1 ENS Live Breaking News

ఇ-క్రాప్ బుకింగ్ తో దళారులకు చెక్..

ఇ-క్రాప్ బుకింగ్,ప్రీఆడిట్ విధానంతో పంట పండించిన నిజమైన రైతులను గుర్తించాకే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమ చేయనున్నామని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీసియో కార్యదర్శి, ఆశాఖ కమీషనర్ కోన శశిధర్ చెప్పారు. ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయ  ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఇ-క్రాప్ బుకింగ్ విధానం వెబ్ ల్యాండ్ కే పరిమితమై ఉండేదని కాని నేడు ఫ్రీ ఆడిట్ విధానాన్ని కూడా తీసుకురావడంతో ధాన్యం అమ్మింది రైతా,కౌలు రైతా లేక మిల్లరా లేక దళారా అనేది వారి బ్యాంకు ఖాతా,ఆధార్ వంటి పూర్తి వివరాలను పరిశీలించి రైతేనని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారి ఖాతాలకు సొమ్ము జమచేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.గతంలో రైతు పేరిట దళారులు,ఇతర రాష్ట్రాలకు చెందిన వారి బ్యాంకు ఖాతాలను ఇచ్చి సొమ్ము పొందే ప్రయత్నం జరిగేదని ఫ్రీ ఆడిట్ విధానంతో అలాంటి వాటిని పూర్తిగా నివారించగలుగుతున్నామని శశిధర్ స్పష్టం చేశారు.ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.

Tadepalle

2021-06-18 13:37:01

సచివాలయ నిర్వీర్యానికి భారీ కుట్ర..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ లు విచక్షణా రహితంగా జారీచేసిన జీఓల కారణంగా దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొదించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే భారీ కుట్ర తెరవెనుక జరుగుతోందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. జిఓ-2 ను జారీచేయడం దానిపై కొందరు హైకోర్టుకి వెళ్లడం..అక్కడ కోర్టు పంచాయతీలు ఉండగా..సచివాలయాలెందుకు అని తీవ్రంగా ప్రశ్నించడం చూస్తేంటే కావాలనే సచివాలయ వ్యవస్థను కోర్టుకీడ్చి దానిపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అవగత మవుతుంది. ప్రభుత్వం జారీ చేసిన జీఓనెంబరు 2 కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న 150003 గ్రామ, వార్డు సచివాలయాల్లోని కార్యదర్శిలు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో డిడిఓలుగా వీఆర్వోల వద్ద డిగ్రీలు, పీజీలు చదువుకున్న గ్రామ కార్యదర్శిలు పనిచేయడానికి సిద్దంగా లేరనే విషయం బహిర్గతమైపోయి ఆందోళనలు చేస్తున్నారు. అందులోనూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీఓలు 110, 149కి విరుద్ధంగా వచ్చిన ఈ జీఓ నెంబరు2ని అడ్డం పెట్టుకొని పంచాయతీల్లోని సర్పంచ్ లను, పంచాయతీ కార్యదర్శిలను రెచ్చగొట్టి వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చి గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత తీసుకు రవాలని చూస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిలు సామాజిక మాద్యమాల్లో తమ నిరశనను తెలియజేయడం,  ఎంపీడీఓలకు, డీపీఓలకు తమ అధికారాలపై క్లారిటీ ఇవ్వాలని అర్జీలు చేయడం ముమ్మరం చేస్తున్నారు. 

