1 ENS Live Breaking News

నెల రోజుల్లో వేక్సినేషన్ పూర్తిచేస్తాం..

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ వేక్సినేషన్ పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అమరావతిలోని తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 శాతానికి 45ఏళ్లు నిండిన వారికి ఒక వ్యాక్సిన్ వేశామని, రాబోయే నెల రోజుల్లో మిగిలిన వారందరికీ పూర్తి స్థాయిలో టీకాలు వేస్తామని చెప్పారు.  సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు పెంచిన స్టయిఫండ్ ను గతేడాది సెప్టెంబర్ నుంచి వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 88,441 శాంపిళ్లు పరీక్షించగా, 10,373 కరోనా కేసులు నమోదయ్యాయని, 80 మంది మృతి చెందారని తెలిపారు. శుక్రవారం 85,311 శాంపిళ్లు పరీక్షించగా,, 10,413 కరోనా కేసులు నమోదయ్యాయని, 83 మంది మృతి చెందారని వెల్లడించారు. గత రెండ్రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలకు అటు ఇటుగా నమోదవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 1,774 ఐసీయూ బెడ్లు, 8,164 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. శుక్రవారం చూస్తే 1,664 ఐసీయూ బెడ్లు, 8,186 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలోనూ రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 12,247 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 3,247 మంది డిశ్ఛార్జి కాగా, 1,248 మంది వివిధ ఆసుపత్రుల్లో అడ్మిషన్ పొందారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో గడిచిన 24 గంటల్లో 406 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్, శుక్రవారం 356 మెట్రిక్ టన్నులను డ్రా చేశామన్నారు. రాష్ట్రంలో 1,460 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించామన్నారు. 104 కాల్ సెంటర్ కు వస్తున్న ఫోన్ కాల్స్ సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. గడిచిన 24 గంటల్లో 3,061 ఫోన్ కాల్స్ రాగా, శుక్రవారం 3,351 కాల్స్ వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఐసోలేషన్ లో ఉన్న 24,706 మంది కరోనా బాధితులతో టెలీ కాల్ మెడిసిన్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్ చేసి మాట్లాడారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు మరణాల రేటు కూడా తగ్గుముఖం పడుతోందన్నారు.

Tadepalle

2021-06-05 14:36:44

వైద్యం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది..

వైద్యఆరోగ్యశాఖలో కరోనాతో బాధపడే వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అమరావతిలోని తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు..  కరోనాతో కారంచేడు పీహెచ్సీ వైద్యులు డాక్డర్ ఎన్ భాస్కరరరావు తీవ్ర అస్వస్థతకు గురై, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారన్నారు. డాక్టర్ భాస్కరరావుకు మెరుగైన వైద్యమందించడానికి రూ.1.50 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయమందించారన్నారు. ఇటువంటి కేసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు రూ.45 వేల నుంచి 70 వేల వరకూ పెంచిన స్టయిఫండ్ ను గతేడాది సెప్టెంబర్ నుంచి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జనవరి నుంచి అమలు చేయాలని తొలుత భావించామని, సెప్టెంబర్ 2020 నుంచి పెంచిన స్టయిఫండ్ అందజేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. కొవిడ్ విధుల్లో పాల్గొంటున్న మూడో సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థులకు కూడా పెరిగిన స్టయిఫండ్ ను అందించనున్నట్లు ఆయన తెలిపారు. పీజీ విద్యార్థులు ఏప్రిల్ 30 తరవాత విధుల్లోకి చేరారని, ఆనాటి నుంచి పెంచిన స్టయిఫండ్ అందిస్తామని తెలిపారు. వారి వార్షిక పరీక్షలను జులై లో నిర్వహించడానికి హెల్త్ యూనివర్శిటీ నిర్వహించనునందన్నారు. పరీక్షల్లో పాల్గొన్నా జులై 31 వరకూ పెంచిన స్టయిఫండ్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. రాష్ట్ర్ర స్థాయి కొవిడ్ కమాండ్ కంట్రోల్ కమిటీ సమావేశం శనివారం జరిగిందన్నారు. ఈ సమావేశంలో థర్డ్ వేవ్ వస్తుందన్న సూచనల మేరకు, ఎంతమంది కరోనా బారిన పడతారో అంచనా వేసి వైద్య పరికరాలు, మందులు కొనుగోలుపైనా, ఐసీయూ బెడ్లు ఏర్పాటుపైనా చర్చించామన్నారు. జిల్లాల వారీగా డేటా సేకరించిన తరవాత ఆ కమిటీ ఇచ్చే రిపోర్టును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామన్నారు. 

