1 ENS Live Breaking News

గ్రామ, వార్డు సచివాలయాలు కీలకం కావాలి..

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడంలో కీలకం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల అధిపతులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధృవీకరణ పత్రాలతో సహా అన్నిరకాల సర్టిఫికెట్లు వారికి సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటిల్‌ ఫార్మాట్‌లో పెట్టి.. వారు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. యూజర్‌ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు వారికి అందుబాటులో డిజిటల్‌ ఫార్మాట్‌లో ఉంచాలన్నారు. సచివాలయాల్లోని సిబ్బందికి ఇస్తున్న అన్నిరకాల శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఫార్మాట్‌లో ఉంచడంతోపాటు, ఒక డిజిటిల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తం  70 బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని వెల్లడించిన సీఎం 2023నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలన్నారు. అంతేకాకుండా పట్టణాల్లో యూఎల్బీ సర్వేని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయితీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, రెవెన్యూ కమిషనర్‌ (సర్వే సెటిల్‌మెంట్స్‌) సిద్దార్ధ జైన్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం ఐజీ ఎంవీవీ శేషగిరిబాబు,  ముఖ్యమంత్రి ప్రధానసలహాదారు అజేయ కల్లంతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-02 13:47:20

ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా జాన్తానయ్..

ఆంధ్రప్రదేశ్ లో జూన్‌ 10 వరకు కర్ఫ్యూని  పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ..ప్రజల సౌకర్యార్ధం కర్ఫ్యూని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపిన ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకూ మధ్యాహ్నాం 12 గంటలవరకూ పనిగంటలు కుదించినా గ్రామ, వార్డు సచివాలయ శాఖ సిబ్బందికి మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ డ్యూటీలు వేస్తుండటం విశేషం. ఈ విషయంలో రాష్ట్రంలో ఒక్క జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.. పైగా సచివాలయ సిబ్బందికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంట వరకూ ప్రత్యేక డ్యూటీలు కోవిడ్ టీకా కేంద్రాల వద్ద వేస్తున్నారు. అంతేకాదు ప్రత్యేకంగా డిజిటల్ అసిస్టెంట్లను కోవిడ్ డ్యూటీలకు వినియోగించ రాదని సిఎస్ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలు వారిని కూడా వదిలిపెట్టకుండా డ్యూటీలు వేస్తున్నారు. దీనితో ప్రజలు వివిధ సర్టిఫికేట్ల కోసం సచివాలయాలకు వెళ్లినా అక్కడ డిజిటల్ అసిస్టెంట్లు లేకపోవడంతో ప్రజలు వెనుతిరగాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఒక్క గ్రామసచివాలయ ఉద్యోగుల విషయంలో అమలు చేయకపోవడం ఏంటని.. వీరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు కారా..లేదంటే అన్ని ప్రభుత్వ శాఖలకూ ఉన్న ప్రత్యేక పనిగంటల సమయం కేవలం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికే అమలు చేయకూదని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, అధికారులు నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది. వాస్తవి విషయాలు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లపోవడం, ప్రభుత్వ ఉత్తర్వులు గ్రామసచివాలయ ఉద్యోగుల విషయంలో అమలు చేయకపోవడం, వాటిని వీరి వరకూ చేర్చకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది.

Tadepalle

2021-05-31 08:36:45

ఆనందయ్య మందుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

కరోనా కాలంలో ప్రజల పిట్టల్లా రాలిపోతున్న వేళ ఆనందయ్య ఆయుర్వేదక కరోనా విరుగుడు మందుని వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.  దీనితో ఎట్టకేలకు ఆనందయ్య మందుకు అనుమతి లభించింది. కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఎవరి ఇష్టానుసారం వారు మందును వాడుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులు రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. సీసీఏఆర్‌ఎస్‌ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అనందయ్య మందు వాడితే కచ్చితంగా కరోనా తగ్గుతుంది అనేందుకు ఆధారమైన నివేదిక ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య ఇచ్చే మందుల వల్ల హానీ కూడా లేదని తేలింది.  ఇలాంటి విపత్కర సమయంలో ఆనందయ్య మందు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న వేళ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు అందింది..

