1 ENS Live Breaking News

సేవలపై అవగాహన కల్పిస్తే కాసుల వర్షం..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15వేల 5 గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అందిస్తున్న 545 సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయం అమాంతంగా పెరిగి కాసులు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ నేటికీ సచివాలయాల్లో ఏ తరహా ప్రభుత్వ సేవలు అందుతున్నాయో ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు చూసినా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల సంఖ్యపై పత్రికల్లో పేజీలకు పేజీలు ప్రచారం చేస్తుంది తప్పితే.. సచివాలయాల్లో అందించే సేవలు పేర్లు, వాటి సంఖ్యను, నేటికొ ఒక్క సారి కూడా ప్రచారం చేయలేదు.  జిల్లా కలెక్టర్, జెసీలు, జిల్లా శాఖల అధికారులు ఎప్పుడు సచివాలయాలను సందర్శించినా..సిబ్బంది వస్తున్నారా లేదా.. రిజస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా.. ఏ అర్జీలను పరిష్కన్నారు.. అనే విషయమై పరిశీలన చేస్తున్నారు తప్పితే. .ప్రభుత్వం  సచివాలయాల్లో అందించే సేవలపై ఏ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు.. ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు.. ఏ శాఖల పరిధిలోని సేవలు ఏ శాఖకు చెందిన ఎవరెవరు ప్రజలకు తెలిసేలా చేస్తున్నారనే కోణంలో ఏ ఒక్క అధికారి ప్రశ్నించిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇక మండల స్థాయి అధికారులైతే సచివాలయ సిబ్బందిని ఉద్యోగులుగా కాకుండా హైస్కూలు విద్యార్ధుల్లా చూస్తూ.. కరోనా వేక్సినేషన్ కార్యాక్రమాల్లో టార్గెట్లు ఇవ్వడం, అవి పూర్తిచేయకపోతే ఇబ్బందులు పడతారని, ఆదివారాల్లోనే ఈ ప్రత్యేక వేక్సినేషన్ కార్యక్రమాలు పెట్టడానికే వారు సమయం మొత్తం వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని మండలాల్లో సచివాలయ ఉద్యోగాలు ఇంకా రెగ్యులర్ కాలేదని, తాము చెప్పినట్టు వినకపోతే  ఉద్యోగాలు తీసేస్తామనే కోణంలో బెదిరించడానికే సమయం అంతా సరిపోతుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నేటికీ కరెంటు బిల్లులు కట్టించుకునే సదుపాయం కూడా సచివాలయాల్లోకి అందుబాటులోకి రాలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో గ్రామాల్లో విద్యుత్ శాఖకు చెందిన బిల్ కలెక్టర్లు వచ్చి మాత్రమే బిల్లులు కట్టించుకుంటున్నారు. లేదంటే మీసేవా కేంద్రాల్లో కట్టించుకుంటున్నారు. అక్కడ అందే సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుతున్నా..ఆ దిశగా ప్రజల వరకూ చేర్చే పని మాత్రం ఎవరూ చేయడం లేదు. కనీసం గ్రామసభలు పెట్టినపుడు సైతం సచివాలయాల్లో అందించే సేవలపై అవగాహన కల్పించడం లేదు. అజెండాలోని అంశాలే పూర్తిగా చెప్పలేని పరిస్థితులు నెలంకొటున్నాయి. అదేవిధంగా ఆధార్, బ్యాంకు అకౌంట్లు, రెవిన్యూ సేవలు, వివిధ రకాల పన్నులు,  డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర అనుమతులకు సంబంధించి చాలా సర్వీసులు గ్రామ సచివాలయం నుంచే అందుతున్నాయనే విషయం నేటికీ ప్రజలకు తెలియడం లేదు. ఎప్పటి మాదిరిగానే ప్రజలు నేటికీ మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. ఆఖరికి సచివాలయ పరిధిలోనే సర్వేయర్లు భూమలకు సంబంధించిన సర్వేలు కూడా చేస్తారనే విషయం తెలియదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతీ సచివాలయాల్లో 12 నుంచి 14 ప్రభుత్వ శాఖల సిబ్బంది పనిచేస్తున్నారు. ఎవరి పరిధిలోని ప్రభుత్వ శాఖలకు సంబంధించి వారు ప్రజలకు అవగాహన కల్పించినా సచివాలయాల ద్వారా అందించే సేవల వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం వుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడు జిల్లా అధికారులు సచివాలయాల ద్వారా అందే సేవల విషయంలో ప్రజలకు తెలిసేలా చేస్తే...ప్రభుత్వానికి ఆదాయం ఒక్కసారిగా భారీస్థాయిలో పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి..లేదంటే సచివాలయాల్లో 545 ప్రజాల సేవలు అందిస్తున్నారని చెప్పుకోవడానికి తప్పా దేనికీ పనిచేయకుండా మిగిలిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..!

Tadepalle

2021-06-26 07:15:02

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇక పక్కాగా ఈ-ఆఫీస్..