ఇదే విషయమై గుంటూరు జిల్లాకి చెందిన ఒక సర్పంచి హైకోర్టును ఆశ్రయించడం...అక్కడ ప్రభుత్వానికి, గ్రామసచివాలయ వ్యవస్థకు వ్యతిరేకంగా హైకోర్టు వ్యాఖ్యానించడం చూస్తుంటే.. కేవలం ఒక్క జీఓనెంబరు 2ని అడ్డం పెట్టుకొని, సచివాలయ కార్యదర్శిల నిరసనను సాకుగా చూపి భారీ కుట్రకు తెరతీశారని  విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి జిఓ నెంబరు-2 రద్దుకోరుతూ, తమ అధికారాలు లాగేసుకోవద్దని మాత్రమే బాధితులు కోర్టుకి వెళ్లినా దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రజాధారణ పొందిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడం కోసం తెరవెనుక జరుగుతున్న కుట్రపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీఓ నెంబరు-2,  73వ రాజ్యాంగ సవరణకు, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా ఉందని కేవలం దానిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగుల్లో నిరసన మంట పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే..ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలపై విమర్శలు చేస్తారనే కోణంలోనే వ్యూహ రచన చేస్తున్నారని తెలుస్తోంది. 

చాలా కాలం తరువాత పంచాయతీ సర్పంచ్ లకు అధికారాలు వచ్చినా అవి అతి తక్కువ అర్హత వున్న వీఆర్వోలకి పంచాయతీలపై డిడిఓగా పెత్తనం ఇవ్వడం ద్వారా డిగ్రీ చదివిన ఉద్యోగులు, చాలాచోట్ల ఎక్కువ చదువు చదువు చదువుకున్న సర్పంచ్ ల మనోభావాలు దెబ్బతింటున్నాయనే కోణంలోనూ వ్యతిరేక ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలోని ఐఏఎస్ లు గ్రామ స్థాయిలో వీర్వోలను, మండల స్థాయిలో తహశీల్దార్ లను, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలను, జిల్లా స్థాయిలో కలెక్టర్లను బాస్ లను చేయడం ద్వారా ఒక ప్రత్యేక రెవిన్యూ వ్యస్థను తయారు చేయాలనే ఉద్దశ్యంతో ఆలోచిస్తే.. అది మొదటికే ముసలాన్ని తెచ్చిపెట్టింది. ప్రభుత్వ పరిపాలకు సౌలభ్యంగా వుంటుందనుకున్న జీఓ నెంబరు 2 ఇపుడు ప్రభుత్వమే హైకోర్టులో తమ సంజాయిషీ చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. అలాగని ప్రభుత్వంలోని ఐఏఎస్ లు కూడా గతంలో జారీచేసిన జీఓ నెంబరు 110, 149 జీఓలను అమలు చేయకపోవడం, తమకు అధికారాలు కట్టబెట్టకపోవడాన్ని రాష్ట్రవ్యాప్తంగా వున్న పంచాయతీ కార్యదర్శిలు వ్యతిరేకిస్తున్నారు. 

ప్రభుత్వం ఇచ్చిన జీఓలను ప్రభుత్వమే అమలు చేయకుండా వాటికి వ్యతిరేకంగా మళ్లీ కొత్తగా జీఓలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శిల నిరసన, వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వర్గం ఇదే అదునుగా చేసుకొని సచివాలయ వ్యవస్థపై కుట్రచేస్తే అటు ప్రభుత్వ నిర్ణయాలపై తప్పుచూపి, పంచాయతీ కార్యదర్శిల నుంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నట్టుగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా జీఓనెంబరు 2పై హైకోర్టులో వచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, సచివాలయ కార్యదర్శిలు కార్యాచరణ ఉండబోతుందనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందనేది హై కోర్టు తీర్పుని బట్టి ఆధారపడి వుంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా జీఓ నెంబరు2 పై కీలక నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా  పంచాయతీ కార్యదర్శిల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలే మెండుగా వున్నాయి..!

Tadepalli

2021-06-18 01:44:02

ఎన్ఈపీ విజయవంతం అందరి బాధ్యత..

