1 ENS Live Breaking News

సచివాలయాలకు సాంకేతిక మోకాలడ్డు..

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సాంకేతికత మోకాలడ్డుతోంది. లక్షా 16 వేల మంది సిబ్బంది, 10వేల 5 గ్రామ,వార్డు సచివాలయాలు.. అదనంగా మరో 8వేల మంది గతంలోని పంచాయతీ కార్యదర్శిలు. ఉద్యోగుల పరంగా భారీ ఉద్యోగులున్న 4వ ప్రభుత్వ శాఖ గ్రామ,వార్డు సచిలయ శాఖ. కాకపోతే ఇఅన్నీ పేరులోనే బలంగా కనిపిస్తున్నాయి. వారందరినీ జిల్లాలో పరిపాలించడానికి  జాయింట్ కలెక్టర్లుగా 13 మంది ఐఏఎస్ అధికారులు ఇంతటి మహత్తర వ్యవస్థను ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ సర్కారు.. అదే స్థాయిలో సాంకేతికను అంది పుచ్చుకోవడంలో ఘోరంగా విఫలమైందనే చెప్పాలి.. దానికి కారణం కూడా లేకపోలేదు. అందుబాటులో సాంకేతిక, వనరులున్నా వాటిని వినియోగించుకోలేకపోవడమే. నేటికీ సంక్షేమ పథకాలు అందించానికి వినియోగించే మొబైల్ యాప్స్ ని పూర్తిస్థాయిలో సచివాలయ వెల్పేర్ అసిస్టెంట్లుగానీ, వాలంటీర్లు, మండల స్థాయి అధికారులు సైతం వాడలేకపోతున్నారంటే కారణం ఒక్కటే సాంకేతికతను ఉద్యోగులకు దగ్గర చేయలేకపోవడం. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ సిబ్బంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్స్ పూర్తిస్థాయిలో పనిచేయాలి. అంతకంటే ముందుగా సదరు గ్రామ, వార్డు సచివాలయశాఖ వెబ్ సైట్లు కూడా పరిపూర్ణంగా పనిచేయాల్సి వుంది. అంతేస్థాయిలో వీటి నిర్వహణకు కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కానీ సచివాలయ శాఖలో సిబ్బందిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చూపించిన శ్రద్ధ.. తరువాత వారి ద్వారా ప్రజలకు సేవలందించడానికి ఎలాంటి అడ్డంకి సాంకేతికత విషయంలో అడ్డుకాకుండా ఉండేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మొత్తం కార్యకలాపాలన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. అలాంటి సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలకు ఉపయోగ పడేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలోనే ఒక ఐటీ విభాగాన్ని, హ్యూమన్ రీసోర్స్ కేంద్రాలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా  ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సుగమం అయ్యేది. వాటిని ఏర్పాటు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది సాంకేతికతకు చాలా దూరంలోనే ఉండిపోతున్నారు. పనిజరుగుతుందంటే అంతా బాగనే వుందనుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏ స్థాయిలో సాంకేతికను అదిగమించి ప్రజలకు సేవలందిస్తున్నామనే విషయాన్ని జిల్లా స్థాయిలో గ్రామ, సచివాలయ శాఖ జెసిలుగానీ, జిల్లా కలెక్టర్లు గానీ, రాష్ట్రస్థాయిలో కమిషనర్లు, ఈశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి కూడా ఆలోచించడం లేదు. వాస్తవానికి ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత వారికి శిక్షణ, సాంతికత, ఐటి పరికరాలు, ఇంటర్నెట్, కంప్యూటర్లు, ఇలా అన్నీ ఒక ప్రోటోకాల్ పద్దతిలో అందించాలి. అత్యధిక వినియోగాన్ని ద్రుష్టిలో ఉంచుకొని ఇవ్వాల్సిన ట్యాబ్ లు నాణ్యతలోపించడంతో అపుడే వాలంటీర్ల దగ్గర ఫోన్లు మొరాయిస్తున్నాయి.. ఇచ్చిన మొబైల్ సిమ్ లు పనిచేయకపోవడంతో వారి సొంత మొబైల్ ఫోన్లు వినియోగించి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు. ఆఖరికి సచివాలయాల్లో స్పీడ్ గా వచ్చే ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకపోవడంతో ఆన్ లైన్ కార్యకాలాపాలన్నీ చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. సంక్షేమపథకాలు అమలు చేసే యాప్ లు కొత్త వెర్షన్లు, కొత్త ఆప్షన్లు జోడించినపుడు వారికి వాటిని ఏ విధంగా వినియోగించాలో ప్రత్యేక శిక్షణా కేంద్రం ద్వారా వారికి మార్గదర్శకాలు ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. గ్రూపులో కొత్త వెర్షన్ యాప్ పెట్టాం. దానినే వినియోగించండి అని ఒక్క మెజేస్ పెట్టి ఊరకుండిపోతున్నారు. దీనితో ఒక్కోసారి అవి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో ఇనిస్టాల్ కాక వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయోమెట్రిక్ యంత్రాలు కొరత, ఐరిష్ పరికరాల లేమి ఇలాం సాంకేతిక పరంగా చాలా లోపాలతోనే సచివాలయ సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. పాడైన మొబైల్ ఫోన్ల స్థానంలో ప్రభుత్వం వాటిని రిపేర్లు చేయించే ఇచ్చే సహాయం కూడా చేయడం లేదు. దానికితోడు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్న తరువాత వీరికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదు. అప్పటికప్పుడు నెల రోజులు శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఫలితంగా చాలా పనులు మందకొడిగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని చాలా సచివాలయాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రింటర్లు కూడా మూలకు చేరిపోయాయి. దీనితో గ్రామపంచాయతీల్లో వినియోగిస్తున్న కంప్యూటర్లు, ప్రింటర్లు వినియోగించాల్సి వస్తుంది. ఇలా అడుగడుగునా సాంకేతిక విషయంలో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇచ్చిన టార్గెట్లు పూర్తికాకపోయినా అధికారుల నుంచి తిట్లు, చీవాట్లు కూడా వీరే పొందాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ వ్యవస్థలో లోపాలను గుర్తించి, సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కొంత మంది సాంకేతిక సిబ్బందిని, జిల్లాకొక హ్యూమన్ రీసోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే తప్పా ప్రభుత్వ సేవలకు అడ్డంకిగా వున్న అరకొర సాంకేతికను అదిగమించడానికి ఆస్కారం వుండదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.!