Tadepalle

2021-05-31 08:35:21

14మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా 14మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి..వాటిని వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభిస్తున్నారు. సుమారు 8వేల కోట్లతో ఈ మెడికల్ కాలేజీలతోపాటు, అనుబంధంగా నర్శింగ్ కాలేజీలను కూడా ప్రారంభిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ కాలేజీల నిర్మాణం పూర్తయితే  ఒకేసారి 1400 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో విద్యార్ధులకు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా వీటిలో అధిక సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గర విషయం. తద్వారా గిరిజన విద్యార్ధులు కూడా అధిక సంఖ్యలో వైద్య విద్యను అభ్యసించడానికి వీలు కలగడంతోపాటు, వారు నివశించే ప్రాంతాల్లోని గిరిజనులకు వారే వైద్యసేవలు చేసే అవకాశం దక్కుతుంది. 

Tadepalle

2021-05-31 06:19:51

నేడు నెరవేరనున్న డా.వైఎస్సార్ కల..

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రియతమ నేత డా.వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయం నేడు నెరవేరబోతుంది. ఏరోజైతే ప్రజలకు ఉచిత వైద్యం, విద్య, ఉపాది కల్పిస్తామో ఆ రోజే మనం ప్రజలకు పూర్తిస్థాయిలో మేలు చేసినట్టు వుతుందనే మాటలను నిజం చేస్తూ రాజన్న తనయుడు యువ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 8వేల కోట్ల  16 మెడికల్ కాలేజీల స్థాపనకు ఈరోజు శ్రీకారం చుట్టారు. ప్రధాన ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటు జరుగుతుంది. వీటితోపాటు, నర్శింగ్ కాలేజీలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఏరియా ఆసుపత్రులకు ఈ మెడికల్ కళాశాలలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్నారు. ఇకపై ప్రభుత్వ వైద్య విద్యను మరింత మంది నిరుపేద, తెలివైన విద్యార్ధులు అభ్యసించడానికి వీలుపడుతుంది. 16 కాలేజీలంటే సుమారుగా 1600 మెడికల్ సీట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో అదనంగా వస్తున్నాయంటే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంత దూరద్రుష్టితో ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిలో అధిక సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గర విషయం. తద్వారా గిరిజన విద్యార్ధులు కూడా అధిక సంఖ్యలో వైద్య విద్యను అభ్యసించడానికి వీలు కలగడంతోపాటు, వారు నివశించే ప్రాంతాల్లోని గిరిజనులకు వారే వైద్యసేవలు చేసే అవకాశం దక్కుతుంది. మెడికల్ కాలేజీలు ఏర్పాటు తోపాటు, అత్యాధునిక ల్యాబరేటరీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం వలన వ్యాధినిర్ధారణ, వైద్యసేవలు మరింతగా నిరుపేద ప్రజలకు మెరుగుపడనున్నాయి.

Tadepalle

2021-05-31 05:05:44

ఆన్ లైన్ లో శ్రీ కనక దుర్గమ్మ సేవలు..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేయున్న శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివర్ల దేవస్థానంలోని శ్రీ కనక దుర్గమ్మ తల్లి వారి సేవలను ఆన్ లైన్ ద్వారా భక్తులకు చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టినట్టు ఆలయ ఈఓ డి.బ్రమరాంబ తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో  భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ పి.అర్జునరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గుగూల్ మీట్ లింక్ ద్వారా  google meet link (https://meet.google.com/nuw-kwsy-xsc)అమ్మవారి ఆలయంలో జరిగే అన్ని పూజల్లో భక్తులు పాల్గొని తిలకించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరుతున్నారు.

Vijayawada

2021-05-30 04:04:51

Tadepalle

2021-05-25 14:50:48

Tadepalle

2021-05-25 14:49:03

Tadepalle

2021-05-25 14:37:27

ఆనందయ్య మందుకు ఏపీలో లైన్ క్లియర్..

