1 ENS Live Breaking News

అందుబాటులో పూర్తిస్థాయి ఆక్సిజన్..

రాష్ట్రంలో అవసరమైన మేర ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.  మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు. గడిచిన 24 గంటల్లో 71,758 శాంపిళ్లను పరీక్షించగా, 2,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 31 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటు 3.1 శాతంగా నమోదైందన్నారు. కడప, కర్నూల్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి మరణాలు చోటు చేసుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 322 ఆసుపత్రుల్లో కొవిడ్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారన్నారు. 322 ఆసుపత్రుల్లో 2,786 ఐసీయూ బెడ్లు, 14,545 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం కొవిడ్ కేర్ సెంటర్లలో 5,311 మంది చికిత్స పొందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం...ఏపీకి రోజువారీగా ఆక్సిజన్ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తుండగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో తక్కువ మొత్తం ఆక్సిజన్ ను డ్రా చేస్తున్నామన్నారు. ఈ నెల 24న 196 మెట్రిక్ టన్నులు, 25న 169 టన్నులు, 27న 170 టన్నుల ఆక్సిజన్ డ్రా చేశామన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బ్రహ్మాండంగా అందుబాటులో ఉందన్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేషంట్లు మృతి చెందారని వార్తలు వచ్చాయని, వాస్తవాలను సంబంధిత జిల్లా కలెక్టర్ తెలిపారని తెలిపారు. అవరమైన ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా తప్పుడు వార్తలతో ప్రజల, అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదన్నారు. అలా చేసిన వారిపై చట్టపరంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం నిర్వహించే సమీక్షా సమావేశాలపై అవాస్తవాలు ప్రచురించడం తగదన్నారు. 

రాష్ట్రంలో 35 బ్లాక్ ఫంగస్ కేసులు..
 రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35  బ్లాక్ ఫంగస్ నమోదయ్యాయన్నారు. కొవిడ్ కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయన్నారు.. ఇప్పటి వరకూ 3,364 బ్లాక్ ఫంగస్  కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,418 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 1,184 మందికి వైద్యులు సర్జరీ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నుంచి 63,395 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రాగా, ప్రస్తుతం 9644 అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే వారం రోజుల్లో మరో 15 వేల ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రానున్నాయన్నారు. 49,250 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయగా, ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 32,197 అందుబాటులో ఉన్నాయన్నారు. 1,39,980 పొసకొనజోల్ మాత్రలు కొనుగోలు చేయగా, ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 51,792 అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పొసకొనజోల్ మాత్రలు, ఇంజక్షన్ల కొరత లేదన్నారు. 

5,515 సచివాలయాల్లో జీరో కేసులు...
ప్రస్తుతం రాష్ట్రంలో 42,252 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 5,515 గ్రామ, వార్డు సచివాయాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదన్నారు. 3,110 సచివాలయాల్లో ఒకే కేసు, 1,891 సచివాలయాల్లో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. 12,545 సచివాలయాల్లో సున్నా నుంచి 5 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఒక సచివాలయంలో 50 కేసులు, మూడు సచివాలయాల్లో 40 నుంచి 50 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 690 సచివాలయాల్లో పది కంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయన్నారు. ఈ సచివాలయాలపై  దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారన్నారు. మండలాల వారీగా చూస్తే... 105 మండలాల్లో 10 లోపల యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.  మండలాలు, సచివాలయాల వారీగా చూసినా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. వారంతపు డేటాను గమనిస్తే ఎనిమిది జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైందన్నారు. 

Tadepalle

2021-06-28 15:28:52

త్వరలో రానున్న 53,14,740 డోసులు..

రాష్ట్రానికి జూలై నెలకు సంబంధించి ఏపీకి 53,14,740  కోవిడ్ డోసులు అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారమిచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై నెలాఖరు నాటికి 31 లక్షల మందికి సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉందన్నారు.  24,36,787 మందికి కొవిషీల్డ్, 6,88,190 మంది కొవాగ్జిన్ సెకండ్ డోసు తీసుకోవాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వమిచ్చే 53.14 లక్షల టీకాల్లో 31 లక్షల మందికి సెకండ్ డోసుగా వేయనున్నామన్నారు. కాగా 
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నాటికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో  7,998 మంది ఉండగా, వారిలో 7,488 మంది ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  93.62 శాతం మంది ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 2266  మంది చికిత్ప పొందుతుండగా, 1.756 మంది (77.49 శాతం) ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,16,90,837 మందికి టీకాలు వేశామన్నారు. ఇందులో ఫస్ట్, సెకండ్ డోసులు వేసుకున్నవారున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన 45 ఏళ్ల లోపు వయస్సు తల్లులు 18,75,866 మంది ఉండగా, నేటి వరకూ 12,99,500 మందికి టీకా మొదటి డోసు వేశామన్నారు. జూన్ నెలకు సంబంధించి సెకండ్ డోసు వేసుకోవాల్సిన వారు  3 లక్షల మంది ఉన్నారన్నారు. వారందరికీ రాబోయే మూడ్రోజుల్లో రెండో డోసు వేస్తామని తెలిపారు. వారిలో 1,30,000 మంది కొవిషీల్డ్, 1,92,000 మంది కొవాగ్జిన్ సెకండ్ డోసు వేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,41,000 డోసులు అందుబాటులో ఉన్నాయని, వాటిని మంగళవారం నాటికి వినియోగించే అవకాశముందని తెలిపారు. 

Tadepalle

2021-06-28 15:24:24

కన్ఫర్డ్ వద్దు.. డైరెక్టు ఐఏఎస్ ముద్దు..

