1 ENS Live Breaking News

ఆ పరీక్షతోనే వారి సర్వీసు రెగ్యులర్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయడానికి ఏర్పాట్లు చకచకా చేస్తున్నది. ఇందులో భాగంగా వారికి సర్వీసు రెగ్యులైజేషన్ కు సంబంధించి శాఖా పరమైన పరీక్షలు పాసైన తరువాత వారి ప్రొహిభిషన్ పీరియడ్ ఎత్తివేసి వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయనున్నది. అయితే ఇక్కడ ఉద్యోగులకు ప్రధానంగా ఒక డౌట్ పట్టి పీడిస్తోంది.. ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఇచ్చిన డిపార్ట్ మెంటల్ టెస్టు నోటిఫికేషన్ లో పాసైన వారినే రెగ్యులర్ చేస్తుందా.. లేదంటే ఆయా ప్రభుత్వ శాఖల విధి నిర్వహణ పరంగా ఇచ్చిన శిక్షణ పూర్తిచేసుకున్న తరువాత పెట్టిన టెస్టులు పాసైన వారి ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తుందనే విషయంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. మరోపక్క సచివాలయ శాఖలో ఇంకా శాఖాపరమైన శిక్షణలు మిగిలి పోయిన వారికి ఆన్ లైన్ శిక్షణను పూర్తిచేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దానికోసం శిక్షణకు సంబంచిన ఆన్ లైన్ క్లాసులను కూడా శిక్షణ మిగిలి పోయిన సచివాలయ ఉద్యోగులకు పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తుంది. చాలా మంది సచివాలయ ఉద్యోగులు శాఖా పరమైన ఉద్యోగ శిక్షణ పూర్తిచేసుకొని ఉన్నారు. ఆ శిక్షణపై ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక పరీక్ష ఏర్పాటు చేస్తుందా...లేదంటే డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించి అందులో పాసైన వారిని రెగ్యులర్ చేస్తుందా అనే విషయంపై క్లారిటీ లేకపోడంతో సచివాలయ సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటీవలే సీఎం జగన్మోహనరెడ్డిని సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసినపుడు సీఎం ఈ విషయమై బదులివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అంది ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. అప్పట్లో కరోనా కేసులు అధికంగా వుండటంతో కొన్ని బ్యాచ్చీల ఉద్యోగులకు శాఖ పరమైన శిక్షణ మధ్యలోనే ఆపేశారు. ప్రభుత్వం నుంచి ఈ రకమైన సమాధానం రావడంతో తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా లేదా అనే అనుమానాలు వారిని తొలిచేస్తున్నాయి. మరోవైపు నవంబరు నాటికి ఉద్యోగులంతా విధుల్లోకి చేరి రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఆ సమాయానికి ఉద్యోగులందరి ప్రొహిభిషన్ పీరియడ్ పూర్తవుతుంది. అనుకున్న తేదీకే ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోతే ఇబ్బందులొస్తాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వారికి ఆరునెలల ముందుగానే సర్వీసు రిజిస్టర్లు కూడా ఓపెన్ చేశారు. ఎస్ ఆర్ లు ఓపెన్ చేయడంతో అంతా వారి ఉద్యోగాలకు లైన్ క్లియర్ అయిందని సంబర పడిన తరుణంలో ప్రభుత్వం శాఖాపరమై పరీక్షలు పాసైన వారి ఉద్యోగాలు మాత్రమే రెగ్యులర్ చేస్తామని చెప్పడంతో రాష్ట్ వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో ప్రభుత్వం అసలు ఏ పరీక్ష ద్వారా తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తారో చెబితే దానికే తామంతా ఇప్పటి నుంచే సిద్దమవుతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ధిష్ట ప్రకటన చేస్తే తప్పా ఆ.. అర్హత పరీక్ష ఏంటనేది ఉద్యోగులకు క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు..!

Tadepalli

2021-06-13 05:42:17

జూమ్ లో బీఎంఎస్ 3వ రాష్ట్ర మహాసభ..