Tadepalle

2021-07-13 01:28:09

రాష్ట్రమంతటా ఒకేలా కర్ఫ్యూ..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేత, 10 గంటల తర్వాత కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కోవిడ్‌ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది.

Tadepalle

2021-07-12 16:59:20

మాస్క్ లేకపోతే రూ.100 ఫైన్..

కోవిడ్‌ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్‌ కమిటీలు మాస్క్‌లు ధరించేలా చూడాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.

Tadepalle

2021-07-12 16:52:22

ఆల్ పాస్ కాదు..గ్రేడింగ్ ఇస్తారు..

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా 'ఆల్‌ పాస్‌'కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019-20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల 'ఆల్‌ పాస్‌'గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన సమ్మేటివ్, ఫార్మేటివ్‌ పరీక్షల మార్కుల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇవ్వనున్నారు. గతేడాది కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేక రాష్ట్ర విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. వారి ధ్రువపత్రాల్లో సబ్జెక్టులకు గ్రేడ్లు బదులు.. పాస్‌ అని మాత్రమే ఇచ్చారు. దీంతో వారి ఉన్నత చదువులకు ఇబ్బందులేర్పడ్డాయి.

చదువులకే కాకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా వచ్చే ఉద్యోగాలను పొందే విషయంలోనూ గ్రేడ్లు, మార్కులు లేకపోవడం వల్ల నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరం విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించాలని విద్యా శాఖ నిర్ణయించింది. దీనిపై ఛాయారతన్‌(రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి) నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ చర్చించింది. 2019-20 విద్యార్థులకు ఫార్మేటివ్‌-1, ఫార్మేటివ్‌-2, ఫార్మేటివ్‌-3, సమ్మేటివ్‌-1 పరీక్షలు జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని వారికి ఇప్పుడు గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఒక్కో ఫార్మేటివ్‌ పరీక్షకు 20 మార్కులు చొప్పున 60 మార్కులుగా, సమ్మేటివ్‌ పరీక్షకు 40 మార్కులుగా పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఇందులో వీరికి కూడా ఎక్కువ మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల సగటును తీసుకొని పబ్లిక్‌ పరీక్షల గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. హైపవర్‌ కమిటీ తుది నివేదిక తర్వాత విద్యా శాఖ ఫలితాలు ప్రకటిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అత్యున్నత స్థాయి కమిటీ త్వరలోనే తన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. దాని ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటిస్తారు.

Tadepalle

2021-07-12 16:49:58

GoNo-2ను సస్పెండ్ చేసిన హైకోర్టు..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో జీఓనెంబరు2 విషయంలో మరోసారి చుక్కెదురైంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీఓను సోమవారం ఆంధ్రప్రదేశ్  హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‌వోలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. అయితే దీనిని సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా తోకలవారిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరపున వాదనలు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ ఈ జీఓ కార్యదర్శిలు, సర్పంచ్ ల అధికారాలు హరించేలా వుందని తమ వాదలను వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 సవరణకు, ఏపీ పంచాయతీరాజ్ చట్టానికి ఇది విరుద్ధంగా ఉందని కోర్టుకి విన్నవించారు. దీనితో పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటివరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను వీఆర్‌వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి వీఆర్వోలకు ఈ అధికారాలు ఇస్తూ జీఓ జారీచేసినట్టు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేశారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తు్న్నట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే ఇదే కేసు విషయంపై గతంలో గ్రామ పంచాయతీలు ఉండగా దానికి సమాంతరంగా ఎందుకు గ్రామసచివాలయాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించింది కూడా ఇపుడు జీఓనెం-2ను సస్పెండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు తీర్పుని పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బుచ్చిరాజు స్వాగతించారు. డిడిఓ అధికారాలు కార్యదర్శిలకే ఉండాలన్నారు. పంచాయతీ కార్యకాలపాలపై వీఆర్వోలకు ఎలాంటి అవగాహన కూడా లేదని పేర్కొన్నారు. నిరంతరం పనిచేసే కార్యదర్శిలకు అధికారాలు ఉండటం వలన ప్రజలకు మంచి సేవలు అందించడానికి వీలుపడుతుందన్నారు. కాగా ఇదే విషయమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరువాత ఎదురైన అంశాలన్నీ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా కూడా ప్రత్యేక కధనాలు అందించింది. ముఖ్యంగా ఈఎన్ఎస్ లైవ్ ప్రస్తావించిన ఆర్టికల్ 73 విషయంలో కోర్టు ఆ జీఓను సస్పెండ్ చేయడం చర్చనీయాంశమవుతోంది..