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన పరిపాలన వ్యవస్థలో భారీ మార్పులకు తెరలేపింది.. యుపీఎస్సీ నుంచి నేరుగా సెలక్ట్ అయిన ఐఏఎస్ లతోపాటు ఇతర సివిల్స్ సర్వీస్ కేడర్ అధికారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో కన్ఫర్డ్ ఐఏఎస్ లను పక్కనపెట్టి వారికి ప్రాధాన్యతలేని ప్రభుత్వ శాఖలను కట్టబెడుతున్నట్టు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అంతేకాదు గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లా కలెక్టర్ హోదా అయిపోయి ఏదో శాఖకు కమిషనర్ గా వెళ్లిన వారిని సైతం మళ్లీ జిల్లా కలెక్టర్లుగా వెనక్కి తీసుకొచ్చి కలెక్టర్ సీట్లోనే కూర్చోబెడుతోంది.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గతంలో కొందరు కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా జిల్లా కలెక్టర్లుగా ఉండేవారు.. వీరంతా డైరెక్టు ఐఏఎస్ లకంటే అద్భుతమైన పనితీరు కనబరుస్తూ, ప్రజలకు విశేషంగా సేవలందిస్తూ.. ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు కూడా తీసుకొచ్చారు.. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలోని పరిపాలనను మొత్తమంతా డైరెక్టు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లకు కట్టబెట్టి కన్ఫర్డ్ ఐఏఎస్ లను ఇతర శాఖల్లో నియమించడం ద్వారా నేరుగా వచ్చేవారిని మాత్రమే జిల్లాలకు కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా పంపాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది.. గతంలో ఐఏఎస్ అధికారి అంటే ఏశాఖకు పంపినా చక్కగా వెళ్లి అక్కడ పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించేవారు. కానీ ఇపుడు కొందరు ఐఏఎస్ లు తమదైన స్టైల్ లో మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రి కుటుంబాలకు సన్నిహితంగా వుండేవారిని ప్రశన్నం చేసుకుంటూ నచ్చిన జిల్లాలకు కలెక్టర్లు, మున్సిపల్ కార్పోరేషన్లకు కమిషనర్లుగా వెళ్లిపోతుండటం, రెండు మూడేళ్లు పూర్తయిపోయినా కదలకుండా పైరవీలు చేస్తూ అక్కడే తిష్టవేసుకొని కూర్చోవడం కూడా ప్రస్తం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకోమే ఇటీవల భారీగా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో కన్ఫర్డ్ ఐఏఎస్ లను జిల్లా కలెక్టర్ల నుంచి తప్పించి వారి స్థానంలో డైరెక్టు ఐఏఎస్ లను నియమించింది ప్రభుత్వం. గతంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అజాయ్ కల్లాం పనిచేస్తున్న సమయంలో ఎంతో మంచి అనుభవం వున్న కన్ఫర్డ్ ఐఏఎస్ లను కూడా జిల్లా కలెక్టర్లుగా నియమించారు.. ఆ ప్లేస్ లోకి ప్రవీణ్ ప్రకాష్ వచ్చిన తరువాత  ఒక్కో కన్ఫర్డ్ ఐఏఎస్ లను జిల్లా కలెక్టర్ల భాద్యతల నుంచి తప్పిస్తూ వస్తుండటం ఐఏఎస్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తుంది. అలా తప్పించడంతో ఇపుడు రాష్ట్రంలో ఇద్దరు కన్ఫర్డ్ ఐఏఎస్ లు మాత్రమే విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లుగా మిగిలారు. వీరిని కూడా త్వరలో జరగబోయో ఐఏఎస్ ల బదిలీల్లో జిల్లా కలెక్టర్ల స్థానం నుంచి మార్చేస్తారనే ప్రచారం జరగుతుంది. వాస్తవానికి డైరెక్టుగా యుపీఎస్సీ నుంచి ఐఏఎస్ గా వచ్చినా, ఇన్ సర్వీసులు ఐఏఎస్ హోదా పొందినా.. రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వం ద్రుష్టలో ఒకే విధాంగా ఉండాలి. కానీ ఎందుకనో రాష్ట్రప్రభుత్వం ఆ విధానానికి కొత్త భాష్యం చెబుతూ.. కన్ఫర్డ్ ఐఏఎస్ లను పక్కపెట్టాలని చూడటం ఏ రకమైన సంకేతాలు ఇస్తుందో అర్ధం కాకుండా వుంది. డైరెక్టుగా వచ్చిన ఐఏఎస్ లకైనా.. కన్ఫర్డ్ ఐఏఎస్ ల కైనా జిల్లా కలెక్టర్లుగా చేయాలనేది ఒక కల... అదే ఐఏఎస్ సర్వీసులో కీలకమైన ఘట్టం కూడా.. మొన్నటి వరకూ ఏ ఐఏఎస్ అయిన తన సర్వీసులో ఒక్కసారైనా జిల్లా కలెక్టరుగా ఓ రెండు మూడేళ్లు పనిచేస్తాననే నమ్మకం ఉండేది. ఇపుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కన్ఫర్డ్ ఐఏఎస్ లకు జిల్లా కలెక్టర్లుగా పనిచేసే అవకాశం రాకపోవచ్చుననే బలమైన సంకేతాలు ఇవ్వడానికే రాష్ట్రప్రభుత్వం అలాంటి వారిని మిగిలిన ప్రభుత్వశాఖలకు కమిషనర్లుగా పంపుతుందని చెబుతున్నారు. ఎంతో అనుభవం వున్న కన్ఫర్డ్ ఐఏఎస్ లు డైరెక్టుగా వచ్చిన ఐఏఎస్ ల కంటే ఎంతో చక్కగా, సమయస్పూర్తితో పనిచేస్తారు.. దారికి కారణం వారంతా ముందుగా గ్రౌండ్ లెవల్ రియాలిటీపై పనిచేసి, వివిధ శాఖలపై పట్టు పెంచుకొని ఉంటారు.. ప్రభుత్వం ఇన్ సర్వీసులో ఇచ్చిన అవకాశం ద్వారా వారు ఐఏఎస్ హోదా పొందుతారు. వాస్తవానికి అలాంటి వారిని జిల్లా కలెక్టర్లుగా ప్రభుత్వం నియమిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోడానికి మార్గం సుగమం అవుతుంది. అదే డైరెక్టు ఐఏఎస్ లకు ప్రభుత్వం ఇచ్చిన శిక్షణతో, వారి పనిచేసే సమయంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే పనిచేస్తాయి.. అలాగని డైరెక్టుగా వచ్చిన ఐఏఎస్ బాగాపనిచేయరని ఇక్కడ ఉద్దేశ్యం కాదు. వీరైనా.. వారైనా.. ఒకేలా పనిచేస్తారు.. ఒక సారి ఐఏఎస్ అయిన తరువాత ఎవరినైనా ఒకే చూడాలన్న నిబంధనను పక్కన పెడితే జరిగే అభివ్రుద్ధి పక్కదారి పడుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇలా రాష్ట్రప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్ లను వేరే రకంగా చూస్తే అలాంటి వారంతా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయినా.. ఇదే విషయం అందరూ ఒకేలా ఆలోచిస్తే ఏదో ఉద్యోగమంటే ఉద్యోగంలా చేశాం తప్పా..అభివ్రుద్ధికోణంలోనూ.. ప్రజలకు మరిన్ని సేవలు అందించే కోణంలోనూ చేయడానికి ముందుకు రాకపోతే అనుకున్న అభివ్రుద్ధి ఆగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ప్రస్తుత ఈ పరిస్థితులు మున్ముందు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచిచూడాల్సిందే..!