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్ర సమావేశం రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్టు అధ్యక్ష, కార్యదర్శిలు ఎం.శ్రావణ్ కుమార్, ఎల్ ముత్యాలు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఒక ప్రటన విడుదల చేసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నేషనల్ ప్రెసిడెంట్ హిరణ్మన్య పండ్య, ఉపాధ్యక్షులు ఎల్పీ కటక్వార్, ఎం జగదీశ్వర్రావు, సౌత్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.దురారీరాజ్ పాల్గొంటారని అన్నారు. వీరితోపాటు బిఎంఎస్, బిటిఈయూ నేషనల్ ప్రెసిడెంట్ వివిఎస్.సత్యన్నారాయణ, జిల్లా కార్యదర్శిలు డివి.ప్రసాద్(విశాఖపట్నం) , సోమేశ్వరరావు(శ్రీకాకుళం), క్రిష్ణారావు(విజయనగరం), రాష్ట్ర కార్యదర్శి ధర్మాంగుదుడు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సమావేశాలు రాత్రి ఏడు గంటల వరకూ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర సమావేశాల్లో సంఘ్ చేపట్టిన కార్యక్రమాలతోపాటు, చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా సుదీర్ఘ చర్చ జరుతుందని వివరించారు.

Tadepalle

2021-06-12 16:28:29

ప్రభుత్వ శాఖల్లో కోవర్టు అధికారులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవర్టు అధికారులు తలనొప్పిగా తయారయ్యారు..ప్రభుత్వ శాఖల్లోని పనిచేసే కొందరు అధికారులు ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను ముందుగానే లీక్ చేస్తున్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం చేయాలనుకున్న కొన్ని కీలకమైన పనుల విషయంలో వీరి వలన అవరోధాలు ఏర్పడుతున్నాయి. అలాంటి వారంతా గత ప్రభుత్వంలోని పెద్దలకు ఈ సమాచారం అందిస్తే..వారు వారి అనుకూల మీడియాకి ఉప్పు అందించి ప్రభుత్వంపై బురదచల్లే పనికి తెగబడుతున్నారనేది ఇటీవల కాలంలో పలు అంశాల్లో తేట తెల్లమైంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదనే నానుడికి తగ్గట్టుగా ప్రభుత్వ శాఖల్లోని కొందరు పెద్దస్థాయిలో వున్న అధికారులే ప్రభుత్వ సమాచారాన్ని చాలా తెలివిగా బయటకు తీసుకురావడంలో సఫలీక్రుతులవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ అనుకూల మీడియా వున్నప్పటికీ ప్రతిపక్ష నేతల అనుకూల మీడియా బయటకు తీసే కొన్ని కీలకమైన వ్యవహారాలపై కౌంటర్ ఇచ్చే దైర్యం కూడా చేయలేకపోతుంది. దీంతో ఇపుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం చేయాలనుకున్న పనిని కొన్ని సందర్భాల్లో ఒక వర్గం మీడియా ప్రజలను భయపెట్టేవిధంగా, ప్రభుత్వంపై చెడు ప్రభావం పడే విధంగా చేయడంలో కీలకభూమిక పోషిస్తుంది. ఈవిషయంలో ప్రభుత్వంలోని కొందరు అధికార ప్రతినిధులు ఉన్నప్పటికీ ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడం వలనే ప్రభుత్వ వ్యతిరేక మీడియా అనుకున్నది చేయగలుగుతోందని చెబుతున్నారు. అందులోనూ ప్రభుత్వం కూడా మీడియాను పట్టించుకోకపోవడం, కావాలనే పక్కన పెట్టడం, జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరించడంతో  కొన్ని మీడియా సంస్థలు ఏకంగా ప్రభుత్వం మంచి పనులు చేసినప్పటికీ వాటిని ప్రజల ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చయడం లేదు. అదేస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక మీడియ చేస్తున్న ప్రచారాన్ని తమకున్న నెట్వర్క్ తో తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. వెరసీ ప్రభుత్వంలోని కోవర్టులు ఇచ్చే కీలక సమాచారంతో ప్రభుత్వ వ్యతిరేక మీడియా ప్రజలను విభిన్నంగా ఆలోచింపజేసే విధంగా తమ వార్తా కధనాలను వండి వార్చేస్తుంది. ఈ విషయంలో మంత్రులు గానీ, ఎంపీలు గానీ, చిన్న చితకా ప్రెస్ మీట్లకే పరిమితం అవడం తప్పా.. ఆ కీలక సమాచారం ఎలా బయటకు వెళ్లిందనే విషయంలో ద్రుష్టిసారించకపోవడం కూడా ఇపుడు రాష్ట్ర్యంలో చర్చనీయాంశం అవుతుంది.

