1 ENS Live Breaking News

Tadepalle

2021-07-03 02:25:29

తెరపైకి మహిళా పోలీస్ పేస్కేల్ అంశం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలు, నగరాల్లోని యువతులు, మహిళల రక్షణను ద్రుష్టిలో ఉంచుకొని గ్రామ, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శిలను జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ మహిళా పోలీసులుగా మార్చారు. సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగులతో పోల్చితే వీరితో 5 ప్రభుత్వం హోంశాఖ, ఐసిడిఎస్, ఈఎస్ఈబి, హెల్త్, మరియు కార్యాలయంలోల డిజిటల్ అసిస్టెంట్లకు సహాయకులుగా కూడా విధులు అప్పగించి పనులు చేయిస్తుంది. వీటితోపాటు సచివాలయాలకు నగదు తెచ్చేసమయంలోనూ, ప్రజాప్రతినిధులు వచ్చే సమయంలోనూ, అధికారుల పర్యటన సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్ గా కూడా వీరినే వినియోగిస్తుంది ప్రభుత్వం. ప్రత్యేక జీఓ ద్వారా వీరిందరిని సాధారణ పోలీసులుగా మార్చినా.. వీరి పే స్కేలు, జీతాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా డిగ్రీ, ఆపై విద్యార్హతలున్న వీరి పదోన్నతుల విషయంలో కూడా సాధారణ పోలీస్ కానిస్టేబుల్స్ ఇచ్చినట్టుగా హెడ్ కానిస్టేబుల్ మాదిరిగా ఇస్తామని ప్రభుత్వం ఆ జీఓ 59లో పేర్కొంది. దీనితో ప్రభుత్వం తమ విద్యార్హతలను బట్టి పదోన్నతి ఎస్ఐగా కల్పించడంతోపాటు,  పేస్కేలు కూడా కానిస్టేబుల్ పేస్కేల్ కి మార్పు చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు బలంగా తీసుకు వస్తున్నారు.  సాధారణ పోలీసు విధులతోపాటు, గతంలో ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ శాఖల విధులు మహిళల సంరక్షణార్ధం దిశ యాప్, దిశ చట్టం చేసి మహిళలకు, యువతులకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్రామ, వార్డు సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. వీరికి త్వరలోనే కాకీ యూనిఫారం ఇచ్చి గ్రామాల్లో ఒక ప్రత్యేక వ్యవస్థను తయారు చేయనుంది ప్రభుత్వం. అయితే వీరికి స్టేషన్ కి వెళ్లి విధులు నిర్వహించేలా కాకుండా సచివాలయాల పరిధిలోనే ప్రజలకు, మహిళలకు రక్షణగా ఉంటూ వీరిద్వారానే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు వెళ్లే విధంగా చేయాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి డిజిపి గౌతం సవాంగ్ ను ఆదేశించారు. ఇంత వరకూ బాగానే వున్నా.. గ్రామ, వార్డు సంరక్షణా కార్యదర్శిలను సాధారణ పోలీసులుగా మార్చడాన్ని ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్నవారు(హోంగార్డు, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు) జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి అనుగుణంగానే వీరి స్టేషన్ శిక్షణ సమయంలో కాస్త చులకన భావంగా మాట్లాడుతున్నారని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసులంటే స్టేషన్ నుంచి గ్రామాలకు  వెళితే ఆ గౌరవం, భయం తమకే దక్కేదని అయితే ఇపుడు అవన్నీ మహిళా పోలీసుకు దక్కుతున్నాయని, పైగా వాళ్లకి యూనిఫారం కూడా ఇచ్చేశారని తెగ ఫీలైపోవడంలో అర్ధం లేదని మహిళా పోలీసులు వాపోతున్నారు. తమకేమీ ఉద్యోగాలు ఊరకనే  ప్రభుత్వం ఇవ్వలేదని.. ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా ఎంతో శ్రమించి పోటీపరీక్షలు రాసి ఈ ఉద్యోగాలు పొందినా, ప్రభుత్వం అప్పనంగా మహిళా పోలీసులకు ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు తమతోపాటు సమానంగా చూస్తుందని, పదోన్నతుల విషయంలో కూడా తమతో పాటే సమానంగా ఇచ్చేయడానికి జీఓ కూడా ఇచ్చిందని తెగ మదన పడిపోవడంతో అర్ధం లేదని చెబుతున్నారు. అక్కడికీ వీరందరికీ జీతాలు, విధులు స్థానిక పోలీసు స్టేషన్ లోని సిబ్బందే తమ జేబుల్లో నుంచి ఇస్తున్నట్టుగా వ్యవహరించడం రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోలీసు వర్గాల్లోని, వారి యూనియన్లలోనూ పెద్ద స్థాయిలో చర్చజరుగుతోంది. వాస్తవానికి మహిళా పోలీసులకు యూనిఫారం ఇవ్వడం చాలా మంది మహిళా పోలీసులకు ఇష్టం లేదు. కాకపోతే ప్రభుత్వం ఉద్యోగ ధర్మం మీది ఇచ్చిన జీఓలు, ఆదేశాలు, నిర్ణయాలు తూచ తప్పకుండా పాటించాలనే ఒక్క కారణంతోనే వీరంతా ప్రభుత్వ నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలిసే నేరుగా డిజిపి ద్వారా ఈ ప్రత్యేక జీఓ ప్రభుత్వం జారీచేయించిందని చెబుతున్నారు. ఇంత చేసిన ప్రభుత్వం తమ ఉద్యోగాలను మార్పు చేన ప్రభుత్వం ఐదు ప్రభుత్వ శాఖలకు పైగా విధులు నిర్వహించే తమ పేస్కేలు కూడా మార్పుచేయాలని మహిళా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వున్నతమలో 14వేలకు పైగా సిబ్బందిలో 25 నుంచి 30ఏళ్లు లోపు వున్న వారు సుమారు 60శాతం వున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం మహిళా పోలీసుల కోసం ప్రత్యేక వ్యవస్త ఏర్పాటుచేసి, దిశ యాప్, చట్టాన్ని అమలు చేస్తున్న తరుణంలో తమ జీత భత్యాల విషయంలో ప్రభుత్వం సముచిత మైన నిర్ణయం తీసుకోవడంతోపాటు పదోన్నతులు కూడా ఎస్ఐగా కల్పించడం ద్వారా తమ న్యాయపరమై డిమాండ్ ను పరిష్కరించినట్టు అవుతుందని మహిళా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా విలేజ్ పోలీస్ వ్యవస్తను ఏర్పాటు చేయడంతోపాటు మంచి పదోన్నతులు కల్పించిన ప్రభుత్వంగా కూడా కీర్తి దక్కుతుందని మహిళా పోలీసులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరి డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచిచూడాల్సిందే..!

