1 ENS Live Breaking News

ఆదాయం కోల్పోతున్న సచివాలయాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం రోజూ లక్షల రూపాయల్లో ఆదాయాన్ని కోల్పోతుంది. ఈ విషయం మీకు కాస్త తేడాగా కనిపించొచ్చు.. కాని ఇదినిజం.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరితే.. ప్రభుత్వ ఖజనా గల్ గల్ మనడం ఖాయమని మీరే అంటారు.. కావాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వం 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. తొలుత  మీ-సేవా కేంద్రాల్లో అందించే 56 సేవలు సచివాలయాల ద్వారా పొందవచ్చునని ప్రకటించి ఆ సేవలు మొదలు పెట్టింది. అంతేకాకుండా ఆ.. సేవలను సచివాలయ సిబ్బంది, గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను సైతం అదేశించింది. కానీ ఆదేశాలు  జిల్లా కేంద్రాలకే పరిమితం అయిపోవడంతో సచివాలయాల్లోని సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి.. నేటికీ కుల, ఆధాయ, మరణ, జనన ద్రువీకరణ పత్రాల కోసం చాలా మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మీ-సేవాల కేంద్రాలకే వెళుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. వున్న సేవలను ప్రజలకు వద్దకు తీసుకెళ్లలేని ప్రభుత్వం మళ్లీ ఇక్కడే మరో489 సర్వీలను గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు గ్రామంలోనే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉన్న సేవలకే ప్రజలకు  అందే దిక్కులేకపోతే.. ఇక కొత్త సర్వీసులపై ప్రజలకు ఏం అవగాహన కలుగుతుందో అది ప్రభుత్వమే చెప్పాల్సి వుంది. ప్రభుత్వం ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలపై పేజీలకు పేజీలు పత్రికల్లో ప్రకటనలివ్వడం తప్పితే ప్రజలకు సచివాలయాల ద్వారా అందే సేవల విషయంలో నేటికీ కనీసం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఒక్క ప్రకటన జారీ చేయకపోవడం విశేషం. ఒక్కోసచివాలయంలో సుమారు 14 ప్రభుత్వశాఖల సిబ్బంది ద్వారా అందే సేవలతోపాటు, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు డిజిటల్ అసిస్టెంట్లను ఏర్పాటు చేసినా.. ఉపయోగం లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వారం పదిరోజుల ముందు సంబంధిత ద్రువీకరణ పత్రాలు అందించడం తప్పితే.. ఏ సచివాలయ పరిధిలో ఏఏ శాఖలకు చెందిన సేవలు అందిస్తున్నారో.. కనీసం సచివాలయాల డిస్ప్లే బోర్డుల్లో సైతం ప్రజలకు తెలిసేలా సేవల వివరాలు తెలియజేసే ఏర్పాటు చేయలేదు. మేజర్ పంచాయతీల్లో 3 గ్రామ సచివాలయాలు, వార్డుల్లో నాలుగు నుంచి 5 వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం అత్యవసర సేవలు కూడా అందడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాలన్నీ ఒకే సారి ప్రభుత్వం ప్రకటించిన సేవలను ప్రజల ముందుకు తీసుకెళ్లగలిగితే ప్రభుత్వ గళ్ల పెట్టి మోగే సౌండ్ రాష్ట్ర మొత్తం వినిపించాలి. ఈ శాఖకు చెందిన కమిషనర్ నుంచి గ్రామాల్లోని సచివాలయ కార్యదర్శి వరకూ నేటికీ ఏ ఒక్కవిషయంలోనూ ప్రోటోకాల్ ప్రకారంగా సేవల వివరాలు అందాయా వేళ్లపై మాత్రమే లెక్కెట్టి చెప్పేంత స్థాయిలో పరిస్థితి ఉన్నదంటే అతిశయోక్తి కాదేమో. విశేషమేమిటంటే గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీలు చేసే జాయింట్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సచివాలయంలో కూడా ఏఏ రకాల సేవలు అందుబాటులో వున్నాయి.. ఇప్పటి వరకూ ఎన్ని రకాల సేవలు ఏఏ సచివాలయాల ద్వారా అందించారనే వార్త రాకపోవడమే నిదర్శనం. ఆదాయం వచ్చే మార్గాలున్నా.. ఇక్కడే వుండి సేవలు అందించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్పితే.. ప్రజలకు సేవలు అందిస్తూనే..వారికి పనికొచ్చే వివిధ ద్రువీకరణ పత్రాల ద్వారా ఆదాయ మార్గాలను పెంపొందంచుకోవాలని నేటికీ ఒక్క అధికారి కూడా హిత బోద చేసిన దాఖలాలు లేవు. ఒక్కో సచివాలయం మీద ప్రభుత్వం ఇపుడిచ్చే ప్రొభిషనరీ సర్వీసు జీతం కింద లెక్కేసినా ఒక్కో గ్రామ సచివాలయానికి రూ.2.25 లక్షలు జీతాలకే ప్రభుత్వం వెచ్చిస్తోంది.  కానీ ఒక్కో సచివాలయంపై రోజుకి రూ.2500 వరకూ కూడా ఆదాయం మాత్రం రావడంలేదు.. ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయశాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిలు ఇక్కడ అందించే సేవల విషయంలో పూర్తిస్థాయిలో ద్రుష్టి సారిస్తే..ప్రజలకు గ్రామస్థాయిలోనే ప్రభుత్వ సేవలు అందడటంతో పాటు.. ప్రభుత్వానికి సమయానికి ఆదాయం కూడా అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..! 