Tadepalle

2021-06-05 14:31:20

రాష్ట్రంలో 1.64 కోట్ల వేక్సిన్లు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 1,06,47,444 డోసులు పంపిణీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అమరావతిలోని తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వాటిలో 25,65,162 మందికి రెండు డోసులు, 55,13,120 మందికి ఒక డోసు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద శుక్రవారం సాయంత్రానికి 3,22,220 డోసుల స్టాక్ ఉందని, వాటిని శనివారం పంపిణీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 ఏళ్లు పైబడిన వారికి 53.08 శాతం మేర కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేశామన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి 1,33,07,889 మంది ఉండగా, వారిలో. 18,66,082 మందికి రెండు డోసులు, 47,91,032 మందికి ఒక డోసు వేశామన్నారు. 45 ఏళ్లు పైబడిన జనాభాలో 50 శాతం మందికి కనీసం ఒక టీకా వేసినట్లు ఆయన తెలిపారు. 

Tadepalle

2021-06-05 14:10:12

Tadepalle

2021-06-05 03:08:50

2021-06-05 01:58:44

20మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు.  రాష్ట్రప్రభుత్వం ఏర్పాటైన తరువాత పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం ఇది రెండవ సారి. అయితే చాలా జిల్లాల్లో సమర్ధవంతంగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీచేయడం విశేషం..కాగా రెండేళ్లు, మూడేళ్లు దాటిన ఐఏఎస్ అధికారుల పేర్లను ఈ బదిలీల్లో చేర్చపోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జేసి-4(హౌసింగ్) కి కొందరు ఐఏఎస్ అధికారులను నియమించింది. కీలకమైన ఏపీఈపిడిసిఎల్ లాంటి సంస్థకు అధికారిని నియమించకపోగా లోపల ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం.

Tadepalle

2021-06-04 16:26:18

శ్రీ కనక దుర్గమ్మ సేవలు ఆన్ లైన్ లో..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేయున్న శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివర్ల దేవస్థానంలోని శ్రీ కనక దుర్గమ్మ తల్లి వారి ఆన్ లైన్ సేవలకు విశేషంగా స్పందన వస్తుందని ఈఓ డి.బ్రమరాంబ తెలియజేశారు.  శుక్రవారం ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో  భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసి ఈ ఆన్ సేవల్లో పాల్గొనడానికి భక్తులు ముందుకి వస్తున్నారన్నారు. అమ్మవారి సేవలు గుగూల్ మీట్ లింక్ ద్వారా  google meet link (https://meet.google.com/nuw-kwsy-xsc)ద్వారా భక్తులు పాల్గొని తిలకించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరుతున్నారు.

Vijayawada

2021-06-04 02:55:41

ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణ స్వీకారం..

