1 ENS Live Breaking News

గ్రేడ్-5 కార్యదర్శిల చూపు గ్రూప్-2 వైపు..

ఒక్క నిర్ణయం జీవితాలను మార్చేస్తుందనే నానుడి ఎపుడైనా విన్నారా.. దానికి నిలువెత్తు నిదర్శనం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయంతో లక్షా 20వేల మంది జీవితాల్లో వెలుగునిండాయి. కానీ ఆ ఆనందం సచివాలయాల్లో విధులు నిర్వహించే గ్రేడ్-5 కార్యదర్శిల్లో లేదు. దానికి కారణం ప్రభుత్వం ఒక్క నిర్ణయంతో ఉద్యోగ కల్పన అయితే చేసిందిగానీ.. ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని అమలు చేయకపోవడంతో ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా వున్న సుమారు 6వేలకు పైగా వున్న గ్రేడ-5 కార్యదర్శిలు కూడా ఓ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట. అతి తక్కువ జీతం(2ఏళ్లుగా రూ.15వేలే).. సాధారణ ప్రభుత్వ శాఖల ఉద్యోగాల కంటే అనదంగా మూడు గంటల పని.. మరీ ముఖ్యంగా చేతిలో కనీసం అధికారంలేని ఉద్యోగం.. ఏ చిన్న పనికైనా పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శిని జోలిపట్ట అడుక్కోవడం..ఇలాలంటి ఉద్యోగం  చేసే కన్నా.. ఈ ఉద్యోగానికి సలాంకొట్టి ప్రభుత్వం కొత్తగా తీయబోయే జాబ్ కేలండర్ కి పోటీ పడితే ఏదో ఒక పోస్టు కొట్టి మన జీవితాలను మార్చుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చారట వీరంతా.. తమకు జీఓనెంబరు 149 ద్వారా అధికార బదలాయింపులు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల నుంచి వాటి పరిధిలోని సచివాలయాలకు మార్పుచేయాలని ఎంపీడీఓలు, డీపీఓలు, ఎమ్మెల్యేలు, ఆఖరికి పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి ద్విదేది, కమిషనర్ గిరిజా శంఖర్ కు వినతి పత్రాలు ఇచ్చినా నేటికీ ఫలితం మాత్రం రాలేదు. దీనితో వారి వారి ఆలోచనలను సామాజిక మాద్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు.. కాకపోతే అవి ఎందకూ పనిచేయలేదని ఆవేదన చెందతున్నారు. తామేమీ కొత్తగా తమకోసం జీఓలు తెమ్మని కోరడం లేదని.. ఉన్నజీఓలనే అమలు చేయమని డిమాండ్ చేస్తున్నామంటూ మీడియా ముందు గొల్లుమంటున్నారు. రాష్ట్రప్రభుత్వంలో ఏ ప్రభుత్వశాఖ ఉద్యోగికి కైనా ఒక నిర్ధిష్ట డ్యూటీ  వుంటుందని.. కానీ విచిత్రంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలో మాత్రమే అటు ప్రభుత్వానికి గానీ, ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలకు గానీ క్లారిటీ లేదని.. అధికారాలు, దస్త్రాలు లేని ఉద్యోగులుగా తామే గుర్తించబడ్డామనేది వీరి ఆవేదన. అంతేకాకుండా అటు ప్రభుత్వం కూడా ఒక్కోసారి ఒక్కోవిధంగా వ్యవహరిస్తూ జీఓలు విడుదల చేస్తుందని పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జాబ్ కేలండర్ లో పెంచుతున్న ఉద్యోగాల్లో  డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉన్న మనమంతా భవిష్యత్తు చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఆదిశగా ప్రయత్నాలు, కొత్త ఉద్యోగాల కోసం పోటీ పడాలని వాట్సప్, టెలీగ్రామ్, ఫోన్లు ద్వారా తమ తమ ఆలోచనలను పంచుకోవడం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అదే జరిగితే ప్రభుత్వం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ నుంచే వేలల్లో ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుంది. అపుడు మళ్లీ ఉద్యోగ ప్రకటన ద్వారా ప్రభుత్వం మరోసారి ఉద్యోగ నియామకాలు, శిక్షణ చేపట్టాల్సి వస్తుంది. కొరివితో తలగోక్కున్నట్టు జీఓనెంబరు 149ని అమలు చేస్తే చాలా మంది ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో ఉండటానికి కూడా అవకాశం వుంటుంది. లేదంటే ప్రస్తుతం ఉద్యోగాల్లో వున్న 80శాతం యువత వేర్వేరు ఉద్యోగాలకు వెళ్లిపోవడానికి సిద్దంగా వున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని ఎందుకు అమలు చేయడం లేదో నేటికీ దానిని విడుదల చేసిన రాష్ట్ర అధికారులకు గానీ.. జిల్లా కలెక్టర్లకుగా గానీ అంతు చిక్కడం లేదు. అలాగని రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలకు ఉద్యోగ కాలం కూడా ఎంతో కాలం లేదు. వారంతా సుమారు ఐదు నుంచి ఏడేళ్లలో ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుంది. అపుడు ఆ స్థానికి వెళ్లిన వారి నుంచి కూడా ఇదే స్థాయిలో ప్రతిఘటన ఎదురైతే.. జీఓ నెంబరు 149 అమలు కాకపోతే ప్రభుత్వానికి తలనొప్పులు తప్పవు.. ఆ స్థానంలోకి వచ్చే గ్రేడ్-5 కార్యదర్శిలు కూడా ఇదే ఇబ్బందులు ఎదుక్కొటారు. వాస్తవానికి గ్రామసచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని రాష్ట్రంలో ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కూడా పలు కేసులు కోర్టులకు చేరిన విషయం కూడా రుజువు చేస్తుంది. ఈ సమయంలోనే ఆ జీఓ-2పై హైకోర్టుకి వెళ్లడంతో అక్కడ కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రామపంచాయతీలు ఉండగా ఎందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారనే చాలా పెద్ద పదం వాడింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని మదించి, రాజ్యాంగంలోని 73వ అధికరణానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీఓనెంబరు 2పై కోర్టులు కీలకంగా వ్యాఖ్యానించినా ప్రభుత్వంలో గానీ.. ప్రభుత్వశాఖల కార్యర్శిల్లో గానీ మార్పు రాలేదు. ఈ పరిణామాలన్నీ క్షుణ్ణంగా గమనిస్తున్న సచివాలయ ఉద్యోగులు, ముఖ్యంగా గ్రేడ్-5 కార్యదర్శిలు ఈ ఉద్యోగాల్లో ఉంటే ఎలాంటి అధికారం లేకుండా.. కనీసం ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా రాదని.. ఇలా అయితే ఉద్యోగాలు చేసి అనవసరమనే భావనకు వచ్చారు. విశేషమేమిటంటే అటెండరు నుంచి ఐఏఎస్ వరకూ అన్ని ఉద్యోగాల్లోనూ అధికారాలను కట్టబెట్టిన రాష్ట్రప్రభుత్వం  ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల జాబ్ చార్ట్ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వకపోగా.. ఒక్క అధికారమూ కట్టబెట్టలేదు. పైగా ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనెంబరు 149ని అమలు చేయకుండా గ్రేడ్-1 కార్యదర్శిల చేతిలోనే అధికారాలన్నీ ఉంచి గ్రేడ్-5 కార్యదర్శిలను ప్రతీ చిన్నపనికీ వీరందరిన పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేలా ప్రభుత్వ అధికారులే చేస్తున్నారు. దీనితో పేరుకి గ్రేడ్-5 కార్యదర్శిలుగా వున్న వీరంతా ఏ పనికావాలన్నా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చుట్టూ దండలుకట్టుకొని తిరగాల్సి వస్తుంది. వాళ్లైనా పంచాయతీల్లో తిన్నగా వుంటున్నారా అంటే ఒక్కో కార్యదర్శికి రెండు నుంచి మూడు పంచాయతీలు ఇన్చార్జిలు అప్పగించారు జిల్లా అధికారులు. ఈ తరుణంలో గ్రామంలో కనీసం చెత్త ఊడ్చాలాన్నా పంచాయతీ నుంచి శానిటేషన్ సిబ్బందిని తీసుకెళ్లే అధికారం గానీ.. వీధుల్లో బ్లీచింగ్, ఫినాయిల్ చల్లించే అధికారం వీరి చేతుల్లో లేకుండా పోయింది. గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు వారు విధుల్లో చేరిన నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి అధికారం లేకుండా పనిచేస్తూ వచ్చారు. విసుగుచెందిన వీరంతా ఇక లాభం లేదనుకొని ఈ ఉద్యోగంలో ఉంటూ మరో కొత్త ఉద్యోగం వస్తే జంప్ అయిపోవాలని నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధుల్లోచేరిన తరువాత మంచి ప్యాకేజీతో ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వస్తే సచివాలయ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు అలా వెళ్లిపోయిన ఉద్యోగాలే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3వేలకు పైగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం జీఓనెంబరు 149ని అమలు చేస్తుందా..లేదంటే తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్టుగా ఎలాంటి అధికారం ఇవ్వకుండానే  గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలను విధులు నిర్వహించమంటుందా అనేది తేలాల్సి వుంది..!