Tadepalle

2021-07-06 01:33:07

తెరపైకి ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు అంశం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి, మెగా గ్రౌండింగ్ పేరుతో నిర్మాణాలు చేపడుతున్న వేళ  సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇచ్చిన ఇంటి స్థలాలు, ఇళ్లు కట్టించి ఇస్తానన్న హామీని ఉద్యోగులంతా తెరపైకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ సంఘాలు సీఎం ఇచ్చిన హామీ అరిచేతిలో ఇంటిలాగే ఉంటుందా..అంటూ.. వారి యూనియన్ గ్రూపుల్లో పెద్ద చర్చకు తీసుకు వస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూస్తాయని..వారు ఆనందంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయని ఆలోచిస్తాయని...కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దానికి విరుద్దంగా జరుగుతుందని బాధపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, 8 డిఏలకు మోక్షం లేదని, పెండింగ్ లో ఉన్న పీఆర్సీ వస్తుందో రాతో తెలియడంలేదని, ఇపుడు ఎన్నికల హామీల్లో ఒకటిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న ఇంటి స్థలాలు, ఇల్లు కట్టించి ఇస్తామన్న హామీ కూడా నెరవేరేలా లేదని ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ప్రజలు చేసిన హామీలకంటే అధికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులను మాత్రం పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి పట్టండ కడితే కనీసం ఈ ప్రభుత్వ హయాయంలో నైనా తమ సొంతింటి కల నెరవేరుతుందనుకుంటే.. ప్రభుత్వంలోని నిధులన్నీ ప్రజలకు నగదు రూపంలో సంక్షేమ పథకాలకే వచ్చి..నేడు నెల నెలా జీతాలకు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే పరిస్థితి దాపురించిందని మదన పడుతున్నారు. నేటికి చాలా మందికి ప్రసూతి సెలవుల జీతాలు, గత పీఆర్సీ బకాయిలు, ఐఆర్ బకాయిలు ఇవ్వలేదని, చాలా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదని చెబుతన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన సొంతింటి కల హామీ ఇంకెక్కడ నెరవేరుతుందని పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో నేటికీ చాలా భవనాలు శిధిల స్థితికి చేరుకున్నాయి. చాలా చోట్ల డిస్పెన్సరీలు, ఆసుపత్రులు పడిపోయాయి. వాటి స్థానంలో నాడు నేడు క్రింద వైద్య ఆరోగ్యశాఖలో ఆసుపత్రులు మాత్రమే కడుతున్నారు తప్పా ప్రభుత్వశాఖల ఉద్యోగులు 50ఏళ్ల క్రితం కట్టిన ప్రభుత్వ భవనాల్లోనే విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందని వాపోతున్నారు. ఉన్న స్థలాలన్నీ నిరుపేదలకు ప్లాట్లు వేసి ఇచ్చేస్తుంటే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఎక్కడి నుంచి తెస్తారని..ఒక వేల ప్రైవేటు స్థలాలు కొనాలంటే ప్రభుత్వ ఖజానాలో సొమ్ములేదని చేతులెత్తేయడానికే ఈ విధంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాల్లో చర్చించుకుంటున్నారు. కనీసం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలనైనా రెగ్యులర్ చేస్తుందా అని అనుకుంటే అదీ జరలేదు. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఉద్యోగులు తీవ్రంగా మదన పుడుతన్నారు. టిడిపిని కాదని వైఎస్సార్సీపీకి మద్దత్తు ఇచ్చినందుకు కనీసం ఒక్క హామీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయకపోగా..ప్రధాన సమస్యలు, డిమాండ్లు కూడా నెరవేరలేదని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మీడియా ముందుకి తమకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీసుకువస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క హామీ కూడా అమలు కాకపోవడం వలన రాబోయే రోజుల్లోనైనా అమలు చేస్తారో లేదోనని పెదవి విరుస్తూ నాటి వైజగ్ ఉద్యోగులకు ఇస్తామన్న ప్రచార వీడియోని వైరస్ చేస్తున్నారు..మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ఉద్యోగులకి ఇచ్చిన సొంతింటి హామీ, డిఏలు, పీఆర్సీ బకాయిలను తీరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!

Tadepalle

2021-07-05 04:04:15

తాజంగిలో గిరిజన మ్యూజియం..

విశాఖజిల్లా, చింతపల్లి మండలం లంబసింగికి సమీపంలోని తాజంగిలో అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన చారిత్రాత్మక గ్రామంలోనే అల్లూరి సీతారామరాజు ను శాశ్వతంగా స్మరించుకొనేలా ‘‘ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం’’ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టబోతోందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఆదివారం కొమరాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.  21 ఎకరాల విస్తీర్ణంలో రూ.35 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించనున్న తాజంగి మ్యూజియం నిర్మాణానికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి త్వరలోనే శంకుస్థాపన కూడా చేయనున్నారని వెల్లడించారు. నిలువనీడ లేని పేద కుటుంబాలన్నింటికీ సొంతిళ్లను అందించే జగనన్న కాలనీల నిర్మాణం దేశానికంతటికీ ఆదర్శప్రాయమని అభివర్ణించారు. కాగా పుష్ప శ్రీవాణి రాజ్యలక్ష్మీపురంలో నిర్మించనున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పిఓ కుర్మనాధ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు,గృహ నిర్మాణ శాఖ ఇఇ శ్రీనివాస్ రావు, డిఇఇ చెన్న రాయడు, మండలం ప్రత్యేక అధికారి శాంతిశ్వర్ రావు ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్, వైసీపీ మండల పార్టీ కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్ధన నాయుడు, వైస్సార్సీపీ సీపీ నాయకులు నంగిరెడ్డి శరత్ బాబు, సర్పంచ్ అంబటి వెంకటిలక్ష్మి,మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చింతల సంఘం నాయుడు, శివిని సింగిల్ విండో అధ్యక్షులు దాసరి శ్రీధర్, అంబటి తిరుపతి నాయుడు, నాలి గుంపస్వామి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Komarada