Tadepalle

2021-07-12 16:40:52

గ్రామసచివాలయ జెసీలకే క్లారిటీ లేదు..

ప్రజలకు ఇంటిముంగిటే అన్నిరకాల సేవలు అందించాలనే ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏ విధంగా పరిపుష్టం చేయాలో ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన  గ్రామ, వార్డు సచివాలయ శాఖ జాయింట్ కలెక్టర్లుకు నేటికీ క్లారిటీ రాలేదు. ఎప్పుడు సచివాలయాలను సందర్శించినా ప్రజలకు మంచిసేవలందించాలి.. బాగా పనిచేయాలి.. ప్రభుత్వానికి పేరుతేవాలని.. బాగ పనిచేయకపోయినా అలక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు తప్పితే.. భారతదేశంలో ఒక వినూత్న వ్యవస్థగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను ఏ తరహా అభివ్రుద్ధి చేయాలి.. ఏం చర్యలు తీసుకుంటే లోపాలను పరిష్కరించవచ్చు.. ఏ జీఓలు అమలవుతున్నాయి.. ఎందుకు పంచాయతీ కార్యదర్శిలు గ్రేడ్-5  కార్యదర్శిలకు అధికారాలు, బాధ్యతలు అప్పగించలేదు.. జీఓ నెంబరు 149ని ఎందుకు అవహేలన చేస్తున్నారనే విషయాన్ని నేటికి రాష్ట్రంలో ఒక్క జాయింట్ కలెక్టర్ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.. కాదు కాదు వారికే క్లారిటీలేకుండా పోయింది. ఏదో మొక్కుబడిగా సందర్శనలు చేశామా..వెళ్లామా అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.. అలాగని జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారులు సైతం గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో అమలు కానీ జీఓల అంశాన్ని జాయింట్ కలెక్టర్లకు వివరించడం లేదు. ఇదంతా చూస్తుంటే.. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభుత్వ జీఓలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క జీఓ నెంబరు 149 మాత్రమే కాదు. గ్రామ,వార్డు సచివాలయ శాఖకు కమిషనరేట్ నుంచి వచ్చే 14 ప్రభుత్వశాఖలకు చెందిన ఏ జీఓలు కూడా సచివాలయాలకు చేరడంలేదు. అమలు జరగడం లేదు. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేక కధనాల రూపంలో తీసుకొస్తూనే వుంది. అయితే ఇక్కడ ప్రధాన సమస్య గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలకు తమ చేతిలో వున్న అధికారం ఇచ్చే ఉద్దేశ్యం లేనట్టుగా కనిపిస్తుంది. అక్కడికీ వీరే గ్రేడ్-5 కార్యదర్శిలను సచివాలయాల్లో నియమించినట్టు, జేబుల్లోనుంచి జీతాలు జీతాలు ఇస్తున్నట్టు..వారంతీ వీరి కింద సబార్డినేట్ ఉద్యోగులుగానే చూస్తూ తెగఫీలైపోతున్నారట. అదొక్క కార్యదర్శిల విషయంలోనే కాదు..అటు మహిళా పోలీసుల విషయంలో కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు కూడా అలానే ఫీలైపోతున్నారు..అసలు వీరిని పోలీసులగా ఎలా గుర్తిస్తామని.. వీరికి ప్రభుత్వం ఎందుకు పోలీస్ అనే పదం తగిలించిందో అర్ధం కావడం లేదని తెగ మదన పడిపోతున్నారు.. అటు వీఆర్వోలు కూడా ప్రభుత్వం తమకిచ్చిన డీడీఓ ఉత్తర్వుల పరంగా తామే సచివాలయాకు ప్రధాన అధికారులమంటూ వ్యవహరిస్తున్నారు.  వ్యవసాయశాఖలో అయితే చెప్పాల్సిన అగ్రికల్చర్ అసిస్టెంట్లు కనీసం సచివాలయం మొహం కూడా చూడటం లేదు వీరంతా ఆర్బీకేలకే పనిమితం అయిపోతున్నారు..సర్వేయర్లకు ప్రభుత్వం సమగ్ర భూ సర్వే పని అప్పగించడంతో వారూ సచివాలయాలకు దూరంగానే ఉంటున్నారు.. ఆరోగ్యశాఖకు చెందిన ఏఎన్ఎంలంతా వారి పీహెచ్సీ వైద్యులు సూచించిన విధుల్లో నిమగ్నమవుతున్నారు..ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మొత్తం కొత్త భవనాల నిర్మాణాలకే అంకితం అయిపోతున్నారు.. అలాగనీ విరికి ప్రభుత్వం వీరి విధులు, బాధ్యతల విషయంలో ఏమైనా జీఓ ప్రకారం సూచించిందా అదీ లేదు. ఈ క్రమంలో సచివాలయాలు వచ్చినా.. సచివాలయ ఉద్యోగులంతా తమ కిందే పనిచేయాలంటూ పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శిలు హుకుం జారీ చేస్తున్నారు. తమ అధికారాల విషయంలో ఎవరికి వారు తామే బాసులమని బల్లగుద్ది చెబుతున్నారు. సచివాలయాల్లో మాత్రం గ్రేడ్1 కార్యదర్శిలు అధికారాలు బదలాయించకుండా మొండి పట్టుదలతో ఉండిపోయినా.. వారికి మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారులు వత్తాసు పలుకుతూ రావడం వలన నేటికీ అధికార వికేంద్రీకరణ జీఓ నెంబరు 149 ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు చేరడం లేదు. మరో ఆరునెలల్లో సచివాలయ ఉద్యోగుల సర్వీసు కూడా క్రమ బద్దీకరణ పూర్తవుతుంది. అయినప్పటికీ వీరికి అధికారికంగా చేసే పనులపై ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగని వున్న జీఓలను కూడా అమలు చేయలేదు. దీనితో తాము ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామో కూడా తెలియడం లేదని, ప్రభుత్వం తమను ఎందుకు నియమించిందో నేటీకీ మాకు అర్ధం కావడం లేదని గ్రేడ్-5 కార్యదర్శిలంతా తలలు పట్టుకుంటున్నారు. అలాగని పంచాయతీరాజ్ శాఖ, గ్రామ, వార్డు సచివాలయ శాఖల్లో కమిషనర్లు అయినా ప్రభుత్వ జీఓలను జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశిస్తున్నారా అంటే అదీ కనిపించడం లేదు. సచివాలయాలు వచ్చిన తరువాత డిడిఓలుగా వీఆర్వోలను చేస్తూ ఇచ్చిన జీఓనెంబరు 2ను మాత్రం ఆగమేఘాలపై అమలు చేసింది ప్రభుత్వం. అలాగని గతంలో విడుదల చేసిన జీఓ నెంబరు 149 అమలు చేయాలంటే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టు వ్యవహరిస్తోందని కార్యదర్శిలు వాపోతున్నారు. అసలు ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేసే ఉద్దేశ్యం లేనపుడు ఎందుకు వాటిని విడుదల చేయాలని..అందులో నియమ నిబంధనలను ఎందుకు పొందు పరచాలని ప్రశ్నిస్తున్నారు. మొట్టమొదటి సారిగా ఉద్యోగాల్లోకి వచ్చిన తమకు ప్రభుత్వం జారీ చేసిన జీఓలను అమలు చేయకపోతే తమకు ప్రభుత్వం మీద ఏం నమ్మకముంటుందంటూ పెదవి విరిస్తున్నారు. ఒక శాఖలో పనిచేసే ఉద్యోగికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా పనిచేయమంటే ఎలా పనిచేస్తామని వీరంతా ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో శానిటేషన్ దగ్గర నుంచి, ఇంటి పన్నుల వసూలు, వివిధ రకాల అనుమతులు ఇలా ఏ విషయానికైనా గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. కనీసం శానిటేషన్ సిబ్బందితో పనిచేయించుకునే అధికారం కూడా లేకపోతే తమ ఉద్యోగాలు దేనికి పనిచేస్తాయంటూ మండి పడుతున్నారు. ఒక్క గ్రామ పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలే కాకుండా..సచివాలయాల్లోన్ని మొత్తం 14శాఖల ఉద్యోగులకు తాము ఏశాఖ కిందకి వస్తామో కూడా తెలియని పరిస్థితి సిబ్బందిలో నెలకొందని.. ఈవిషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన గ్రామ, వార్డు సచివాలయశాఖ జాయింట్ కలెక్టర్లు పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే వాస్తవాలు తెలుస్తాయని వాపోతున్నారు. లేదంటే పేరుకి సచివాలయ సిబ్బందిగా మాత్రమే పనిచేస్తున్నా.. ఎలాంటి అధికారాలు లేని ఉద్యోగాలు ఎలా చేయాలో కనీసం ఉన్నతాధికారుల దగ్గరున్నఆలోచనలు చెప్పినా బావుంటుందని..లేదంటే తామని ప్రభుత్వం ఎందుకు నియమించిందో నేటికీ క్లారిటీ రాకపోతే ప్రజలకు ఏ విధంగా సమాధానాలు చెబుతామని సచివాలయాలను దగ్గరుండి నిర్వహించాల్సిన గ్రేడ్-5 కార్యదర్శిలు నెత్తీ నోరూ కొట్టుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిల దగ్గర నుంచి అధికారాలు, శానిటేషన్ సిబ్బంది, తమ పరిధికి చెందిన రికార్డులు అసలు అప్పగిస్తుందా..లేదంటే వీరిని పేరుకే సచివాలయ కార్యదర్శిలుగా నియమించాం తప్పితే..అధికారాలు..డిప్యుటేషన్ బాధ్యతలు గ్రేడ్-1 కార్యదర్శిల చేతిలోనే ఉంచుతామని ప్రకటిస్తుందా అనేది తేలని ప్రశ్నిగా మారింది..చూడాలి ఏం జరుగుతుందో..!

Tadepalle

2021-07-11 03:29:09

Tadepalle

2021-07-10 12:55:17

మళ్లీ తెరపైకి జర్నలిస్టుల విద్యార్హతలు..