Tadepalli

2021-06-28 05:12:58

విద్యార్ధులకు onlineక్లాసులు చెప్పాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ విద్యలో పెను మార్పులు తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలాభాస్కర్ ఆదేశాలతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వున్న 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 84 పాలిటెక్నిక్ కాలేజీలు, 140 ఎయిడెడ్ డిగ్రీకాలేజీల ప్రిన్సిపాళ్లు  దారిలోకి వచ్చారు. ప్రభుత్వం విద్యార్ధుల ఆన్ లైన్ విద్యకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ప్రతీ అధ్యాపకుడు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాల్సిందే. ఇదేదో ఉత్తుత్తి మాటలతో ఊరకనే ఊరకనే ఇచ్చే ఆదేశాలు కావు..  ఖచ్చితంగా ఏ అధ్యాపకుడు యాప్ లోకి లాగిన్ అయి ఎంత సేవు విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు.. ఎంత మేరక సిలబస్ పూర్తి చేస్తున్నారు.. విద్యార్ధులు ఏ మేరకు స్పందిస్తున్నారు.. అనే అంశాలన్నీ రాజధానిలోకి కమిషనరేట్ లో ఒక్క మీట నొక్కి తెలుసుకునే విధంగా పక్కాగా రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ( మొబైల్ యాప్ విత్ డేష్ బోర్డ్) తో అద్యాపకులంతా ఆన్ లైన్ లోకి వచ్చి పాఠాలు చెబతున్నారు.. కరోనా సమయంలో విద్యార్ధులు కాలేజీకి వచ్చే పరిస్థితి లేదు..అలాగని వారికి పాఠాలు చెప్పకపోతే వారి విద్యమధ్యలోనే ఆగిపోతుంది..మీకు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జీతాలిస్తోంది.. దానిని ద్రుష్టిలో పెట్టుకొనైనా ఖచ్చితంగా ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాల్సిందే..లేదంటే చర్యలు తప్పవు అంటూ ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇచ్చిన హెచ్చరికతో మూడు రోజుల్లో 50శాతానికంటే తక్కువగా వుండే ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అటెండెన్సు ఒక్కసారిగా 20శాతానికి పెరిగింది. విద్యార్ధులకు ఆన్ లైన్ పాఠాలు చెప్పడానికి ప్రతీ లెక్చరర్ ఖచ్చితంగా ల్యాప్ ట్ ప్ వినియోగించాలని ఆదేశాలు జారీచేయడంతో చక చకా పాఠ్యాంశాలు బోధించడానికి అద్యాపకులు ఒక్కొక్కరుగా ఆన్ లైన్ లోకి వస్తున్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆన్ లైన్ ద్వారానైనా పాఠాలు చెప్పించి వారిని సబ్జెక్టు పరంగా అభివ్రుద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్షమని..దానికోసమే విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు కమిషనర్ పోలాభాస్కర్ ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా వివరించారు. ఆన్ లైన్ విద్యకోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామన్నారు. అందులో ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాల్స్ తోపాటు, ఆర్జేడీలు, రాష్ట్రస్థాయిలో కమిషనర్ లో డాష్ బోర్డులో ఎంత మంది విద్యార్ధులకు పాఠ్యాంశాలు చెప్పారో ఎప్పటి కప్పుడు తెలుసుకునే వీలుపడేలా ఎంతో ఉపయుక్తంగా ఈ యాప్ రూపొందించినట్టు ఆయన వివరించారు. అటు ఎయిడెడ్ డిగ్రీకాలేజీలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తున్నందున వారికి కూడా ఈ అదేశాలు, నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంతో ద్రుడ సంకల్పంతో వుందని ఎవరు ఆ నిబంధనలను అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోయేది లేదని కూడా కమిషనర్ చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత రాష్ట్రప్రభుత్వం కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించడంతో విద్యార్ధుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి కమిషనర్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చేదిశగా కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో..!