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేసి కాగితపు రహిత కాలేజీలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కొన్ని కాలేజీల్లో ఈ-ఆఫీస్ అమలు జరిగినా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. తాజాగా ఉన్నత, సాంకేతిక విద్యా కమిషనర్ గా డా.పోలా భాస్కర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రభుత్వ డిగ్రీకాలేజీలు ను అభివ్రుద్ధి చేయడంతోపాటు, విద్యార్ధులకు నాణ్యమైన విధ్యను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ పాత విధానాలతో నడిచే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలతో సమీక్ష నిర్వహించిన తరువాత ప్రభుత్వం డిగ్రీ కాలేజీల విషయంలో ఏ తరహా చర్యలు తీసుకుంటుందో కమిషనర్ స్పష్టంగా అర్ధమైంది. దానికోసం అన్ని కాలేజీల్లోనూ ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ఇక అన్ని వ్యవహారాలు ఈ-ఆఫీస్ లోనే నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేయడంతో చక చకా పనులు జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ కాలేజీల్లో అన్ని ఆర్ధిక పరమైన అంశాలను ఆఫ్ లైన్ లో జరుగుతున్నాయి. ఇకపై అన్ని కార్యకలాపాలు ఆన్ లైన్ లోనే కాలేజీ ప్రిన్సిపాల్స్ చేయాల్సి వుంటుంది. రానున్న రోజుల్లో ఇక ప్రభుత్వ కాలేజీల పేరు చెబితే ప్రైవేటు విద్యాసంస్థలు సైతం కంగారు పడేలా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. రాష్ట్రప్రభుత్వం నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఉన్నత విద్యలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఏ పనైనా దేశం మొత్తం తొంగి చూసేలా చేయడంలో సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలా భాస్కర్ ది అందివేసిన చేయి. ప్రభుత్వం కూడా ఈ అధికారిని ఉన్నతవిద్యకు కమిషనర్ ని చేయడంతో కాలేజీవిద్యలో సమూల మార్పులకు ఈయన శ్రీకారం చుట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆరు నెలల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల స్వరూపం, విద్యా విధానం అన్నీ ప్రైవేటే కాలేజీలను తలదన్నే విధంగా తయారుకావడం ఖాయంగా కనిపిస్తుంది. తొలుత ఈ-ఆఫీస్, ఆపై ఆన్ లైన్ విద్య, తరువాతర ఉపాది అవకాశాలు కలిగేలా విద్యాబోధన, కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్లు ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వ డిగ్రీకాలేజీలను మార్చాలనేది కమిషనర్ ఆలోచనగా కనిస్తుంది. ఈ విషయమై కమిషనర్ డా.పోలా భాస్కర్ ను ఈఎన్ఎస్ సంప్రదించినపుడు రాబోయే రోజుల్లో డిగ్రీ కాలేజీల అభివ్రుద్ధికి తీసుకునే చర్యల రోడ్ మ్యాప్ ను ప్రత్యేకంగా వివరించారు. పేపర్ లెస్ కాలేజీలుగా మారి కాలేజీల సమాచారం మొత్తం ఆన్ లైన్ అయితే ఒక్కో అభివ్రుద్ధి మొదలు పెడతామని వివరించారు. ఇప్పటికే ఆన్ లైన్ విద్యకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించామని ఆయన వివరించారు.

Tadepalle

2021-06-26 05:41:20

Tadepalli

2021-06-25 16:35:10

డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన వద్దు..

తిరుపతిలో ఇటీవల ఓ వ్యక్తికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. శుక్రవారం సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో కొవిడ్ పై సమీక్ష నిర్వహించగా, మంత్రి ఆళ్ల నాని ఈ అంశాన్ని సీఎంకి తెలియజేశారు. అయితే  డెల్టా ప్లస్ వేరియంట్ కేసు ఏపీలో ఇదే మొదటిదన్న మంత్రి.. ఆ వ్యక్తి నుంచి ఇతరులు ఎవరికీ కొవిడ్ వేరియంట్ సోకలేదని తెలిపారు. ఇప్పుడా వ్యక్తికి చికిత్స కూడా పూర్తయిందని, కోలుకోవడం కూడా జరిగిందని అన్నారు. తిరుపతి కేసు మినహా ఏపీలో మరెక్కడా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు లేవని ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ జన్యు ఉత్పరివర్తనం చెంది డెల్టా ప్లస్ గా మార్పు చెందిందని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే భారత్ లోని పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉనికి వెల్లడైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 21 కేసులు నమోదు కాగా, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ లోనూ పలువురు దీని బారినపడ్డారు. దీనితో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉందని మంత్రి వెల్లడించారు..

Tadepalle

2021-06-25 14:56:03

ప్రిన్సిపాల్స్ మైండ్ సెట్ మారాలి ముందు..