ఎపి సమాచార కమీషన్ లో రాష్ట్ర సమాచార కమీషనర్లుగా నియమితులైన యు.హరిప్రసాద్ రెడ్డి, కె.చెన్నారెడ్డి లు శుక్రావారం ప్రమాణం చేయనున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జిపియంఅండ్ ఎఆర్) కె.ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.రేపు మధ్యాహ్నం 12గం.లకు అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చే హరిప్రసాద్ రెడ్డి,చెన్నారెడ్డిలతో రాష్ట్ర సమాచార కమీషనర్లుగా ప్రమాణం(Administered Oath)చేయించనున్నారని ఆయన తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005 కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 53 తేది.25-5-2021 ద్వారా రాష్ట్ర సమాచార కమీషన్ కు కమీషనర్లుగా హరిప్రసాద్ రెడ్డిని,చెన్నారెడ్డిని నియమించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన కాకర్ల చెన్నారెడ్డి వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందినవారు.ఎంకామ్ ఎల్ఎల్బి విద్యార్హత కలిగి  రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లోను,జిల్లా కోర్టుల్లోను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఈవృత్తిలో 15యేళ్ళకు పైగా అనుభవం కలిగి ఉన్నారు.ఆయన ముఖ్యంగా వివిధ సివిల్,క్రిమినల్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులతో పాటు మానవ హక్కుల కమీషన్,ఆర్బిట్రేషన్,భూ,రెవెన్యూ, లేబర్,వినియోగదారుల,పరోక్ష పన్నులకు సంబంధించిన పలు కేసుల పరిష్కారంపై కృషి చేస్తుంటారు. అలాగే మరో సమాచార కమీషనర్ గా నియమితులైన యు.హరిప్రసాద్ రెడ్డి సీనియర్ జర్నలిస్టుగా జర్నలిజం రంగంలో విశేష అనుభవం కలిగి ఉన్నారు.ఆయన జర్నలిజం రంగంలో సుమారు 20యేళ్ల వరకూ అనుభవం కలిగి ఉన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి చరిత్ర విభాగంలో మాస్టర్ డిగ్రీ పొందిన ఈయన ప్రధానంగా రాజ్యాంగ విలువలు,డెమోక్రాటిక్ కల్చర్,ప్రాధమిక హక్కులు వంటి అంశాల్లో అనుభవం కలిగి ఉన్నారు. తెలుగు డైలీలో 1000వరకూ ఎడిటోరియల్ పేజిలో ఆర్టికల్స్ వ్రాశారు.

Tadepalle

2021-06-03 16:38:43

పలు రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ..

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేయాలని గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ టీకా వేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారన్నారు. ఇదే విషయమై దేశంలోని ముఖ్యమంత్రులందరూ కేంద్రాన్ని కోరాలంటూ పలు రాష్ట్రాల సీఎంలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినట్లు సింఘాల్ వివరించారు. ఈ ఏడాది జనవరి 16 తేదీన చేపట్టినట్లు దేశ ప్రజలందరికీ కేంద్రమే వ్యాక్సిన్ వేయాలన్నారు.  దీనివల్ల దేశ ప్రజలకు మేలు కలుగుతుందని ఆ లేఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారన్నారు. కోవిడ్ విషయంలో ఎప్పటికప్పుడు సీఎం రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారని వివరించారు.

Tadepalle

2021-06-03 16:36:32

61.13% మందికి ఆరోగ్య శ్రీ సేవలు..

రాష్ట్రంలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో 61.13 శాతం మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 79.59 శాతం ఆరోగ్య శ్రీ పథకం వైద్య సేవలు అందుకున్నారన్నారు. నిర్ధేశించిన లక్ష్యం కంటే అధిక శాతం మందికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 86,223 శాంపిళ్లు పరీక్షించగా, 11,421 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయిని, 81 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,674 ఐసీయూ బెడ్లు, 7,527 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 14,658 మంది చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆక్సిజన్ వినియోగం రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తోందన్నారు. గడిచిన 24 గంటల్లో 384 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డ్రా చేశామన్నారు. ఆక్సిజన్ అవసరం లేకపోవడం వల్ల తక్కువగా తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 16వ తేదీన 104 కాల్ సెంటర్ అభివృద్ధి పరిచిన నాటి నుంచి చూసుకుంటే గడిచిన 24 గంటల్లో  కాల్ సెంటర్ కు గతంలో కంటే తక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. 3,427 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో ఆసుపత్రుల్లో అడ్మిషన్ల కోసం 468 కాల్స్ వచ్చాయన్నారు.  హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న 23,285 మందితో టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్లో మాట్లాడి సలహాలు సూచనలు అందజేశారన్నారు. 