Tadepalle

2021-06-12 02:24:13

పాస్ పోర్ట్, పాన్ కార్డుతో 536 సేవలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 15003 గ్రామ, వార్డు సచివాలల్లో పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సుతో సహా సుమారు 536 పై చీలుకు సేవలను రాష్ట్రవ్యాప్తంగా వున్న  అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ కేవలం సుమారు 50 సేవలు మాత్రమే ఉండే ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన సేవలు ద్రువీకరణ పత్రాలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవలే పాస్ పోర్టుకి దరఖాస్తులు ఏ విధంగా అప్లోడ్ చేయాలనే విషయమై గ్రామ, వార్డు డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. దీనితో ఏ సేవకైనా గ్రామంలోని సచివాలయాన్నే సంప్రదించేలా ప్రభుత్వం కీలక మార్పులు చేపడుతుంది. ఇప్పటికే గ్రామ, వార్డు  సచివాలయాల్లో సుమారు 14శాఖల సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రజలు తెల్లవారి లెగిస్తే ఏపనికైనా సచివాలయానికే వెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఒకప్పుడు ఏదైనా ద్రువీకరణ పత్రం కావాల్సి వస్తే మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పా పనులు జరిగేవి కాదు. ఇపుడు కేవలం మూడు నుంచి వారం రోజుల్లోపే పలు ద్రువీకరణ పత్రాలు ఇంటి ముంగిటే సచివాలయాల్లోనే అందుకునే పరిస్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే మిగిలిన అన్ని రకాల ప్రధాన సేవలను కూడా ఇక్కడే అందించడం ద్వారా చాలా పనులకు జిల్లా కార్యాలయాలకు కూడా తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో మరింత సులువుగా అనుకున్న ద్రువీకరణ పత్రాలను గ్రామంలోనే చేయించుకునే సౌలభ్యం కలుగుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంలోని శాఖలతోపాటు, కేంద్ర ప్రభుత్వంలోని మరికొన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లను కూడా గ్రామసచివాలయ వ్యవస్థకు అనుసంధానం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైవుంది. ఆ విధానం పూర్తయితే ఎలాంటి అనుమతులైనా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పొందే వీలుంటుంది. ఒకప్పుడు పాస్ పోర్టు, పాన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలంటే దళారులను సంప్రదించాల్సి వచ్చేది ఇపుడు ఆ ఇబ్బందులు లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వీటిని అందిస్తే ప్రజలకు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే బాధల నుంచి విముక్తి కలుగుతుందని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేయడం రాష్ట్రంలోనే చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం మీసేవా కేంద్రాల్లో లభించే సేవల కంటే అత్యధికంగా సచివాలయాల్లో ప్రజలకు అతి తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రభుత్వ యోచన. అంతేకాదు త్వరలోనే ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేసి, జిల్లా కార్యాలయాలు మాదిరిగా పేపర్ లెస్ సచివాలయాలుగా కూడా మర్చే యోచన ప్రభుత్వం వద్ద ఉందనే సమాచారం అందుతుంది. అదే జరిగితే ఈ ఫైలింగ్ విధానం అభివ్రుద్ధి చెంది మోసాలకు తావు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందడానికి వీలుపడుతుంది..!