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాళ్ల మైండ్ సెట్ మారితేనే విద్యార్ధుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి ఆస్కారం వుంటుందని ఉన్నతవిద్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డా.పోలాభాస్కర్ అన్నారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత విశాఖలో తొలి సమావేశం ఉత్తరాంధ్రాలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిల్స్ తో ఏయూలోని డా.వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు అత్యధిక సమయం ఆన్ లైన్ విద్య అందించడానికి సమయం వెచ్చించాలన్నారు. అదే సమయంలో పాత విద్యావిధానాలకు స్వస్తిచెప్పి నూతన విద్యావిధానాలను అలవాటు చేసుకోవడం ద్వారా విద్యార్ధులకు మంచి విద్య అందించడానికి ఆస్కారం వుంటుందన్నారు. నేను ఇలాగే ఆడుతూ పాడుతూ పనిచేస్తాను..ఈవిధంగానే ఉంటానంటే కుదరదని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఆన్ లైన్ చేసి సెంట్ర్ సిస్టమ్ ద్వారా మానటరింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కాలేజీల్లో అడ్మిషన్లు పెంచడంతోపాటు, ఆన్ లైన్ విద్యలో విద్యార్ధులు విధిగా పాల్గొనేలా చేయాలన్నారు. విద్యార్ధులు, అద్యాపకుల ఆన్ లైన్ విద్య కోసం ప్రత్యేకంగా యాప్ ప్రవేశపట్టినట్టు వివరించారు. దీని ద్వారా ఏఏ కాలేజీల్లో ఎంత అద్యాపకులు, ఎన్ని గంటలు ఆన్ లైన్ విద్య విద్యార్ధులకు అందించారో కూడా మానిటర్ చేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ప్రభుత్వ డిగ్రీకాలేజీలతోపాటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల ప్రన్సిపాల్స్ కూడా ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. వారికి ప్రభుత్వమే ఎయిడ్ ఇస్తున్నందున ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. త్వరలోనే అద్యాపకులకు నూతన విద్యావిధానంపై శిక్షణా తరగతులను ఏర్పాటు చేయనున్నామన్నారు. విద్యార్ధులు డిగ్రీ పూర్తిచేసుకొని బయటకు వెళ్లగానే వారికి ఉద్యోగ, ఉపాది అవకాశాలు వచ్చే కోర్సులను కాలేజీల్లోకి అందుబాటులోకి తేవాలన్నారు. అంతే తప్పా ఏదో ఆడుతూ, పాడుతూ పనిచేసుకుంటూ పోతాం..మన జీతం మనకి వచ్చేస్తుందనే దోరణికి ఇకపై స్వస్తి చెప్పాలన్నారు. డిగ్రీవిద్యలో విద్యార్ధులు అన్నికోర్సుల్ల విద్యార్ధులు చేరేందుకు ముందుగా దగ్గర్లోని ఇంటర్ కాలేజీలను సందర్శించి అక్కడి నుంచి విద్యార్ధులను చేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా డ్రాపౌట్స్ లేకుండా చూసుకోవాలన్నారు. శతశాతం విద్యార్ధులు డిగ్రీపట్టాతో బయటకు వెళ్లే విధంగా విద్య అందించడానికి శక్తివంచన లేకుండా క్రుషిచేయాలన్నారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జోన్లలోని ప్రిన్సిపాళ్లతో తరచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ విద్యాభివ్రుద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిషనర్ పోలా భాస్కర్ వివరించారు. ఈ సమీక్షలో ఆర్డీలు, ఆర్జేలు, తదితరులు పాల్గొన్నారు.


Visakhapatnam

2021-06-25 13:11:37

GMSK,WMSKలు ఇక పోలీసులే..

గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సంరక్షణా కార్యదర్శిలు/మహిళా పోలీసులంటే మీరేమైనా నిజమైన పోలీసులు అనుకుంటున్నారా.. హోంగార్డు కంటే తక్కువ స్థాయి.. మీరు కేవలం గ్రామాల్లోని సమాచారం మాత్రమే మాకు పంపాలి..అంతకు మించి నిజమైన పోలీసుల్లా ఫీలైపోతే మీ ఉద్యోగాలు తీయించేస్తాను..ఇదో స్టేషన్ లో ఎస్ఐ నుంచి హోంగార్డు కూడా ఇచ్చిన వార్నింగ్.. అసలు మీరేమనుకుంటున్నారు..మహిళా పోలీస్ అంటే అంగన్వాడీలపై పెత్తనం చలాయిద్దామనుకుంటున్నారా.. అలాంటివి నా దగ్గర పనిచేయవు మేము చెప్పినట్టు చేయాలి.. లేదంటే పైకి రాసేస్తాం మీ ఉద్యోగాలు పోతాయ్ ఐసిడిఎస్ లో ఇదొక సిడిపిఓ బెదిరింపు.. నిన్నగాక మొన్న వచ్చి ఎంతో కాలంగా పనిచేస్తున్న అంగన్వాడీల మీ పెత్తనం ఏంటి, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే అర్జెంటుగా ఇచ్చేయాలా.. మా యూనియన్ లో మాట్లాడుకొని ఇస్తాం..ఇప్పటికిప్పుడు అంటే కుదరదు.. ఇదొక అంగన్వాడీ కార్యకర్త రుబాబు..ఇవన్నీ గ్రామ సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులకు తరుచూ వచ్చే బెదిరింపులే.. ఇవి కాకుండా మండల అధికారుల విషయమైతే చెప్పాల్సిన పనేలేదు అవి మాటలకి అందవు ఇవన్నీ జూన్ 22-2021 వరకూ మాత్రమే జరిగాయి.. కట్ చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శి(GMSK,WMSK)లను ప్రభుత్వం సాధారణ పోలీసులుగా మార్చేసింది. ఈమేరకు ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబరు 59ని  ఈనెల 23న విడుదలచేస్తూ సాధారణ పోలీసులకు ఏ విధమైన అధికారాలు, విధులు ఉంటాయో వీరికీ అదే తరహా విధులు ఉంటాయని ఆ జీఓలో స్పష్టం చేస్తూ ఏపీ గెజిట్ లో నమోదు చేయడం విశేషం. దీనితో మహిళాపోలీసులపై కాస్త అతిచూపించే అధికారులు, ఇతర సిబ్బంది గొంతులోనూ పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. అంతేకాకుండా వీరి సర్వీసులో ప్రమోషన్ వస్తే అదనపు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందుతారని  కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైగా ఇకపై మహిళా పోలీసులందరికీ కాకి డ్రెస్ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ప్రతీ సచివాలయ పరిధిలో కాకీ డ్రెస్ వేసుకున్న పోలీసులు అందుబాటులో ఉంటే గ్రామంలోని అల్లర్లతోపాటు, మహిళలకు రక్షణ కూడా అధికంగా వుంటుందని ప్రభుత్వం భావించింది. ఇటీవలే ప్రకాశం బ్యారేజి దగ్గర చోటు చేసుకున్న(యువతిపై సామూహిక అత్యాచారం)ఘటనలు మళ్లీ పునరావ్రుతం కాకుండా ఉండాలన్నా, గ్రామస్థాయిలో కష్టం వచ్చిన వెంటనే మహిళలు సచివాలయనాకి వచ్చి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా, దిశ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నా జిఎంఎస్కేలను పోలీసులుగా చేస్తే తప్పా పరిస్థితి గాడిలోకి రాదని ప్రభుత్వం భావించినట్టు ఈ జీఓ ద్వారా స్పష్టంగా కనిపించింది. దానికోసం రాష్ట్రస్థాయిలో డిజిపీతో సహా ఇతర పోలీసు విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, ప్రభుత్వంలోని ముఖ్య కార్యదర్శితో పాటు పలు శాఖల అధికారులతో చర్చలు జరిపిన తరువాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సచివాలయాల్లో పనిచేసే పోలీసులు వీరికి అనుసంధానంగా ఉంటారు. ఇకపై గ్రామాల్లో ప్రజలు చేసే ఫిర్యాదులన్నీ మహిళా పోలీసుల ద్వారానే పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అవుతాయి. త్వరలోనే వీరికి డ్రెస్ కోడ్ తోపాటు ఒక ట్యాబ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం వస్తోంది. దాని ద్వారా గ్రామాల్లోని అత్యవరసర, గొడవలను, ప్రత్యేక పరిస్థిని ఎప్పటి కప్పుడు ఫోటోలు, వీడియోలు, కేసుల రూపంలో గ్రామ మహిళా పోలీసులు స్టేషన్ ఎస్ఐకి నివేదించే విధంగా ప్రత్యేక మార్పులు కూడా చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ మహిళా పోలీసులు, హెల్త్, ఐసిడిఎస్, విలేజ్ సెక్యూరిటీ  సర్వీసుల్లో కీలకంగా వ్యవహరించారు. ఇకపై వారిని హోంశాఖలో సాధారణ పోలీసులుగా మార్చడంతో గ్రామస్థాయిలో ఒక పోలీసునే ప్రత్యేకంగా  నియమించినట్టు అయ్యింది. పైగా కింది స్థాయి ఉద్యోగులను చులకనగా చూసిన అధికారులకు, సిబ్బందికి జీఓనెంబరు 59 ద్వారా చెక్ చెప్పినట్టు అయ్యింది. పైగా వీరు విధుల్లోకి చేరి ఏడాదిన్నర గడుస్తున్న సందర్భంగా నెల రోజుల క్రితమే వీరికి ప్రభుత్వం సర్వీసు రిజిస్టర్లను కూడా పూర్తిచేసింది ప్రభుత్వం. మరో ఆరు నెలలు గడిస్తే మహిళా పోలీసుల సర్వీసు కూడా రెగ్యులర్ అవుతుంది. అంతకు ముందే ప్రభుత్వం వీరిని సాధారణ పోలీసులగా మార్పు చేస్తూ ఇచ్చిన జీఓ సాహసోపేతమని పోలీసు, వైఎస్సార్సీపీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇకవీరంతా ఖాకీ డ్రెస్సుల్లో విధులకు రావడం ఒక్కటే తరువాయి. గ్రామంలో మహిళా పోలీసును అందుబాటులోకి తేవడం ద్వారా ప్రభుత్వం మహిళల కోసం ఎంతో శ్రద్ధ తీసుకుందని మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Tadepalli

2021-06-24 01:32:25

9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలు..

రాష్ట్ర వ్యాప్తం బోట్లను కంట్రోల్ చేయడానికి 9 కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
ప్రైవేటు బోటు యజమానులతో జూన్ 24న సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 50 బోట్లకు గానూ 48 బోట్లు అనుమతులు తీసుకున్నాయని, అవి గురువారం నుంచే బోటింగ్ నిర్వహించుకోవొచ్చునన్నారు. ఇప్పటికీ కొందరు ప్రైవేటు బోటు యజమానులు లైసెన్సులు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా ప్రైవేటు బోట్లు నిర్వహించేలా కొత్త విధి విధానాలు రూపొందించామన్నారు. వాటిపై ప్రైవేటు బోటు యజమానులతో శుక్రవారం విజయవాడలోని బెరమ్ పార్కులో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పర్యాటక, స్పోర్స్టు అధికారులు పాల్గొన్నారు. 

Tadepalle

2021-06-23 13:32:46

రూ.164 కోట్లతో ‘బ్లూ బే’హోటల్..