ఆంధ్రప్రదేశ్ లో కార్డు (అక్షరం రాయడం రాకపోయినా వైట్ అండ్ వైట్ డ్రెస్సేసుకొని కలరిచ్చే) జర్నలిస్టుల ను నియంత్రణ చేయాలంటే అక్రిడిటేషన్ల జీఓలో మార్పులు మాత్రమే చేస్తే సరిపోదని.. విద్యార్హతల విషయంలో గట్టిగా వ్యవహరించాలని ప్రభుత్వం ఒక ఆలోచన వచ్చినట్టు కనిపిస్తుంది. మండల కేంద్రాల్లో ఖచ్చితంగా ఇంటర్, జిల్లా కేంద్రాల్లో డిగ్రీ, స్టాఫ్ రిపోర్టర్లకు జర్నలిజంలో డిప్లమాలేదా, డిగ్రీ, పీజీ కోర్సులను అర్హతలుగా చేసి పక్కాగా అమలు చేస్తే ఆటోమేటిక్ గా కార్డు జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోతుందనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. దానినే నిజం చేస్తూ.. ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశరాజధాని డిల్లీలోని పిఐబి అక్రిడిటేషన్ కు కూడా లేని నిబంధనలను  తీసుకొచ్చింది. ఈ విషయంలో కోర్టు నుంచి కూడా అనుకూలంగా ఉత్తర్వులు పొందింది.  ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈసారి ప్రెస్ అక్రిడిటేషన్లకు సుమారు 40వేల మంది ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారు. గత ఏడాది అక్రిడిటేషన్ల సంఖ్య చూస్తే కేవలం 28వేల మందికే మంజూరు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ తరుణంలో కార్డు జర్నలిస్టులు అధికమై పోయారని.. అందులో వర్కింగ్ జర్నలిస్టులను మాత్రమే గుర్తించి కార్డు లేదా నకిలీ జర్నలిస్టులను పూర్తిగా ఏరిపారేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టమవుతుంది. దీనికోసం ప్రభుత్వం అక్రిడిటేషన్ జిల్లా కమిటీలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు తావులేకుండా చేయడంతో పైచేయి సాధించింది ప్రభుత్వం. వాస్తవానికి జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచ జర్నలిస్టు సంఘాలకు నాయకులమని చెప్పుకునే వారికి ప్రభుత్వం విడుదలచేసిన జీఓ కాపీలను ఇంగ్లీషులో చదివి..ఆపై జిల్లా చైర్మన్ కు అందులోని లోటు పాట్లను చెప్పే సామర్ధ్యం లేనివారే అధికంగా జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులు ఉంటూ వస్తున్నారు. దీనితో ఇలాంటివారికి చెక్ పెట్టాలంటే ముందు వారికి సమావేశాల్లో ప్రాతినిథ్యం లేకుండా చేసింది ప్రభుత్వం. దెబ్బతికి అక్రిడిటేషన్ కమిటీల్లో ఆ..తరహా జర్నలిస్టులకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం చిన్న, మధ్యతరహా పత్రికలు, ప్రధాన పత్రికలు, న్యూస్ టీవీ ఛానళ్లు, లోకల్ కేబుల్ టీవీలు, న్యూస్ ఏజెన్సీలకు జిఎస్టీ మెలిక పెట్టింది ప్రభుత్వం. నిత్యం పత్రికలు ముద్రించాలని..ఎన్ని పత్రికలు ముద్రిస్తున్నారో దానికి అనుగుణంగా జీఎస్టీ రిటర్న్ లు దాఖలు చేయాలని, క్లిప్పింగులు కూడా ఆన్ లైన్ లో పెట్టాలని, విద్యార్హతలతోనే మీడియా సంస్థలకు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేయాలన్ని ప్రస్తుతం సమాచారశాఖ ప్రధాన నిబంధన. పెద్ద పత్రికలు జీఎస్టీ రిటర్న్స్, క్లిప్పింగులు, ఇతర అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్నవారికి, టివి ఛానళ్లకు అపుడే అక్రిడిటేషన్లకు లైన్ క్లియర్ అయిపోయాయి. అయినప్పటికీ అలా మంజూరైన వారిలోనూ.. ఇంకా  కనీస విద్యార్హత లేనివారు చాలా మందే ఉన్నారని అలాంటి వారిని పూర్తిగా వడపోసి వర్కింగ్ జర్నలిస్టులను గుర్తిస్తూ వారికే అక్రిడిటేషన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా  సమాచారశాఖలోని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న విద్యార్హతల విషయంలో ప్రధాన జర్నలిస్టు సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో వారికి సర్ధిచెప్పి.. ఎలాగైనా కనీస విద్యార్హతలు నిర్ణయించి దానిని అమలు చేయాలని భావిస్తుంటద సమాచారశాఖ. అదే జరిగిగే రాష్ట్రంలోని చాలా మంది కార్డు/నకిలీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పొందే అర్హత రాదు. అలాగని మీడియా సంస్థలు అక్రిడిటేషన్లు అమ్ముకోవాలని చూసినా ఆ ప్రయత్నం కూడా ఫలించకుండా ఈ ప్రభుత్వంలోనే కఠిన చర్యలు తీసుకొని వర్కింగ్ జర్నలిస్టులను, చిన్న, మధ్య తరహా పత్రికలను కూడా ఒకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రిడిటేషన్ల మంజూరు ఆలస్యమైందని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కోర్టులో ఈ విషయం ఉండటం ఆలస్యం అమవడం ఒక కారణమైతే..తప్పకుండా జర్నలిస్టుల విద్యార్హత, నిజమైన జర్నలిస్టులను గుర్తించే కార్యక్రమం అమలు చేయకపోతే కార్డుకోసం..పైరవీలు చేయడం కోసం అక్రిడిటేషన్లు తీసుకునే వారు ఎక్కువైపోతారనేది ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది. కరోనా సమయంలో చిన్న, మధ్య తరహా పత్రికలు ముద్రించలేనివారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి కూడా ప్రభుత్వం మినహాయింపు ఇవ్వలేదు. జీఓ ప్రకారం అనుబంధ పత్రాలు ఆన్ లైన్ అప్లోడ్  చేస్తే అక్రిడిటేషన్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది సమాచార శాఖ. గతంలో న్యూస్ ఏజెన్సీలు ఒక లేఖ ఇస్తే అక్రిడటేషన్లు ఇచ్చేవారు. ఇపుడు వారు కూడా ఇతర మీడియా సంస్థల మాదిరిగానే అనుబంధ ధ్రువపత్రాలు ఆన్ లైన్ లో సమర్పించాల్సి వుంది. అలా చేసిన వారి దరఖాస్తులే పరిగణలోనికి తీసుకుంటామని కూడా చెబుతోంది ప్రభుత్వం. కాగా ఇప్పటికే పక్కరాష్ట్రం తెలంగాణలో ఈ విద్యార్హత పక్కాగా అమలు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్ లో కూడా దీనిని కాస్త గట్టిగానే అమలు చేసేలా కనిపిస్తున్నారు అధికారులు. అంతేకాదు ఇప్పటికే సమాచారశాఖ మంత్రి పేర్నినాని ఇదే నకిలీ, అర్హతలేని జర్నలిస్టుల విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఎప్పుడు జర్నలిస్టుల సంఘాలు కలిసినా ప్రస్తావించడం కూడా ఇపుడు జర్నలిస్టుల విద్యార్హత విషయానికి ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. చూడాలి ప్రభుత్వం జర్నలిస్టుల విద్యార్హత విషయంలో కట్టుబడి వుంటుందా..లేదంటే జర్నలిస్టు సంఘాల ఒత్తిడికి తలొగ్గుతుందా..ఎప్పటిలాగే కాలం వెళ్లదీస్తూ ఉండిపోతుందా..?!