Guntur

2021-07-19 02:15:22

కోర్టు ఆదేశాలను అమలు చేయని IAS లు..

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలోని ఉన్నతాధికారులకు కోర్టు కష్టాలు తప్పడం లేదు.. కాదు కాదు కోర్టు ఆదేశాలను అమలు చేయక కావాలనే సీనియర్ ఐఏఎస్ లు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు.. తాజాగా హైకోర్టు ఆగ్రహానికి గురైన పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వం శాఖల్లోని అత్యధిక సంఖ్యలో కోర్టు వ్యవహారాల చుట్టూ తిరుగుతున్నశాఖగా కూడా పంచాయతీరాజ్ శాఖ వార్తల్లో నానుతూనే వుంది. వివరాలు తెలుసుకుంటే తన నియామకం నాటి నుంచి బిల్ కలెక్టర్ గా సర్వీసుని క్రమబద్దీకరించాలని తూర్పుగోదావరి జిల్లా చెందిన భైరవమూర్తి 2019లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడే హైకోర్టు ఆయన సర్వీనుకి క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఎప్పటిమాదిరిగానే హైకోర్టు ఆదేశాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు అమలు చేయకుండా ఉండిపోయారు. దీనితో బైరవమూర్తి మళ్లీ 2020లో హైకోర్టులోనే కోర్టు ధిక్కరణ వాజ్యం వేశారు. అందులో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, తూర్పోగోదావరి జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఎస్వీనాగేశ్వర నాయక్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీనితో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు మళ్లీ హైకోర్టులో సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ శాఖల్లోనే హైకోర్టు ఆదేశాలే కాదు.. ప్రభుత్వం ఇచ్చిన జీఓలనే అమలు చేయని శాఖగా కూడా గుర్తింపు తెచ్చున్న ఈ శాఖ అధికారులు ఇటీవల హైకోర్టు ఆగ్రహానికి గురై వింత శిక్షను కూడా అనుభవించారు.  అయినప్పటికీ ఈ శాఖ అధికారుల తీరులో మాత్రం మార్పురాలేదు. వాస్తవానికి శాఖాపరంగా చేసిన తప్పులపై ఉద్యోగులు కోర్టుకి వెళ్లిన సమయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వంలోని సదరు శాఖ ముఖ్యకార్యదర్శి అమలు చేయాల్సి వుంది. విచిత్రంగా పంచాయతీరాజ్ శాఖలో మాత్రం ఆవిధంగా జరగడంలేదు. ఫలితంగా అధికారుల తీరువలన ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది. అలాగని ఏ విషయంలో అయితే ఉద్యోగులు కోర్టుకెళ్లారో దానికి సంబంధించిన కౌంటర్ ను కూడా ప్రభుత్వశాఖ పరంగా కోర్టు ముందుంచలేకపోతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను భేఖాతరు చేస్తూ సంజాయిషిలు ఇస్తున్నారు తప్పితే న్యాయస్థానం ఆదేశాలను మాత్రం అమలు చేయకపోతున్నారనే విషయం కోర్టులు ఇచ్చే దిక్కరణన నోటీసులు, అధికారులకు కోర్టులు వేసే శిక్షలే రుజువు చేస్తున్నాయి. అసలు హైకోర్టు పలు కేసుల విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారులను తీవ్రంగా హెచ్చరించడం, శిక్షలు వేయడాన్ని ప్రభుత్వంలోని ముఖ్యకార్యదర్శి సుమోటాగా స్వీకరించి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సి వుంది. లేదంటే ఒక్క ప్రభుత్వశాఖ చేసిన తప్పుకు ప్రతీసారి అధికారులు కోర్టుకు హాజరవుతున్నారంటే.. దానికి కారణం ప్రభుత్వంలో పరిపాలన సక్రమంగా లేదని, అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టు ప్రభుత్వశాఖల అధికారులను హెచ్చరించినా.. అధికారులకు శిక్షలు వేసినా అవి అధికారలకే అన్నట్టు బావిస్తుందా... లేదంటే ప్రభుత్వానికి వేస్తున్నట్టు బావిస్తోందో అర్ధం కాని పరిస్థి ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో నెలకొని వుందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తున్నాయి.. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయా ప్రభుత్వశాఖల కార్యదర్శిలకి నిర్ధిష్ట ఆదేశాలిస్తే తప్పా రాజున్న రోజుల్లో మరిన్ని వ్యవహారాలు, కేసుల విషయంలో హైకోర్టుతోపాటు, ఇతర కోర్టుల ఆగ్రహానికి గురికాక తప్పని పరిస్థితులే కనిపిస్తున్నాయి.

అమరావతి

2021-07-18 05:20:28

బయో మెట్రిక్ వేయకపోతే రంగు పడుద్ది..