విశాఖపట్నంలోని రుషికొండలో ఉన్న హరిత రెస్టారెంట్ ను రూ.164 కోట్లతో బ్లూ బే హోటల్ గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  విశాఖ తీరానికి కొట్టికొచ్చిన విదేశీ ఓడను లో ఫ్లోటింగ్ రెస్టారెంట్(షిప్ రెస్టారెంట్) ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని, వీలైనంత తొందరగా షిప్  కొనుగోలుకు చర్యలు తీసుకోనున్నామన్నారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ పనులు ప్రారంభించి, పర్యాటకలకు అందుబాటులో తీసుకురానున్నామన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి  తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో ఉన్న 33 బార్లలో విదేశీ మద్యంతో పాటు క్వాలిటీ ఉన్న బ్రాండ్లను ఈ బ్లార్లలో విక్రయించనున్నామన్నారు. ఈ మద్యాన్ని అధిక ధరలకు కాకుండా తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కడప జిల్లాలో ఉన్న గండికోటలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా హోటళ్లు, ఇతర సౌకర్యాల క్పలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హార్సలీ హిల్స్ తరహాలో గండికోటను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటితో పాటు.. రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా కారణంగా ఆ పనులు ఆలస్యం చోటుచేసుకుందన్నారు. విశాఖ, తిరుపతిలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒబరాయ్ హోటల్ యాజమన్యం ముందుకొచ్చిందన్నారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లోనూ పీపీపీ పద్ధతిలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రపంచ పర్యాటక పటంలో ఏపీని నిలపాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లకు ఆహార పదార్థాలు సప్లయ్ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 హోటళ్ల ద్వారా గతేడాది రూ.58.05 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.28 కోట్ల మేర ఆదాయం ఆర్జించామన్నారు.

Tadepalle

2021-06-23 13:21:42

24 నుంచి పర్యాటక అనుమతులు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల్లోకి గురువారం(జూన్ 24) నుంచి పర్యాటకులను అనుమతించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో  పర్యాటక ప్రాంతాల్లోకి పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించామన్నారు. పర్యాటకం ద్వారా ఆదాయం పెంచుకునే చర్యలు తీసుకోనున్నామన్నారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నామన్నారు.  కొవిడ్ కష్ట కాలంలో ఆదాయం తగ్గినా పర్యాటక శాఖలోని ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదన్నారు. అంతకుముందు పర్యాటక, క్రీడల అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి  సమీక్షా సమావేశం నిర్వహించారు. బోటుల నిర్వహణకు రాష్ట్రంలో వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ ను ఆదేశించారు. పర్యాటకం ద్వారా ఆదాయం పెంపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. టూరిజంలో అవినీతికి అడ్డుట్ట వేస్తూ, చిత్తశుద్ధితో పనిచేసే ఉద్యోగులను ప్రోత్సాహించాలన్నారు. పర్యాటక శాఖ పరధిలో ఉన్న హోటళ్ల ట్రేడ్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి ట్రేడ్ రిజిస్ట్రేషన్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక, స్పోర్స్టు అధికారులు పాల్గొన్నారు. 

Tadepalle

2021-06-23 13:15:41

మళ్లీ తెరపైకి సిపిఎస్ రద్దు అంశం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం జాబ్ కేలండర్ ప్రకటించిన తరుణంలో మరోసారి ఉద్యోగుల సిపిఎస్ రద్దు అంశం తెరపైకి వచ్చింది. పాదయాత్ర సమయంలో ప్రకటించిన హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా సీపిఎస్ రద్దు విషయమై ప్రభుత్వం నేటికీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఈ విషయంలోనే అటు ప్రతిపక్షపార్టీల నేతలతో కొందరు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు చెందిన కోవర్టు నేతలతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ప్రకటిస్తే ఉద్యోగులకు తరచుగా పీఆర్సీ అమలు చేయడంతోపాటు, ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెబుతున్నారట. పేద ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో నగదు పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పితే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని..ఈ ప్రభుత్వంలో మీ డిమాండ్ నెరవేరదనే కోణంలో రాజకీయం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వం ఉద్యోగులు రెండు నెలల క్రితం కోవిడ్ ఉందనే కారణంలో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లల్లోనే తమ నిరసన తెలియజేశారు కూడా. ఈ సందర్భంలో ప్రతిపక్షపార్టీల నేతలు చేస్తున్న రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కేవలం లక్షా 16వేలమంది ఉంటే ఇతర ప్రభుత్వ శాఖ ఉద్యోగులు సుమారుగా ఆరు లక్షల పైచీలుకే ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు సిపిఎస్ రద్దు విషయంలో కలిసి రాకపోయినా..ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల బలం అధికంగానే వుంది. ఉన్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోనే నిరసన మళ్లీ ఉద్రుతం చేయాలని ఉద్యోగ సంఘాలు, సీపిఎస్ యూనియన్ నాయకులు భావిస్తున్నారట. పాదయత్ర సమయంలో రాష్ట్రంలో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు, ఆర్టీసీ ఉద్యోగులను కార్పోరేషన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు తదితర అంశాలను ప్రభుత్వం నెరవేర్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దు, పీర్సీ అమలు, డీఏ ఇచ్చే విషయమంపై నేటికీ ప్రకటన చేయలేదు. అంతేకాకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమ బద్దీకరణ అంశంలో మంత్రుల కమిటీ వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. దీనితో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సీపిఎస్ రద్దు కోరుతూ ఉద్యమం చేసి తమ నిరసనను తెలియజేయాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మాత్రం పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సీపిఎస్ రద్దు హామీ ఇచ్చిన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు వైఎస్సార్సీపీకి తమ మద్దతు తెలియజేశారు. కానీ రెండేళ్లు దాటిపోతున్నా..ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, అసలు సిపిఎస్ రద్దు చేస్తుందా లేదా..అనేవిషయంలో క్లారిటీ లేకపోతే తమ మద్దతును ప్రభుత్వానికి ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉద్యోగుల సిపిఎస్ రద్దు అంశం 2024 ఎన్నికల్లో ప్రభుత్వానికి మరోసారి మద్దతు తెలియజేస్తే అమలు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చూస్తుందని, వచ్చే ఎన్నికలకు దీనిని వినియోగించుకోవాలని ప్రభుత్వంలోని సలహాదారులు ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారని చెబుతున్నారు. ఆ కారణంగానే పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి చూపించే శ్రద్ధ వాటిని అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ రద్దుపై చూపించలేదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.  సిపిఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఒక నిర్ధిష్ట ప్రకటన చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ఇస్తారా లేదా ముందుగా ఆఫర్ చేస్తున్న ప్రతిపక్షాలకు చేయందిస్తారా అనేది నేడు ప్రధాన చర్చజరుగుతుంది..ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి..!