Tadepalle

2021-07-10 01:44:00

సేవలు బారేడు.. అనుసంధానం మూరెడు..

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు గ్రామ/వార్డుల్లోనే అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకి ఇంకా బాలారిష్టాలు తీరలేదు. ఇబ్బడి ముబ్బడిగా సేవలు ప్రకటించేసిన ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటికీ అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అనుసంధానం పూర్తికాలేదు. కేవలం రాష్ట్వ్యాప్తంగా కొన్ని సచివాలయాలకు మాత్రమేమే సిఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్) విధానాన్ని తీసుకొచ్చింది. అన్ని జిల్లాల్లో ఉన్న సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్టు క్రింద 50శాతం మాత్రమే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనితో ప్రభుత్వం ప్రకటించిన 745 సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. వీటికి తోడు సచివాలయాలకు ఇంటర్నెట్ ప్రధాన సమస్యగా మారుతోంది. అన్ని గ్రామ సచివాలయాలకు ఇంటర్నెట్ స్పీడ్ రాకపోవడంతో చాలా కార్యకలాపాలు ఆదిలోనే నిలిచిపోతున్నాయి. వీరికి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందించింది. అయితే అది సాధారణంగా గ్రుహ అవసరాలకు ఇచ్చే ప్యాకేజీతో అందించడం వలనే స్పీడ్ రాక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సచివాయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు చెబుతున్నారు. వారంలో మూడు రోజులు ఇంటర్నెట్ స్పీడ్ సమస్యను సచివాలయాలు ఎదుర్కొంటున్నాయి. వీటికిత తోడు ప్రభుత్వం సాధారణ కంప్యూటర్లు, ప్రింటర్లు మాత్రమే సచివాలయాలకు అందించింది. అపుడే చాలచోట్ల కంప్యూటర్లకు రిపేర్లు వచ్చాయి. ప్రింటర్లు పనిచేయకపోవడంతో డిజిటల్ అసిస్టెంట్లే తమ సొంత నిధులతో వాటిని బాగు చేయిస్తున్నారు. ఒక్కో సచివాలయానికి ప్రభుత్వం రెండు కంప్యూటర్లును మంజూరు చేసింది.  14 మంది సిబ్బంది ఒక సిస్టమ్ ను మాత్రమే దశల వారీగా వినియోగించుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఉద్యోగులు ఆ ఇబ్బందులు పడలేక సొంతంగా ల్యాప్ ట్యాప్ లు సొంతంగా తీసుకెళ్లి పనిచేసుకోవాల్సివస్తుంది. మరికొంత మందికి ల్యాప్ టాప్ లు అందుబాటులోల లేని చోట్ల చాలా పనులు పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి. ప్రభుత్వం సేవలు పెంచిన తరువాత కామన్ సర్వీస్ సెంటర్ విధానాన్ని గ్రామసచివాలయాలకు అనుసంధానం చేస్తే ఇటు రాష్ట్రప్రభుత్వ శాఖలతోపాటు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అనుమతులు కూడా గ్రామ స్థాయిలోని సచివాలయాల నుంచే ఇవ్వడానికి ఆస్కారం వుంటుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖాలాలు ఎక్కడా కనిపించడం లేదు. పైగా కొత్తగా చేర్చిన సేవలపై సిబ్బందికి ఎలాంటి శిక్షణ కూడా లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అంతేకాదు ఆ సేవల వివరాలు ఏంటో ఇప్పటికీ సచివాలయ సిబ్బందికే తెలియని పరిస్థితి నెలకొంది. కనీసం గ్రామ, వార్డు స్థాయిల్లోని సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అందించేసేవలపై అవగాహన ఉంటే వారు వాలంటీర్లకు తెలియజేసి.. ప్రజలకు ఆ సేవలను చేరువ చేస్తారు. కానీ అలా ప్రోటోకాల్ స్థాయిలో ప్రభుత్వం ఇక్కడ అందించే సేవలపై ప్రజలకు గానీ, సిబ్బందికి గానీ అవగాహన కల్పించలేదు. దీనితో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది రాష్ట్రంలోని గ్రామసచివాలయాల సేవల పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలపై సచివాలయాల్లో ప్రత్యేక డిస్ప్లే  చార్టులు ఏర్పాటు చేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లలకైనా సచివాలయాల్లో అందే సేవలపై ప్రత్యేక ప్రచారం, అవగాహన కల్పించాల్సిన సమయం ఆశన్న మైంది.  ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు అవసరం ఉండటం, అందులో చాలా లోపాలు ఉండటంతో వాటిని గ్రామ స్థాయిలో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దానికోసం చాలా మంది అవగాహన లేనివారం  మేసేవా కేంద్రాలను, బ్యాంకుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలకు వెళుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే అత్యధిక ఆదాయం వీటిద్వారానే పోతుంది.  వచ్చే ఆ కొద్దిపాటి ఆదాయం కూడా గ్రామస సచివాలయాలు కోల్పోతే..ఇక్కడ ఎన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగ పడవనే గుర్తించాలి.. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుని సచివాలయాల్లో అందించే సేవల విషయంలో ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి..!