2021-07-04 10:20:27

ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతోందా..

వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్వరం మారుతున్నట్టు కనిపిస్తుంది..ప్రతీనెలా ఒటకవ తేదీకి ప్రతీ ఇంటికీ పించనుతో పాటు సంక్షేమ పథకాలు నగదు రూపంలోనే టంచనుగా అందుతున్నాయి.. మాకు మాత్రం 8డిఏలు, ఒక పీఆర్సీ ఇవ్వడానికి నిధులు లేవు.. సీపిఎస్ రద్దు చేయడానికి ప్రభుత్వానికి చేతులు రావాడం లేదు అనే స్వరాన్ని ఉద్యోగులు బలంగా వినిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువా ఆర్టీసీ కార్పోరేషన్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, పోలీసులకు వారాంతపు సెలవులు మంజూరు చేయడం తప్పా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మరే ఎన్నికల హామీలేవీ నెరవేరలేదు. ఇంకో రెండేళ్లు కాలం వెళ్లదీస్తే మరోసారి ఉద్యోగులకు కొత్తగా హామీలివ్వాలని ప్రభుత్వం చూస్తోందనే దోరణిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఎందుకు వాటిని కావాలనే పక్కన పెట్టిందని  ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వ తీరుపై గుర్రుగా వున్నాయి. ఈ విషయాన్ని  నిఘా వర్గాలు గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసినా ఫలితం మాత్రం కనిపించలేదనే వాదన కూడా వినిపిస్తుంది.. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉండగా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలను రద్దు చేయాలని ఉద్యమం చేసిన నేటి అధికారి ప్రభుత్వం సీట్లోకి రాగానే... నేరుగా రెగ్యులర్ ఉద్యోగాలకు మంగళం పాడటానికి ఏకంగా ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిందని మండి పడుతున్నారు.  ప్రజలకి ఇచ్చిన హామీలే హామీలా...ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులకు ఇచ్చినవి హామీలు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే ఉంటే మరో రెండేళ్లు కాలయాపన చేసి..వచ్చే ఎన్నికలకు కూడా ఇవే హామీలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందనే కోణంలో ఉద్యోగ సంఘాల్లోని సామాజిక మాద్యమాల్లో విపరీతంగా చర్చకు తెరలేపారు. పైకి వ్యక్తం చేస్తే ప్రభుత్వం నేరుగా ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేస్తుందని భావించిన ఉద్యోగ సంఘాలు చాపకింద నీరులా తమ తదుపరి కార్యాచరణకు అంకురార్పణ చేసినట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలతో ఇదే విషయమై సంప్రదింపులు చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి ప్రతిపాదనలు వచ్చినట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే ఎన్నికలు సమీపించే నాటికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏకమై ప్రభుత్వానికి తెలియకుండా దెబ్బకొట్టే సూచనలు కూడా లేకపోలేదు. ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖల్లోని అధికారలు, ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఉద్యోగులు, సంఘాల నేతలపై ఏసీబీ దాడులు, బదిలీలు, ఇతర శాఖ పరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడంతో ఉద్యోగులంతా బయటపడకుండా రహస్య మంతనాలు చేస్తూ వ్యతిరేక కూటమికి బలం పెంచుతున్నారని తెలుస్తుంది. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన సీపిఎస్ రద్దు హామీ, పీఆర్సీ, 8 డిఏల బకాయిలు, పదోన్నతులు, బదిలీలు విషయంలో చర్యలు ఉద్యోగులకు అనుకూలంగా తీసుకుంటుందా లేదంటే ప్రజలంతా మనవైపు వుంటే చాలన్నట్టు వ్యవహరిస్తుందానే అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది..!