ప్రజలకు సేవలందించాలని గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తే.. అక్కడ పనిచేసే సిబ్బందిని ఇష్టానుసారంగా కావాల్సిన చోటుకి డిప్యుటేషన్లు, అదనపు విధులకు పంపుతున్నారు.. ఒక్కరు కూడా పూర్తిస్థాయిలో సచివాలయాల్లో ఉండటం లేదు.. డిజిటల్ అసిస్టెంట్లను ఎక్కడా బయట విధులకు పంపకూడదనే ప్రత్యేక జీఓ ఉన్నా మండల అధికారులు కావాలనే వారిని బయటకు పంపుతూ వారి కార్యాలయ విధులకు వాడుతున్నారు.. అలా అయితే గ్రామసచివాలయాలు ఎందుకు.. మనం అనుకున్న లక్ష్యం ఎలా నెరవేరుతుంది.. ఏ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గద్దు.. సచివాలయ సిబ్బంది డిప్యుటేషన్లన్నీ రద్దుకావాలి.. ఎవరికి కేటాయించిన సచివాలయంలో వారే ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉండాలి.. ఖచ్చితంగా బయో మెట్రిక్ అటెండెన్సుతో ఉండాల్సిందే.. ఏం చేస్తారో నాకు తెలియదు సోమవారం నుంచి మొత్తం సచివాలయాల స్వరూపమే మారిపోవాలి.. ఇవీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లుకి ఇచ్చిన ఆదేశాలు.. ఇవన్నీ ఎందుకంటే సచివాలయ సిబ్బందికి జిల్లా అధికారులు అదనంగా కేటాయిస్తున్న విధులు, సక్రమంగా వేయని బయోమెట్రిక్ రిపోర్టులు తెచ్చిన తంటా.. రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్ నేరుగా సీఎం చెక్ చేసిన సమయంలో ప్రతీ జిల్లాలోనూ 60శాతనికి పైగానే బయోమెట్రిక్ పడని విషయం..సచివాలయ సిబ్బందిని అదనపు విధులకు వినియోగిస్తున్నట్టు తేలింది.. దీనితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఖచ్చితంగా బయో మెట్రిక్ ను వేసేలా చూడాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను గట్టిగా ఆదేశించిన నేపథ్యంలో ఉదయం సాయంత్రం రిపోర్టులు జిల్లా కలెక్టరేట్లకు చేరుతున్నాయి. రాష్ట్రంలోని 13జిల్లాలు, 16 మున్సిపాలిటీల్లో వార్డు సచివాలయాల సిబ్బంది బయో మెట్రిక్ వేయడంలో వెనుకంజలో ఉన్నారు.. మరికొంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రసన్నం చేసుకొని కావాల్సిన సచివాలయాల్లోకి అదనపు డిప్యూటేషన్లు వేయించుకున్నారు. ఫలితంగా సీఎం ఆదేశాలతో ప్రస్తుతం డెప్యూటేషన్ లో వున్న కార్యదర్శిలంతా వారి వారి సొంత సచివాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. అన్ని డిప్యుటేషన్లు సోమవారం నుంచే రద్దు కానున్నాయి. ఏ ఒక్క సచివాలయ సిబ్బందికి బయో మెట్రిక్ నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని, బయోమెట్రిక్ లోపాలు ఇబ్బందులు వుంటే తక్షణమే సరిచేయాలని సీఎం కలెక్టర్లకు వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా గందర గోళ పరిస్థితి ఏర్పడింది.  జిల్లాల్లో సచివాలయ కార్యదర్శిలు, వీఆర్వోలు, సర్వేయర్లు, మహిళా పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్లకు అదనపు విధులు, డిప్యుటేషన్లు వేయడంతో వారి బయో మెట్రిక్ అటెండెన్సు కూడా చాలా తక్కువగా నమోదు అవుతుంది. దానిపై తమకు మండల అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు డిప్యూటేషన్లు వేశారని చెప్పుకునే సిబ్బందికి సోమవారం నుంచి సమయానికి రాకపోతే  రంగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. బయో మెట్రిక్ అటెండెన్సు ఆధారంగా సిబ్బందికి జీతాలు ఇవ్వనున్నారు. ఖచ్చితంగా సోమవారం నుంచి మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ సచివాలయంలోనే అన్నిశాఖల సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాల్సి వుంటుంది. ఇదే సమయంలో ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేసే సమయంలో ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది బయో మోట్రిక్ అటెండెన్సు పరిగణలోకి తీసుకోవడంతో ఆడుతూ పాడుతూ ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా సచివాలయాల్లో బయో మెట్రిక్ అటెండెన్సు తక్కువగా ఉంటే సదరు జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించిన నేపథ్యంలో సచివాలయ సిబ్బంది మొత్తం ప్రజలకు గ్రామంలోనే ఉండి సేవలు అందించేందుకు సోమవారం నుంచి సిద్దమవుతారు. ఇప్పటి వరకూ సచివాలయ కార్యదర్శిలకు బయో మెట్రిక్ నుంచి మినాయింపులు ఇచ్చారని చెప్పుకునేవారంతా కూడా ఖచ్చితంగా సమయానికి బయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. ప్రభుత్వ లక్ష్యానికి జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు, మండల అధికారులు(ఎంపీడీఓలు, తహశీల్దార్లు,ఏఓలు) గండికొడుతున్నట్టు స్పష్టంగా సీఎం నేరుగా గుర్తించేలా చేసింది. రాష్ట్రంలో సచివాలయ సిబ్బందికి కేటాయిస్తున్న అదనపు విధుల  కారణంగా ఈ బయో మెట్రిక్ అటెండెన్సు సక్రమంగా పడటం లేదనే విషయం స్పష్టమైంది. అయినా ఇక్కడ తప్పంతా సచివాలయ ఉద్యోగులదే అన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎందుకు సచివాలయ సిబ్బంది సమయానికి బయో మెట్రిక్ వేయలేకపోతున్నారనే విషయంపై రాష్ట్రప్రభుత్వం ఆరాతీస్తే.. జిల్లా అధికారులు, మండల అధికారులు సచివాలయ సిబ్బందికి అదనపు పనులు సిబ్బందిలేమిని కారణంగా చూపి కావాలనే పురమాయిస్తున్నట్టు లెక్కతేలింది. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సచివాలయ సిబ్బందికి ఎలాంటి అదనపు పనులు అప్పగించకూడదని.. డెప్యూ టేషన్లు రద్దు చేయాలని.. ముఖ్యంగా ప్రతినిత్యం సేవలు అందించే డిజిటల్ అసిస్టెంట్లు ఏ పనులకూ వినియోగించకూడదనే జీఓను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మండల కార్యాలయాల్లో సిబ్బంది కొరతగా ఉండటంతో చాలా మండలాల్లో డిజిటల్ అసిస్టెంట్ల సేవలను అనధికారికంగా ఎంపీడీఓలు, తహశీల్దార్లు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ విడుదల చేసినప్పటికీ దానిని కూడా ఎంపీడీఓలు భేఖాతరు చేయడంతో వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సచివాలయాలకి కేటాయించిన సిబ్బంది వారి సచివాలయాల్లో ఉండకపోతే కలెక్టర్లుపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరు కలెక్టర్లు అన్నిశాఖల జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తక్షణమే డిప్యూటేషన్లు రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని కూడా కలెక్టర్లు జిల్లాఅధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఖచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్సు ఆధారంగానే సచివాలయ సిబ్బంది మొత్తానికి జీతాలు అందించాలని కూడా కలెక్టర్లంతా జిల్లా, మండల అధికారులను ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన రెండేళ్లకు గానీ సచివాలయ ఉద్యోగులపై ద్రుష్టిసారించకపోవడంతో ఇప్పటి వరకూ ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతూ వచ్చింది. ఇపుడు నేరుగా సీఎం రంగంలోకి దిగడంలో ప్రభుత్వంలోని సుమారు 14శాఖల ముఖ్యకార్యదర్శిలంతా కలెక్టర్లందరికీ ఫోన్ ఇన్ చేసి తలంటేశారు. సోమవారం నుంచి 100శాతం బయో మెట్రిక్ పడకపోతే చర్యలు తొలుత జిల్లా కలెక్టర్లపై ఉంటే.. కలెక్టర్లు జిల్లా అధికారులపైనా, జిల్లా అధికారులు మండల అధికారులకు చార్జిమెమోలు జారీచేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అదేసమయంలో సచివాలయ సిబ్బంది మూమెంట్ రిజిస్టర్, ప్రజల నుంచి వచ్చే శాఖల వారీ అర్జీలకు ఉద్యోగులే బాధ్యత వహించాల్సి వుంటుంది. సర్వేయర్లకు సైతం డిప్యూటేషన్లు రద్దు, అదనపు విధులు మండల అధికారులు రద్దుచేయాలి. అలా కాకపోతే రాష్ట్రశాఖ ముఖ్య కార్యదర్శిల నుంచి అనుమతులు తెచ్చుకోవాలని జిల్లా శాఖ అధికారులకు కలెక్టర్లు తెగేసి చెప్పేశారు. దీనితో సోమవారం నుంచి సచివాలయ సిబ్బంది ఉదయమంతా వారి డ్యూటీ చార్టు ప్రకారం విధులు, మధ్యాహ్నం నుంచి స్పందన కార్యక్రమ నిర్వహణలో పాల్గొనాలి.. కానీ రాజకీయ ఒత్తిళ్లు.. యధాస్థితిగానే మండల అధికారుల ప్రత్యేక పనుల పురమాయింపు.. ప్రభుత్వం ఇచ్చిన జీఓలను అమలు చేయకపోవడం అలవాటుగా మారిన ప్రభుత్వశాఖల అధికారులు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశాలను ఏ స్థాయిలో అమలు చేస్తారనేది వేచి చూడాలి.. ఒకవేల అమలు చేయకపోతే రంగు పడటం ఖాయంగానే కనిపిస్తుంది ఆదేశాల్లో మాత్రం.. చూడాలి ఏం జరుగుతుందనేది. 