Tadepalle

2021-06-28 03:04:13

గ్రామ సచివాలయ సెలవులకి మంగళం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆదివార సెలవులకు మంగళం పాడాలని చూస్తున్నట్టు కోవిడ్ వేక్సిన్ ద్వారా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కరోనా సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకూ పనిచేయాలని అవకాశం కల్పించిన సమయంలో కూడా సచివాలయ ఉద్యోగులకు ఆ సౌకర్యం అమలు చేయకపోగా.. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ పనిచేయించింది. ఇపుడు తాజాగా వారంలో ఒక్కరోజు వచ్చే ఆదివారం సెలవులకు మంగళం పాడి ఆరోజు కరోనా వేక్సిన్ టీకా కార్యక్రమాలు పెడుతోంది ప్రభుత్వం. సెలవురోజుల్లో వేక్సినేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు ఉదయం 8గంటల నుంచి సాయంత్ర ఆరు, ఏడు గంటల వరకూ వేక్సినేషన్ కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధామని ప్రశ్నించిన ఉద్యోగులకు చెప్పింది చేయకపోతే మీ ఉద్యోగాలు పోతాయని, పైకి రాసేస్తామని మండల అధికారులు బెదిరస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించడంతో  భయం భయంగా  కేంద్రాల వద్ద కోవిడ్ డ్యూటీలు చేస్తున్నామని చెబుతున్నారు. కేంద్రాల వద్ద కనీస శానిటేషన్ లేకపోగా, శానిటైజర్లు గానీ, డెటాల్ గానీ, హేండ్ గ్లౌజులు గానీ, హైపో సోడియం పిచికారీ కూడా  ప్రభుత్వం చేపట్టడం లేదంటే అతిశయోక్తి కాదు..  మాస్కులు, శానిటైజర్లు, హేండ్ గ్లౌజులు ఇలా అన్నీ విధులకు వచ్చే సచివాలయ సిబ్బందే కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మూడు దఫాలు ఆదివారం రోజులు కరోనా వేక్సినేషన్ డ్యూటీలు వేసి వారి సెలవులను కోల్పోయోలా చేసింది ప్రభుత్వం. కనీసం ఆదివారం సెలవురోజు డ్యూటీలు చేసినందకు మరో రోజైనా సెలువులు ప్రభుత్వం మంజూరు చేస్తుందా అదీకనిపించడం లేదని సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారానికి ఒక్కరోజు దొరికే సెలవు రోజున వారాంతం నిండిపోయిన బట్టలు ఉతుక్కోవడానికి కూడా సమయం దొరకడం లేదని సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు కరోనా వేక్సినేషన్ లక్ష్యాలను కూడా వైద్య ఆరోగ్యశాఖలో ఆశ, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్లు, రెండవ ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తులు ఉన్నప్పటికీ వారికి ఏమీ చెప్పకుండా తమకే ప్రజలను వేక్సిన్ వేక్సిన్లు వేయించే టార్గెట్లు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజలు కోవిడ్ వేక్సినేషన్ కు ముందుకి రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఏ విధంగా పరిగణిస్తో అర్ధం కావడం లేదని వీరాంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు, తమకు జీతాలు, విధుల్లోనే కాకుండా ప్రభుత్వం పరిగణించే విషయంలోనూ చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 
 సచివాలయ ఉద్యోగులు రెండు కోవిడ్ టీకాలుు పూర్తిచేసుకున్నా..కోవిడ్ కేంద్రాల వద్ద డ్యూటీలు చేసేవారే కరోనా భారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ పత్రీ పది గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం సచివాలయానికి ముగ్గురు సిబ్బంది చొప్పున ఇపుడు పాజిటివ్ భారిన పడి వైద్యం పొందడం కూడా తమకు భయాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు. చాలా మంది ప్రజలు వారికి కరోనా ఉన్నా పరీక్షలు చేయించుకోకుండా నేరుగా కోవిడ్ వేక్సినేషన్ కు రావడ వలన, వారికి ఇచ్చే టోకెన్లు తాము అలా తీసుకోవడం వలన వారి కరోనా వైరస్ తమకు సోకుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మండల అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా వేక్సిన్ కార్యక్రమం ఆదివారం, సెలవురోజుల్లో ఏర్పాటు చేస్తే అపుడు విధుల్లో పాల్గొన్నా వారికి ప్రత్యేకంగా సెలవులు ఇవ్వాల్సిందేనని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ ఆదివారాల సెలవులు, విధులు, ఇబ్బందులు, సమస్యల కోసం ఎవరితో మాట్లాడాలనుకున్నా మండలస్థాయి అధికారుల నుంచి బెదిరింపులే ఎదురవుతున్నాయి తప్పితే తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. పైగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం కోసం ఆ మాత్రం కూడా ఆదివారాలు పనిచేయలేరా అని తిరిగి ప్రశ్నిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ఆదివారాల సెలవు రోజుల్లో వారితో కరోనా వేక్సిన్ విధులు నిర్వహించినందుకు వారికి ప్రత్యామ్నాయ సెలవులు ఇస్తుందా...వాటిని పరిగణలోకి తీసుకోకుండా అలానే వదిలేస్తుందా అనేది వేచి చూడాలి..!

Tadepalli

2021-06-28 01:17:41

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోర్సులపై అధ్యయనం..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డ్రిగీ కాలేజీల్లో ప్రస్తుతం నడుస్తున్న కోర్సులపై అధ్యయనం చేసి కొత్తకోర్సులు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికోసం ఉన్నతవిద్య, సాంకేతిక విద్యా కమిషనర్ డా.పోలా భాస్కర్ ప్రత్యేకంగా ద్రుష్టిసారించారు. సాధారణ డిగ్రీ కోర్సుల వలన కేవలం డిగ్రీలు మాత్రమే చేతికొస్తున్నాయని, అలా కాకుండా డిగ్రీ పూర్తికాగానే ఉపాది, ఉద్యోగ అవకాశాలు కలిగే కోర్సులను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్ధుల భవిష్యత్తుకు మార్గాలు వేసేందుకు సత్వర చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 70శాతం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కేవలం బిఏ, బీకాం, బిఎస్సీ కోర్సులు మాత్రమే నిర్వహిస్తున్నారు. కొన్ని కాలేజీల్లో మాత్రం సిబిజెడ్, బిఎస్సీ ఎంపీసి కోర్సులు నడుస్తున్నాయి. ఇలా కాకుండా హార్టికల్చర్, సెరీకల్చర్, బిఎస్సీ ఎలక్ట్రానిక్స్,  కంప్యూటర్ సైన్స్ కోర్సులతోపాటు ప్రత్యేక ల్యాబ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. తద్వారా విద్యార్ధులకు డిగ్రీ పూర్తయిన తరువాత ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరిధిలోని పరిశ్రమలు, కంపెనీలు, పెద్ద పెద్ద ప్రభుత్వ శాఖల్లో విద్యార్ధులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక టూర్లను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఇటీవల విశాఖలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన కమిషనర్ ఈ దిశగా ఆదేశాలు జారీచేశారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చదివితే ఖచ్చితంగా ఉపాది, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయనే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురాడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఏ తరహా కోర్సులు నడుస్తున్నాయి, కొత్తగా ఏ తరహా కోర్సులు ఏర్పాటు చేస్తే విద్యార్ధులకు ఉపయోగం ఉంటుందనే విషయమై అధ్యయనం చేసి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతామని అన్నారు. అంతేకాకుండా అన్ని డిగ్రీ కాలేజీలు ఖచ్చితంగా నాక్ గుర్తింపులో ఏదో ఒక సర్టిఫికేట్ కలిగి ఉండేలా సదుపాయాలు కల్పించాలన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఎలాంటి ఆటంకం రాకుండా ఇపుడు ఆన్ లైన్ పేమెంట్లకు, ఈ-ఆఫీస్,  ప్రత్యేక మొబైల్ యాప్ లను అభివ్రుద్ధి చేసినట్టు కమిషనర్ పోలాభాస్కర్ వివరించారు. డిగ్రీ కాలేజీలో చేపట్టే నూతన అంశాలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ఆయన ప్రత్యేకంగా వివరిస్తున్నారు. కమిషనర్ చెప్పిన విధంగా ప్రాధమిక మార్పులు చేసినా, చాలా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రావడంతోపాటు, లైబ్రెరీలు, ఇంగ్లీషు ల్యాబ్ లు, ఉపాది, ఉద్యోగ శిక్షణలు అన్నీ విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి.  