Tadepalle

2021-07-04 05:03:29

సచివాలయ ఉద్యోగులకు కొత్త విధులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శాఖల వారీగా ప్రత్యేక జీఓల ఆధారంగా వారికి అనంగా చేర్చిన విధులు, సేవలను తెలియజేస్తుంది. ఇప్పటికే  గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిలుగా వున్న వారిని జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ పోలీసులుగా మార్చడంతోపాటు కాఖీ యూనిఫారం ఇచ్చింది. దానిని అన్ని జిల్లా ఎస్పీలు అమలు చేస్తున్నారు. ఇపుడు మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శిలకు జీఓనెంబరు 650ని విడుదల చేసింది. అందులో సచివాలయ ఉద్యోగులు ఏవిధంగా పనిచేయాలనే విషయం తెలియజేయడంతో వాటిని రాష్ట్రంలోని అన్ని పట్టణ పురపాలక శాఖల కమిషనర్లకు కూడా తెలియజేయడంతో ఉద్యోగులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు దశల వారీగా జీఓల ద్వారా విధులును తెలియజేసే పనిలో పడింది. గతంలో ఉద్యోగులు విధుల్లో చేరినపుడు వీరందరికీ ఒక జాబ్ చార్ట్ ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ ద్వారానే తెలియజేసింది. ఇపుడు ప్రత్యేకంగా శాఖల వారీగా జీఓల రూపంలో కొత్తగా రూపొందించిన విధులను తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలను 545కి పెంచిన నేపథ్యంలో ఉద్యోగుల విధులు కూడా ఆయా ప్రభుత్వ శాఖలకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా కొత్తగా తయారు చేస్తుందని రాష్ట్ర అధికారి ఒకరు ఈఎన్ఎస్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారానే అన్ని సేవలు అందించాలనే లక్ష్యంతోనే కొత్తగా రూపొందించిన విధులను అధికారిక జీఓల ద్వారా తెలియజేస్తుందని వివరించారు. దానికితోడు, సమాచార హక్కుచట్టాన్ని కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని భావించిన తరుణంలో సచివాలయ వ్యవస్థలో దాపరికంలేని సేవలు అందించాలనే ఉద్దేశ్యంలో ఉద్యోగులకు చెందిన విధులను ఆయాశాఖల ముఖ్య కార్యదర్శిల ద్వారా జీఓలు విడుదల చేయిస్తుందని చెబుతున్నారు. సచివాలయానికి వచ్చిన దగ్గర నుంచి శాఖల వారీగా ఎంతమంది సిబ్బంది ఎన్ని దరఖాస్తులను పరిష్కరించారనే విషయంలోనూ ఇకపై ప్రభుత్వం లెక్కలు తేల్చనుందని సమాచారం అందుతుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా సమస్యలు గ్రామస్థాయిలో పరిష్కారం కావడం లేదు. సచివాలయ సిబందే మండల, జిల్లా కార్యాలయాలకు పంపుతున్నారు. కొన్నింటిని సచివాలయాల్లో చేసే అవకాశం వున్నా సక్రమంగా చేయడం లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించే కొత్తగా జీఓల రూపంలో విధులు ఉటంకిస్తూ జీఓలు జారీచేస్తుందని అధికారులు చెబుతున్నారు.  ఇకపై రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని, పరిష్కరించినవి ఎన్ని అనే విషయాలను డాష్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు నేరుగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రభుత్వంలోని ముఖ్యశాఖల అధిపతులే సమీక్షనున్నారని కూడా తెలుస్తుంది. ఇంకా వ్యవశాఖ, పట్టు పరిశ్రమశాఖ, ఉద్యానశాఖ, ఇంజనీరింగ్, సంక్షేమశాఖ, వీఆర్వోలు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శిలకు కూడా కొత్త విధులపై జీఓలు ప్రభుత్వం జారీచేయనుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజలకు పూర్తిస్థాయిలో గ్రామంలోనే సేవలు అందాలంటే ఉద్యోగులకు జాబ్ చార్ట్ లిఖిత పూర్వకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. అన్నిశాఖల సిబ్బందికి వారి వారి విధులు, సేవలపై ప్రత్యేక జీఓలు వస్తే తప్పా..కొత్తగా వారి విధుల్లో ఏఏ కొత్త సేవలు అదనంగా చేర్చారనే విషయం కొలిక్కిరాదు..! 

Tadepalle

2021-07-04 02:32:52

పచ్చరాతలు.. పచ్చికూతలు అన్నన్నా..

‘నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు...’అన్నట్టు మీకనిపించలేదా పచ్చరంగు పులుముకున్న వారందరికీ.. పచ్చ పచ్చని రాతాలు రాసేవారందరికీ.. నిన్నటి పుట్టిన రోజు వేడకలను ప్రశ్నించిన ఆచార్యులంతా చదువులమ్మ ఒడి ఆంధ్రాయూనివర్శిటీ మైదనాంలో నాడు మహానాడు జరుగుతున్న సమయంలో ఏం చేశారు..ఇంకేం పీకారు.. ఓహో సిగ్గుతో రాజకీయ ప్రశంగాలు వినకలేక చెవులు మూసుకున్నారా.. రాజకీయనాయలు నేరుగా వచ్చి చదువులమ్మ ఒడిలో సభలు పెడితే చూడలేక కల్లు కుట్టుకున్నారా.. నాడు చేయని ఆందోళనలు.. బాధ నేడేంటని మీకు అనిపించలేదా.. నేడు ఆ పచ్చ విద్యార్ధులే ఇపుడు ఎందుకు ప్రశ్నిస్తున్నట్టో కనీసం అర్ధం చేసుకోలేని ప్రజలున్నారంటారా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివ్రుద్ధిని చూసి ఓర్వలేని వారంతా పుట్టిన రోజు వేడుకలను రాజకీయం చేయాలని చూస్తే.. ఏకంగా నాడు.. మహానాడుతో వారు చేసిన రాజకీయం మేము చేస్తే.. సంసారం.. మీరు చేస్తే వ్యభిచారం.. అన్నట్టుగా చిత్రీకరించే ఆ పక్షనేతలు.. ఈ పచ్చరాతలు.. నిజంగానే మాటల కందని అర్ధాలు తీసినట్టుగానే ఉన్నాయి. భావ ప్రకటన అభిమానాన్ని కేకు కట్ చేస్తే.. చూపిస్తే.. చదువులమ్మ తల్లి పరువుపోయిందా.. అన్నన్నా.. ఎంత మాట ఎంతమాట.. కలం కల్మషంగా రాయాలి తప్పా.. కలం కలుషితంగా మారి అక్షరాలు రాస్తే.. అవి వక్రభాష్యాన్నే చూపుతాయనడానికి ఎంపీ వి.విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆంధ్రాయూనివర్శిటీలో జరిగినందుకు రాసిన పచ్చరాతలే నిదర్శనంగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు..నిజమైన ఆచార్యాలు..రాజకీయాలు చేయని విద్యార్ధులు..