రాష్ట్రంలో అమలు చేయనున్న జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులపైనా ఉందని రాష్ట్ర ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సచివాలయంలో జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎన్నికలకు ముందే ఢిల్లీలో పర్యటించి, అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశామన్నారు. కనీస మౌలిక సదుపాయాలు, క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు లేని ప్రైవేటు పాఠశాలలో అప్పో సప్పో చేసి తమ పిల్లలను తల్లిదండ్రులు చేర్చుతున్నారన్నారు. ఇవన్నీ గమనించే... జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారన్నారు. దీర్ఘకాలిక విజన్ తో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. జాతీయ విద్యా విధానం అమలులో ఉపాధ్యాయుల అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటామని, రాష్ట్ర ఏకపక్షంగా వ్యవహరించదని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఉపాధ్యాయుల తనను సంప్రందించొచ్చునన్నారు. జాతీయ విద్యా విధానంపై తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ సంఘాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కు సూచించారు.


ఎన్ఈపీని స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు.. 
అంతకుముందు అన్ని సంఘాల ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రి ఆదిమూలపు సురేష్ తెలుసుకున్నారు. అన్ని సంఘాల నేతలూ జాతీయ విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నాడు – నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక పథకాలతో పాటు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టిని కొనియాడారు. జాతీయ విద్యా విధానం అమలులో ఎదురయ్యే సమస్యలను మంత్రి, విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై వినతలను మంత్రి, ప్రభుత్వ సలహాదారుకు అందజేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా డైరెక్టర్ చినవీరభద్రుడు, ఇతర విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. 

Tadepalle

2021-06-17 15:46:10

ఒక్క ఉపాధ్యాయ పోస్టు రద్దు కాదు..

రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020(ఎన్ఈపీ) అమలులో భాగంగా జాతీయ విద్యా విధానంలో అపోహాలను నమ్మొద్డని, ఏ ఒక్క పాఠశాల మూతపడదని, ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయనున్నామని, ఈ విప్లవాత్మక సంస్కరణలను విజయవంతం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. కొవిడ్ తో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పాఠశాలలకు క్రీడా మైదానాలు లేనిచోట్ల భూములు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సచివాలయంలో జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, మేనమామగా పిల్లలకు తానిచ్చే ఆస్తి చదువేనంటూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాలని సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. నాడు-నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలన్నీ దేశానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యమైన మౌలిక సదుపాయల కల్పనకు జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా 5+3+3+4 విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు.  పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఒకటి రెండు తరగతులు ప్రాథమిక విద్యలో, 3,4,5 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ ను ఉన్నత విద్యలో చేర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనిపై ఉపాధ్యా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానంపై ఎటువంటి అపోహలు నమ్మొద్దని కోరారు. ఏ ఒక్క పాఠశాల మూతపడదని, ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాబోదని భరోసా ఇచ్చారు. ఏ అనుమానం ఉన్నా పరిష్కరిస్తామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు. నాడు – నేడు పనుల్లో భాగంగా క్రీడా మైదానాలు లేని పాఠశాలలు గుర్తించి భూములు కొనుగోలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. విద్యార్థుల్లో క్రీడల ప్రోత్సాహాకానికి స్పోర్ట్సు కిట్ అందజేయనున్నామన్నారు. మూడో విడత జగనన్న విద్యా కానుకలో అందజేసే ఈ కిట్ ద్వారా స్పోర్ట్సు షూస్, డ్రెస్ ఇవ్వనున్నామన్నారు. కొవిడ్ కారణంగా ఉపాధ్యాయులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. 

Tadepalle

2021-06-17 15:43:27

sc,bc కుటుంబాలకు రాయితీ రుణాలు..