తాడేపల్లి

2021-06-12 02:16:27

రాష్ట్రంలో పెరిగిన పడకల ఖాళీల సంఖ్య..

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పలు ఆసుపత్రుల్లో కొవిడ్ పడకల ఖాళీల సంఖ్య పెరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కేసులు రిజిస్టర్ కాకపోవడంతో ఆ చికిత్సలకు బదులు ఇతర చికిత్సలకు వైద్యసేవలు అందజేస్తున్నాయన్నారు.  కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 625 ఆసుపత్రుల్లో కొవిడ్ కు చికిత్స అందజేసేవారన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో 454 ఆసుపత్రుల్లో కొవిడ్ నివారణ చికిత్సలు అందజేస్తున్నారన్నారు. అన్ని జిల్లాల్లో ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.  ప్రస్తుతం 2,231 బెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయన్నారు. 10,447 ఆక్సిజన్ బెడ్లు రోగులతో నిండి ఉండగా, 11,290 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గుతోందన్నారు. రోజువారీగా చూస్తే కేంద్ర ప్రభుత్వం...ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తోందన్నారు. గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వ నుంచి 423 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను మాత్రమే డ్రా చేశామన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లో 650 మెట్రిక్ టన్నుల వరకూ వినియోగించేవారమన్నారు. 

రాష్ట్రంలో తగ్గుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు..
రాష్ట్రంలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ తో 138 మంది మృతి చెందారన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులను దాచిపెడుతున్నారనే ఆరోపణలు సరికాదన్నారు. కేసులు దాచిపెట్టడం వల్ల నష్టమే కలుగుతుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ ఫంగస్ నివారణకు రావాల్సిన ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రాకుండా పోతాయన్నారు. కరోనా కేసులు మాదిరిగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా తగ్గుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నది ఉన్నట్లుగా... ఏపీలో కరోనా కేసులు, బ్లాక్ ఫంగస్ కేసులు, వాటి వల్ల సంభవించే మరణాల సంఖ్య ఎప్పటికప్పుడు చెబుతున్నామన్నారు. 

Mangalagiri

2021-06-11 14:28:48

రాష్ట్రంలో చురుగ్గా కోవిడ్ వేక్సినేషన్..

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న టీకాలు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 1,01,863 శాంపిళ్లు పరీక్షించగా 8,239 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 61 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతున్నా శాంపిళ్లు ఎక్కువగా నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 10న పాజిటివిటీ రేట్ 8.29, జూన్ 11న 8.09గా నమోదైందన్నారు. రికవరీ రేటు 94 శాతంగా నమోదవుతోందన్నారు. అదే సమయంలో మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. కరోనా కారణంగా జూన్ 10న 67 మంది మృతి చెందగా, జూన్ 11న 61 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.  25 రోజుల కిందట 2,11,000 వరకూ కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. వివిధ ఆసుపత్రుల్లో 15,951 చికిత్స పొందుతున్నారన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్ లో 71,186 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 20,500 మంది తో వైద్యలు మాట్లాడారన్నారు. గడిచి,న 24 గంటల్లో 104 కాల్ సెంటర్ కు 2,592 ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో వివిధ సమాచారాలకు 1,387 కాల్స్, అడ్మిషన్ల కోసం 319 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. 

Mangalagiri

2021-06-11 14:27:19

1.28 లక్షల తల్లులకి వేక్సినేషన్..

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ లో చేసిన మార్పులకు అనుగుణంగా వయస్సుతో నిమిత్తం లేకుండా 1,28,824 మంది అయిదేళ్ల లోపు పిల్లలకు కలిగిన తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకాలు వేసే పకడ్బందీగా సాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,13,76,000 డోసులు పంపిణీ చేశామన్నారు. 26,04,000 మందికి రెండు డోసులు, 61,67,700 మందికి మొదటి డోసు వేశామన్నారు. 45 ఏళ్లుకు పైబడిన వారిలో 52,52,000 మందికి ఒక డోసు, 18,94,000 మందికి రెండు డోసులు వేశామన్నారు. ఇప్పటి వరకూ 45 ఏళ్లు పైబడిన జనాభాలో 53.07 శాతం మందికి టీకా వేశామన్నారు. జూన్ నెలాఖారు నాటికి రాష్ట్రంలో 47,50,000 డోసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. 