Amaravati

2021-07-18 02:30:57

ENSకథనాలపై స్పందించిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మానసపుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని లోపాలు, అధికారుల అనాలోచిత నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్, ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net కథనాలకు(న్యూస్ కార్డ్) జిల్లా కలెక్టర్లు స్పందించక పోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరు ప్రజల నుంచి విశేషంగా మన్ననలు అందుకుంటోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో అభివ్రుద్ధి, లోపాలు, అధికారుల అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలకు ఏవిధంగా సేవలు అందించలేకపోతుందనే విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ఎప్పటికప్పుడు కథనాలు అందిస్తున్నాం. ముఖ్యంగా సచివాలయ స్పందనకు కరోనా మోలకాడ్డు శీర్షికన వచ్చిన కథనంపై నేరుగా సీఎం వైఎస్ జగన్ స్పందించి, జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీచేసిన తీరు ఒక్కసారిగా 16 ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలను కదిలించేలా చేసింది. ముఖ్యంగా మండల అధికారులు సచివాలయ సిబ్బందిలో కీలక భూమిక వహించే డిజిటల్ అసిస్టెంట్లను కరోనా వేక్సినేషన్ క్యాంపులకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు పంపడం, సచివాలయ కార్యదర్శిలకు ఒకటి రెండు అదనపు సచివాలయాలు డిప్యుటేషన్ వేయడం తదితర విషయాలను ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అందించాం. సరిగ్గా ఇవే కారణాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి ప్రతీ ముఖ్యమైన సమాచారాన్ని, ప్రభుత్వం విడుదల చేసి జీఓ నెంబర్లు, అందులో ప్రస్తావించిన ముఖ్యమైన విషయాలను  ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ప్రత్యేకంగా కధనాలు అందిస్తున్నాం. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు స్పందించినా చర్యలు తీసుకోకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలు కరోనా వేక్సినేషన్ లో తామంతా తెగ కష్టపడిపోతున్నామని జిల్లా కలెక్టర్ల వద్ద రంగు పులుముకోవడానికి సచివాలయ సిబ్బంది అదనపు విధుల కోసం రెండవ శనివారాలు, ఆదివారాలు అనే తేడా లేకుండా కరోనా వేక్సినేషన్ కు, మండల కార్యాలయంలోని పనులకు వినియోగించుకున్న విషయాన్ని బయటకు తీసుకు వచ్చింది ఈఎన్ఎస్. అయితే మొదట్లో చాలా లైట్ తీసుకున్న జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీసీఈఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన వీడియో కాన్ఫరెన్సులో ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ ద్వారా ప్రస్తావించిన కధనాల్లో విషయాలపై తలంటడంతో ఒక్కసారిగా అధికారులంతా కంగారు పడ్డారు. ముఖ్యంగా డిజిటల్ అసిస్టెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మండల అధికారులు సచివాలయాల నుంచి కదపడానికి వీల్లేదని చేసిన ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ విధులకు ఆటంకం కలిగించ వద్దని ప్రత్యేకంగా జీఓ జారీచేసినా జిల్లా అధికారుల ఆదేశాలతో మండల అధికారులు అదనపు విధులు అప్పగించడంతోపాటు  కార్యాలయ విధులకు వినియోగించుకునేవారని, ఈఎన్ఎస్ కధనాలతో ప్రభుత్వంలో చలనం వచ్చి నేరుగా విషయం ముఖ్యమంత్రి ద్రుష్టికీ తీసుకెళ్లారంటూ ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం ఆదేశాలతో తమకు విముక్తి లభించినట్టు అయ్యిందని అభిప్రాయపడుతున్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి తోపాటు సుమారు 16 ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శిలు, పోలీస్ డీజీపి కూడా సచివాలయ ఉద్యోగులకు అదనపు విధులు కేటాయించడానికి వీల్లేదని, డిప్యుటేషన్లు అసలు వేయవద్దని.. ఒకవేళ వేసి వుంటే తక్షణమే రద్దు చేయాలని ఆదేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారులకు టెలీకాన్ఫరెన్సుల ద్వారా ఆదేశాలు జారీచేస్తున్నారు. వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది సోమవారం నుంచి సచివాలయాలకే పరిమితం కావాలని కలెక్టర్లు గట్టిగా ఆదేశాలు జారీచేశారు. తప్పనిసరిగా బయోమెట్రిక్ నూటికి నూరుశాతం పడేలా చేయాలని చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనితో ఈఎన్ఎస్ కధనాలు రాష్ట్రప్రభుత్వాన్ని చైతన్య పరచడంలో కీలక భూమిక వహించినట్టైంది. ఇపుడే కాకుండా ముఖ్యమంత్రి మానసపుత్రిక గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా జరిగే అభివ్రుద్ధి, అందే సేవలపై రానున్న రోజుల్లోనూ మంచి మంచి కధనాలు అందిస్తామని కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరోసారి తెలియజేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి బెదిరింపులు వచ్చినా, ఒత్తిడిలు వచ్చినా ఎక్కడా వెనుకడుగు వేసేది లేదని కూడా ప్రకటిస్తున్నాం. వైఎస్.జగన్మోహనరెడ్డి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఆదర్శమైందనే విషయాన్ని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని కూడా చెబుతున్నాం. అదే సమయంలో సచివాలయ వ్యవస్థలోని లోపాలను, అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, మండల అధికారుల అనాలోచిత చర్యలను కూడా ఎప్పటికప్పుడు ఎండగడతామని, అదే సమయంలో ఉన్నతంగా పనిచేసిన అధికారులపై కూడా ప్రత్యేక చైతన్య, ఆదర్శవంతమైన కధనాలు(న్యూస్ కార్డ్) అందిస్తామని కూడా స్పష్టం చేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే సేవలను అన్ని మీడియాల కంటే ముందుగా తెలియజేస్తామని కూడా మాట ఇస్తున్నాం. సచివాలయాల సేవల్లో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కూడా భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పర్యటనలు, సూచనలు, సలహాలు కూడా ప్రజలకు కధనాల ద్వారా తెలియజేస్తామని ప్రకటిస్తున్నాం..!

Tadepalle

2021-07-17 16:02:21

కాఖీ చొక్కాలేదు.. చేతిలో లాఠీ అసలేలేదు..

రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో మహిళలకు రక్షణ ఉండాలి.. ఆకతాయిల ఆగడాలను కూకటి వేళ్లతో పెకిలించాలి.. దిశ చట్టంతో మహిళల దశను మార్చాలి.. దిశ చట్టం దేశానికే ఆదర్శం కావాలి.. నలుదిశలా వ్యాప్తి చెందాలి.. మహిళలకు పోలీసు శాఖ ఒక రక్షణ కవచంలా మారాలి.. అలా జరగాలంటే మహిళా పోలీసు వ్యవస్థ ఒక్కటే ముఖ్యం.. అలా జరగాలన్నా.. ప్రభుత్వం అనుకున్నట్టు గ్రామాల్లో తేడాగాళ్లకు కాస్త భయం వచ్చేటట్టు చేయాలన్నా.. మహిళా పోలీసుల ఒంటిపై కాఖీ చొక్కా.. నెత్తిన మూడు సింహాల గుర్తు.. చేతిలో లాఠీ ఉంటేనే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేది.. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 15వేల మంది మహిళా పోలీసులు గ్రామస్థాయిలో ఉత్తుత్తి పోలీసులుగానే మిగిలిపోయారు.. నిజమైన పోలీసులనే సివిల్ డ్రెస్సులో ఉంటే ఎవరూ పట్టించుకోరు..ఇక మహిళా పోలీసులమని చెప్పి సాధారణ దుస్తుల్లో గ్రామాల్లో తిరుగితే పరిస్థితి ఎలా వుంటుందో ఆలోచించుకోవాలి.. ఏంటి తేడాగా చదువుతున్నాం అనుకుంటున్నారా... కాదు కాదు మీరు కరెక్టుగానే చదువుతున్నారు.. ప్రభత్వ వ్యవస్థలోని లోపాలు.. రాష్ట్ర అధికారులు నిర్ధిష్టంగా ఇవ్వలేని ఆదేశాలు.. ఈ ఆర్టికల్ చదవేటపుడు మిమ్మల్నే కాదు ప్రజలను కూడా కాస్త చులకనగా ఆలోచించేలా చేస్తున్నాయి.. కారణం ఒక్కటే రాష్ట్రస్థాయిలో పోలీస్ బాస్ డిజిపి ఇచ్చిన ఆదేశాలు, ప్రత్యేక జీఓలు అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు కాకపోవడమే.. నేటికీ గ్రామ, వార్డు మహిళా పోలీసులను ప్రభుత్వమే ఏ విధంగా గుర్తించాలో ఒక కొలిక్కిరాలేదంటే ఇక ప్రజలకు, మహిళలకు ఏ విధంగా సేవలందించి రక్షణ కల్పిస్తారనే అంశం ప్రశ్నార్ధకమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం నియమించిన మహిళా పోలీసులకు ఏ తరహా విధులు అప్పగించాలి, వీరిని ఏవిధంగా గుర్తించాలనే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి డిజీపీ వరకూ అధికారులంతా మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి గ్రామస్థాయిలో మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం పరిరక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా వీరి నియామకాల సమయంలో జీఓ నెంబరు 129 ద్వారా సాధారణ పోలీసులు నిర్వర్తించే విధులతోపాటు వీరికి ఐసిడిఎస్ అంగన్వాడీల పర్యవేక్షణ బాధ్యత కూడా అప్పగించారు. అంతవరకూ బాగానే వున్నా.. పోలీస్ ఉద్యోగమంటే ఒంటిపై కాఖీ చొక్కా, చేతిలో లాఠీ లేకపోతే గ్రామస్థాయిలో ప్రభుత్వం అనుకున్న గ్రామ సంరక్షణ జరగదు. అలా కాఖీ చొక్కా లేకపోతే వచ్చేది పోలీసులని ప్రజలు కూడా గుర్తించరు.. దీనితో ప్రభుత్వం తరువాత మరో జీఓ నెంబరు 59ని విడుదల చేసి.. మహిళా పోలీసులందరినీ సాధారణ పోలీసులుగా మారుస్తున్నామని అందులో పేర్కొంది. అంతే కాదు వీరికి పదోన్నతి వస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇస్తామని కూడా ప్రభుత్వం ఆ జీఓ పేర్కొంది. ఇక్కడే చిక్కంతా వచ్చిపడింది. డిగ్రీ చదువుకున్న తమను కానిస్టేబుళ్ల మాదిరిగా ఎలా గుర్తిస్తారంటూ మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు సాధారణ పోలీసులు చేసే విధులకంటే తాము అధికంగా విధులు నిర్వర్తిస్తున్నామంటూ  చెప్పుకొస్తున్నారు. తమకు పదోన్నతి కల్పిస్తే ఎస్ఐలుగా పదోన్నతి కల్పించాలనేది వీరి డిమాండ్. ఇదిలా వుంటే గ్రామస్థాయిలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్ పోలీసులుగా తమ గౌరవానికి భంగం కల్పించారని హోంగార్డు నుంచి స్టేషన్ ఎస్ఐల వరకూ తెగ ఫీలై పోతున్నారు. అంతేకాదు.. మిమ్మల్ని తాము సాధారణ పోలీసులుగా గుర్తించలేమని, మేముండగా మిమ్మల్ని పోలీసులని ఎలా పిలుస్తారని.. ఇది జరిగేపని కాదని పోలీసులంతా వీరిని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల నేరుగా మీరు నిజమైన పోలీసులు కాదనీ.. మేమే నిజమైన పోలీసులమని.. అయినా డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలు పొందిన మీరు.. మాలా ఇంటర్ విద్యార్హతతో కానిస్టేబుల్స్ గా ఉండటం ఏంటంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయడం విశేషం. దీనితో ఈ విషయం కాస్తా నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందటంతో వీరికి ప్రస్తుతం పోలీసు యూనిఫారం కాకీ డ్రెస్సు, లాఠీ ఇవ్వాలా లేదంటే. సివిల్ డ్రెస్సులో పేరుకే పోలీసులుగా ఉంచి, హోంగార్డులు, కానిస్టేబుళ్ల కిందనే విధులు నిర్వర్తించేలా చేయాలా అనే కోణంలో పోలీసులు వర్గాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇటు మహిళా పోలీసుల్లో కూడా చాలా మంది 45సంవత్సరాలు వచ్చినవారున్నారు. వారంతా తమకు పోలీస్ డ్రెస్సు వద్దని, పదోన్నతి ఇస్తే ఐసిడిఎస్ విభాగం నుంచి ఇవ్వాలని చెబుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా స్టేషన్ పోలీసులు తమకి ఏ స్థాయి ఉద్యోగం అంటే...  పోలీస్ డ్రెస్ వేసుకున్న ఉద్యోగం కావాలా, లేదంటే గ్రామసచివాలయంలోనే డ్రెస్సులేని ఉత్తుత్తి పోలీసు ఉద్యోగం కావాలా అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నారట. ప్రత్యేక సమావేశాల్లో వీరి ఆలోచనలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అసలు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసే సమయంలో  మహిళా పోలీసు ఉద్యోగం ఇవ్వడం, వారి విధుల కోసం జీఓ 129 జారీ చేసింది ప్రభుత్వం. అసలు ఆ జీఓపై రాష్ట్రంలోని ఎంత మంది పోలీసులకు అవగాహన వుంది.. దానిపై ఎన్ని జిల్లాల ఎస్పీలు వాటిపై నిర్ధిష్ట ఆదేశాలు ఎస్ఐలకు ఇచ్చారనే దానిపైనా నేటికీ క్లారిటీ రాలేదు. దీనితో సాధారణ పోలీసులుగా ప్రభుత్వం మిమ్మల్ని నియమిస్తే మాత్రం తామెలా గుర్తిస్తామంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట కానిస్టేబుళ్లు, ఎస్ఐలు. పోలీసుశాఖ పిలవబడే  హోంశాఖలోని సాధారణ పోలీసులు నిర్వర్తించే విధులతోపాటు మహిళా శిసు సంక్షేమశాఖలోని అంగన్వాడీ కేంద్రాల మానటరింగ్ విధులు వీరికి కేటాయించారు. వాటితోపాటు గ్రామస్థాయిలో ఆరోగ్య సహాయకులు చేసే విధులు ఇమ్యునైజేషన్ విధులు కూడా కేటాయించారు. ఇలా ఒక్క మహిళా పోలీసు మూడు శాఖలకు చెందిన విధులతోపాటు, గ్రామసచివాలయంలో డిజిటల్ అసిస్టెంటుకి అత్యవసర సమయంలోనూ, పని అధికంగా ఉన్న సమయంలోనూ సహాయం చేయాలని ప్రభుత్వం మహిళా పోలీసులకు తెలియజేసింది. ఇన్ని చేస్తున్న ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థకు ఒక గుర్తింపు అంటూ ఇవ్వకవోవడం విశేషం. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన మహిళా పోలీసు వ్యవస్తను  హోంశాఖలోని ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల ద్వారా మహిళా పోలీసు వ్యవస్థను ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అధికారులు తమకు వీరి ద్వారా పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టారన్నట్టుగా వ్యవహరిస్తూ..మహిళా పోలీసులను కాస్త చులకనగా చూస్తున్నారు. ఈ విషయం డివిజన్ స్థాయిలో డిఎస్పీల, జిల్లా స్థాయిలో ఎస్పీలకు తెలిసినా కింది స్థాయి పోలీసులకు ప్రభుత్వం జారీచేసిన జీఓల ఆధారంగా వారి విధులు వారిని నిర్వర్తించనీయండి అనే కోణంలో ఆదేశాలు జారీచేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలా ఆదేశాలు జారీ చేసి ఉంటే స్టేషన్ స్థాయిలో పోలీసులు.. గ్రామ సచివాలయ మహిళా పోలీసులను ప్రశ్నించే తీరు, అజమాయిషి తీరు మారుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గీసిన లక్ష్మణ రేఖ రెండేళ్ల ప్రొబిషన్ అనే మాటకు మహిళా పోలీసులు కూడా కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. లేదంటే డిగ్రీ, అంతకంటే ఎక్కువగా చదువుకున్న మహిళా పోలీసులు తాము ఏఏ జీఓ నెంబర్లు ద్వారా విధుల్లోకి చేరామో... ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో జీఓనెంబర్లు 129, జీఓనెంబరు 59లను విడుదల చేసిందో.. దైర్యంగా చెప్పేంత సత్తా ఉన్నవాళ్లే మహిళా పోలీసులుగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోనూ, పట్టణాల్లోని వార్డుల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. అంతెందుకు దిశ యాప్ టార్గెట్ లు పెడితే రోజుకు 50 నుంచి 100 రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారంటే గ్రామస్థాయిలో వీరి విధులు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ప్రభుత్వం కూడా గుర్తించాలనే వాదన బలపడుతోంది. ఇవేమీ కాకుండా మాట్లాడితే మేము ఒక్క లెటర్ పెట్టామంటే మీ ఉద్యోగాలు పోతాయనే పదాన్ని స్టేషన్ లో హోంగార్డులు నుంచి ఎస్ఐల వరకూ ఆ పదాలను జోబులో పెట్టుకున్నట్టే మాట్లాడటం, వీరే మహిళా పోలీసులకు జీతాలు ఇస్తున్నట్టు కలరివ్వడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇదంతా హోంశాఖలోని 60శాతం మంది పోలీసులు వెలబెడుతున్న వ్యవహారం మిగిలిన 40శాతం మంతి పోలీసులు ఎంతో చక్కగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ.. మహిళా పోలీసులు గ్రామస్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలో చాలా చక్కగా వారికి ఉపదేశిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్ ఇనెస్పెక్టర్లు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.  అటు ప్రభుత్వంగానీ, డిజిపీ కార్యాలయం నుంచి గానీ నిర్ధిష్ట ఆదేశాలు రాకపోవడం వలనే మహిళా పోలీసుల విధులేంటో.. యూనిఫారమేంటో నేటికీ తెలియని స్థితిలో విధులు నిర్వహిస్తున్నారు వార్డు, సచివాలయ మహిళా పోలీసులు.. ముందు ముందు వీరంతా పవర్ లేని ఉత్తుతి పోలీసులుగా గ్రామస్థాయిలో యూనిఫారం లేకుండా రక్షణ కల్పిస్తారా.. లేదంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తారా..అనేది డిజీపీ ఇచ్చే ఆదేశాల మీదే ఆధారపడి వుంది..చూడాలి ఏం జరుగుతుందనేది..!