Tadepalle

2021-06-03 16:33:15

విజిలెన్స్ కేసుల్లో రూ.9.90 కోట్ల వసూలు..

ఆంధ్రప్రదేశ్ లోని 89 ఆసుపత్రులపై విజిలెన్స్ తనిఖీలు చేసి, 66 కేసుల్లో రూ.9.90 కోట్ల వరకూ వసూలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో 1,187 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. 11,605 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన 93 మంది చిన్నారులను గుర్తించామన్నారు. వారి పేరున ఫిక్సడ్ డిపాజిట్ చేసిన రూ.10 లక్షలకు నెలకు రూ.5 వేలు వడ్డీ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనాధలైన చిన్నారుల గుర్తింపు కొనసాగుతోందన్నారు.

Tadepalle

2021-06-03 16:28:56

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం..

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 24 వేల నుంచి 11 వేలకు తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. నాలుగు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని, తగ్గడం లేదంటూ కొందరు అవస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అవాస్తవాల వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదముందన్నారు. వారం రోజుల నుంచి చూస్తే అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తూర్పు గోదావరిలో 3,400ల నుంచి 2,050 కేసులకు తగ్గాయన్నారు. ఇలా అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివీ రేటు మే 5నాటికి 17 శాతం ఉండగా, జూన్ 2వ తేదీ నాటికి 13 శాతానికి తగ్గిందన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న మే 17న 2,11,554 యాక్టివ్ కేసులు ఉండగా గడిచిన 24 గంటల్లో జూన్ 2వ తేదీ నాటికి 1,43,795 కేసులకు తగ్గాయని, గురువారం(జూన్ 3వతేదీ) నాటికి మరింత తగ్గే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 91 శాతానికి పెరిగిందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో 99.2 వరకూ పెరగనుందన్నారు. మే 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 380 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండగా, జూన్ 2వ తేదీకి 1582 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మే 17 నాటికి 433 ఆక్సిజన్‌ బెడ్లు మాత్రమే ఖాళీగా ఉంటే జూన్ 2వ తేదీ నాటికి 7,270 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయడానికి ఈ అంకెలు నిదర్శనమన్నారు. 

Tadepalle

2021-06-03 16:22:23

నెలాఖరుకి 58,72,370 టీకాలు..

జూన్ నెలాఖరు నాటికి 58,72,370 టీకాలు రానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి 87,08,730 డోసులు వచ్చాయన్నారు. జూన్ 2 వ తేదీ రాత్రికి కేంద్రమిచ్చిన డోసుల్లో 5,67,970, ఏపీ ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన దాంట్లో 44.170 డోసులు అందుబాటులో ఉన్నాయని, మొత్తంగా  6,12,170 డోసుల స్టాక్ ఉందని తెలిపారు. ఇప్పటికి వరకూ 1,01,94,389 డోసులను పంపిణీ చేశామన్నారు. జూన్ నెలకు సంబంధించి 36,94,210 డోసులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా 20,74,730 డోసులను కొనుగోలు చేయనున్నామని, ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మొత్తంగా చూస్తే జూన్ 30 వరకూ 58,72,370 డోసులు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇప్పటికే జరుగుతున్న వ్యాక్సినేషన్ తో కలిపి జూన్ నెలాఖరు వరకూ 1.60 కోట్ల టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందన్నారు. కేంద్రమిచ్చే వ్యాక్సిన్ కోటా చాలకపోవడం వల్లే గ్లోబల్ టెండర్లను పిలిచామన్నారు. మే 13 తేదీన వ్యాక్సిన్ల కొనుగోలు నిమిత్తం  నోటిఫై చేశామని, జూన్ 3 సాయంత్రంలోగా బిడ్ ఫైల్ చేయాలని కోరుతూ గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు. మే 20తేదీన నిర్వహించిన ప్రీబిడ్ లో మూడు కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. గడువు ముగిసినా ఎవరూ బిడ్ దాఖలు చేయలేదన్నారు. బిడ్ దాఖలకు మరో రెండు వారాలు గడువు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. యూపీ, కర్నాటక, రాజస్తాన్, ఒడిశా.. ఇలా దేశ వ్యాప్తంగా 9 ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా, బిడ్ దాఖలకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. 