కరోనాను నియంత్రించే ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఆంధ్రప్రదేశ్ లోని ఆయుష్ అధికారుల నుంచి లైన్ క్లియర్ అయ్యింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి వుంది. ఆయుష్ వైద్యుల సమక్షంలోనే ఆనందయ్య కరోనాకి మందు తయారు చేశారు. దీనితో ఈ మందు వలన ఎలాంటి చెడు ఫలితాలు లేవని అయుష్ శాఖ కమిషనర్ రాములు తేల్చారు. అయితే దీనిని పూర్తిగా ఆయుర్వేదమని చెప్పలేమని, పసరు మందు లేదా నాటు మందుగానే గుర్తిస్తామని మాత్రం మెలిక పెట్టారు. ఈ మందు వలన కరోనా రోగుల్లో ఆక్సిజన్ పెరిగినట్టుగా ప్రాధమిక సమాచారం గుర్తించినట్టు వెల్లడించిన ఆయన  ఈ వైద్యం పొందిన మరికొందరిని పరీక్షించాలని చెబుతున్నారు. దీనితో ఏపీలో ఈ మందుపై ఏపీలో అధ్యయనం ముగిసింది. ఇక కేంద్ర ప్రభుత్వం సంస్థCCRAS(సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్)కు ఏపీలోని ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుందని ఆయుష్ కమిషనర్  ప్రకటించారు. కానీ ఈ మందుని ఆయుర్వేద మందు అనడానికి ముందుకి రాని ప్రభుత్వ అధికారులు కూడా నాటు మందుగానే గుర్తించడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఆనందయ్య కరోనా వైరస్ నియంత్రణకు తయారు చేసిన ఈ మందులో అన్నీ ఆయుర్వేద దినుసులే వినియోగించి చేసినప్పటీకీ ప్రభుత్వ అధికారులు కూడా నాటు వైద్యమనే ముద్రవేశారు తప్పితే ఈ మందు పనిచేయడం లేదని, గానీ దీనికి శాస్త్రీయత లేదని ఎక్కడా తేల్చలేదు. దీనితో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ అధికారులు ఈ మందులపై ఎలాంటి నివేదికలు ఇస్తాయనేది ఇపుడు ఉత్కంఠగా మారింది. అన్నీ అనుకూలిస్తే ప్రభుత్వం ద్వారానే ఈ మందుని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరిగే అవకాశం కూడా లేకపోలేదని ఒక అధికారి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగ వివరించారు.

Tadepalle

2021-05-23 03:07:01

ప్రభుత్వ శాఖల్లో గ్రామ సచివాలయశాఖ లేనట్టుంది..

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ శాఖలూ ఈ నెలాఖరు వరకూ ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలి. అలాకాకుండా 12 తరువాత కార్యాలయంలో ఉండాలంటే ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక పాసులుండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ చేసిన చేసిన ఉత్తర్వులు ఇవి. కానీ ఈ ప్రభుత్వ శాఖల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉన్నట్టుగా కనిపించలేదు.. అందుకే గ్రామ సచివాలయ ఉద్యోగులంతా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ యధాస్తితిగా గర్భీస్త్రీలు, బాలింత ఉద్యోగిణిలతో సహా విధులు నిర్వహిస్తున్నారు.  రాష్ట్రప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలతో సమానంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసి వాటి నిర్వహణను జిల్లాల్లోప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ల(గ్రామ సచివాలయాలు)కు అప్పగించింది. అయినా ప్రభుత్వం విడుదల చేసిన కొత్తగా విడుదలచేసిన కార్యాలయ పనిగంటల జీఓలు గ్రామ, వార్డు సచివాలయాలకు వర్తింప జేయడంలేదు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు(గ్రామసచివాలయం) ప్రభుత్వ శాఖలతోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ కరోనా సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన పనిగంటల ఆదేశాలను వర్తింప జేస్తుంటే.. కొన్ని జిల్లాల్లో గర్భిణీ స్త్రీలు, బాలింత ఉద్యోగులతో సహా పూర్తి పనిగంటలుతో పనులు చేయిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఒక్క కారణమే రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం  విడుదల చేసిన జీఓలు, ప్రత్యేక ఆదేశాలు గ్రామ సచివాలయాల్లో అమలు చేయలేదని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైనా ముఖ్యమైన జీఓ విడుదల చేసినపుడు దానిని జిల్లా కలెక్టర్లు ఆయాశాల ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేయస్తున్నారు. కానీ విచిత్రంగా ఆ సమాచారం కొన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు మాత్రం చేరడం లేదు. కరోనా సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన కుదించిన పనిగంటల సమయం ఒక్కటే కాకుండా ఇతర ముఖ్యమైన విషయాలకు సంబంధించిన జీఓలు రాకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయాల్లో జరిగే అభివ్రుద్ధి కార్యక్రమాలు, లోపాలు, పరిపాలన సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ యాప్ ద్వారా అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు ఇతర శాఖల అధికారుల ద్రుష్టికి తీసుకెళుతూ చైతన్యం తీసుకొస్తోంది. గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వ్యవస్థ జరిగే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన వార్తలను తాజా తాజాగా అందిస్తోంది. కొన్ని సందర్భల్లో కొన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు ఈఎన్ఎస్ అందించిన సమాచారం ఆధారంగా సత్వరమే చర్యలు చేపడుతున్నా..మరికొన్ని జిల్లాలో అమలు చేయడానికి ఎందుకనో ద్రుష్టి పెట్టడం లేదు. ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి తాజాగా పెంచిన పనిగంటల సమయాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కుదించిన పనిగంటల ఆదేశాలను అమలుచేస్తారా..లేదంటే అది ప్రభుత్వశాఖలో లేదన్నట్టుగా వారికి ప్రత్యేక ఆదేశాలిచ్చి పనిచేయిస్తారా అనేది వేచి చూడాలి..