Tadepalle

2021-07-03 01:53:22

Tadepalle

2021-07-02 02:22:43

పదోన్నతులపై తొలగని సందిగ్ధత..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులకు చాలా మందికి తమ పదోన్నతులు ఎలా ఉండబోతాయనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. వాస్తవానికి రాష్ట్రప్రభుత్వంలోని కొన్ని ఉద్యోగాలకు ఇన్ సర్వీసులో రెండు రకాలుగా పదోన్నతులు కల్పిస్తారు..సర్వీసు ఆధారంగా ఇచ్చే పదోన్నతి ఒకటైతే..ఇదే ఇన్ సర్వీసులో ప్రభుత్వం వారి విద్యార్హతను మెరిట్ ప్రాతిపదిక ఎంపిక చేసి వారికి జీతంతో కూడి చదువు చెప్పించి..ఆపై మండల స్థాయి అధికారులుగా కల్పించే పదోన్నతులు.. కానీ ఏపీలో సచివాలయ ఉద్యోగుల భర్తీయే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా జరగడంతో రెగ్యులర్ ఉద్యోగులకు, వీరికి మధ్య భారీ వ్యత్యాసాలు విధి నిర్వహణ దగ్గర నుంచి జీత భత్యాలలో కనిపిస్తున్నాయి.. ఇపుడు ఈ శాఖలోని ఉద్యోగులకు తమ పదోన్నతులు ఏవిధంగా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల్లోని గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలను సాధారణ మహిళా పోలీసులుగా మార్చుతూ జీఓ నెంబరు 59ని విడుదల చేసి.. వీరికి పదోన్నతి కూడా హెడ్ కానిస్టేబుల్ వుంటుందని పేర్కొంది. పేరుకి మహిళా పోలీస్ అయినప్పటికీ వీరు హోంశాఖలో పాటు, ఐసిడిఎస్, హెల్త్, కార్యాలయ సహాయకులు, ఇతర అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మిగిలిన శాఖల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇచ్చిన ఒక్కశాఖ ఉద్యోగంతో నాలుగైదు శాఖలు విధులు నిర్వహించే మహిళా పోలీసులకు డిగ్రీ కంటే అధిక విద్యార్హత ఉన్నప్పటికీ, కేవలం ఇంటర్ తో సమానమైన కానిస్టేబుల్స్ కి ఇచ్చే సాధారణ ప్రమోషన్ మాత్రమే ఇవ్వడంతో తమకు ఏవిధమైన పదోన్నతులు వస్తాయోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్, ఏఎన్ఎం, ఇంజనీరింగ్ , హార్టికల్చర్, సెరీకల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ,శానిటేషన్ అసిస్టెంట్లకు తరువాత పదోన్నతులు ఏంటనే విషయంలో ప్రభుత్వం ద్వారా క్లారిటీరాలేదు. పంచాయతీ గ్రేడ్ 5 కార్యదర్శిలకు తరువాత పదోన్నతి గ్రేడ్4, అని డిజిటల్ అసిస్టెంట్లకు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్5 ఇస్తారని అంతా భావిస్తున్నారు. కానీ వీరి ప్రమోషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక జీఓ ద్వారా ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఉదాహరణకు వ్యవసాయ శాఖలో డిప్లమా విద్యార్హతతో చేరిన ఉద్యోగులకు ఇన్ సర్వీసులో ప్రభుత్వమే బిఎస్సీ అగ్రికల్చర్ చదివించి వారికి మండల వ్యవసాయ అధికారిగా పదోన్నతి కల్పిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశాఖలో ఏఎన్ఎంలకు కూడా ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్సు శిక్షణ ఇచ్చి వారికి నర్సులుగా పదోన్నతి కల్పిస్తుంది.  కానీ సచివాలయ ఉద్యోగులకు కూడా ఆవిధమైన పదోన్నతులు వాస్తాయా అనేది  క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పటికే మహిళా పోలీసులంతా డిగ్రీ, పీజీ అంతకంటే అధికంగా పీహెచ్డీ విద్యార్హతతో కూడా మహిళా పోలీసు ఉద్యోగాల్లోకి చేరారు. అయితే ప్రభుత్వం వారికి తదుపరి పదోన్నతి హెడ్ కానిస్టేబుల్ అని జీఓ ద్వారా తెలియజేయడంతో అంతా ఇపుడు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. వారి వినతులను ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రభుత్వ విప్ ల ద్వారా తీసుకెళుతున్నారు.  