Mangalagiri

2021-06-11 14:22:58

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..

శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్.వి రమణకు  శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే  భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ సతీ సమేతంగా స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు.ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి  రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి  వై.వీర్రాజు, ప్రోటో కాల్ మేజిస్ట్రేట్  పవన్ కుమార్,
డిఐజి  క్రాంతి రాణా టాటా, సి వి ఎస్ ఓ  గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్  యం. హరి నారాయణన్,తిరుపతి అర్బన్ ఎస్.పి  వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు..

Tirumala

2021-06-10 17:15:46

ఆర్బీకేల్లోనే ధాన్యం అమ్ముకోవాలి..

రాష్ట్ర వ్యాప్తంగా రబీ 2021 పంటకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్ధత్తు ధరకు రైతుల నుండి కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇఓ సెక్రటరీ మరియు కమీషనర్ కె.శశిధర్ స్పష్టం చేశారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు,కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థిలున్నప్పటికీ వాటిని అధికమించి రబీలో రైతులు పండించిన ప్రతి ధాన్యాపు గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్ధత్తు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.కావున ఏరైతు కూడా దళారులకు లేదా మధ్యవర్తులకు,మిల్లర్లకు కనీస మద్ధత్తు ధరకంటే తక్కువకు లేదా తూకంలో తేడాతోగాని అమ్ముకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఒక వేళ మద్ధత్తు ధరకంటే ఎక్కువ ధర వచ్చినచో బయట అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉందని చెప్పారు.మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఇ-పంటలో ఉన్నరైతుల సమాచారం ఆధారంగా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు వాటి ద్వారా రైతు కల్లం వద్దనే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని ఇందుకుగాను 7వేల 706 రైతు భరోశా కేంద్రాలకు 3936 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానించి ఈకొనుగోలు ప్రక్రియను చేపట్టడం జరిగిందని ఇఓ సెక్రటరి శశిధర్ వివరించారు.

ఇప్పటి వరకూ 3లక్షల 78వేల 206 మంది రైతులు వారి వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో “Paddy Procurement Online Portal”నమోదు చేసుకున్నారని తెలిపారు.ఈవిధంగా పేర్లు నమోదు చేసుకున్న రైతులకు ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా ప్రతి రైతుకు ధాన్యం కొనుగోలు చేసే తేది కూపన్లను జారీ చేయడం జరుగుతోందని ఇప్పటి వరకూ ఆవిధంగా 2లక్షల 84వేల 129 మంది రైతులకు కూపన్లు జారీ చేశామని శశిధర్ వెల్లడించారు. 2020-0-21 ఏడాది రబీ పంటకాలానికి గాను 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సుమారు 8వేల 600కోట్ల రూ.లతో కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 3లక్షల 78వేల 206 మంది రైతుల నుండి 25లక్షల 25వేల927 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4వేల 729కోట్ల రూ.లతో కొనుగోలు చేయడం జరిగిందని ఇఓ సెక్రటరీ శశిధర్ వెల్లడించారు. 2018-19లో 27లక్షల 52వేల 702 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని4వేల838కోట్లతోను,2019-20లో 34లక్షల 73వేల 414 టన్నుల ధాన్యాన్ని 6వేల 331కోట్లతో కనీస మద్ధత్తు ధరకు కొనుగోలు చేయడం జరిగిందని మీడియాకు వివరించారు.ఇప్పటి వరకూ రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో 12లక్షల 26వేల 538 టన్నులు,తూర్పు గోదావరి జిల్లాలో 6లక్షల 29వేల 736 టన్నులు,కృష్ణా జిల్లాల్లో 2లక్షల 69వేల 558 టన్నులు,నెల్లూరు జిల్లాలో 2లక్షల 37వేల 218 టన్నులు,గుంటూరు జిల్లాలో 71వేల 130 టన్నులు,ప్రకాశం జిల్లాలో 50వేల 320 టన్నులను కొనుగోలు చేశామని తెలిపారు.అలాగే కడప,కర్నూలు,అనంతపురం జిల్లాల నుండి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని వివరించారు.

