇచ్చే కౌంట‌ర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ద‌ర్శ‌నం టికెట్లు స్కానింగ్ కౌంట‌ర్లు, తిరుప‌తిలోని ఎస్‌ఎస్‌డి కౌంట‌ర్లు, అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న కౌంట‌ర్లు ఈ ఏజెన్సీ చేత నిర్వహించబడతాయ‌న్నారు.

       తిరుమల, తిరుప‌తిల‌లో యాత్రికులకు సేవ‌లందించే 164 కౌంటర్ల‌లో మూడు షిఫ్టులలో నడపడానికి 430 మంది సిబ్బంది అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. కౌంట‌ర్ల‌లో విధులు నిర్వ‌హించే సిబ్బందికి ఒక వారం పాటు శిక్షణ ఇచ్చామ‌న్నారు. వారి వేతనాలు ప్రభుత్వ కనీస వేతన నిబంధనల ప్రకారం ఉంటాయ‌ని, ఇపిఎఫ్, ఇఎస్ఐ ప్రయోజనాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. కౌంట‌ర్ల‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు రోటేష‌న్ ప‌ద్ధ‌తిలో వారం వారం ఈ సిబ్బందిని మార్చ‌నున్న‌ట్లు వివ‌రించారు. అనంత‌రం ఆయ‌న ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో ల‌డ్డూల పంపీణిని ప‌రిశీలించారు. అనంత‌రం బూంది పోటును ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్‌, పోటు పేష్కార్  శ్రీ‌నివాసులు, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-01 12:00:18