Tadepalli

2021-06-27 04:16:19

సేవలపై అవగాహన కల్పిస్తే కాసుల వర్షం..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15వేల 5 గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అందిస్తున్న 545 సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయం అమాంతంగా పెరిగి కాసులు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ నేటికీ సచివాలయాల్లో ఏ తరహా ప్రభుత్వ సేవలు అందుతున్నాయో ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు చూసినా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల సంఖ్యపై పత్రికల్లో పేజీలకు పేజీలు ప్రచారం చేస్తుంది తప్పితే.. సచివాలయాల్లో అందించే సేవలు పేర్లు, వాటి సంఖ్యను, నేటికొ ఒక్క సారి కూడా ప్రచారం చేయలేదు.  జిల్లా కలెక్టర్, జెసీలు, జిల్లా శాఖల అధికారులు ఎప్పుడు సచివాలయాలను సందర్శించినా..సిబ్బంది వస్తున్నారా లేదా.. రిజస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా.. ఏ అర్జీలను పరిష్కన్నారు.. అనే విషయమై పరిశీలన చేస్తున్నారు తప్పితే. .ప్రభుత్వం  సచివాలయాల్లో అందించే సేవలపై ఏ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు.. ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు.. ఏ శాఖల పరిధిలోని సేవలు ఏ శాఖకు చెందిన ఎవరెవరు ప్రజలకు తెలిసేలా చేస్తున్నారనే కోణంలో ఏ ఒక్క అధికారి ప్రశ్నించిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇక మండల స్థాయి అధికారులైతే సచివాలయ సిబ్బందిని ఉద్యోగులుగా కాకుండా హైస్కూలు విద్యార్ధుల్లా చూస్తూ.. కరోనా వేక్సినేషన్ కార్యాక్రమాల్లో టార్గెట్లు ఇవ్వడం, అవి పూర్తిచేయకపోతే ఇబ్బందులు పడతారని, ఆదివారాల్లోనే ఈ ప్రత్యేక వేక్సినేషన్ కార్యక్రమాలు పెట్టడానికే వారు సమయం మొత్తం వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని మండలాల్లో సచివాలయ ఉద్యోగాలు ఇంకా రెగ్యులర్ కాలేదని, తాము చెప్పినట్టు వినకపోతే  ఉద్యోగాలు తీసేస్తామనే కోణంలో బెదిరించడానికే సమయం అంతా సరిపోతుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నేటికీ కరెంటు బిల్లులు కట్టించుకునే సదుపాయం కూడా సచివాలయాల్లోకి అందుబాటులోకి రాలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో గ్రామాల్లో విద్యుత్ శాఖకు చెందిన బిల్ కలెక్టర్లు వచ్చి మాత్రమే బిల్లులు కట్టించుకుంటున్నారు. లేదంటే మీసేవా కేంద్రాల్లో కట్టించుకుంటున్నారు. అక్కడ అందే సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుతున్నా..ఆ దిశగా ప్రజల వరకూ చేర్చే పని మాత్రం ఎవరూ చేయడం లేదు. కనీసం గ్రామసభలు పెట్టినపుడు సైతం సచివాలయాల్లో అందించే సేవలపై అవగాహన కల్పించడం లేదు. అజెండాలోని అంశాలే పూర్తిగా చెప్పలేని పరిస్థితులు నెలంకొటున్నాయి. అదేవిధంగా ఆధార్, బ్యాంకు అకౌంట్లు, రెవిన్యూ సేవలు, వివిధ రకాల పన్నులు,  డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర అనుమతులకు సంబంధించి చాలా సర్వీసులు గ్రామ సచివాలయం నుంచే అందుతున్నాయనే విషయం నేటికీ ప్రజలకు తెలియడం లేదు. ఎప్పటి మాదిరిగానే ప్రజలు నేటికీ మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. ఆఖరికి సచివాలయ పరిధిలోనే సర్వేయర్లు భూమలకు సంబంధించిన సర్వేలు కూడా చేస్తారనే విషయం తెలియదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతీ సచివాలయాల్లో 12 నుంచి 14 ప్రభుత్వ శాఖల సిబ్బంది పనిచేస్తున్నారు. ఎవరి పరిధిలోని ప్రభుత్వ శాఖలకు సంబంధించి వారు ప్రజలకు అవగాహన కల్పించినా సచివాలయాల ద్వారా అందించే సేవల వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం వుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడు జిల్లా అధికారులు సచివాలయాల ద్వారా అందే సేవల విషయంలో ప్రజలకు తెలిసేలా చేస్తే...ప్రభుత్వానికి ఆదాయం ఒక్కసారిగా భారీస్థాయిలో పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి..లేదంటే సచివాలయాల్లో 545 ప్రజాల సేవలు అందిస్తున్నారని చెప్పుకోవడానికి తప్పా దేనికీ పనిచేయకుండా మిగిలిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..!

Tadepalle

2021-06-26 07:15:02

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇక పక్కాగా ఈ-ఆఫీస్..