చిత్తూరు జిల్లాల్లోను,కృష్ణా జిల్లా పెడన తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ధాన్యం ఎరైవల్స్ వస్తున్నాయని ఆధాన్యాన్ని అంతటినీ రైతుల నుండి కొనుగోలు చేసేందుకు జూలై నెలాఖరు వరకూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తామని శశిధర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి 3వేల 299 కోట్ల రూ.లు రావాల్సి ఉందని దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదికి,కేంద్ర పౌరసరఫరాల మంత్రికి లేఖలు వ్రాశారని శశిధర్ వివరించారు.అలాగే రైతుల నుండి కోనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోగా సొమ్ము చెల్లించాల్సి ఉండగా ఇంకా 360కోట్ల రూ.లను ఆవిధంగా చెల్లించాల్సి ఉండగా ఆనిధులను త్వరగా విడుదల చేయాల్సిందిగా ఇప్పటికే ఆర్ధికశాఖ అధికారులకు సియం ఆదేశాలు జారీ చేశారని త్వరలో వారికి సొమ్ము చెల్లించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఖరీఫ్ నుండి స్థానికంగా వినియోగించని వరి రకాలు సాగుచేయవద్దు రైతులకు విజ్ణప్తి
రాష్ట్రంలో వచ్చే ఖరీప్ సీజన్ నుండి స్థానికంగా వినియోగించని 1010,MTU 1001, NLR 145 వంటి వరి వంగడాలను సాగు చేయవద్దని రైతులందరిలో అవగాహన కలిగించేందుకు రైతు భరోసా కేంద్రాలు,స్థానిక రైతు సలహా కమిటీలు ద్వారా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల ద్వారా పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను చేపట్టనునట్టు శశిధర్ పేర్కొన్నారు.ఎందుకంటే స్థానికంగా వినియోగించని వరి వంగడాలను సాగుచేయడం వల్ల వాటిని ప్రజలు తినకపోవడం,భారత ఆహార సంస్థ కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతారని కావున అలాంటి వరి వంగడాల సాగును చేపట్టవద్దని రైతులందరికీ అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు పౌరసరఫరాలశాఖ ఇఓ సెక్రటరీ కె.శశిధర్ పేర్కొన్నారు.        ఈమీడియా సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.

Tadepalle

2021-06-10 15:38:24

ప్రతీ ధాన్యపు గింజను కొంటాం..

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతులు తప్పనిసరిగా తమ పేరును ‘ఈ పంట’లో నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి అధిక ప్రాధాన్యతిస్తూ, ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ లో భాగంగా రూ.1190.11 కోట్లతో లక్షన్నర హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ విస్తరింపజేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.  వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాలులో పంటల కొనుగోలుపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు వ్యవసాయ, సివిల్ సప్లయ్ శాఖాధికారులు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఎం.శంకర నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి  సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.  దీనిలో భాగంగా ప్రతి ధాన్యపు గింజనూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల కొనుగోలు చేయనున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ఆర్బీకేల ద్వారా ‘ఈ పంట’ లోని Paddy Procurement Online పోర్టల్ లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవడం వల్ల ఇతర రాష్ట్రాల రైతులు ఏపీలో తమ పంటలను విక్రయించుకునే అవకాశం ఉండదన్నారు.  రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా రైతుల పొలాల వద్దకెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. దీనివల్ల దళారులు/మధ్యవ్యర్తుల ప్రమేయం ఉండదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తరవాత 21 రోజుల్లో రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. దీనివల్ల రైతులకు కనీస మద్దతు ధర లభిస్తోందన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11.90 లక్షల మంది రైతులు 13.43 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేస్తున్నారన్నారు. 