ఒక్కోశాఖలో ఒక్కోలా పదోన్నతులు ఇవ్వడమేమంటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. అగ్రికల్చర్, వైద్యఆరోగ్యశాఖలో పదోన్నతులు ఇన్ సర్వీసులో ఇచ్చినట్టే మహిళా పోలీసులకు ఎస్ఐ లుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తుంటే.. ఆపై  మిగిలిన శాఖలైన ఇంజనీరింగ్, సెరీకల్చర్, వెటర్నరీ, వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ శాఖలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖ సచివాలయ సిబ్బందికి పదోన్నతి విషయంలో క్లారిటీ ఇవ్వాలనే వాదన బలపడుతుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్త సచివాలయ గ్రూపుల్లో పెద్ద పెద్ద డిబేట్లే జరుగుతున్నాయి. గ్రామస్థాయిలో ఎంతో ఎక్కువ సేవలు అందించే తమకు సాధారణ ఉద్యోగుల కంటే అతి తక్కువ జీతాలు ఇవ్వడంతోపాటు, పదోన్నతుల విషయంలో కూడా ఎటూ తేల్చి చెప్పకపోవడంపై ఉద్యోగులంతా ఆగ్రహంగా వున్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వం సరైన మార్గం పదోన్నతుల విషయంలో చూపించకపోతే తదుపరి కార్యాచరణ ఏంటని కూడా జోరుగా తమ తమ ఆలోచనలు ఉద్యోగ సంఘాల గ్రూపుల్లో చర్చకు తెరలేపుతున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు దగ్గర కూడా ప్రస్తావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినపుడు ఒక్కో శాఖకు ఒక్కోలా పదోన్నతులపై క్లారిటీ ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులపై క్లారిటీ ఇస్తే..ఈ ఉద్యోగాల్లో ఉండాలా లేదంటే ఇంతకంటే మంచి ఉద్యోగాలకు వెళ్లిపోవాలా అనే కోణంలో సచివాలయ ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం ప్రకటించే జాబ్ కేలండర్ తోపాటు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకుంటే మంచిదనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. కారణం వీరికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు తేడా ఉండటం, విధులు, జీతాలు, పదోన్నతులు, ప్రొబిషన్ ఇలా ఏ కోణంలో చూసిన సాధారణ ఉద్యోగులతో వీరిని పరిగణించడానికి ఆస్కారం లేకుండా పోతుందని  చెబుతున్నారు. అటు చాలా జిల్లాల్లో వీరి ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియకుండా ఉందని..ఇప్పటికే హైకోర్టు పంచాతీ కార్యాలయాలు ఉండగా సచివాలయాలు ఎందుకనే ఒక కేసు విషయంలో ప్రశ్నించింది.. ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా కేవలం ప్రొభిషన్ లోనే 15వేలు మాత్రమే జీతం వస్తుంటే ఇక రెగ్యులర్ అయిన తరువా పెద్దగా జీత బత్యాలు ఏమొస్తాయోనని ఉద్యోగులంతా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రత్యేక జీవోల ద్వారా క్లారిటీ ఇవ్వకపోతే చాలా మంది ఇక్కడి ఉద్యోగాలను వదిలి ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ ఏడాది చివరి నాటికి సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ పూర్తయి వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయి. అప్పటికైనా ప్రభుత్వం వీరి పదోన్నతుల విషయంలో క్లారిటీ ఇస్తుందా లేదా అనేది వేచిచూడాలి..!