Tadepalle

2021-06-23 02:10:11

30న ఏపీ మంత్రి మండలి భేటీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి మండలి ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ లో ఉన్న కేబినెట్ హాల్ లో ఈ సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఈ నెల 30 వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు.  

Tadepalle

2021-06-22 13:01:47

25న డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాళ్ల సమావేశం..

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనరం జిల్లాల డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజిల ప్రిన్సిపాళ్లతో ఈనెల 25న విశాఖలో జోనల్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ డా.పోలా భాస్కర్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్ ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నతవిద్యలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత కాలేజీల్లో నెలకొన్న సమస్యలు, ఏర్పాటు చేయాల్సిన వసతులపై ప్రిన్సిపాళ్లతో చర్చిస్తామన్నారు. మొదటిగా ఉత్తరాంధ్రాలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన తరువాత విడతల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశం అనంతరం ప్రత్యేకంగా స్టేట్ లెవల్ రూట్ మ్యాప్ తయారు చేయనున్నట్టు వివరించారు. ఈ సమావేశం అనంతరం పలు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, అక్కడ జరుగుతున్న అభివ్రుద్ధి పనులను కూడా స్వయంగా పరిశీలిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఉన్నత విద్యకు ప్రాధనిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ విశాఖ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా సంవత్సరాల తరువాత ఉన్నతవిద్యాశాఖ పై జరుగుతున్న ఈ సమీక్షలో చాలా సమస్యలకు పరిష్కారం లభించనుందని తెలుస్తుంది.

Tadepalle

2021-06-22 12:28:05

ఏపీలో ఉన్నత విద్యకు బంగారు బాటలు..

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యకు చాలా ఏళ్ల తరువాత మహర్ధశ పట్టబోతుంది.. ఇప్పటివరకూ డిగ్రీకాలేజీలు, యూనివర్శిటీల్లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యకోసం క్రుషిచేసిన అధికారులు లేకుండా పోయారు. దీనితో ఉన్నత విద్య రాష్ట్రంలో అంతంత మాత్రంగానే సాగుంది.. ఏపీలోని ఉన్నత విద్య దేశానికే ఆదర్శం కావాలన్నా, ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలు అందుబాటులోకి రావాలన్నా ఉన్నతాధికారులు కీలకంగా వ్యవహరిస్తే తప్పా అదిజరగదు. దానికోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం డేరింగ్ అండ్ డేషింగ్  సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలాభాస్కర్ ను రంగంలోకి దించింది. ఈయన ఉన్నత విద్యకు  కమిషనర్, డైరెక్టర్ టెక్నకల్ ఎడ్యుకేషన్ గా చేరిన వెంటనే శాస్వత అభివ్రుద్ధికి, ప్రక్షాలనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రీజియన్ కేంద్రాలు, వాటి కింద వున్న ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, సదుపాయాలు, విద్యావ్యవస్థ, ఆన్ లైన్ విద్య, ఇలా అన్ని విషయాలపై ఒకేసారి ద్రుష్టి కేంద్రీకరించారు. దీనితో ఉన్నత విద్యలో ఎన్నడూ రానంతగా చురుకుదనం, కొత్త కొత్త విధానాలు అమలవుతున్నాయి. కరోనా సమయంలో డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్ధులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారు. మళ్లీ విద్యార్ధులకు ఆ స్థాయిలో విద్య అందించాలంటే శాఖా పరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్పా విద్యార్ధుల భవిష్యత్తుకి బాటలు వేయలేమని ప్రభుత్వం భావించి ఆ దిశగా తన దైన స్టైల్ లో కార్యాచరణ తో ద్రుష్టిని కేంద్రీకరించారు కమిషనర్.  ఈ ఉన్నతాధికారి విధుల్లోకి చేరుతూనే కరోనా సమయంలో ఆన్ లైన్ విద్య విద్యార్ధులకు సక్రమంగా జరగడం లేదనే విషయాన్ని పసిగట్టారు. వెంటనే జోనల్ స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాలు అనంతరం రూట్ మ్యాప్ ద్వారా  రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతోపాటు సదుపాయాలు, సిబ్బందికొరత, భవనాలు, విద్యావిధానం ఇలా అన్ని అంశాలను గాడిలోపెట్టడానికి కార్యాచరణ రూపొందించారు. ఉన్నత విద్య కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వచ్చే ఫలితాలు ఎలావుంటాయో ఈయన జిల్లా కలెక్టర్ గా చేసిన జిల్లాల్లో ఇప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల నెమరు వేస్తూనే వున్నారు. ఇపుడు విద్యార్ధుల భవిష్యత్తుకు కూడా బంగారు బాటలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని  కమిషనర్ పోలాభాస్కర్ పుణ్యమాని విద్యార్ధుల విద్యావిధానం, నాణ్యమైన విద్య, కళాశాలల్లో మరింతగా అభివ్రుద్ధి చెందుతాయని అన్ని వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి..!
       