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై రాజకీయ బురద చల్లేందుకు చదువలమ్మ ఒడి.. ఆంధ్రాయూనిర్శిటీని వేదిక చేసుకోవడం నిజంగా సిగ్గుచేటని గుండెలు అవిసేలా బాధుకొని రాజకీయం చేసేవారంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి సూచిస్తున్నారు వాస్తవాలు తెలిసిన వారంతా.. ఒక వేల వారి వేలే ముందుకి చూపిస్తే నాలుగు వేళ్లు తప్పుచేసిన వారిపైనే చూపిస్తాయనే విషయం మరిచిపోకూడదు అలాంటపుడు అంటూ హితబోద చేస్తున్నారు. విసి చాంబర్ లో  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసినందుకు..పెద్ద ఎత్తున  రాజకీయ బురదచల్లాలని చూసిన వారంతా ముందు వారేం చేశారో.. వర్శిటీ పరువుని ఏ విధంగా తీసేశారో గుర్తుచేసుకోవాలని నానా గడ్డి పెడుతున్నారు. పేరుపొందిన ఆంధ్రా యూనివర్శి పరువు పోతుందని గగ్గోలు పెట్టిన ఆ.. రంగు ఆచార్యులు.. ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టిన తెలుగు తమ్ముళ్లు ఒకే ఒక్కసారి ముక్కున వేలేసుకొని ఆలోచించాలి.. నాడు అధికారంలో ఆ తెలుగుదేశం పార్టీ.. ఏకంగా తన రాజకీయవేడుక మహానాడు కోసం ఆంధ్రాయూనివర్శిటీ మైదానాన్ని వాడుకొని రాజకీయం చేసిందో.. నాడు రాయని రాతలు...నాడు కనిపించని ద్రుశ్యాలు నేడే కనిపించాయా కొంపదీసి.. అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. నిన్న ఒక్క వీసి మాత్రమే తన చాంబర్ లో కేక్ కట్ చేసిన ఉండొచ్చుగాక.. మరీ మీ పార్టీ అధినేత సాక్షిగా ఎన్ని వేల మంది పచ్చ పార్టీ నేతలు ఆంధ్రాయూనివర్శిటీలో రాజకీయ సభలు పెట్టి పరువుతీశారో గుర్తుకు రాలేదా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారం రోజులు చదువుల తల్లి సరస్వతి సొంతింటిలాంటి ఆంధ్రాయూనివర్శిటీ సాక్షిగా రాజకీయం చేసినపుడు గుర్తుకి రాలేదేమో.. అపుడు లేని ఆలోచన..ఆపుడు రాయలేని రాతలు ఇపుడెందుకు గుర్తొచ్చాయో మరి.. వాస్తవాలు రాసేవారంతా ఎప్పుడూ వాస్తవాలనే రాయాలి..నాడు మన పార్టీ అని ఆహా ఓహో అని పొగిడితే..నేడు ఏదో జరిగిపోయిందని జనాలు నమ్మించే పచ్చరాతలు రాస్తే...జనం దేనితోనో నవ్వుతారని గుర్తెరగాలని ఆ వర్గం కానీ ఆచార్యులు...పచ్చపార్టీ బ్యాక్ చెందని విద్యార్ధులు సూచిస్తున్నారు. అవునంటారా కాదంటారా..!

Visakhapatnam

2021-07-03 09:34:34

ఏపీ రెవిన్యూ శాఖలో భారీగా ఖాళీలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెవిన్యూశాఖలో భారీ ఖాళీలు ఏర్పడనున్నాయి. చాలా సంవత్సరాల నుంచి డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అత్యధిక సంఖ్యలో 152 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. తహశీల్దార్లకు పదోన్నతులు ఇస్తే వారిని ఆర్డీఓలుగా చేయాల్సి వుంటుంది. కానీ దానిపై ఇంకా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలేదు. అంటే ఇపుడు ఆ 152 డిటీలు ఖాళీ అయిపోయినట్టే. ఇదే సమయంలో రెవిన్యూ ఇనెస్పెక్టర్లుగా ఉన్నవారికి అందులో కొన్నింటిని పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఆర్ఐ పోస్టులు కూడా ఖాళీ అవుతాయి..ఆ స్థానంలోకి ఇప్పటికే సర్వే శిక్షణ పూర్తిచేసుకున్న 26 మంది జూనియర్ అసిస్టెంట్లకు ఆర్ఐ లుగా పదోన్నతి ఇవ్వాల్సి వుంటుంది. అలాగైనా 26 జూనియర్ అసిస్టెంట్లు  ఖాళీలు అవుతాయి. ఇలా చైన్ లింక్ ప్రమోషన్ సిస్టమ్ వారీగా చూసుకుంటే రెవిన్యూశాఖలో ఆర్డీఓ, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, జూనియర్ అసిస్టెంట్లు ఇలా చాలా పోస్టులే రెవిన్యూశాఖలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ప్రతీ ఏడాదీ జాబ్ కేలండర్ తీయడానికి నిర్ణయించుకున్న తరుణంలో వచ్చే జాబ్ కేలండర్ లో పెద్ద ఎత్తున రెవిన్యూ పోస్టులు జాబ్ కేలండర్ లో పెరగాల్సి వుంది. ఇవికాకుండా చైన్ మేన్ పోస్టులను చాలా కాలం నుంచి ప్రభుత్వం భర్తీ చేయలేదు. వాటితోపాటు వచ్చే ఏడాది చాలా మంది వీఆర్వోలు, తహశీల్దార్లు, డిటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లతోపాటు అటెండర్లు, బిళ్ల బంట్రోతులు కూడా ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ విధంగా చూసుకున్నా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఒక్క రెవిన్యూశాఖలోనే సుమారు 1000 ఉద్యోగాలకు పైగా వివిధ విభాగాల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి.