క‌రోనా వైరస్ కారణంగా కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయిన బీసీ, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కుటుంబాలకు  ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల రుణ స‌దుపాయం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంద‌ని ఎస్సీకార్పోరేషన్ ఎండి అండ్ విసి నవ్య ఒక  ప్ర‌ట‌న‌లో తెలియజేశారు. ఈ మేర‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాధితుల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్సీకార్పోరేషన్ ఈడీలకు వర్తమానం పంపారు.  క్షేత్ర స్థాయిలో ఎవ‌రైనా ఎస్సీ, బిసి సామాజిక వ‌ర్గానికి చెందిన ఇంటి పెద్ద మ‌ర‌ణించి.. జీవ‌నాధారం కోల్పోయిన కుటుంబాలు ఉంటే గుర్తించాలని మున్సిపాలిటీల‌ు, మండ‌లాల‌ అధికారుల‌ను ఆదేశించినట్టు పేర్కొన్ారు. ప్ర‌భుత్వం నేష‌న‌ల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ (ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి.) ద్వారా అందించే ఈ రుణంలో రూ.1 ల‌క్ష వ‌ర‌కు రాయితీ ఉంటుంద‌ని, మిగిలిన రూ.4 ల‌క్ష‌ల‌ను వాయిదాల్లో ల‌బ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు బాధిత కుటుంబ స‌భ్యులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె స్ప‌ష్టం చేశారు. బాధిత కుటుంబ స‌భ్యుల‌కు త‌గిన స‌హాయ స‌హాకారాలు అందించాల‌ని ఎస్సీకార్పోరేషన్ ఎండి అండ్ విసి నవ్య ఆ ప్రకటనలో కోరారు.

అర్హ‌తలు.. ఇత‌ర ప్ర‌క్రియ‌ ఈ విధంగా ఉండాలి..

@కోవిడ్ కారణంగా కుటుంభ పెద్ద మరణించి ఉండాలి

@వయస్సు 18 నుండి 60 సంవత్సరాలు ఉండాలి

@యస్సీ, బీసీ సామాజిక వర్గం అయి ఉండాలి

@వార్షిక ఆదారం 3లక్షలు మించరాదు

@తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి

@అర్హతగల దృవీకరణ పత్రాలతో మీ మండల పరిషత్ అభివృద్ధి అదికారి/మన్సిపల్ కమీషనర్ ను కలవండి.

తాడేపల్లి

2021-06-17 02:56:26

సచివాలయానికే మచ్చ తెచ్చిన జీఓ..