Tadepalle

2021-06-22 12:06:46

సచివాలయ ఉద్యోగాలు భర్తీ ఇక అప్పుడే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత తక్కువగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో మరోసారి గ్రామ,వార్డు సచివాలయ మిగులు ఉద్యోగాలు, పోలీస్ శాఖలో ఖాళీలు, భర్తీకాకుండా మిగిలిపోయిన ఉపాధ్యాయుల ఉద్యోగాలు, చాలా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా వున్న కీలక జిల్లా పోస్టుల్లో అధికారులు డిప్యుటేషన్ పై పనిచేస్తున్న విషయం మరోసారి తెరపైకి వచ్చాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో మిగిలిపోయిన సుమారు 9వేల ఉద్యోగాలను వచ్చే ఏడాది జాబ్ కేలండర్ లో ప్రకటిస్తారనే సమాచారం ప్రచారంలోకి వచ్చేసింది. నెల రోజుల క్రితం సచివాలయ వ్యవస్థలో సుమారు 9వేల మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తామని ప్రకటించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆగస్టులో 6వేల పోలీసు సిబ్బంది ఖాళీలను భర్తీచేస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత చేసిన ప్రకటనలనే ఇపుడు నిరుద్యోగులు గుర్తుచేస్తున్నారు.  ప్రతీ ఏడాది 18వేల ఉద్యోగాలకు తక్కువ లేకుండా అన్ని రకాల ఉద్యోగాలను జాబ్ కేలండర్ ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నారని మంత్రులు ఒకరి తరువాత ఒకరు ప్రకటిస్తున్నారు.  నేటి వరకూ ప్రధాన ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలతో పాటు సచివాలయంలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుమారు 500 మందికి పైగా సచివాలయ ఉద్యోగులు తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఉపాధ్యాయ ఉద్యాగాల్లోకి చేరిపోయారు. వీటితోపాటు చాలా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండిపోయిన ఖాళీల కారణంగా  కొందరు అధికారులతో డిప్యూటేషన్ పద్దతిపై ప్రభుత్వం అదనపు ఉద్యోగం చేయిస్తుంది. రాష్ట్ర ఖజానాను ద్రుష్టిలో పెట్టుకొని మాత్రమే తక్కువగా పోస్టుల భర్తీ తొలి జాబ్ కేలండర్ లో ప్రకటించారని చెబుతున్నా.. ముఖ్యంగా విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టులకి సంబంధించి డిఎస్సీ ప్రస్తావన లేకపోవడం కూడా నిరుద్యోగులను తీవ్రస్థాయిలో నిరాశకు గురిచేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత అధికంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను మాత్రమే భర్తీచేసింది. మిగిలిన ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వం చేపట్టిన వాటినే దఫ దఫాలుగా భర్తీచేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరంతం ఆందోళనలు చేపడుతున్నారు. దీనితో రంగంలోకి దిగిన వివిధ శాఖల మంత్రులు నిరుద్యోగులను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే జాబ్ కేలండర్ మార్చినాటికి వస్తుందని దానిలో మిగులు ఉద్యోగాల భర్తీచేడతామని, అంతేకాకుండా కరోనా సమయంలో అత్యధిక ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం మంచిది కాదనే భావనతోనే ప్రభుత్వం తక్కువగా ఉద్యోగాల భర్తీ చేపడుతుందని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని పేర్కనడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఏది ఏమైనా జాబ్ కేలండర్ విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల సంఖ్య నిరుద్యోగులను తీవ్రస్థాయిలో నిరాశకు గురిచేసింది. అంతేకాకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందోలేదో కూడా క్లారిటీ ఇవ్వకుండా వాటిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే జాబ్ కేలండర్ లో చూపించడం నిరుద్యోగులకి ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో మంత్రల ప్రచారం మేరకు వచ్చే ఏడాది ఎన్ని ఖాళీల భర్తీకి జాబ్ కేలండర్ వస్తుందనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.. వచ్చే జాబ్ కేలండర్ లో నైనా ఉద్యోగాల సంఖ్య పెంచుతారా లేదంటే ఇదేస్థాయిలో ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి..!