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేసి కాగితపు రహిత కాలేజీలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కొన్ని కాలేజీల్లో ఈ-ఆఫీస్ అమలు జరిగినా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. తాజాగా ఉన్నత, సాంకేతిక విద్యా కమిషనర్ గా డా.పోలా భాస్కర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రభుత్వ డిగ్రీకాలేజీలు ను అభివ్రుద్ధి చేయడంతోపాటు, విద్యార్ధులకు నాణ్యమైన విధ్యను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ పాత విధానాలతో నడిచే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలతో సమీక్ష నిర్వహించిన తరువాత ప్రభుత్వం డిగ్రీ కాలేజీల విషయంలో ఏ తరహా చర్యలు తీసుకుంటుందో కమిషనర్ స్పష్టంగా అర్ధమైంది. దానికోసం అన్ని కాలేజీల్లోనూ ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ఇక అన్ని వ్యవహారాలు ఈ-ఆఫీస్ లోనే నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేయడంతో చక చకా పనులు జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ కాలేజీల్లో అన్ని ఆర్ధిక పరమైన అంశాలను ఆఫ్ లైన్ లో జరుగుతున్నాయి. ఇకపై అన్ని కార్యకలాపాలు ఆన్ లైన్ లోనే కాలేజీ ప్రిన్సిపాల్స్ చేయాల్సి వుంటుంది. రానున్న రోజుల్లో ఇక ప్రభుత్వ కాలేజీల పేరు చెబితే ప్రైవేటు విద్యాసంస్థలు సైతం కంగారు పడేలా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. రాష్ట్రప్రభుత్వం నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఉన్నత విద్యలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఏ పనైనా దేశం మొత్తం తొంగి చూసేలా చేయడంలో సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలా భాస్కర్ ది అందివేసిన చేయి. ప్రభుత్వం కూడా ఈ అధికారిని ఉన్నతవిద్యకు కమిషనర్ ని చేయడంతో కాలేజీవిద్యలో సమూల మార్పులకు ఈయన శ్రీకారం చుట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆరు నెలల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల స్వరూపం, విద్యా విధానం అన్నీ ప్రైవేటే కాలేజీలను తలదన్నే విధంగా తయారుకావడం ఖాయంగా కనిపిస్తుంది. తొలుత ఈ-ఆఫీస్, ఆపై ఆన్ లైన్ విద్య, తరువాతర ఉపాది అవకాశాలు కలిగేలా విద్యాబోధన, కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్లు ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వ డిగ్రీకాలేజీలను మార్చాలనేది కమిషనర్ ఆలోచనగా కనిస్తుంది. ఈ విషయమై కమిషనర్ డా.పోలా భాస్కర్ ను ఈఎన్ఎస్ సంప్రదించినపుడు రాబోయే రోజుల్లో డిగ్రీ కాలేజీల అభివ్రుద్ధికి తీసుకునే చర్యల రోడ్ మ్యాప్ ను ప్రత్యేకంగా వివరించారు. పేపర్ లెస్ కాలేజీలుగా మారి కాలేజీల సమాచారం మొత్తం ఆన్ లైన్ అయితే ఒక్కో అభివ్రుద్ధి మొదలు పెడతామని వివరించారు. ఇప్పటికే ఆన్ లైన్ విద్యకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించామని ఆయన వివరించారు.

Tadepalle

2021-06-26 05:41:20

Tadepalli

2021-06-25 16:35:10

డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన వద్దు..

తిరుపతిలో ఇటీవల ఓ వ్యక్తికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. శుక్రవారం సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో కొవిడ్ పై సమీక్ష నిర్వహించగా, మంత్రి ఆళ్ల నాని ఈ అంశాన్ని సీఎంకి తెలియజేశారు. అయితే  డెల్టా ప్లస్ వేరియంట్ కేసు ఏపీలో ఇదే మొదటిదన్న మంత్రి.. ఆ వ్యక్తి నుంచి ఇతరులు ఎవరికీ కొవిడ్ వేరియంట్ సోకలేదని తెలిపారు. ఇప్పుడా వ్యక్తికి చికిత్స కూడా పూర్తయిందని, కోలుకోవడం కూడా జరిగిందని అన్నారు. తిరుపతి కేసు మినహా ఏపీలో మరెక్కడా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు లేవని ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ జన్యు ఉత్పరివర్తనం చెంది డెల్టా ప్లస్ గా మార్పు చెందిందని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే భారత్ లోని పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉనికి వెల్లడైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 21 కేసులు నమోదు కాగా, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోనూ పలువురు దీని బారినపడ్డారు. దీనితో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉందని మంత్రి వెల్లడించారు..

Tadepalle

2021-06-25 14:56:03

ప్రిన్సిపాల్స్ మైండ్ సెట్ మారాలి ముందు..

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాళ్ల మైండ్ సెట్ మారితేనే విద్యార్ధుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి ఆస్కారం వుంటుందని ఉన్నతవిద్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డా.పోలాభాస్కర్ అన్నారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత విశాఖలో తొలి సమావేశం ఉత్తరాంధ్రాలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిల్స్ తో ఏయూలోని డా.వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు అత్యధిక సమయం ఆన్ లైన్ విద్య అందించడానికి సమయం వెచ్చించాలన్నారు. అదే సమయంలో పాత విద్యావిధానాలకు స్వస్తిచెప్పి నూతన విద్యావిధానాలను అలవాటు చేసుకోవడం ద్వారా విద్యార్ధులకు మంచి విద్య అందించడానికి ఆస్కారం వుంటుందన్నారు. నేను ఇలాగే ఆడుతూ పాడుతూ పనిచేస్తాను..ఈవిధంగానే ఉంటానంటే కుదరదని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఆన్ లైన్ చేసి సెంట్ర్ సిస్టమ్ ద్వారా మానటరింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కాలేజీల్లో అడ్మిషన్లు పెంచడంతోపాటు, ఆన్ లైన్ విద్యలో విద్యార్ధులు విధిగా పాల్గొనేలా చేయాలన్నారు. విద్యార్ధులు, అద్యాపకుల ఆన్ లైన్ విద్య కోసం ప్రత్యేకంగా యాప్ ప్రవేశపట్టినట్టు వివరించారు. దీని ద్వారా ఏఏ కాలేజీల్లో ఎంత అద్యాపకులు, ఎన్ని గంటలు ఆన్ లైన్ విద్య విద్యార్ధులకు అందించారో కూడా మానిటర్ చేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ప్రభుత్వ డిగ్రీకాలేజీలతోపాటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల ప్రన్సిపాల్స్ కూడా ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. వారికి ప్రభుత్వమే ఎయిడ్ ఇస్తున్నందున ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. త్వరలోనే అద్యాపకులకు నూతన విద్యావిధానంపై శిక్షణా తరగతులను ఏర్పాటు చేయనున్నామన్నారు. విద్యార్ధులు డిగ్రీ పూర్తిచేసుకొని బయటకు వెళ్లగానే వారికి ఉద్యోగ, ఉపాది అవకాశాలు వచ్చే కోర్సులను కాలేజీల్లోకి అందుబాటులోకి తేవాలన్నారు. అంతే తప్పా ఏదో ఆడుతూ, పాడుతూ పనిచేసుకుంటూ పోతాం..మన జీతం మనకి వచ్చేస్తుందనే దోరణికి ఇకపై స్వస్తి చెప్పాలన్నారు. డిగ్రీవిద్యలో విద్యార్ధులు అన్నికోర్సుల్ల విద్యార్ధులు చేరేందుకు ముందుగా దగ్గర్లోని ఇంటర్ కాలేజీలను సందర్శించి అక్కడి నుంచి విద్యార్ధులను చేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా డ్రాపౌట్స్ లేకుండా చూసుకోవాలన్నారు. శతశాతం విద్యార్ధులు డిగ్రీపట్టాతో బయటకు వెళ్లే విధంగా విద్య అందించడానికి శక్తివంచన లేకుండా క్రుషిచేయాలన్నారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జోన్లలోని ప్రిన్సిపాళ్లతో తరచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ విద్యాభివ్రుద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిషనర్ పోలా భాస్కర్ వివరించారు. ఈ సమీక్షలో ఆర్డీలు, ఆర్జేలు, తదితరులు పాల్గొన్నారు.