Tadepalle

2021-07-09 01:47:27

స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు షురూ..

రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావడం కోసం అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం పులివెందులసహా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గురువారం పులివెందులలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి.. వారిలో స్కిల్స్ ను పెంపొందించేందుకు రూ. 30 కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 స్కిల్ కాలేజీలు ఇలాంటివి రాబోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పులివెందులలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) లోని హాస్టల్ భవనం సమీపంలో ఈ స్కిల్ ట్రైనింగ్ అకడామీ ఏర్పాటుకోసం ఇప్పటికే 7 ఎకరాల స్థలాన్ని జిల్లా అధికారులు గుర్తించారు. ఈ స్కిల్ అకాడమీలో పులివెందుల పరిసర ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యాలు పెంచడంతోపాటు ఉపాధి కల్పించడం కోసం అధునాతన ఐటి శిక్షణా కార్యక్రమాలతోపాటు సిమెంట్ పరిశ్రమ, మైనింగ్ పరిశ్రమ వంటి ప్రధాన రంగాలలో అధునాతన నైపుణ్య శిక్షణ ఇస్తారు.  రాష్ట్రంలో ఉండే యువతకు పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేయడంతోపాటు.. అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజక వర్గాల్లోనూ స్కిల్ కాలేజీలకు అవసరమైన స్థల సేకరణ పూర్తి చేసింది. స్కిల్ కాలేజీల్లో హైఎండ్ స్కిల్స్ పై శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు స్థానికంగానే 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు కొత్త పరిశ్రమలను ఆకర్శిస్తారు. ఈ స్కిల్ ట్రైనింగ్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు ఐటి, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి బంగారరాజు పాల్గొన్నారు.