Tadepalle

2021-07-01 02:54:35

Tadepalle

2021-07-01 01:40:57

రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేమాల..

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేమాల హేమసుందరరావు నియామకమయ్యారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పారపు సాంబశివ నాయుడు అధ్యక్షతన విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ ప్రతినిధుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు  హేమసుందరరావుకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. ఈయన నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

Tadepalle

2021-06-30 15:24:14

రాష్ట్ర అధ్యక్షునిగా సాంబశివనాయుడు..

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు విజయవాడలో బుధవారం ఓ హోటల్ లో జరిగాయి. యూనియన్ ఏర్పాటై 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా యూనియన్ రాష్ట్ర నూతన కమిటీని అధ్యక్షులుగా చొప్పారపు సాంబశివనాయుడు నాయకుల  ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర  అధ్యక్షులుగా ఈయనను రెండవసారి ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పి.ప్రసన్నకుమార్ రెడ్డి(కడప), సి. సంజీవరెడ్డి  (అనంతపురం)ప్రధాన కార్యదర్శిగా  జూపూడి గురుకాంతాచారి,(ప్రకాశం) పి.సాయికుమార్, కార్యదర్శులుగా(గుంటూరు) బి. షాలన్న,(కర్నూలు) కొయిలాడ పరశురామ్, (విశాఖపట్నం) ఏ. రాధ కృష్ణ,(కృష్ణా జిల్లా) 
సహాయ కార్యదర్శిలుగా  ఎండీ హుమైన్,(విజయవాడ),నేమాల.హేమసుందర రావు,( విశాఖపట్నం),రాఘవేంద్ర రావు (కర్నూలు ) కార్యనిర్వహక సభ్యులుగా వై. శ్రీనివాసరావు, (తూర్పుగోదావరి),సంతోష్,(శ్రీకాకుళం), కె.సుధాకర చారి,( చిత్తూరు  ), సత్యనారాయణ మూర్తి, (రాజమండ్రీ), టి. నరసింహం,(పశ్చిమ గోదావరి),సలహా  సభ్యులుగా కాకుమాను వెంకట వేణు,గరగ ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tadepalle