Tadepalle

2021-07-03 03:27:16

Tadepalle

2021-07-03 02:27:42

Tadepalle

2021-07-03 02:25:57

Tadepalle

2021-07-03 02:25:29

తెరపైకి మహిళా పోలీస్ పేస్కేల్ అంశం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలు, నగరాల్లోని యువతులు, మహిళల రక్షణను ద్రుష్టిలో ఉంచుకొని గ్రామ, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శిలను జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ మహిళా పోలీసులుగా మార్చారు. సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగులతో పోల్చితే వీరితో 5 ప్రభుత్వం హోంశాఖ, ఐసిడిఎస్, ఈఎస్ఈబి, హెల్త్, మరియు కార్యాలయంలోల డిజిటల్ అసిస్టెంట్లకు సహాయకులుగా కూడా విధులు అప్పగించి పనులు చేయిస్తుంది. వీటితోపాటు సచివాలయాలకు నగదు తెచ్చేసమయంలోనూ, ప్రజాప్రతినిధులు వచ్చే సమయంలోనూ, అధికారుల పర్యటన సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్ గా కూడా వీరినే వినియోగిస్తుంది ప్రభుత్వం. ప్రత్యేక జీఓ ద్వారా వీరిందరిని సాధారణ పోలీసులుగా మార్చినా.. వీరి పే స్కేలు, జీతాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా డిగ్రీ, ఆపై విద్యార్హతలున్న వీరి పదోన్నతుల విషయంలో కూడా సాధారణ పోలీస్ కానిస్టేబుల్స్ ఇచ్చినట్టుగా హెడ్ కానిస్టేబుల్ మాదిరిగా ఇస్తామని ప్రభుత్వం ఆ జీఓ 59లో పేర్కొంది. దీనితో ప్రభుత్వం తమ విద్యార్హతలను బట్టి పదోన్నతి ఎస్ఐగా కల్పించడంతోపాటు,  పేస్కేలు కూడా కానిస్టేబుల్ పేస్కేల్ కి మార్పు చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు బలంగా తీసుకు వస్తున్నారు.  సాధారణ పోలీసు విధులతోపాటు, గతంలో ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ శాఖల విధులు మహిళల సంరక్షణార్ధం దిశ యాప్, దిశ చట్టం చేసి మహిళలకు, యువతులకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్రామ, వార్డు సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. వీరికి త్వరలోనే కాకీ యూనిఫారం ఇచ్చి గ్రామాల్లో ఒక ప్రత్యేక వ్యవస్థను తయారు చేయనుంది ప్రభుత్వం. అయితే వీరికి స్టేషన్ కి వెళ్లి విధులు నిర్వహించేలా కాకుండా సచివాలయాల పరిధిలోనే ప్రజలకు, మహిళలకు రక్షణగా ఉంటూ వీరిద్వారానే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు వెళ్లే విధంగా చేయాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి డిజిపి గౌతం సవాంగ్ ను ఆదేశించారు. ఇంత వరకూ బాగానే వున్నా.. గ్రామ, వార్డు సంరక్షణా కార్యదర్శిలను సాధారణ పోలీసులుగా మార్చడాన్ని ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్నవారు(హోంగార్డు, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు) జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి అనుగుణంగానే వీరి స్టేషన్ శిక్షణ సమయంలో కాస్త చులకన భావంగా మాట్లాడుతున్నారని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసులంటే స్టేషన్ నుంచి గ్రామాలకు  వెళితే ఆ గౌరవం, భయం తమకే దక్కేదని అయితే ఇపుడు అవన్నీ మహిళా పోలీసుకు దక్కుతున్నాయని, పైగా వాళ్లకి యూనిఫారం కూడా ఇచ్చేశారని తెగ ఫీలైపోవడంలో అర్ధం లేదని మహిళా పోలీసులు వాపోతున్నారు. తమకేమీ ఉద్యోగాలు ఊరకనే  ప్రభుత్వం ఇవ్వలేదని.. ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా ఎంతో శ్రమించి పోటీపరీక్షలు రాసి ఈ ఉద్యోగాలు పొందినా, ప్రభుత్వం అప్పనంగా మహిళా పోలీసులకు ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు తమతోపాటు సమానంగా చూస్తుందని, పదోన్నతుల విషయంలో కూడా తమతో పాటే సమానంగా ఇచ్చేయడానికి జీఓ కూడా ఇచ్చిందని తెగ మదన పడిపోవడంతో అర్ధం లేదని చెబుతున్నారు. అక్కడికీ వీరందరికీ జీతాలు, విధులు స్థానిక పోలీసు స్టేషన్ లోని సిబ్బందే తమ జేబుల్లో నుంచి ఇస్తున్నట్టుగా వ్యవహరించడం రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోలీసు వర్గాల్లోని, వారి యూనియన్లలోనూ పెద్ద స్థాయిలో చర్చజరుగుతోంది. వాస్తవానికి మహిళా పోలీసులకు యూనిఫారం ఇవ్వడం చాలా మంది మహిళా పోలీసులకు ఇష్టం లేదు. కాకపోతే ప్రభుత్వం ఉద్యోగ ధర్మం మీది ఇచ్చిన జీఓలు, ఆదేశాలు, నిర్ణయాలు తూచ తప్పకుండా పాటించాలనే ఒక్క కారణంతోనే వీరంతా ప్రభుత్వ నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలిసే నేరుగా డిజిపి ద్వారా ఈ ప్రత్యేక జీఓ ప్రభుత్వం జారీచేయించిందని చెబుతున్నారు. ఇంత చేసిన ప్రభుత్వం తమ ఉద్యోగాలను మార్పు చేన ప్రభుత్వం ఐదు ప్రభుత్వ శాఖలకు పైగా విధులు నిర్వహించే తమ పేస్కేలు కూడా మార్పుచేయాలని మహిళా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వున్నతమలో 14వేలకు పైగా సిబ్బందిలో 25 నుంచి 30ఏళ్లు లోపు వున్న వారు సుమారు 60శాతం వున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం మహిళా పోలీసుల కోసం ప్రత్యేక వ్యవస్త ఏర్పాటుచేసి, దిశ యాప్, చట్టాన్ని అమలు చేస్తున్న తరుణంలో తమ జీత భత్యాల విషయంలో ప్రభుత్వం సముచిత మైన నిర్ణయం తీసుకోవడంతోపాటు పదోన్నతులు కూడా ఎస్ఐగా కల్పించడం ద్వారా తమ న్యాయపరమై డిమాండ్ ను పరిష్కరించినట్టు అవుతుందని మహిళా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా విలేజ్ పోలీస్ వ్యవస్తను ఏర్పాటు చేయడంతోపాటు మంచి పదోన్నతులు కల్పించిన ప్రభుత్వంగా కూడా కీర్తి దక్కుతుందని మహిళా పోలీసులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరి డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచిచూడాల్సిందే..!