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం విడుదల చేసిన జీఓనెంబరు 2 మాయని మచ్చలా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంచాయతీ కార్యదర్శిల నిరసనకు కారణమైంది. ప్రభుత్వం విడుదల చేసి జిఓ నెంబరు 110, 149లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ఇపుడు వాటికి విరుద్ధంగా జీఓనెంబరు2 విడుదల చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా వున్న 15003 సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలు ప్రభుత్వంపై గుర్రుగా మారడానికి ప్రధాన కారణమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు సచివాలయ వ్యవస్థను మెచ్చుకొని వారి రాష్ట్రాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించిన తరుణంతో జీఓ నెంబరు-2,  73వ రాజ్యాంగ సవరణకు, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా ఉందని.. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు అసలు సచివాలయ వ్యవస్థే దండగ అని వ్యాఖ్యానించేలా చేసిందంటే ఇంతకంటే చెడ్డపేరు మరొకటి లేదనే వాదన తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో రెవిన్యూ వ్యవస్థను కీలకం చేయాలని భావించి గ్రామ, వార్డు సచివాలయాల్లో డిడిఓలుగా వీఆర్వోలను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 2  వలన ఇపుడు కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ జీఓ విడుదల సమయంలోనే డిగ్రీ చదివి కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన సచివాలయ ఉద్యోగులు ఇంటర్ మాత్రమే పాసైన వీఆర్వోల వద్ద పనిచేయడం ఇబ్బందిగా ఫీలవుతున్నారనే విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా తెలియజేసింది. అదే విషయాన్ని ఇపుడు రాష్ట్ర హైకోర్టు కూడా ఈ జీఓ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చర్చనీయాంశం అయ్యింది. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో జరుగుతున్న అభివ్రుద్ధిని, లోపాలను ప్రజల ముందుంచే ఈఎన్ఎస్ చెప్పినట్టుగా అన్ని జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోనూ మొన్నటి వరకూ గ్రామస్థాయిలో పదవ తరగతి, ఇంటర్ విద్యార్హతతో వీఆర్ఏ లుగా వున్న వారిని ఖాళీలును భర్తీ చేయడానికి ప్రభుత్వం వారికి ప్రమోషన్లు కల్పించి వీఆర్వోలను చేసింది. ఆపై వెంటనే జీఓ 2 ఇవ్వడంతో డిడిఓగా వీఆర్వోలు మారిపోయారు..దీనితో అప్పటి వరకూ పంచాయతీలను పరిపాలిస్తున్న కార్యదర్శిలు, సర్పంచ్ ల మనోభావాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. దీనితో గుంటూరు జిల్లాకి చెందిన సర్పంచ్ క్రిష్ణమోహన్ హైకోర్టులో వాజ్యం వేయడంతో వాదనలు విన్న హైకోర్టు అసలు పంచాయతీలు ఉండగా ఇక సచివాలయాలు ఎందుకున్న అని ప్రశ్నించడం, కార్యదర్శిలు హక్కులు, అధికారాలు లాగేస్తారని అని ప్రభుత్వ జీపీని ప్రశ్నించడం..అది కాస్తా పతాక శీర్షిక మీడియాలో రావడంతో సచివాలయ వ్యవస్థ ఆదిలోనే కనుమరుగ వుతుందనే భయాన్ని కూడా కలుగ జేసింది.  అటు గతంలో నుంచి పంచాయతీ కార్యదర్శిలుగా ఉన్నవారు కూడా తమ ఆందోళనలు పెద్ద ఎత్తున చేపట్టడంతో...ప్రభుత్వం మొన్నటికి మొన్న ఉద్యోగుల జీతాల పేరుతో రెండు నెలలు డిడిఓలుగా పంచాయతీ కార్యదర్శిలే ఉంటారు..అదీ కూడా ఉద్యోగుల జీతాలకు సమస్యలు వాటిల్ల కూడదని ఓ మెట్టు దిగి జీఓ2 కి ప్రత్యామ్నాయ ఉత్తర్వులు జారీచేసింది. ఆపై ఇపుడు కోర్డులో జీఓ2పై వాదనలు జరగడం, ప్రభుత్వం నుంచి కోర్టుకి సరైన వివరణ లేకపోవడంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏడాదిన్నరకే పురిటి కష్టాలు మొదలైనట్టు అయ్యింది. వాస్తవానికి ఒక ప్రభుత్వ శాఖలో ఏదైనా జీఓ జారీచేసే సమయంలో ఆటుపోట్లను, రాజ్యాంగ సవరణలను, గతంలో ఇచ్చిన జీఓల అమలను అన్నింటినీ బేరీజు వేసుకొని కొత్త జీఓలు జారీ చేస్తారు. అలాకాకుండా పంచాయతీలకు, గ్రామసచివాలయాలకు డిడిఓలుగా వీఆర్వోలను చేస్తూ వచ్చిన ఈ జిఓ విషయంలో పెద్ద రచ్చే జరిగి చివరకి ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగులు కోపం పెంచుకునేలా చేశాయి. సచివాలయ వ్యవస్థపై ఆదిలోనే మచ్చపడేలా చేశాయి. ఈ క్రమంలో కోర్టులో పెండింగ్ లో వున్న తీర్పు ఏ విధంగా వస్తుందనేది ఆశక్తి కరంగా మారింది..!

Tadepalli

2021-06-17 02:10:49

గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై  స్టే విధించింది.. ఇంటర్వ్యూను నాలుగు వారాలపాటు నిర్వహించకూడదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో వాల్యుయేషన్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు తీర్పుతో వాయిదా పడింది. నాలుగు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప‌బ్లిక్ క‌మిష‌న్‌ను ఆదేశించింది.  కాగా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూయేషన్‌ గురించి చివరి దశలో చెప్పారన్నారు. అయితే నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు జరిగాయని, వాల్యూయేషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున వ్యాయవాది వాదనలు హైకోర్టుకు తెలిపారు. ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Tadepalle

2021-06-16 15:16:43

Tadepalle

2021-06-15 09:47:56

Hyderabad

2021-06-15 04:17:07

కోవిడ్ వారియర్స్ కి ప్రభుత్వ అండ..