2021-06-30 15:18:42

Tadepalle

2021-06-30 14:30:18

ఒలింపిక్స్ లో దేశానికి పతకాలు సాధించాలి..

జపాన్‌ టోక్యో నగరంలో జులై 23,2021 నుంచి ఆగష్టు 8 వరకూ  జరిగే ఒలింపిక్స్‌లో భారతదేశానికి మంచి పథకాలు సాధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్‌ పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు సీఎం వైఎస్‌ జగన్‌  విషెష్‌ చెప్పి ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్‌ అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేసి అభినందనలు తెలియజేశీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, మరియు క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-30 14:28:49

అందరి సహకారంతో కరోనా నివారణ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రంణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన  చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్-19 నివారణ చర్యలపై మంగళవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి సిఎస్ వెబ్ నార్ నిర్వహించారు. ఈ వెబ్ నార్ లో హెల్ప్ కమ్యూనిటీ, అవేర్ నెస్, రూరల్ కమ్యూనికేషన్, అప్రొప్రయేట్ బిహేవియర్, వ్యాక్సినేషన్ తదితర 5 అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ,  రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2.16 కోట్ల కొవిడ్ టెస్టు నిర్వహించామని తెలిపారు.  వాటిలో ఆర్టీపీసీఆర్ ద్వారా 1,47,74,072 టెస్టులు,ర్యాపిడ్ యాంటిజనెన్ విధానం ద్వారా 68,63,534 టెస్టులు నిర్వహించడం జరిగిందని సిఎస్ పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 18,75,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,16,930 మంది వ్యాధి నుండి కొలుకున్నారని తెలిపారు. కరోనా కారణంగా ఇంత వరకూ 12,566 మంది మృతి చెందారని సిఎస్ చెప్పారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,48,64,205 మందికి టీకాలు వేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు. కాగా 1,19,54,827 మందికి ఒక డోసు, 29,09,378 మందికి రెండు డోసులు వేశామన్నారు.జర్వ పీడితుల గుర్తింపునకు చేపట్టిన ఇంటింటి సర్వేలో 1,42,55,516 కుటుంబాల నుంచి నమూనాల సేకరించామన్నారు. కరోనా నివారణలో భాగంగా ఒక వైపు కర్ఫ్యూ విధిస్తూనే,మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం ద్వారా మరింత వేగవంతంగా రాష్ట్రంలో కరోనా నివారణ సాధ్యమవుతుందన్నారు. ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కె.భాస్కర్,కోవిడ్ టాస్కుఫోర్సు కమిటీ సభ్యులు బాబు ఎ తోపాటు గోద్రేజ్ అగ్రోవెట్,యూనిలివర్, ఓక్షఫామ్, యూనిసెఫ్, ఐటీసీ, ఓన్జీసీ, బెర్గర్, మారికో, టాటా ట్రస్టుతో పాటు ఆసంస్థలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-29 13:56:12

SCSP నిధులు 100% ఖర్చుచేయాలి..

రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వారికి సంక్షేమానికై ఎస్సి కాంపొనెంట్ కింద పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదేశించారు. ఈమేరకు ఎస్సి కాంపొనెంట్ కు సంబంధించి మంగళవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో 27వ నోడలు ఏజెన్సీ ఆఫ్ షెడ్యూల్డ్ కులాల కాంపొనెంట్ (SCSP) సమావేశం మంత్రి విశ్వరూప్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సి కాంపొనెంట్ కింద కేటాయించిన నిధులను నూరు శాతం ఖర్చు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.ఈనిధుల వినియోగంలో ఎంతమాత్రం జాప్యం లేదా అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన స్పష్టం చేశారు.2020-21లో షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కింద 44 శాఖలకు(HOD's) 19430 కోట్లు కేటాయించగా 13672 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఎస్సి కాంపొనెంట్ కింద కేటాయించిన నిధుల్లో 76%కంటే ఎక్కువ 12శాఖలు ఖర్చు చేయగా,25నుండి 51% 23శాఖలు ఖర్చు చేశాయని 9శాఖలు మాత్రం ఏవిధమైన నిధులు ఖర్చు చేయలేదని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. 

2021-22 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల కాంపోనెంట్ (SCSP) కింద 42 శాఖలకు 17403 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.ఇది గత ఆర్థిక సం.రం.కంటే 1667కోట్లు(10.06శాతం)అదనమని,2019-20 కంటే 2402కోట్లు(16%) అదనమని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు.కాగా మే 2021 నాటికి ఎస్సి కాంపొనెంట్ కింద కేటాయించిన నిధుల్లో 4641 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు.2021-22 ఆర్థిక సం.రం.లో ఎస్సిఎస్పి కింద అధిక నిధులు కేటాయించిన శాఖల్లో ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖకు 8059కోట్లు, వ్యవసాయ శాఖ 1680కోట్లు,గృహ నిర్మాణ శాఖ కు 1020కోట్లు, ఇంధన శాఖకు 810కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఎస్సి కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్ననేపధ్యంలో ఇందుకై కేటాయించిన నిధులను నూరు శాతం ఖర్చు చేసేందుకు అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదేశించారు.కొన్ని శాఖలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయలేక పొవడం,కొన్ని శాఖలు అసలు నిధులేమీ ఖర్చు చేయడం పోవడానికి గల కారణాలను విశ్లేషించి పూర్తి స్థాయిలో ఖర్చు చేసేలా చూడాలని వివిధ శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.తదుపరి త్రైమాసికంలో జరిగే సమావేశం సియం అధ్యక్షతన జరుగుతుందని కావున ఆలోగా వివిధ శాఖలన్నీ పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు చేసేందుకు కృషి చేయాలని మంత్రి పినిపే విశ్వరూప్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

సమావేశానికి తొలుత సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత స్వాగతం పలికారు.అనంతరం వివిధ శాఖల వారీగా ఎస్సిఎస్పి కింద కేటాయించిన నిధులు ఆయా శాఖలు ఖర్చు చేసిన నిధులు వివరాలను శాఖల వారీ సమీక్షించారు.
ఈసమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ హర్ష వర్ధన్,ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సోసైటీ కార్యదర్శి నవ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-29 12:55:13

ఎమ్మెల్యేలు చైర్మన్లగా అసైన్డ్ కమిటీలు..

 రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ నిమిత్తం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చైర్మన్లు గా  అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సమగ్ర భూ రీ సర్వేతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో లో ఉన్న కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి అసైన్డ్ భూములు, అసైన్ మెంట్ కమిటీల ఏర్పాటుపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ స్థాయిలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్ మెంట్ కమిటీలు ఉండేవన్నారు. తరవాత కాలంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా జిల్లా స్థాయి అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు. ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కమిటీలు ఆయా నియోజకవర్గాల్లోని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీకి అర్హులుగా వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారన్నారు. రాష్ట్ర చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అత్యధికంగా నిరుపేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. 2014 నుంచి గత ప్రభుత్వ హయాంలో భూ పంపిణీ చేయలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి భూ పంపిణీకి శ్రీకారం చుడుతున్నారన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. సమగ్ర భూ రీ సర్వే ద్వారా శాశ్వత భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.9,900 కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలకు పైగా కొనుగోలు చేశామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారన్నారు. అర్హులను గుర్తించి రెండున్నర ఎకరాల మెట్ట గాని, 5 ఎకరాల మాగాణి గాని ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూ పంపిణీ సమగ్ర భూ రీ సర్వేతో సీఎం జగన్ హయాంలో భూ వివాదాలన్నీ పరిష్కారమయ్యాయనే సంతృప్తి ప్రజల్లో కలుగుతుందన్నారు. అంతకుముందు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో గతంలో జరిపిన భూ పంపిణీ విధానంపైనా, అసైన్డ్ చట్టాలపైనా, అసైన్ మెంట్ కమిటీల రూపకల్పనపైనా వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా 1954లో పేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. అప్పటి నుంచి 2014 వరకూ 33,29,908 ఎకరాలు పంపిణీ చేశారన్నారు. సమీక్షా సమావేశానికి హాజరైన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల్లోని భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, సీసీఎల్ఎ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, , రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, లాండ్ సర్వే కమిషనర్ సిద్ధార్థ జైన్, ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి, విప్ లు దాడిశెట్టి రాజ, కాపు రామచంద్రారెడ్డి, పలువురు ఎమెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Tadepalle