Tadepalle

2021-07-03 01:53:22

Tadepalle

2021-07-02 02:22:43

పదోన్నతులపై తొలగని సందిగ్ధత..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులకు చాలా మందికి తమ పదోన్నతులు ఎలా ఉండబోతాయనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. వాస్తవానికి రాష్ట్రప్రభుత్వంలోని కొన్ని ఉద్యోగాలకు ఇన్ సర్వీసులో రెండు రకాలుగా పదోన్నతులు కల్పిస్తారు..సర్వీసు ఆధారంగా ఇచ్చే పదోన్నతి ఒకటైతే..ఇదే ఇన్ సర్వీసులో ప్రభుత్వం వారి విద్యార్హతను మెరిట్ ప్రాతిపదిక ఎంపిక చేసి వారికి జీతంతో కూడి చదువు చెప్పించి..ఆపై మండల స్థాయి అధికారులుగా కల్పించే పదోన్నతులు.. కానీ ఏపీలో సచివాలయ ఉద్యోగుల భర్తీయే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా జరగడంతో రెగ్యులర్ ఉద్యోగులకు, వీరికి మధ్య భారీ వ్యత్యాసాలు విధి నిర్వహణ దగ్గర నుంచి జీత భత్యాలలో కనిపిస్తున్నాయి.. ఇపుడు ఈ శాఖలోని ఉద్యోగులకు తమ పదోన్నతులు ఏవిధంగా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల్లోని గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలను సాధారణ మహిళా పోలీసులుగా మార్చుతూ జీఓ నెంబరు 59ని విడుదల చేసి.. వీరికి పదోన్నతి కూడా హెడ్ కానిస్టేబుల్ వుంటుందని పేర్కొంది. పేరుకి మహిళా పోలీస్ అయినప్పటికీ వీరు హోంశాఖలో పాటు, ఐసిడిఎస్, హెల్త్, కార్యాలయ సహాయకులు, ఇతర అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మిగిలిన శాఖల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇచ్చిన ఒక్కశాఖ ఉద్యోగంతో నాలుగైదు శాఖలు విధులు నిర్వహించే మహిళా పోలీసులకు డిగ్రీ కంటే అధిక విద్యార్హత ఉన్నప్పటికీ, కేవలం ఇంటర్ తో సమానమైన కానిస్టేబుల్స్ కి ఇచ్చే సాధారణ ప్రమోషన్ మాత్రమే ఇవ్వడంతో తమకు ఏవిధమైన పదోన్నతులు వస్తాయోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్, ఏఎన్ఎం, ఇంజనీరింగ్ , హార్టికల్చర్, సెరీకల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ,శానిటేషన్ అసిస్టెంట్లకు తరువాత పదోన్నతులు ఏంటనే విషయంలో ప్రభుత్వం ద్వారా క్లారిటీరాలేదు. పంచాయతీ గ్రేడ్ 5 కార్యదర్శిలకు తరువాత పదోన్నతి గ్రేడ్4, అని డిజిటల్ అసిస్టెంట్లకు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్5 ఇస్తారని అంతా భావిస్తున్నారు. కానీ వీరి ప్రమోషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక జీఓ ద్వారా ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఉదాహరణకు వ్యవసాయ శాఖలో డిప్లమా విద్యార్హతతో చేరిన ఉద్యోగులకు ఇన్ సర్వీసులో ప్రభుత్వమే బిఎస్సీ అగ్రికల్చర్ చదివించి వారికి మండల వ్యవసాయ అధికారిగా పదోన్నతి కల్పిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశాఖలో ఏఎన్ఎంలకు కూడా ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్సు శిక్షణ ఇచ్చి వారికి నర్సులుగా పదోన్నతి కల్పిస్తుంది.  కానీ సచివాలయ ఉద్యోగులకు కూడా ఆవిధమైన పదోన్నతులు వాస్తాయా అనేది  క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పటికే మహిళా పోలీసులంతా డిగ్రీ, పీజీ అంతకంటే అధికంగా పీహెచ్డీ విద్యార్హతతో కూడా మహిళా పోలీసు ఉద్యోగాల్లోకి చేరారు. అయితే ప్రభుత్వం వారికి తదుపరి పదోన్నతి హెడ్ కానిస్టేబుల్ అని జీఓ ద్వారా తెలియజేయడంతో అంతా ఇపుడు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. వారి వినతులను ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రభుత్వ విప్ ల ద్వారా తీసుకెళుతున్నారు.  