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు 2021-21 సంవత్సరానికి సంబంధించి మరో లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.1190.11 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేసే రైతులకు 90 శాతం సబ్సిడీ అందజేయనున్నామన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో 4 హెక్టార్లు కలిగిన రైతులకు 70 శాతం, 5 హెక్టార్లు కలిగిన ప్రకాశం జిల్లా మినహా మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల రైతులకు 50 శాతం మేర సబ్సిడీ అందజేయనున్నామన్నారు. రబీ సీజన్ లో నేటి వరకూ ఎన్ని టన్నుల మేర ధాన్యాన్ని  కొనుగోలు చేశారని సివిల్ సప్లయ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సివిల్ సప్లయ్ శాఖ ఈవో కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ, 2020-21 పంటల కాలానికి సంబంధించి 45 లక్షల మెట్రిక్ టన్నలు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకూ 3,78,206 మంది రైతుల నుంచి రూ.4,728.81 కోట్ల విలువ చేసే 25,25,927 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఎంత వరి పంట ఉన్నా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వాణిజ్య పంటల కొనుగోలు వివరాలను మార్క్ ఫెడ్ అధికారులు వివరించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. నగదు జమలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తనకు దృష్టికి తీసుకురావలని, తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రైతును ఆర్థికంగా అభివృద్ధి చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. అన్నదాత సంక్షేమానికి వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) మాట్లాడుతూ, ప్రతి రైతుకూ ఆర్థికంగా మేలు కలుగజేయాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపితే, అధికారుల సాయంతో వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్యేలు, మార్క్ ఫెడ్ ఎం.డి. ప్రద్యుమ్మ, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఎం.డి. సూర్య కుమారి, మైక్రో ఇరిగేషన్ పీవో హరనాథ్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-10 15:37:05

చిరువ్యాపారుల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలోని చిరువ్యాపారులు రుణాల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదనే లక్ష్యంతోనే జగనన్న తోడు పథకం కింద 2వ విడతలో   3.70 లక్షల మంది చిరువ్యాపారుల ఖాతాలలో  రూ. 10వేల చొప్పున రూ. 370 కోట్లను  విడుదల చేసినట్లు   ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకంలోని లబ్దిదారులకు  కంప్యూటర్ బటన్ నొక్కి  ఖాతాలలోకి  నగదు జమ చేసారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తాను పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాలు స్వయంగా చూశానని వారిని ఆదుకోవడాని ఈ తరహా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు.   గత ఏడాది  జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది  రుణ సౌకర్యం పొందారని  అన్నారు.  అర్హత ఉన్నవారందరికి సహాయం చేస్తున్నామని  సకాలంలో వడ్డీ చెల్లించే వారికి  తిరిగి వారి ఖాతాలలోకి  వడ్డీ జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్,  పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆప్కాబ్‌ పర్సన్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్త, సెర్ప్‌ సీఈఓ  రాజాబాబు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాధరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tadepalle

2021-06-08 12:33:45

Tadepalli

2021-06-08 06:40:51

గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు..

 తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీ ,ఎస్టీ ,బీ సి వర్గాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరామాలయాల నిర్మాణాలు చేపట్టనున్నామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ జి.ఏకాంబరం ఒక ప్రకటన లో తెలిపారు . ఆయా గ్రామాలలో  ఈ ఆలయాలను నిర్మించాలి అనుకున్నవారు లొకేషన్, సైట్ ప్లాన్, సదరు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉందని భావిస్తే టిటిడి అధికారులు పరిశీలించి ఒక్కొక్క  ఆలయానికి రూ.10,00,000/- చొప్పున నిధులను కేటాయించనున్నారన్నారు.  ఈ ఆలయ నిర్మాణం విషయంలో  ఖచ్చితంగా ఈ అనుమతులు కావాల్సి వుంటుందన్నారు.
గ్రామాలలోని దళితవాడలు, ట్రైబల్ ఏరియా, మత్సకార కాలనీలు, వెనుకబడిన ప్రాంతాలలో మరియు ముఖ్యమైన ఆలయములు లేనిచోట పరిగణించబడుతుందని,  గుర్తించిన ప్రాంతంలో 10  సెంట్లు స్థలాన్ని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించాలని, ఆయా ప్రాంతంలో ఎలాంటి ఆలయాలు లేవని సంబంధిత గ్రామస్థుడు దేవాదాయ శాఖకు అర్జీ సమర్పించాలని, టీటీడీ జారీచేసిన డిజైన్ లోనే రాష్ట్రంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.