కొవిడ్ విధుల్లో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..  విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కరోనా కారణంగా మృతి చెందిన వైద్య సిబ్బందికి భారీ మొత్తంలో ఎక్స్ గ్రేషియా ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ జీవో జారీచేసిందన్నారు. కొవిడ్‌ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్‌ నర్సు కుటుంబానికి రూ.20 లక్షలు, ఎఫ్‌ఎన్ఓ, ఎమ్‌ఎన్ఓలకు రూ.15 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని నిర్ణయించిందన్నారు. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌ గ్రేషియా చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. తక్షణమే ఎక్స్‌ గ్రేషియా అందేలా జిల్లా కలెక్టర్లకు అధికారం అప్పగించిందన్నారు. ఇతర ఇతర బీమా పరిహారాలు పొందినా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియో అందజేస్తామన్నారు.

తాడేపల్లి

2021-06-14 15:45:08

3,540 సచివాలయాల్లో కేసులు నిల్..

రాష్ట్రంలో కరోనా రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలో ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల వారీగా డేటా పరిశీలిస్తే కేసులు తగ్గుతున్నాయనేది అవగతమవుతుందన్నారు. రాష్ట్రంలో 15 వేల వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయన్నారు. వాటిలో గడిచిన 24 గంటల్లో 3,540 సచివాలయాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కేవలం ఒక్క కేసు 2,637 సచివాలయాల్లో, రెండు కేసులు 1,961 సచివాలయాలు, మూడు కేసులు 1500 సచివాలయాల్లో నమోదయ్యాయన్నారు. సున్నా నుంచి 3 కేసుల వరకూ 9 వేల పైన సచివాలయాల్లో(60 శాతంపైగా) నమోదయ్యాయన్నారు. 15 సచివాలయాల్లో 50 కేసులు, 18 సచివాలయాల్లో 40 కేసులు, 40 సచివాలయాల్లో 30 కేసులు నమోదయ్యాన్నారు. ఇలా 70 సచివాలయాలు... 0.5 శాతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్ధేశం చేశారన్నారు. కేసులు తగ్గుతున్నాయని 104 కాల్ సెంటర్ నిర్వహణపైనా, ఫీవర్ సర్వేపైనా నిర్లక్ష్యం చూపొద్దని, ప్రస్తుతమున్న స్ఫూర్తిని మరికొంతకాలం పాటు పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారన్నారు. రాష్ట్రంలో నేటి వరకూ 2,303 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 1,328 యాక్టివ్ కేసులు అని తెలిపారు. 

ఈ కేసుల్లో 538 మందికి ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు, 577 మందికి పొసకొనజోల్ ఇంజక్షన్లు ఇస్తున్నామన్నారు. 157 మంది మృతిచెందారని తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 32,285 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు అన్ని జిల్లాలకు కేటాయించామని, ప్రస్తుతం 10,759 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 49,250 పొసకొనజోల్ ఇంజక్షన్లు, 1,39,980 పొసకొనజోల్ ట్యాబ్ లెట్లు అన్ని జిల్లాలకు అందజేశామన్నారు. అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లోనూ అదనంగా  పిడియాట్రిక్, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయాలని సోమవారం నిర్వహించిన కొవిడ్ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఇపుడున్న ఐసీయూ బెడ్ల కంటే అదనంగా ఐసీయూ బెడ్లు పెంచాలన్నారు. ఆరు నెలల చిన్నారుల కోసం అవసరమైన బెడ్ల పెంపుదలపైనా చర్చించామన్నారు. ప్రైవేటు టీచింగ్ ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు, సిబ్బంది నియామకంపైనా అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా నిర్ధేశం చేశారన్నారు.  ఆరోగ్య శ్రీ పథకంలో పిడియాట్రిక్ కేసుల చేర్పుపైనా సీఎం సమీక్షా సమావేశంలో చర్చించామన్నారు. 