2021-06-29 12:27:26

Tadepalli

2021-06-29 04:29:40

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పక్కాగా జాబ్ చార్ట్..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పక్కాగా జాబ్ చార్ట్ అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఏపీ హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా.పోలా భాస్కర్ చెప్పారు. మంగళవారం ఆయన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రధాన ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉన్నతవిద్యలో సమూల మార్పులు తేవడంతోపాటు, కాలేజీల్లోని అద్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది జాబ్ చార్ట్ ను కూడా ఇకపై పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇటీవలే ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లకు చెందిన కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామని. ఇక ప్రతీ నెల ఒక్కో జోన్ లో ఈ తరహా సమీక్షలు జరుపుతామన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్ధులు ఆన్ లైన్ విద్యకు దూరమవుతున్న విషయాన్ని గుర్తించి దానిని గాడిలో పెట్టేందుకు యాప్ ప్రవేశపెట్టామని, వాటి నుంచి ఫలితాలు ప్రారంభమయ్యాయన్నారు. అదేవిధంగా ఈ ఎకడమిక్ ఈయర్ లో రాష్ట్రవ్యాప్తంగా వున్న 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 84 పాలిటెక్నిక్ కాలేజీలు, 140 ఎయిడెడ్ డిగ్రీకాలేజీల్లో 72వేల సీట్లు అందుబాటులో ఉంటే కేవలం 42వేల మంది విద్యార్ధులు మాత్రమే చేరుతున్నారని, అలాకాకుండా శతశాతం  విద్యార్ధులను చేర్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానికోసం అద్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు దగ్గర్లోని ఇంటర్ కాలేజీలను మ్యాపింగ్ చేసుకొని వారిని డిగ్రీకాలేజీల్లో చేర్పించే ప్రణాళికలు సిద్దం చేసినట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలకు సమానంగా నిధులు కేటాయిస్తున్నందున ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అద్యాపకులు, ప్రిన్సిపాల్స్ తమ విధులను పక్కాగా జాబ్ చార్ట్ ఆధారంగా నిర్వహించాల్సి వుందన్నారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రశక్తిలేదని, ఉన్నత విద్యలో విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్న కమిషనర్ ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టే భాద్యతను పెంచుతున్నట్టు వివరించారు.

Tadepalle

2021-06-29 02:08:01

రాష్ట్రంలో రెండు కేటగిరీలుగా కర్ఫ్యూ..

ఈ నెలాఖరుతో కర్ఫ్యూ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రెండు కేటగిరీలుగా కొత్తగా కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు మరో మూడు జిల్లాల్లో సాయంత్రం ఆరు గంటల తరవాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో 8 జిల్లాల్లో జూలై 1 నుంచి రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చి, ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతుందన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంటుందన్నారు. రాత్రి తొమ్మిది గంటల తరవాత అన్ని దుకాణాలు, ఇతర సముదాయాలు మూసివేయాలన్నారు. ఇలా వారం రోజుల పాటు కొత్త కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Tadepalle

2021-06-28 15:30:33