Tadepalle

2021-06-07 17:30:05

ఇక ఉదయం 6 నుంచి 2 గంటల వరకూ..

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి నివారణకు విధించిన 144 సెక్షన్, కర్ఫ్యూను జూన్ 20 వతేదీ వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ నెల 11 వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ 144 సెక్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. కర్ఫ్యూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ... ఇదివరకటి నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందన్నారు. మరికొద్ది రోజులు కర్ఫ్చూ పొడిగిస్తే మరింత సత్ఫలితాలు వస్తాయని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందన్నారు. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాజిటివిటీ రేటు పది శాతం లోపలే ఉంటోందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో జూన్ 6వ తేదీనాటికి  21,130 మంది చికిత్స పొందుతున్నారన్నారు. వారిలో 17,944 మంది(84.92 శాతం) ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,659 మంది కరోనా చికిత్స పొందుతుంటే, వారిలో 6,473 మంది (67 శాతం) ఆరోగ్య శ్రీ కింద వైద్యసేవలు పొందుతున్నారన్నారు. రోజు రోజుకూ ఆరోగ్య శ్రీ కింద కరోనా చికిత్సలు పొందే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు.

Tadepalli

2021-06-07 17:22:17

థర్డ్ వేవ్ నివారణకు ప్రత్యేక చర్యలు.

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వ్యాపించ వచ్చనే నిపుణుల సూచనల మేరకు ముందుస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొవిడ్ సమీక్షా సమావేశంలో సూచించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇప్పటికే థర్డ్ వేవ్ వస్తే చేపట్టే నివారణ చర్యలపై ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు, పిడియాట్రిక్  కేసులు వస్తే, నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైనా సీఎం చర్చించారన్నారు. కరోనా రెండు వేవ్ ల ఆధారంగా తీసుకుని బాధితుల వయస్సు జాబితాను దేశ, రాష్ట్రం వారీగా చర్చించామన్నారు. దేశ వ్యాప్త డేటా చూస్తే... 0 నుంచి 10 ఏళ్ల లోపు దేశంలో 3.35 శాతం, ఏపీలో  2.72 శాతం, 11 నుంచి 20 ఏళ్ల లోపు దేశంలో8.38 శాతం, ఏపీలో 8,35, 21-30 ఏళ్ల లోపు 21.79 శాతం, ఏపీ లో 20.28 శాతం, 31-40 ఏళ్లలోపు దేశంలో 21.91 శాతం, ఏపీలో 21.29 శాతంగా నమోదయ్యిందన్నారు. మొత్తంగా ఏపీలో ఏపీలో 20 ఏళ్లలోపు 11 శాతం మందిగా గుర్తించామన్నారు. థర్డ్ వేవ్ లో పిడియాట్రిక్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయితే,  ఐసీయూ, పిడియాట్రిక్ బెడ్లు, వెంటిలేటర్లు, పిల్లలకు ఇచ్చే సిరప్ లు, మాస్కులు, మందులు ఎన్ని కావాలి..? వాటిని ముందుగానే కొనుగోలు చేసేలా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, చిన్న పిల్లల వైద్యులను రిక్రూట్ మెంట్ చేసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆదేశించారన్నారు. 

Tadepalle

2021-06-07 17:18:39