Tadepalle

2021-06-22 02:12:20

ఈ-హాస్పిటల్ అందుబాటులోకొచ్చేనా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న ఈ-హాస్పిటల్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా గత ప్రభుత్వం హయాంలో ఈ-హాస్పిటల్ ను అభివ్రుద్ధి చేసి పేపర్ లెస్ ఆస్పత్రులను ప్రజలకు అందించాలని అప్పటి ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య సంకల్పించారు. ఆమె ప్రభుత్వ శాఖ, ప్రభుత్వం కూడా మారిపోవడంతో ఆ తరువాత మళ్లీ ఆ ఊసే ప్రభుత్వం ఎత్తలేదు. రూ1000 దాటితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలని భావించిన ప్రభుత్వం ఈ-హాస్పిటిల్ ను మాత్రం అందుబాటులోకి తీసుకువస్తుందని అంతా భావించారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు.. ఈ-హాస్పిటల్ వ్యవస్థ అందుబాటులోకి రావడం ద్వారా ప్రభుత్వ డిస్పెన్సరీలు, పీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లోకి కావాల్సిన వసతులు, మందులు, ల్యాబ్ పరికరాలు, యంత్రాలు, సిబ్బంది ఖాళీలు మొత్తం అన్నీ ఒకే వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వం తెలుసుకునే వీలుంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా ఒకే రకమైన మందులు కొనుగోలు చేసి అవి వినియోగంలోకి రాక చాలా చోట్ల మందులు అధికంగా వ్రుధా అవుతున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా ప్రజల రోగాలకు కావాల్సిన మందులు కొనుగోలు చేసి అందించే ఏర్పాటు చేయవచ్చు. పైగా ఏ రకం మందులు ప్రజలు అధికంగా ఉపయోగ పడుతున్నాయో కూడా తెలుసుకునే వీలుంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీచేయాలనుకున్నా, వసతులు కల్పించాలన్నా, ఎపడమిక్ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా చేయాలన్నా ఒకేసారి జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ కోరే పనుండదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాలకు ఖాళీల విషయమై ప్రతీసారి ఫైల్ రన్ చేసే ఇబ్బందులు కూడా తప్పుతాయి. ఈ-హాస్పిటిల్ విధానం ద్వారా ఆన్ లైన్ లోనే రోగి ఆధార్ కార్డు లేదా, ఫోన్ నెంబరు ఆధారంగా వివరాలు నమోదు చేసి..ఏ రోగి రోగానికి ఏ తరహా మందులు ఇచ్చారు, ఏ తరహా రక్తపరీక్షలు చేశారు, ఎలాంటి మందులు చీటీ రాశారు, రాసిన మందులు పీహెచ్సీల్లో అందుబాటులో ఉన్నాయా లేదా, ఇంకా ఎలాంటి టెస్టులు చేయాలి, ఆసుపత్రిల్లో అందించే సేవలు అనేవివరాలు ఇలా అన్నీ ఒక ప్రత్యేక ఫామ్ లో నమోదు అవుతాయి. తద్వారా ప్రభుత్వానికి కూడా ఎంత మంది ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించారో ఆధారాలతో సహా ప్రకటించడానికి వీలుపడుతుంది. ఇదే విషయాన్ని జిల్లాలోని డిఎంహెచ్ఓలు, రాష్ట్రస్థాయిలో వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి స్వయంగా వివరాలు ఈ హాస్పిట్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రభుత్వం అందించే సేవలు కూడా అన్ని కార్యక్రమాలు మాదిరిగానే మీడియా ద్వారా ఏఏ సేవలు ప్రజలకు అందించారో కూడా తెలియజేయడానికి ఆస్కారం వుంటుంది. ఇన్ని సదుపాలయాలతోపాటు పేపర్ లెస్ ఆసుపత్రిగా మార్చడం ద్వారా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తేవాలని నాడు సంకల్పించారు. ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రులకు ఓపీలో ఏ తరహా రోగులు వస్తున్నారనేది పర్శంటేజీ రూపంలో ప్రభుత్వానికి తెలిసే అవకాశం వుంటుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం మందులు, ఇతర సదుపాయాలు కల్పించడానికి, ఆరోగ్యశ్రీ సేవలు అందించడానికి అవకాశం వుంటుందనేది ఈ-ఆసుపత్రి ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతీఏడాది జాబ్ క్యాలెండర్ తీయడానికి సన్నద్దమైన నేపథ్యంలో పీహెచ్సీనుంచి జిల్లా ఆసుపత్రి వరకూ సిబ్బంది ఖాళీల వివరాలు కూడా ఏకకాలంలో తెలుసుకోవడం ద్వారా అవసరమైన సమయంలో ఖాళీలను భర్తీచేయడానికి వైద్యఆరోగ్యశాఖ వివరాలు అందుబాటులోకి వస్తాయి.  ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఇదే విధానాన్ని అవలంభిస్తూ..అనవసర మందుల వినియోగాన్ని తగ్గించుకుంటూ పేపర్ లెస్ ఆసుపత్రులగా అభివ్రుద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా వారికి కావాల్సిన సిబ్బందిని కూడా వారి రాష్ట్ర యాజమాన్యం ఆదేశాల మేరకు నియమాకాలు కూడా చేపడుతున్నాయి. ప్రస్తుతం మొబైల్ ఫోన్ నెంబరు ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ-హాస్పిటిల్ వ్యవస్థ ఎంతో చక్కగా అమలు చేస్తున్నారు. ఇదే విధానాన్ని రాష్ట్రప్రభుత్వం కూడా అవంభిస్తే ప్రజలకు గ్రామ స్థాయిలో ప్రాధమిక ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యం నెరవేరడంతోపాటు, జిల్లా ఆసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్యం అందించడానికి వీలు కలుగుతుంది. ఈ దశగా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి మరి..!

Tadepalle

2021-06-22 02:11:02