Tadepalle

2021-06-03 16:20:10

అక్కా చెల్లమ్మలకు సొంతిల్లు కల సాకారం..

రాష్ట్ర ప్రభుత్వం  నవరత్నాలు` పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా నిరుపేద మహిళల పేరున నివేశన స్దలాలు రిజిస్ట్రేషన్‌ చేయించి కనివిని ఎరుగని విధంగా పేదవారి స్వంతింటి కలను సాకారం దిశగా ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వె.ఎస్. జగన్మోహనరెడ్డి తెలిపారు. గురువారం  తాడేపల్లి క్యాంపు కార్యాలయంనుంచి వర్చువల్‌ విధానంలో తొలిదశలో  వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలలో 15.60 లక్షల గృహాలను నిర్మించడానికి భూమి పూజ శంకుస్దాపనలు చేసారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి భగవంతుని ఆశీస్సులతో శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే సంకల్పించి అక్కాచెల్లెమ్మల పేరిటి ప్దలాలు రిజిస్ట్రేషన్‌ చేయించి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.  మొదటి దశ శంకుస్దాపన, గృహ నిర్మాణాల ప్రారంభోత్సవాలు ఈనెల 3వ తేదీనుంచి 10వ తేదీవరకు కొవిడ్‌ నిబంధనలు ప్రకారం పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.  31 లక్షల మంది నిరుపేద మహిళలకు ఇల్లు నిర్మించి,అందించే  బృహత్తర కార్యక్రమన్నారు. మొదటి దశ గృహ నిర్మాణాలు  జూన్‌ 2022 నాటికి పూర్తి చేయాలని, రెండవ దశలో 12లక్షల 70 వేలు గృహాలను జూన్‌ 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు.పిఎంఎవై అనుసంధానంలో గృహ నిర్మాణాలు వేగవంతంచేసి యుద్ద ప్రాతిపదికను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది కుటుంబాలకు గృహాలు మంజూరు చేసామని ఇంటికి నలుగురు చోప్పున వెరసి మొత్తం కోటి 24 లక్షల మందికి గృహయోగం కలుగుతుందన్నారు.  17,005 లేఅవుట్లలో  32,900 కోట్ల వ్యయంతో నిర్మాణాలుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

 వీటిలో సుమారు రూ 4,120 కోట్లతో త్రాగునీటి వసతులు, రూ 22,587 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌  సి.సి రోడ్లు, రూ 4,986 కోట్లతో అండర్‌ గ్రౌండు విద్యుత్‌ పౌకర్యం, రూ 627 కోట్ల వ్యయంతో అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్‌ పౌకర్యం, ఇతరు మౌలిక సదుపాయాలైన ఆఆర్‌బికె, గ్రామ విలేజ్‌ క్లినిక్‌ వంటి సదుపాయాలు కల్సించడం జరుగుతుందన్నారు. రూ 567 కోట్ల పిజికల్‌ ఇన్‌ప్రాస్టక్చర్‌ వపతులు రానున్నాయన్నారు. సౌకర్యాలు మంచి నాణ్యతా ప్రమాణాలతో ఉండేలా మరో అడుగు ముందుకు వేసామన్నారు.  మంచి నాణ్యతా ప్రమాణాలు అన్నింటిలోను పాటించడం జరుగుతుందన్నారు. కాలనీలు పూర్తి అయిన పిదప ఒక్కొక్క ఇంటి విలువ రూ 5 లక్షలనుంచి సుమారు రూ15 లక్షలవరకు ఉంటుందన్నారు.  మూడు రకాల ఆప్షన్లులో లబ్దిదారులు తమకు ఇష్టమైన విధంగా 340 చదరపు అడుగుల విస్తిర్ణంలో నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవచ్చునన్నారు. ఇంటి నిర్మాణంలో ఒక పడక గది, ఒక హాలు కిచెన్‌, వరండా, వసతులు వస్తాయని అదేవిధంగా  రెండు ప్యాన్లు, రెండు ట్యూట్‌సైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్‌ ట్యాంకు కూడా  అందించడం  చేయడం జరుగుతుందన్నారు.  కరోనా కష్ట కాలంలో ఈ కాలనీ ఇళ్ల నిర్మాణాలవల్ల గ్రామీణ ఆర్దిక వ్యవస్ద బలోపేతం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 30 రకాలువారికి  చేతినిండా  ఇటుకలు, తయారీ, ఇంటి నిర్మాణ పనులు లబించి ఆర్దిక  వ్యవస్ద బలపడనుందన్నారు. సిమ్మెంటు బస్తా రూ. 225 లకే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గ్రామ, మండల స్దాయి మెటిరియల్‌ను గోడౌన్లు భద్రపర్చి లబ్దిదారులు అవసరాలకు అనుగుణంగా అందించడం జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణానికి రూ 1,80,000 గ్రాంటుగా అందించడం జరుగుతుందన్నారు. 