మంగళగిరి

2021-06-14 15:37:43

రాష్ట్రంలో 19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు..

ఆంధ్రప్రదేశ్ లోని 16 మున్సిపల్ కార్పొరేషన్లలో 19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 మున్సిపాలిటీల్లో  11, 12 చోట్ల భూములు గుర్తించామన్నారు. ఆర్టీసీపీఆర్ ల్యాబ్ ల ఏర్పాటు కోసం యూనిట్ల వారీగా వీటిని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇక్కడ సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకంపై రెండు వారాల్లో విధి విధానాలు ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు.  భవిష్యత్తులో రాష్ట్రంలో కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ లు ఏర్పాటు చేస్తోందన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అత్యధిక పరీక్షలు చేయడానికి వీలు పడుతుందని పేర్కొన్నారు. వైద్యసేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీలేకుండా ముందుకు వెళుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో సూపర్ స్పెషాలిటీ, మల్లీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అయిదు ఎకరాల గుర్తింపుపైనా సీఎం సమీక్షా సమావేశంలో చర్చించినట్టు సింఘాల్ వివరించారు.

Mangalagiri

2021-06-14 15:29:50

2021-06-14 11:15:29

రక్తదానంలో కిరణ్ ఆదర్శప్రాయుడు..

ఆయనొక జర్నలిస్టు..ఎప్పుడూ సామాజిక సేవలో ఫస్టు..ఎన్నో నిశ్వార్ధ సేవలపై వార్తా కధనాలు రాసి రాసి ఆయనకి తన జీవితంలో సేవ ఒక బాగమైపోయింది. రక్తధానం యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా ఇప్పటి వరకూ 64సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలువడానికి కారణమయ్యాడు. ఆయనే విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్టు కాళ్ల సూర్యప్రకాష్ (కిరణ్) అనునిత్యం ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ వస్తున్నారు. అర్ధరాత్రిలో రక్తం అవసరమైనా దానం చేయడానికి ఈయన హుటాహుటీన బాధితుల కోసం వెళతారంటే అదిమాటల్లో చెప్పలేం. ఇదంతా ఎందుకూ అంటే ఇన్నిసార్లు రక్తదానం చేసిన నిజమైన రక్తదాత మరెందరికో మార్గదర్శి కావాలన్న చిన్న సంకల్పమే ఆయన కోసం ఇంతలా రాసేలా చేసింది. అలాంటి రక్తదాత, సమాజ సేవకుడు
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉండటం గర్వకారమని భావించిన యూనియన్ కార్యవర్గం కిరణ్ ను సోమవారం ప్రత్యేకంగా యూనియన్ కార్యాలయంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని సత్కరించి గౌరవించింది. ఈ సందర్బంగా బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానంపై అవగాహన పెంచుకొని అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా రక్త దాతలుగా ముందుకు రావాలన్నారు. అసోసియేషన్ సభ్యులు కిరణ్ అనేక మందికి రక్తదానం చేసి
ఎంతో ఆదర్శంగా నిలిచారని  కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి కర్రి సత్యన్నారాయణ(సత్య),కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్ యాదవ్,ఉపాధ్యక్షులు వెంకట సూరి అప్పారావు(శ్రీనివాసరావు),రామకృష్ణ,ప్రధాన కార్యవర్గ సభ్యులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-14 08:57:54