Visakhapatnam

2021-06-25 13:11:37

GMSK,WMSKలు ఇక పోలీసులే..

గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సంరక్షణా కార్యదర్శిలు/మహిళా పోలీసులంటే మీరేమైనా నిజమైన పోలీసులు అనుకుంటున్నారా.. హోంగార్డు కంటే తక్కువ స్థాయి.. మీరు కేవలం గ్రామాల్లోని సమాచారం మాత్రమే మాకు పంపాలి..అంతకు మించి నిజమైన పోలీసుల్లా ఫీలైపోతే మీ ఉద్యోగాలు తీయించేస్తాను..ఇదో స్టేషన్ లో ఎస్ఐ నుంచి హోంగార్డు కూడా ఇచ్చిన వార్నింగ్.. అసలు మీరేమనుకుంటున్నారు..మహిళా పోలీస్ అంటే అంగన్వాడీలపై పెత్తనం చలాయిద్దామనుకుంటున్నారా.. అలాంటివి నా దగ్గర పనిచేయవు మేము చెప్పినట్టు చేయాలి.. లేదంటే పైకి రాసేస్తాం మీ ఉద్యోగాలు పోతాయ్ ఐసిడిఎస్ లో ఇదొక సిడిపిఓ బెదిరింపు.. నిన్నగాక మొన్న వచ్చి ఎంతో కాలంగా పనిచేస్తున్న అంగన్వాడీల మీ పెత్తనం ఏంటి, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే అర్జెంటుగా ఇచ్చేయాలా.. మా యూనియన్ లో మాట్లాడుకొని ఇస్తాం..ఇప్పటికిప్పుడు అంటే కుదరదు.. ఇదొక అంగన్వాడీ కార్యకర్త రుబాబు..ఇవన్నీ గ్రామ సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులకు తరుచూ వచ్చే బెదిరింపులే.. ఇవి కాకుండా మండల అధికారుల విషయమైతే చెప్పాల్సిన పనేలేదు అవి మాటలకి అందవు ఇవన్నీ జూన్ 22-2021 వరకూ మాత్రమే జరిగాయి.. కట్ చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శి(GMSK,WMSK)లను ప్రభుత్వం సాధారణ పోలీసులుగా మార్చేసింది. ఈమేరకు ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబరు 59ని  ఈనెల 23న విడుదలచేస్తూ సాధారణ పోలీసులకు ఏ విధమైన అధికారాలు, విధులు ఉంటాయో వీరికీ అదే తరహా విధులు ఉంటాయని ఆ జీఓలో స్పష్టం చేస్తూ ఏపీ గెజిట్ లో నమోదు చేయడం విశేషం. దీనితో మహిళాపోలీసులపై కాస్త అతిచూపించే అధికారులు, ఇతర సిబ్బంది గొంతులోనూ పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. అంతేకాకుండా వీరి సర్వీసులో ప్రమోషన్ వస్తే అదనపు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందుతారని  కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైగా ఇకపై మహిళా పోలీసులందరికీ కాకి డ్రెస్ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ప్రతీ సచివాలయ పరిధిలో కాకీ డ్రెస్ వేసుకున్న పోలీసులు అందుబాటులో ఉంటే గ్రామంలోని అల్లర్లతోపాటు, మహిళలకు రక్షణ కూడా అధికంగా వుంటుందని ప్రభుత్వం భావించింది. ఇటీవలే ప్రకాశం బ్యారేజి దగ్గర చోటు చేసుకున్న(యువతిపై సామూహిక అత్యాచారం)ఘటనలు మళ్లీ పునరావ్రుతం కాకుండా ఉండాలన్నా, గ్రామస్థాయిలో కష్టం వచ్చిన వెంటనే మహిళలు సచివాలయనాకి వచ్చి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా, దిశ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నా జిఎంఎస్కేలను పోలీసులుగా చేస్తే తప్పా పరిస్థితి గాడిలోకి రాదని ప్రభుత్వం భావించినట్టు ఈ జీఓ ద్వారా స్పష్టంగా కనిపించింది. దానికోసం రాష్ట్రస్థాయిలో డిజిపీతో సహా ఇతర పోలీసు విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, ప్రభుత్వంలోని ముఖ్య కార్యదర్శితో పాటు పలు శాఖల అధికారులతో చర్చలు జరిపిన తరువాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సచివాలయాల్లో పనిచేసే పోలీసులు వీరికి అనుసంధానంగా ఉంటారు. ఇకపై గ్రామాల్లో ప్రజలు చేసే ఫిర్యాదులన్నీ మహిళా పోలీసుల ద్వారానే పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అవుతాయి. త్వరలోనే వీరికి డ్రెస్ కోడ్ తోపాటు ఒక ట్యాబ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం వస్తోంది. దాని ద్వారా గ్రామాల్లోని అత్యవరసర, గొడవలను, ప్రత్యేక పరిస్థిని ఎప్పటి కప్పుడు ఫోటోలు, వీడియోలు, కేసుల రూపంలో గ్రామ మహిళా పోలీసులు స్టేషన్ ఎస్ఐకి నివేదించే విధంగా ప్రత్యేక మార్పులు కూడా చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ మహిళా పోలీసులు, హెల్త్, ఐసిడిఎస్, విలేజ్ సెక్యూరిటీ  సర్వీసుల్లో కీలకంగా వ్యవహరించారు. ఇకపై వారిని హోంశాఖలో సాధారణ పోలీసులుగా మార్చడంతో గ్రామస్థాయిలో ఒక పోలీసునే ప్రత్యేకంగా  నియమించినట్టు అయ్యింది. పైగా కింది స్థాయి ఉద్యోగులను చులకనగా చూసిన అధికారులకు, సిబ్బందికి జీఓనెంబరు 59 ద్వారా చెక్ చెప్పినట్టు అయ్యింది. పైగా వీరు విధుల్లోకి చేరి ఏడాదిన్నర గడుస్తున్న సందర్భంగా నెల రోజుల క్రితమే వీరికి ప్రభుత్వం సర్వీసు రిజిస్టర్లను కూడా పూర్తిచేసింది ప్రభుత్వం. మరో ఆరు నెలలు గడిస్తే మహిళా పోలీసుల సర్వీసు కూడా రెగ్యులర్ అవుతుంది. అంతకు ముందే ప్రభుత్వం వీరిని సాధారణ పోలీసులగా మార్పు చేస్తూ ఇచ్చిన జీఓ సాహసోపేతమని పోలీసు, వైఎస్సార్సీపీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇకవీరంతా ఖాకీ డ్రెస్సుల్లో విధులకు రావడం ఒక్కటే తరువాయి. గ్రామంలో మహిళా పోలీసును అందుబాటులోకి తేవడం ద్వారా ప్రభుత్వం మహిళల కోసం ఎంతో శ్రద్ధ తీసుకుందని మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Tadepalli