Pulivendula

2021-07-08 15:47:55

Tadepalli

2021-07-08 01:31:00

Tadepalli

2021-07-08 01:23:23

గ్రామ రక్షణ ఇక మరింత పటిష్టం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పోలీసుల ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గ్రామాల పటిష్టత మరింతగా పెరగనుంది. జీఓనెంబరు 59 ద్వారా గ్రామ సంరక్షణా కార్యదర్శిలుగా వున్నవారిని ప్రభుత్వం సాధారణ పోలీసులుగా గా మార్చడంతో గ్రామంలో సచివాలయానికి ఒకరు చొప్పున రక్షణగా నిలవనున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లలేని మహిళలకు గ్రామస్థాయిలో సేవలు అందించడానికి మహిళా పోలీసులు సచివాలయం దగ్గర నుంచే స్టేషన్ వరకూ బాధితుల తరుపున ఫిర్యాదులు పంపిస్తారు. అంతేకాకుండా గ్రామాల్లోని అల్లర్లు జరగకుండా, గొడవలు రేగకుండా చూసేందుకు వీరికి ప్రభుత్వం సాధారణ పోలీసులు మాదిరిగా పోలీస్ డ్రెస్ ఇవ్వడంతో గ్రామాలకు ఖాకీ పవర్ ఎంతో పటిష్టం కానుంది. ఇప్పటికే వీరందరికీ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో(ఎస్ఈబీ), పోలీస్ స్టేషన్లు, మండల కార్యాలయాలు, ఐసిడిఎస్ కేంద్రాల్లో శిక్షణ పూర్తయింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో శిక్షణ తీసుకున్న అనంతరం వీరంతా దశల వారీగా క్యాప్సూల్ శిక్షణ కూడా తీసుకుంటారు. ఒంటికి ఖాకీ చొక్కా..చేతిలో లాఠీ పట్టుకొని గ్రామాల్లో అనునిత్యం పహాకాస్తూ ప్రజలకు రక్షణగా నిలవనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చి దిశ యాప్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామ స్థాయి నుంచి వార్డు, పట్టణాల్లో సైతం యాప్ ను విరివిగా అత్యధిక సంఖ్యలో మహిళలు తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేయించే విషయంలో మహిళా పోలీసులు చాలా కీలకంగా వ్యవస్తున్నారు. సాదరణంగా పోలీసులైతే ఒక్క స్టేషన్ విధులకే పరిమితం అవుతారు. కానీ రాష్ట్రప్రభుత్వం వీరిని ప్రత్యేకంగా నియమించడంతో గ్రామ రక్షణతోపాటు, ఐసిడిఎస్, వైద్యం, ఎన్నికల విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ సమయంలో మహిళా పోలీసులు పోషించిన ప్రత్యేక పాత్ర కారణంగా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో అత్యధికంగా మహిళలు, బాలింతలు, ప్రస్తుతం గర్భిణీ స్త్రీలకు కోవిడ్ టీకా అందింది. తద్వారా కరోనా వైరస్ అధికం కాకుండా కాపాడటంలో వీరు ఎంతో కీలకంగా వ్యవహరించారు. రానున్న రోజుల్లో వీరు సచివాలయ పరంగా మరిన్ని విధులు నిర్వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏవైనా గొడవలు జరిగితే ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చేది ఇపుడు ఆ ఇబ్బందులు లేకుండా గ్రామంలోని సచివాలయం కేంద్రంగా ఫిర్యాదులు సమర్పించడంతోపాటు, అత్యవసర సమయంలో వీరిని నేరుగా సంఘటనా స్థలాలకు తీసుకెళ్లే వెసులు బాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కల్పించడం శుభపరిణామ మని గ్రామాల్లో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలకు మహిళా పోలీసులు కవచంలా ఉంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్, కేంద్రం అమలు చేస్తే దిశ చట్టానికి కూడా కార్యరూపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సంరక్షణకు మహిళా పోలీసులు ఒక ప్రత్యేక కవచంలా  తయారుచేస్తుంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ విధానంతో గ్రామాలు, పట్టణాల్లో మహిళా పోలీసులు ప్రభుత్వం ద్వారా ప్రజలకు రక్షణగా నిలవనున్నారు..!

తాడేపల్లి

2021-07-08 01:19:35

Tadepalle

2021-07-07 14:27:47

తల్లిబిడ్డల మృతిపై నివేదికివ్వండి..

పాడేరు ఐటిడిఏ పరిధిలో ప్రసవానికి డోలీలో తీసుకు వెళ్తున్న గర్బిణిస్త్రీ తోపాటు ఆమెబిడ్డ కూడా మరణించిన సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పాడేరు ఐటిడిఏ పి.ఓ ను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి  బుధవారం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జి.మాడుగుల మండలం గెమ్మెలిబారు గ్రామానికి చెందిన కొర్రా జానకి (25) అనే గిరిజన మహిళను కాన్పుకోసం గిడుతూరు గ్రామం నుంచి జి. మాడుగుల ఆసుపత్రికి  తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించిన ఆమహిళతోపాటు బిడ్డ కూడా  మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ సంఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తల్లీబిడ్డల మరణంపై విచారణచేసి నివేదిక సమర్పించాల్సిందిగా బుధవారం పాడేరు ఐటిడిఏ పి.ఓ ను ఆదేశించారు. పాడేరు ఐటిడిఏ పరిధిలో రహదారులు లేని గిరిశిఖర గ్రామాలలో గర్బిణిస్త్రీలకు సంభందించిన సమాచారాన్ని సేకరించి అవసరమైన వారిని ముందుస్తుగానే కాన్పుకోసం ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. రహదారులు లేని కారణంగా డోలీలను ఇప్పటికీ వినియోగిస్తున్న గిరిజన గ్రామాల సమస్యలను తీర్చడానికి, డోలీల సమస్యను శాశ్వితంగా పరిష్కరించటానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించామని వెల్లడించారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  పాముల పుష్ప శ్రీవాణి  ఆదేశాలపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.గోపాలక్రిష్ణ  వెంటనే స్పందించారు. మాత శిశు మరణాలు జరగ కుండా  తగిన చర్యలు చేపడతామన్నారు. కొర్రా జానకి మృతి పై సమగ్రమైన విచారణ చేసి నివేదిక సమర్పించాలని అదనపు జిల్లా వైద్యాధికారి ని విచారణ అధికారిగా నియమించారు. రెండు రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈనెల 9వతేదీన వైద్యాధికారులు,108 వాహన యాజమాన్యం, ఫీడర్ అంబులెన్సుల నిర్వాహకులు తో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిగర్భిణీ స్త్రీలు వసతి గృహం నిర్వహణ , ఐసిడిఎస్  సేవలపై సీడీపీవోలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 

Paderu

2021-07-07 14:12:14