ఒక్కోశాఖలో ఒక్కోలా పదోన్నతులు ఇవ్వడమేమంటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. అగ్రికల్చర్, వైద్యఆరోగ్యశాఖలో పదోన్నతులు ఇన్ సర్వీసులో ఇచ్చినట్టే మహిళా పోలీసులకు ఎస్ఐ లుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తుంటే.. ఆపై  మిగిలిన శాఖలైన ఇంజనీరింగ్, సెరీకల్చర్, వెటర్నరీ, వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ శాఖలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖ సచివాలయ సిబ్బందికి పదోన్నతి విషయంలో క్లారిటీ ఇవ్వాలనే వాదన బలపడుతుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్త సచివాలయ గ్రూపుల్లో పెద్ద పెద్ద డిబేట్లే జరుగుతున్నాయి. గ్రామస్థాయిలో ఎంతో ఎక్కువ సేవలు అందించే తమకు సాధారణ ఉద్యోగుల కంటే అతి తక్కువ జీతాలు ఇవ్వడంతోపాటు, పదోన్నతుల విషయంలో కూడా ఎటూ తేల్చి చెప్పకపోవడంపై ఉద్యోగులంతా ఆగ్రహంగా వున్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వం సరైన మార్గం పదోన్నతుల విషయంలో చూపించకపోతే తదుపరి కార్యాచరణ ఏంటని కూడా జోరుగా తమ తమ ఆలోచనలు ఉద్యోగ సంఘాల గ్రూపుల్లో చర్చకు తెరలేపుతున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు దగ్గర కూడా ప్రస్తావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినపుడు ఒక్కో శాఖకు ఒక్కోలా పదోన్నతులపై క్లారిటీ ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులపై క్లారిటీ ఇస్తే..ఈ ఉద్యోగాల్లో ఉండాలా లేదంటే ఇంతకంటే మంచి ఉద్యోగాలకు వెళ్లిపోవాలా అనే కోణంలో సచివాలయ ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం ప్రకటించే జాబ్ కేలండర్ తోపాటు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకుంటే మంచిదనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. కారణం వీరికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు తేడా ఉండటం, విధులు, జీతాలు, పదోన్నతులు, ప్రొబిషన్ ఇలా ఏ కోణంలో చూసిన సాధారణ ఉద్యోగులతో వీరిని పరిగణించడానికి ఆస్కారం లేకుండా పోతుందని  చెబుతున్నారు. అటు చాలా జిల్లాల్లో వీరి ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియకుండా ఉందని..ఇప్పటికే హైకోర్టు పంచాతీ కార్యాలయాలు ఉండగా సచివాలయాలు ఎందుకనే ఒక కేసు విషయంలో ప్రశ్నించింది.. ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా కేవలం ప్రొభిషన్ లోనే 15వేలు మాత్రమే జీతం వస్తుంటే ఇక రెగ్యులర్ అయిన తరువా పెద్దగా జీత బత్యాలు ఏమొస్తాయోనని ఉద్యోగులంతా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రత్యేక జీవోల ద్వారా క్లారిటీ ఇవ్వకపోతే చాలా మంది ఇక్కడి ఉద్యోగాలను వదిలి ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ ఏడాది చివరి నాటికి సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ పూర్తయి వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయి. అప్పటికైనా ప్రభుత్వం వీరి పదోన్నతుల విషయంలో క్లారిటీ ఇస్తుందా లేదా అనేది వేచిచూడాలి..!

Tadepalle

2021-07-01 02:54:35

Tadepalle

2021-07-01 01:40:57

రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేమాల..

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేమాల హేమసుందరరావు నియామకమయ్యారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పారపు సాంబశివ నాయుడు అధ్యక్షతన విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ ప్రతినిధుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు  హేమసుందరరావుకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. ఈయన నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

Tadepalle

2021-06-30 15:24:14