Tadepalle

2021-05-22 06:26:46

Tadepalli

2021-05-22 03:47:54

ఆనందయ్య ఆయుర్వేద వైద్యవిధానం సరైనదే..

కరోనా వైరస్ ను మానవ శరీరం నుంచి బయటకు పంపించడానికి నెల్లూరు క్రిష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు సరైనదేనని వాదన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చాలాగట్టిగా వినిపిస్తున్నారు. ఈ ఆయుర్వేద మందులో వినియోగించేవన్నీ నిత్యం మన కళ్లముందు ఉండేవనని, ముఖ్యంగా ఈ మందు ద్వారా వ్యాధినిరోధకశక్తి బాగా పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆనందయ్య మందుకోసం వినియగించే ఆయుర్వేద దినుసులు ఏవిధంగా పనిచేస్తాయనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయుర్వేద వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ మందు తీసుకున్నవారందరికీ కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడం తో ఇపుడు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. ఇప్పటికే ఈ మందును పరీక్షించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితోపాటు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కేంద్రప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ మందుతీసుకుని నెగిటివ్ వచ్చిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో జనాబా వేలాది ఆ ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు కాస్త తేడాగా చూపించే పనిలో కూడా పడ్డాయి. మందు తీసుకున్నవారంతా తాము బాగానే ఉన్నామని చెబుతున్నప్పటికీ ఎవరైనా కాస్త తేడాగా చెప్పకపోతరా అనే కోణంలో తేడాగా వ్యవహరించే మీడియా విశ్వప్రయత్నాలు చేస్తున్నది. అలాంటి మీడియాను తెలుగుప్రజలంతా సోషల్ మీడియా వేదికగానే అమ్మనా బూతులు తిడుతున్నారు. మేము కరోనా వైరస్ నుంచి బతికి బట్టకట్టడం మీడియాకు ఇష్టం లేని కారణంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు ప్రాణాలను కాపాడుతున్న ఆయుర్వేద మందును అవగాహన లేని మీడియా సంస్థలు నాటు మందు అంటూ వెటకార దోరణికి తెరలేపడటం పైనా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా క్రిష్ణపట్నం ఆనందయ్య మందు వాడిని వారికి మంచి ఫలితాలు వస్తూనే ఉన్నాయి. ఈ మందుకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభిస్తే..లక్షలాది మందికి ఈ మందు చేరి కరోనా వైరస్ ని తరమికొట్టడానికి ఆస్కారం వుంటుందనే వాదన దేశవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఆనందయ్య కరోనా వైరస్ కి ఇచ్చిన ఆయుర్వేద మందు వలన  ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రభుత్వాలు ద్రుష్టిసారించడం శుభపరిణామంగా కనిపిస్తున్న ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఆశక్తి కరంగా మారింది..

Tadepalle

2021-05-22 02:38:32

బ్లాక్‌ ఫంగస్‌ కి ఆరోగ్యశ్రీలో చికిత్స..

బ్లాక్ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌)చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది..ఇప్పటికే కరోనాకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందిస్తున్న ప్రభుత్వం, తాజాగా బ్లాక్‌ ఫంగస్ కి కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడండంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.

Tadepalle

2021-05-20 14:58:43