సచివాలయ మిగులు ఉద్యోగాల భర్తీఎప్పుడు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగాల భర్తీకి గ్రహణం వీడటం లేదు. సుమారు లక్ష ఉద్యోగాలు తొలి దశలో భర్తీ చేసిన ప్రభుత్వం మిగిలిపోయిన సుమారు 26వేల ఉద్యోగాలకు రెండవ సారి నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత అన్నిజిల్లాల్లో సిబ్బందిని నియమించలేదు. సుమారు 8వేల ఉద్యోగాలకు పైగా సచివాలయ ఉద్యోగాలు ఇంకా భర్తీ కాకుండా అలానే మిగిలిపోయాయి.  ఇదే సమయంలో కొంత మంది గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలు గతంలో రాసిన గ్రేడ్-4 కార్యదర్శి ఉద్యోగాలు రావడంతో ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లో చేరిపోయారు. ఆ సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. సచివాలయంలో అత్యధికంగా గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలు, వెటర్నరీ అసిస్టెంట్లు, సెరీకల్చర్ అసిస్టెంట్లు, పోస్టులు అధికంగా ఖాళీలు ఉండిపోయాయి. మిగిలిన శాఖలైన హార్టికల్చర్, గ్రామ కార్యదర్శిలు పోస్టులు తక్కువగానే ఉన్నాయి. మరికొంత మంది వివిధ శాఖల్లో అప్పటికే పరీక్షలు రాసి ఉండటంతో కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లోకి చేరిపోయారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉండిపోయిన గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు భర్తీకాలేదు. మధ్యలో వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయిన ఖాళీల గుర్తింపు కూడా జరగలేదు. దీనితో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందే డిప్యుటేషన్లపై ఇతర సచివాలయాల్లోని డిప్యుటేషన్ పై అదనంగా చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆదేశాలున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నియామకాలు చేపట్టలేదు. ఆ తరువాత కరోనా వైరస్ విజ్రుంభించడంతో ఆ వ్యవహారం పూర్తిగా మూలకు చేరింది. కొన్ని జిల్లాల్లో విధుల్లోకి చేరిన సిబ్బంది ద్వారా మాత్రం ప్రస్తుతం సేవలు అందుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఏ జిల్లాల్లోని గ్రామసచివాలయాల వారీగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై కూడా నేటికీ క్లారిటీ రాకపోవడం విశేషం. తొలుత సచివాలయ ఉద్యోగాల్లో చేరినప్పటికీ, జీతం కేవలం మొదటి రెండేళ్లు 15వేలు మాత్రమే ఇవ్వడంతో చాలా మంది ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. అలా ఖాళీ అయిన స్థానాలను కూడా ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరుకే ఎపీపీఎస్సీ కేలండర్ ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. అటు దీనితో గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగాల భర్తీ కాకుండా ఉండిపోయింది. ఈ కరోనా ప్రభావం తగ్గేవరకూ మళ్లీ ప్రభుత్వం సచివాలయాల్లో మిగులు ఉద్యోగాల భర్తీపై ద్రుష్టిపెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందులోనూ అమలాపురం వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రామక్రిష్ణరాజు సచివాలయ ఉద్యోగులపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాయడంపైనా చర్చజరుగుతోంది.. ఇటీవలే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సచివాలయ మిగులు ఉద్యోగాలని భర్తీ చేస్తామని ప్రకటించిన కొద్ది రోజులకే రెబల్ ఎంపీ లేఖతో హడావిడీ చేయడం, దానిని ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ హడావిడి చేయడంతోనూ ప్రభుత్వం ఆలోచనల్లో పడింది. ఇప్పట్లో భర్తీచేయాలా..లేదంటే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఆరునెలల్లో రెగ్యులర్ చేసి ఆ తరువాత ఒకే సారి మిగులు ఉద్యోగాలను ఉద్యోగాల జాబ్ కేలండర్ విడుదల చేసి అందులో భర్తీచేయాలా అనే విషయంపై సమాచాలోచన చేయాలా అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది..  ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..!

తాడేపల్లి

2021-06-14 02:00:04