Tadepalli

2021-07-17 04:26:45

పులివెందులలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అకాడమీ..

‘నైపుణ్య యువాంధ్రప్రదేశ్’ దిశగా వడివడిగా రాష్ట్ర ప్రభుత్వ అడుగులు వేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. వరల్డ్ స్కిల్ యూత్ డే సందర్బంగా ఆయన యువతీ,యువకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికా ప్రకటనల విడుదల చేశారు. 'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం' అని బోధించిన వివేకానందుడి మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు తగు శిక్షణను అందించాలనేదే ధ్యేయమని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందజేయడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించినా నెంబర్ వన్ స్కిలింగ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. 2లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి "ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు"ల్లోకి ఎక్కిందన్నారు. ఇటీవల సీఎం జగన్‌ చేతుల మీదుగా వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందులలో రూ.30కోట్లతో 'స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ' ఏర్పాటుకు శంకుస్థాపనతో కీలక ముందడుగు వేశామని తెలిపారు. రాష్ట్ర ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో మానవ వనరులదే కీలకమైన పాత్ర అని, నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తుందని ముందే గుర్తించడం సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనమన్నారు. రేపటి భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోసే యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రతీ ఏడాదీ జూలై 15న 'ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం' నిర్వహించుకోవడం సముచితమని తెలిపారు. నైపుణ్యం ఉంటేనే యువతకు ఉద్యోగాలు వస్తాయిని, ఆ నైపుణ్యాన్ని ఉచితంగా యువతకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం బాటలు వేస్తోందని తెలిపారు. ఏ రంగంలో నైపుణ్యం కలిగిన మానవులు కావాలో చెప్పండి తామే శిక్షణ ఇచ్చి నైపుణ్యంతో కూడిన మానవ వనరులు సమకూరుస్తామనేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి కల్పన లక్ష్యంగా లోక్ సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 25 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రిపుల్ఐటీలలో ఒక్కొక్కటి చొప్పున 4 స్కిల్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వం 30 నైపుణ్య కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రూ1,385 కోట్లను వెచ్చించేందుకు సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు.7 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ తీసుకొని 156 ప్రముఖ ఎమ్ఎన్‌సీ  కంపెనీలలో ఉపాధి పొందిన యువత 4,500 మంది అని తెలిపారు. 2021-22లో 5వేల మందికి ఒక్క ఓమ్ క్యాప్ ద్వారా ఉపాధి అవకాశాలు అందించాలనేది లక్ష్యంమని, స్కిల్ కాలేజీలలో యువతీ, యువకులు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 24 జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుందని తెలిపారు.ఆ జాబితాలో ఐబీఎమ్,టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్, బయోకాన్, ఒరాకిల్ తదితర ప్రముఖ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి స్కిల్ కాలేజ్‌లో పరిశ్రమలో పనిచేసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా 'సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్'లకు శ్రీకారం చేట్టినట్లు తెలిపారు. పరిశ్రమలలో స్థానిక యువతకే 75 శాతం ఉద్యోగాలు అందించేందుకూ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల సమన్వయం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల డిమాండ్- సప్లైల మధ్య అంతరాన్ని నిర్మూలించడం, సాంకేతిక, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, కొత్త నైపుణ్యాలను ప్రవేశపెట్టడం, వినూత్నమైన ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడం లాంటి విధులను వర్తమానానికే గాక భవిష్యత్తులో కూడా పనికొచ్చే విధంగా కృషి చేస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు శుభాభినందనలు తలియజేశారు.

Tadepalle

2021-07-15 16:10:54

ఉద్యోగులకు మేలుచేసే నిర్ణయాలుంటాయ్..

వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉద్యోగులకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకోవడం ఉద్యోగుల పట్ల సీఎం  వైయస్‌ జగన్‌ ఆలోచనాతీరును ఆ నిర్ణయాలు తెలియచేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారులు  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని ప్రైవేటు కల్యాణమండపంలో ఏపి ఎన్‌ జి ఓ సంఘ నేత నలమారు చంద్రశేఖరరెడ్డి అభినందన సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమనే ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ ఎప్పుడూ చెబుతుంటారని తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్‌ అన్నిరంగాలలో అగ్రగామిగా నిలవాలన్నా,ప్రజల జీవనప్రమాణాలు పెరగాలన్నా అది భాధ్యతాయుతంగా పనిచేసే ఉద్యోగుల వల్లనే సా«ధ్యమవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.కరోనా వంటి కష్టసమయంలో కూడా  సీఎం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువెళ్లిన ఘనత ఉద్యోగులదేనని వారందర్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు సీఎం చెప్పమన్నారని సజ్జల తెలియచేశారు.  అధికారం చేపట్టగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 42 వేల ఉద్యోగాలను సృష్టించారు.ప్రపంచ చరిత్రలో ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మనం చూసి ఉండమన్నారు. ప్రజలకు అందించాల్సిన సేవలు గ్రామసచివాలయాల ద్వారా త్వరితగతిన పారదర్శకంగా అందించాలనేది ఆయన లక్ష్యమని వివరించారు. ఆ లక్ష్యసాధనలో భాగంగా గ్రామసచివాలయాల వ్యవస్ధ ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆ ఉద్యోగ నియామకాలలో కనీసం ఇంటర్వూల వంటివి కూడా లేకుండా పూర్తి పారదర్శకంగా  ప్రతిభ కలిగిన వారికి అది కూడా వెనకబడిన వర్గాల వారికి దాదాపు 80 శాతం  ఉద్యోగాలను అందించారన్నారు. వారికి సహాయంగా రెండులక్షల 55 వేలమందితో వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటుచేశారన్నారు. కాంట్రాక్ట్‌ ,అవుట్‌ సోర్సింగ్‌  ఉద్యోగులుగా ఉన్నవారిని సైతం ఏపి కార్పోరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌(ఆప్కాస్‌ ) పేరుతో సంస్ధను ఏర్పాటుచేసి ఆ ఉద్యోగులలో ఆత్మవిశ్వాసం పెంచారన్నారు. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలే ప్రభుత్వంలో ఉంటాయన్నారు.

Tadepalle

2021-07-15 16:07:43

సచివాలయ స్పందనకు కరోనా మోకాలడ్డు..

గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి.. సచివాలయాలు దాటి గ్రామస మస్యలు జిల్లా కార్యాలయాలకు రాకూడదు.. ప్రతీరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 వరకూ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం తప్పక జరగాలి.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలి.. స్పందన కార్యక్రమం పై వాలంటీర్లతో ప్రజలకు అవగాహనక కల్పించాలి.. ఇవీ రాష్ట్రప్రభుత్వ ఆదేశాలు నాణేనికి ఒక వైపు.. ఈరోజు మీ మండలానికి 1000 కరోనా టీకాలు కేటాయించాం.. సచివాలయ సిబ్బంది ఉదయం 8గంటలకు కేంద్రానికి వచ్చేసి సాయంత్రం ఆరుగంటల వరకూ ఉండైనా వాక్సిన్లు మొత్తం ప్రజలకు చేరేలా చేయాలి.. 2వ శనివారం, ఆదివారం తేడాలేకుండా కరోనా వేక్సినేషన్ డ్యూటీలు సచివాలయ సిబ్బంది బుజాన వేసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలి.. మానవతా ద్రుక్పదంతో పనిచేయాలి.. లక్ష్యాలకు మించి కరోనా వేక్సినేషన్ జరిగిపోవాలి.. వేక్సినేషన్ డిజిటలైజేషన్ చేయడానికి డిజల్ అసిస్టెంట్లు పనిచేయాలి(వీరిని కరోనా వేక్సినేషన్ విధులకు వనియోగించకూడాని ప్రత్యేక జీఓ ఉన్నా) ఇవినాణేనికి రెండో వైపు. ఉదయం 9.30 సచివాలయానికి వచ్చే సిబ్బంది మధ్యాహ్నం రెండు గంటల వరకూ సిబ్బంది విధులు చూసుకుంటూ, మధ్యాహ్నం నుంచి స్పందన కార్యక్రమం నిర్వహించాలనేది ప్రభుత్వ ఉత్తర్వులు. కానీ ఉదయం 8గంటల నుంచి సాంత్రం ఆరు గంటల వరకూ కరోనా వేక్సినేషన్ దగ్గరే సచివాలయ సిబ్బంది ఉండిపోతే ఇక స్పందన కార్యక్రమం ఎలా నిర్వహిస్తారో ప్రభుత్వ ఉన్నతాధికారులే చెప్పాలి. గ్రామసచివాలయ ఉద్యోగులకు 2వ శనివారం, ఆదివారం రోజులు కూడా సెలవు లేకుండా ఆరోజుల్లోనే కరోనా వేక్సినేషన్ డ్యూటీలు వేస్తూ ప్రజలకు వీరితో సేవలందిస్తున్నారు. అలాంటి సమయంలో ఇక స్పందన కార్యక్రమం సచివాలయాల్లో  ఏం జరుగుతుందో..ఎలా జరుగుతుందనేది అధికారులు గుర్తించాల్సివుంది. అయితే ఇదెందుకు గుర్తొచ్చిందనే అనుమానం కలవచ్చు ఈ న్యూస్ కార్డ్ చదివే పాఠకులకు.. ఇటీవలే రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నేరుగా తాను కూడా వారానికి రెండు రోజులు గ్రామ సచివాలయాలను తనిఖీ చేయడానికి వస్తానని ప్రకటించడంతో అధికారులు ఆఘమేఘాలపై స్పందన ద్రుష్టిపెట్టేశారు. దీనితో మరోసారి సచివాలయాల్లో స్పందన కార్యక్రమం తెరపైకి వచ్చింది. కరోనావేక్సినేషన్ కార్యక్రమానికి ఉదయం 8 గంటలకొచ్చి సాయంత్రం 6 గంటలవరకూ ఉన్నా ఒక్కోసారి వేక్సిన్లు అందించలేకపోతున్నామని.. చాలా మంది ప్రజలు వేక్సిన్ వేసుకోవడానికి ముందుకి రావడం లేదని సచివాలయ ఉద్యోగులు తలలు పీక్కుంటున్నారు. ఈ క్రమంలోనే టార్గెట్లు పూర్తవక్కపోతే మండల అధికారుల ఒత్తిడి, వార్నింగ్ లు మరింత ఇబ్బంది కరంగా మారాయని చెబుతున్నారు. తమకు వారానికి ఒక్కరోజు వచ్చే ఆదివారం సెలవులు కూడా వినియోగించుకోవడానికి వీలులేకుండా విధులు నిర్వహిస్తున్నా గుర్తింపు రావడం లేదని చెబుతున్నారు. వారంలో రెండు రోజులు కరోనా వేక్సినేషన్ కే సమయం మొత్తం వెచ్చిస్తే.. స్పందన కార్యక్రమం ఎలా నిర్వహిస్తామని చెబుతున్నారు. అందులోనూ కార్యాలయానికి వచ్చే వారికి ఎవరి కరోనా ఉందో.. ఎవరికి లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కోవిడ్ వేక్సినేషన్ తోపాటు, సచివాలయంలో కూడా కనీసం హేండ్ శానిటైజర్ గానీ, గ్లౌజులు గానీ, ఫేస్ మాస్కులు గానీ ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జనావాసాల్లో విధులు నిర్వహిస్తూ చాలా మంది సచివాలయ సిబ్బంది కరోనా వైరస్ భారిన పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ విధుల ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలోపు ముగించేసుకోడానికి పూర్తిస్థాయిలో ఆస్కారం వుంటుందని సచివాలయ ఉద్యోగులే చెబుతున్నారు. మిగిలిన సమయం మొత్తం ఫీవర్ సర్వే, కరోనా డ్యూటీలకే సరిపోతుందని చెబుతున్నారు. దానికితోడు చాలా సచివాలయాల్లో ఉన్న సిబ్బంది ఖాళీల ద్రుష్ట్యా మిగిలిన వారి విధులు కూడా ఉన్న సిబ్బందే పంచుకొని చేయాల్సి వస్తుందంటున్నారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన నిర్వహించే విషయంలో జిల్లా అధికారులకు ఏస్థాయిలో క్లారిటీ ఉందో సిబ్బందికి కరోనా వేక్సినేషన్ డ్యూటీలు వేయడాన్ని బట్టి అర్ధమవ్వాలి. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్లు వారానికి రెండురోజులు, సచివాలయ జాయింట్ కలెక్టర్లు వారానికి 4 రోజులు సచివాలయ సందర్శన చేయాలనే సీఎం ఆదేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ విషయంలో జిల్లా అధికారులు కూడా సచివాలయ సిబ్బందికే ఈ కరోనా వేక్సినేషన్  విధులు అప్పగించడంతో రాష్ట్రంలో చాలా మంది జిల్లా కలెక్టర్లుగానీ, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు సచివాలయాల్లోని స్పందన కోసం పట్టించుకోకపోవడం కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. విశేషం ఏంటంటే కరోనా సెకెండ్ వేవ్ లో అన్ని ప్రభుత్వశాఖల అధికారులకూ, సిబ్బందికి విధి నిర్వహణ సమయంలో కొంత వెసులుబాటు(ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12) ఇచ్చినా సచివాలయ సిబ్బందికి ఇవ్వలేదు. అలాగే నేటికీ సెలవుల సమయం అంటే 2వ శనివారాలు, ఆదివారాల్లోనూ నేడు గ్రామసచివాలయ సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇన్ని జరిగినా నేటికీ సచివాలయ ఉద్యోగుల కోసంగానీ, విధులు, సమయం కోసం గానీ ఆలోచించిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదని చెబుతున్నారు. ఇలాంటి కారణాలే గ్రామసచివాలయాల్లో స్పందన సక్రమంగా జరగకపోవడానికి కరోనా రూపంలో మోకాళ్లు అడ్డుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లా స్థాయిల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆలోచిస్తే తప్పా గ్రామ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించదనే బలమైన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి కరోనా వేక్సినేషన్ విధులకు సచివాలయ సిబ్బందిని దూరంచేసి.. దానిని వైద్యఆరోగ్య సిబ్బందికే  అప్పగించి.. ప్రభుత్వం ఏ నిర్ణయం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు ఏ స్థాయిలో పరిష్కరిస్తుందో..!

తాడేపల్లి

2021-07-14 10:43:50

Tadepalle

2021-07-14 04:33:49

డిజిపికి మహిళా పోలీసుల కృతజ్ఞతలు..

ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రత, రక్షణకు పెద్దపీటవేస్తూ వారికి తోడుగా ఉండేందుకు మహిళా పోలీసులకు సముచిత స్థానం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కల్పించాలరని మహిళా పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మహిళా పోలీసులు డిజిపి గౌతం సవాంగ్ ను కలిసి  కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయల్లోని 15000 మంది  మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ  జీవో నెంబర్ 59ని జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ, సీఎం ఎంతో ఉన్నత లక్ష్యంతో మహిళా పోలీసులను సాధారణ పోలీసులుగా గుర్తించారని.. తద్వారా గ్రామాల్లోని మహిళలకు ఎంతో రక్షణ ఏర్పడుతుందన్నారు. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ సేవలను మహిళలకు చైతన్యం కల్పించే బాధ్యత మహిళా పోలీసులదేనన్నారు. చక్కగా పనిచేసి..మహిళల కష్టాలకు అంగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా మహిళా పోలీసులు పనిచేయాలని సూచించారు.  పోలీసు శాఖలో అంతర్భాగంగా  రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ శాఖ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని  మహిళా పోలీసులు డిజిపి బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ సర్వీసెస్ డిఐజి జి.పాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-07-13 14:48:35

భారీగా 104అంబులెన్సులకు అనుమతి..

ఆంధ్రప్రదేశ్ ఓ ప్రాధమిక, గ్రామీణ వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 539 అంబులెన్సు వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిని అన్ని పీహెచ్సీలకు 104గా కేటాయించనున్నారు. దీనికోసం రూ.89.27 కోట్లతో 539 అంబులెన్సులు కొనుగోలు చేసి పీహెచ్సీలకు అందించనుంది. ఇప్పటికే 104 అంబులెన్సులు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 539 అంబులెన్సులపై ఏటా రూ.75.82 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ వీటి ద్వారా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త అంబులెన్సుల కొనుగోలుతో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన కూడా జరగనుంది.

Tadepalle

2021-07-13 14:02:59

సీఎం చీఫ్ సెక్రటరీగా ఆర్.ముత్యాలరాజు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా విభాగం(జీఏడి, పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి బాధ్యతల నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మంగళవారం రిలీవ్‌ అయ్యారు. ఆయన స్థానంలో జీఏడీ (పొలిటికల్‌) బాధ్యతలను రేవు ముత్యాలరాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ సీఎస్ ఉద్యోగ విరమణ చేస్తున్న సమయంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ప్రభుత్వం కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమిస్తుందనే విషయంలో అపుడే ప్రాధాన్యత క్రమాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Tadepalle

2021-07-13 13:17:41

నిర్మాణాలన్నీ ఈఏడాదే పూర్తి కావాలి..