2021-06-24 01:32:25

9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలు..

రాష్ట్ర వ్యాప్తం బోట్లను కంట్రోల్ చేయడానికి 9 కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
ప్రైవేటు బోటు యజమానులతో జూన్ 24న సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 50 బోట్లకు గానూ 48 బోట్లు అనుమతులు తీసుకున్నాయని, అవి గురువారం నుంచే బోటింగ్ నిర్వహించుకోవొచ్చునన్నారు. ఇప్పటికీ కొందరు ప్రైవేటు బోటు యజమానులు లైసెన్సులు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా ప్రైవేటు బోట్లు నిర్వహించేలా కొత్త విధి విధానాలు రూపొందించామన్నారు. వాటిపై ప్రైవేటు బోటు యజమానులతో శుక్రవారం విజయవాడలోని బెరమ్ పార్కులో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పర్యాటక, స్పోర్స్టు అధికారులు పాల్గొన్నారు. 

Tadepalle

2021-06-23 13:32:46

రూ.164 కోట్లతో ‘బ్లూ బే’హోటల్..

విశాఖపట్నంలోని రుషికొండలో ఉన్న హరిత రెస్టారెంట్ ను రూ.164 కోట్లతో బ్లూ బే హోటల్ గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  విశాఖ తీరానికి కొట్టికొచ్చిన విదేశీ ఓడను లో ఫ్లోటింగ్ రెస్టారెంట్(షిప్ రెస్టారెంట్) ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని, వీలైనంత తొందరగా షిప్  కొనుగోలుకు చర్యలు తీసుకోనున్నామన్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ పనులు ప్రారంభించి, పర్యాటకలకు అందుబాటులో తీసుకురానున్నామన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి  తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో ఉన్న 33 బార్లలో విదేశీ మద్యంతో పాటు క్వాలిటీ ఉన్న బ్రాండ్లను ఈ బ్లార్లలో విక్రయించనున్నామన్నారు. ఈ మద్యాన్ని అధిక ధరలకు కాకుండా తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కడప జిల్లాలో ఉన్న గండికోటలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా హోటళ్లు, ఇతర సౌకర్యాల క్పలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హార్సలీ హిల్స్ తరహాలో గండికోటను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటితో పాటు.. రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా కారణంగా ఆ పనులు ఆలస్యం చోటుచేసుకుందన్నారు. విశాఖ, తిరుపతిలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒబరాయ్ హోటల్ యాజమన్యం ముందుకొచ్చిందన్నారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లోనూ పీపీపీ పద్ధతిలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రపంచ పర్యాటక పటంలో ఏపీని నిలపాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లకు ఆహార పదార్థాలు సప్లయ్ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 హోటళ్ల ద్వారా గతేడాది రూ.58.05 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.28 కోట్ల మేర ఆదాయం ఆర్జించామన్నారు.

Tadepalle

2021-06-23 13:21:42

24 నుంచి పర్యాటక అనుమతులు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల్లోకి గురువారం(జూన్ 24) నుంచి పర్యాటకులను అనుమతించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో  పర్యాటక ప్రాంతాల్లోకి పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించామన్నారు. పర్యాటకం ద్వారా ఆదాయం పెంచుకునే చర్యలు తీసుకోనున్నామన్నారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నామన్నారు.  కొవిడ్ కష్ట కాలంలో ఆదాయం తగ్గినా పర్యాటక శాఖలోని ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదన్నారు. అంతకుముందు పర్యాటక, క్రీడల అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి  సమీక్షా సమావేశం నిర్వహించారు. బోటుల నిర్వహణకు రాష్ట్రంలో వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ ను ఆదేశించారు. పర్యాటకం ద్వారా ఆదాయం పెంపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. టూరిజంలో అవినీతికి అడ్డుట్ట వేస్తూ, చిత్తశుద్ధితో పనిచేసే ఉద్యోగులను ప్రోత్సాహించాలన్నారు. పర్యాటక శాఖ పరధిలో ఉన్న హోటళ్ల ట్రేడ్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి ట్రేడ్ రిజిస్ట్రేషన్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక, స్పోర్స్టు అధికారులు పాల్గొన్నారు. 

Tadepalle

2021-06-23 13:15:41