ఇళ్ల స్దలాలు జాబితా తమపేరు లేదని ఎవ్వరు బాధపడాల్సిన అవసరంలేదని మరలా దరఖాస్తు చేసుకుంటే 90 రోజులలో ఇంటి స్దలాన్ని కొనుగోలు చేసి    అందించడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.  ఊహకందని రీతిలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పూర్తిస్దాయిలో పర్యవేక్షణకై ప్రతి జిల్లాకు నాల్గవ జాయింట్‌ కలెక్టరు పోష్టును మంజూరు చేసామని త్వరలో వీరి నియమాకానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వీరు లబ్దిదారులుకు అన్ని విధాలుగా  చేయూతను అందించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా పూర్తిస్దాయిలో చర్యలు చేపడతారన్నారు. ఇళ్ల నిర్మాణాలను అత్యంత ప్రాదాన్యతగా తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 74 వేలమంది లబ్దిదారులుకు  స్దలాలు  కోర్డు కేసులు మూలంగా ఇప్పటికీ మంజూరు కాలేదని, కోర్డులు తెరచిన పిదప  వారికి న్యాయం చేసి స్దలాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ‌ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌నారాయణ గుప్తతో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి అధికారులు, లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

Tadepalle

2021-06-03 13:33:03

విద్యార్థులకు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్..

విదేశాలకు వెళ్లే విద్యార్ధులు, ఉద్యోగులు 45 ఏళ్లలోపు ఉన్నా వారికి వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారనివైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను మార్గదర్శకాలు జారీచేశామన్నారు. విదేశాలకు వెళ్లేవారు ఆధార కార్డుకు బదులు పాస్ పోర్టు నెంబర్ ను కొవిన్ అప్లికేషన్ లో పొందుపరుచుకోవాలని సూచించారు. విదేశాల్లో పాస్ పోర్టుకు జతజేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను మాత్రమే అనుమతిస్తున్నారన్నారు. దీనివల్ల ఆధార్ నెంబర్ తో వ్యాక్సిన్ తీసుకున్న వారు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయా జిల్లా కలెక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతమున్న నిబంధనల దృష్ట్యా పాస్ పోర్టు నెంబర్ జతజేసి రివైజ్డ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. ఇదే విషయం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శితో చర్చించామని, కొవిన్ వ్యాక్సిన్ అప్లికేషన్ లో పాస్ పోర్టు నెంబర్  ను జతచేసేలా మార్పులు చేయాలని కోరామని తెలిపారు. కేంద్రం అందుకు అంగీకరించిన వెంటనే పాస్ పోర్టు జతచేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకిచ్చే స్టయిఫండ్ ను రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు తమకిచ్చే స్టయిఫండ్ ను పెంచాలని కోరారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించామని తెలిపారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్డర్లు గత ఏడాది సెప్టెంబర్ లో విధుల్లోకి చేరారన్నారు. 800 పీజీ విద్యార్థుల వినతులపై చర్చించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Tadepalle

2021-06-03 04:15:30