రాష్ట్రవ్యాప్తంగా మిగిలి వున్న గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, ఆర్భీకేలు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం ఈ ఏడాది పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వివిధశాఖ అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని నిర్మాణాలు పూర్తి అయితే కార్యకాలపాలన్నీ నూతన భవనాల నుంచి ప్రారంభించాలన్నారు. వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యక్రమంలో పనులు చేపట్టాలని అధికారులనుఆదేశించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని, పల్లెలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. వైయస్సార్‌ జలకళ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమన్న సీఎం దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. చిన్న చిన్న నదులమీద ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యాం తరహా నిర్మాణాలు చేపట్టి నీటిని నిల్వచేయాలన్నారు. కనీసం 3–4 అడుగుల నీరు నిల్వ ఉండేలా ఏర్పాటు చేయడం ద్వారా భూర్భజలాలు బాగా పెరుగుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రిడ్జిల వద్ద ఈ నిర్మాణాలు చేపట్టాలని, వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూరక్ష పథకం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. మరింత సమర్ధవంతంగా అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు.
పంచాయతీరాజ్, రెవెన్యూ, పురపాలకశాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె వి సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, సెర్ప్‌ సీఈఓ పి రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-07-13 12:41:53

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈవో డా.కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జూలై 16న శ్రీ‌వారి ఆల‌యంలో సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం ఉద‌యం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. సాధార‌ణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు. కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, ఆరోగ్య విభాగం అధికారి డాక్ట‌ర్ సునీల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-13 09:47:24

ప్రభుత్వ జీఓలకు కోర్టులో శృంగభంగం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచనలకు, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను సవరించకుండా ఇచ్చిన ప్రత్యేక జీఓలకు హైకోర్టులో శృంగభంగం తప్పడం లేదు. భారత దేశంలోనే గ్రామ వ్యవస్థ ఒక నూతన అధ్యాయం. అలాంటి సచివాలయ వ్యవస్థకు ఆదిలోనే చరమగీతం పాడాలని అనుకుంటున్నారో.. ఏమో తెలీదుగానీ.. ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్ అధికారులు తీసుకుంటున్న ఏ నిర్ణయమైనా సచివాలయ ఉద్యోగులకు వ్యతిరేకంగానే నిలుస్తున్నది. గ్రామాభివ్రుద్ధి కోసం అమలు చేయాల్సిన జీఓనెంబరు 149 లాంటి వాటిని ఖచ్చితంగా అమలు చేయకుండా.. వున్న అధికారాలన్నీ కనీసం డిగ్రీ అర్హత కూడా లేని వీఆర్వోల చేతిలో పెట్టాలంటూ ఇచ్చిన జీఓనెంబరు 2 ప్రభుత్వ ప్రతిష్టకు హైకోర్టు సాక్షిగా భంగం వాటిల్లుతోంది. జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వంశాఖలకు చైర్మన్ గా వుండే జిల్లా కలెక్టర్ మాదిరిగా.. గ్రామాల్లో కూడా సుమారు 14శాఖలకు అధిపతిగా సచివాలయాకు పంచాయతీ కార్యదర్శిలను అధిపతులుగా ప్రభుత్వమే ఒక మంచి వ్యవస్తను ఏర్పాటు చేసింది. అంతాబాగానే వుందనుకున్న సమయంలో ఈ వ్యవస్థ కూడా రెవిన్యూ చేతిలోనే ఉండాలనుకుని భావించిన ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్ లు, సచివాలయాల సిబ్బందికి అందరూ వీఆర్వో కిందనే ఉండాలంటూ వారిని డిడిఓలుగా చేస్తూ జీఓనెంబరు 2 జారీచేసింది. దీనిని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా తోకలవారిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరపున వాదనలు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ ఈ జీఓ కార్యదర్శిలు, సర్పంచ్ ల అధికారాలు హరించేలా వుందని తమ వాదలను వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 సవరణకు, ఏపీ పంచాయతీరాజ్ చట్టానికి ఇది విరుద్ధంగా ఉందని కోర్టుకి విన్నవించారు. దీనితో పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి వీఆర్వోలకు ఈ అధికారాలు ఇస్తూ జీఓ జారీచేసినట్టు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేశారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తు్న్నట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే ఇదే కేసు విషయంపై గతంలో గ్రామ పంచాయతీలు ఉండగా దానికి సమాంతరంగా ఎందుకు గ్రామసచివాలయాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ హైకోర్టు ప్రశ్నించింది కూడా.. ఇపుడు ఆ జీఓనెం-2ను సస్పెండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరుసగా ప్రభుత్వ జీఓలన్నింటికీ కోర్టుల్లో మొట్టికాయలు పడుతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా అధికార బదలాయింపు చేపట్టకపోతే.. కోర్టుకు వెళితే పనిజరుగుతుందనే నిర్ణయంలో కార్యదర్శిలంతా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అనవసర జీఓలను తెరమీదకు తెచ్చి.. అధికార వికేంద్రకరణ చేపట్టే జీఓనెంబరు 149 లాంటి వాటిని మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో డీపీఓలు, కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో కమిషనర్లు తొక్కిపెడుతున్నట్టు సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు భావిస్తున్నారు. తమకు న్యాయం జరగాలన్నా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల కబందహస్తాల్లో వున్న అధికారాలు.. సచివాలయాల వారీగా బదిలీకావాలన్నా హైకోర్టు ఒక్కటే శరణ్యమనే ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరి నుంచి అనుకూలంగా హామీలు కూడా రాలేదని చెబుతున్నారు. తాము ఉద్యోగాల్లోకి నవంబరు నెల వస్తే రెండేళ్లు పూర్తవుతాయని..ఇప్పటికి కూడా తమకు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండానే ప్రభుత్వం తమో పనిచేయిస్తుందని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పంచాయతీ కార్యదర్శిలకు మాత్రం ఒక్కొక్కరికీ రెండు మూడు గ్రామ పంచాయతీలను అదనపు బాధ్యతలు అప్పగిస్తుంది గానీ..తమకు మాత్రం ప్రభుత్వమే ఇచ్చిన జీఓ ద్వారా మాత్రం అధికారాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రత్యేక జీఓలను అమలు చేయడం ఇష్టంట లేని ప్రభుత్వం ఎందుకు జీఓనెంబరు149 విడుదల చేయాలని.. లేదంటే దానిని అధికారికంగా రద్దు చేయాలని గ్రేడ్-5  పంచాయతీ కార్యదర్శిలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమకు అధికారాలు ఇచ్చే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. గ్రామసచివాలయ పరిధిలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నా..కనీసం బ్లీచింగ్ చల్లించాలన్నా.. అత్యవసరంగా ఏపనిచేయించాలన్నా పరుగు పరుగున గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమకు సంక్రమించాల్సిన అధికారాలు తమకు బదలాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకపోయినా.. మరో ఐఏళ్లలో పాత గ్రేడ్1 పంచాయతీ కార్యదర్శిలంతా 80శాతం  ఉద్యోగ విరమణ చేస్తారని, అపుడైనా ఆ అధికారాలు తమకు వస్తాయని.. దానికంటే ముందు ప్రభుత్వమే జీఓనెంబరు 149 అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ సచివాలయ కార్యదర్శిదర్శిలకు సచివాలయాల వారీగా అధికార బదలాయింపు చేస్తే ప్రభుత్వ లక్ష్యం..గ్రామాల అభివ్రుద్ధి..ప్రజలకు సేవలు పూర్తిస్థాయిలో అందుతాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జాబ్ కేలండర్ విషయంలో ప్రభుత్వ తీరుపై గుర్రుగా వున్న నిరుద్యోగుల మాదిరిగానే..సచివాలయ ఉద్యోగులు కూడా తమ డిమాండ్ ను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కనిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వున్న మంచి అభిప్రాయం కోల్పోవడమే కాకుండా..గ్రామస్థాయిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే సచివాలయాల్లో అధికారాలు తమకు బదలాయింలేదనే బాధతో చాలా చోట్ల గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరగుతుంది. ఈ తరుణంలో రాబోయో పరిణామాలు ఏ విధమైన మలుపుతిరుగుతాయో చూడాల్సి వుంది..! 

Tadepalle

2021-07-13 02:17:04